Blogger Widgets

మంగళవారం, డిసెంబర్ 15, 2009

తిరుప్పావై రెండవ పాశురం

మంగళవారం, డిసెంబర్ 15, 2009

ఆండాళ్ తిరువడిగలే శరణం :
మరి మొదటి పాటలో తామేమి పొందదలచి ఈ వ్రతం చేయడలచుకున్నారో , ఈ వ్రతమునకు సాయపడు వారు ఎవరో, ఆ వ్రతమును జేయుటకు తమకుగా అధికారమేమో వివరించినారు. ఈ దిన ఒక కార్యము చేయ దలచుకున్నప్పుడు ముందుగా తెలుసుకోవలసినవి ఆ మూడే. ఏ ఫలము కాంక్షించి ఈ కార్యము చేయుచున్నామో తెలిసి ఫలము తప్పక పొమ్దదగినదె అని తెలిసిన కాని కార్యమునందేవరికిని ప్రవృత్తి కలగదు. ఆ ఫలము మంచిదే అని తిలిసినా తము చేయగలమా , చేయలేమా , మద్యలో శక్తి లేక మాని నవ్వులపాలగుదురు. దానికి కావలసిన పరికరాలు సమకుర్చుకో గలమో లేమో నిర్నయిమ్చుకోవాలి . ఆ కార్యము చేయుటకు తనకు గల అధికారాన్ని తెలుసుకోవాలి .
ఇవన్నీ సమకుర్చగలది కేవలము కృష్ణుడే అని తెలిసిన నీకు అన్ని సమకురినట్లే.
దీనికి శ్రీ కృష్ణుడే ఉపాయం , శ్రీ కృష్ణుని పోడుతయే ఫలమని విశ్వసించి వానిని కైమ్కరమునదే రుచిగాగల నియామాలుందున ? అసలు నియమాలు పాటించాలా? వారు గొల్లపిల్లలు కదా ? వారికి నియమాలు ఎలాతెలియును?
వీటన్నిటికీ ఒకటే ఉపాయమున్నది. భగవంతునిపై భక్తి , పరిసుద్దమైన మనసు కలిగిన చాలు .
కాని భక్తులు భాగాత్స మ్రుద్దికి భగవద్భాక్తులు ఆనందముగా కొన్ని నియమాలు పాటిమ్చుదురు .
వానిని ఈ పాశురములో వివరించుదురు.

పాశురం:
వైయత్తు వాళ్ వీర్గాళ్! నాముం నం పావైక్కు
శెయ్యుం కిరిశైగళ్ కేళీరో పాఱ్కడలుళ్
పైయత్తుయిన్ఱ పరమనడి పాడి
నెయ్యుణ్ణోం పాలుణ్ణోం నాట్కాలే నీరాడి
మైయిట్టెళుదోం మలరిట్టు నాం ముడియోమ్
శెయ్యాదన శెయ్యోం తీక్కుఱళై చ్చెన్ఱోదోమ్
ఐయముం పిచ్చైయుం ఆందనైయుం కైకాట్టి
ఉయ్యుమాఱెణ్ణి ఉగందేలోర్ ఎమ్బావాయ్

Pasuram02-HH.mp3


తాత్పర్యము : శ్రీ కృష్ణుడు అవతరించిన కాలములో పుట్టి దుః ఖమగు ఈ ప్రపంచములో కుడా ఆనందమునే అనుభావిమ్చుచున్న వారలారా ! మేము మావ్రతమునకు చేయు క్రియాకలాపము వినుడు:-
పాలసముద్రములో ద్వానికాకుండా మెల్లగా పడుకోనివున్న ఆ పరమ పురుషుని పాదములకు మంగళము పాడదేము . ఈ వ్రతసమయములో నేతిని కాని పాలను కాని మేము ఆరగింపము . తెల్లవారు జామున స్నానము లు చేసెదము . కంటికి కాటుక పెట్టుకోము . కొప్పులో పువ్వులు ముడువము. మా పెద్దలు ఆచరించని పనులు మేము ఆచరించము . ఇతరులకు బాద కలిగించెపనులు మేము చేయము. అసత్యాలాడము. ఎచ్చటా పలుకము.ఙానులకు అధిక ధన ధాన్యాధులు తో సత్కరించుదుము. బ్రహ్మచారులకు సన్యాసులకు భిక్షలను ఉంచుధుము. మీము ఉజ్జీవించు విధముగానీ పర్యాలోచన చేసికొనెదము. దీనిని అంతావిని మీరానదింప కోరుచున్నము.

విశెషార్ధము:- తమతో వ్రతమునకు రాబోవుచున్న గోపికలను ఉద్దెసించి తామీ వ్రతములొ చెయవలసినవి , చెయకుడనివి ఇందు వివరించుకున్నరు.
జై శ్రీ మన్నారాయణ

సోమవారం, డిసెంబర్ 14, 2009

తిరుప్పావై మొదటి పాశురం

సోమవారం, డిసెంబర్ 14, 2009

నారాయణ తత్వము
గోపికలు ఈ వ్రతము చేయుటకు అనుకూల కాలము మనకు లభిమ్చిందే అని ఆ కాలమును ముందుగా పోగాడుచున్నారు.
వ్రతము ఎవరు చేయుటకు తగినవారో నిర్ణయించుకున్నారు. ఈ వ్రతము చేసి తాము పొందదగిన ఫలమేమో , దానిని పోదిమ్చు సాధనమేమో స్మరించుచు ఈ మొదటి పాటలో అనంధించుచున్నారు.
మన గోపికలు మరియు గోదాదేవి.


పాశురము:

మార్గళి త్తింగళ్ మది నిఱైంద నన్నాళాల్
నీరాడ ప్పోదువీర్ పోదుమినో నేరిళైయీర్
శీర్ మల్గుం ఆయ్ ప్పాడి చ్చెల్వ చ్చిఱుమీర్గాళ్
కూర్వేల్ కొడుందోళిలన్ నందగోపన్ కుమరన్
ఏరారంద కణ్ణి యశోదై ఇళమ్ శింగం
కార్మేని చ్చెంగణ్ కదిర్మదియం పోల్ ముగత్తాన్
నారాయణనే నమక్కే పఱైతరువాన్
పారోర్ పుగళప్పడిందేలోర్ ఎమ్బావాయ్
.

Pasuram01-HH.mp3
తాత్పర్యము :- ఓహో ! మార్గశీర్షమాసము, వెన్నెల నిండిన మంచి రోజు . ఓ అందమైన ఆభరణములు గల పడచులారా ! ఐశ్వర్యముతో నిండిన వ్రేపల్లెలొ సంపదలతో తులతూగు చున్న ఓ బాలికలారా! ఈ మార్గశీర్ష స్నానము చేయవలెనన్నా సంకల్పమున్నచొ రండు. ముందు నడువుడు. వాడియగు వేలాయుధమును దాల్చి కృష్ణునకు ఏవిధమగు ఆపద రాకుండా కాపాడుచున్న శ్రీ నంద గోపుల కుమారుడును , అందములగు కన్నులతో అలరుచున్న యశొద యొక్క బాలసిమ్హమును, నీలమేఘశ్యాముడును, ఎఱ్ఱని తామరలనుపోలు కన్నులు కలవాడును, సూర్యుని వలే ప్రకాశమును , చంద్రునివలె ఆహ్లాదమును ఈయజాలిన దివ్యముఖమండలము కలవాడును అయిన నారాయణుడే, అతనినే తప్ప వేరొకనిని అర్ధించనిమనకే , మనమాపేక్షెంచు వ్రత సాధనమగు `పరా అను వాద్యమును ఈయనున్నాడు. మనమీ వ్రతము చీయుటను చూచి లోకులందరు సమోషించునత్లు మీరందరు వచ్చి ఈ వ్రతములొ చేరుడు.

ఆదివారం, డిసెంబర్ 13, 2009

Panchatantra Tales - The Talkative Tortoise

ఆదివారం, డిసెంబర్ 13, 2009

శుక్రవారం, డిసెంబర్ 11, 2009

United Andhra Pradesh state in India Petition

శుక్రవారం, డిసెంబర్ 11, 2009

United Andhra Pradesh state in India Petition

శుక్రవారం, డిసెంబర్ 04, 2009

దేశం మనదే తేజం మనదే

శుక్రవారం, డిసెంబర్ 04, 2009




నానని నాన...
నానని నాన...
నాన నాన నన న నా........

దేశం మనదే! తేజం మనదే!
దేశం మనదే, తేజం మనదే,
ఎగురుతున్న జెండా మనదే!!
నీతీ మనదే, జాతీ మనదే
ప్రజల అండ దండా మనదే!!

అందాల బంధం ఉంది ఈ నేలలో
ఆత్మీయ రాగం ఉంది ఈ గాలిలో
ఏ కులమైనా , ఏ మతమైనా
ఏ కులమైనా , ఏ మతమైనా
భరతమాతకొకటే లేరా!

ఎన్ని బెధాలున్నా
మాకెన్ని తేడాలున్నా
దేశమంటే ఏకమౌతాం
అంతా ఈ వేళా!!

వందేమాతరం! అందాం అందరం!
వందేమాతరం! అందాం అందరం!

దేశం మనదే, తేజం మనదే,
ఎగురుతున్న జెండా మనదే!
నీతీ మనదే, జాతీ మనదే
ప్రజల అండ దండా మనదే!

అందాల బంధం ఉంది ఈ నేలలో
ఆత్మీయ రాగం ఉంది ఈ గాలిలో
ఏ కులమైనా , ఏ మతమైనా
భరతమాతకొకటే లేరా!
రాజులు ఐనా బీదలు ఐనా
భారత మాత సుతులే లేరా!!

ఎన్ని ద్వేషాలున్నా
మాకెన్ని దోషాలున్నా
దేశమంటే ప్రాణమిస్తాం
అంతా ఈ వేళా!!

వందేమాతరం! అందాం అందరం!
వందేమాతరం! అందాం అందరం!

వందేమాతరం వందేమాతరం వందేమాతరం వందేమాతరం!
వందేమాతరం వందేమాతరం వందేమాతరం వందేమాతరం !! ...

మంగళవారం, డిసెంబర్ 01, 2009

Shri Dattatreya Stotra

మంగళవారం, డిసెంబర్ 01, 2009

ఈ రోజు దత్తాత్రయును జయంతి కదా. దత్తాత్రయుని స్తోత్రం చదివితే మంచిది.

Shri Datta Jayanti Special

బుధవారం, నవంబర్ 25, 2009

Shri Kanakamahalakshmi Temple (vishakhapatnam)

బుధవారం, నవంబర్ 25, 2009

నమస్కారం మార్గశిర మాసం వచ్చింది . ఎంతో ముఖ్యమైన మార్గశిర లక్ష్మివారం పూజలు చేసుకుంటున్నారా. మా అమ్మమ్మ కూడా చేస్తోంది. విశాఖపట్నం లో కనక మహాలక్ష్మి అమ్మవారికి ప్రత్యేక ఫుజలు చేస్తారు. అమ్మదర్శనము మీరూ చేసుకోండు మరి.

ఆదివారం, నవంబర్ 22, 2009

సత్య సాయి బాబా గారి పుట్టినరోజు

ఆదివారం, నవంబర్ 22, 2009

సత్యసాయిబాబాగారు 23 వ తేదిన నవంబరు 1926 వ సంవత్సరం లో జన్మించారు.బాబాగారి సిద్ధాంతము అద్వైతము .ఆయన కార్యక్రమాలు ఆద్యాత్మిక బోదనలు, నీతిబోదలు. ఆయన తత్వము అహింస.

బాబాగారు పుట్టపర్తి అనే కుగ్రామంలో అనంతపురం జిల్లాలో జన్మించారు.
సాయి బోదనలు ను అనుసరించేవారు చాలా సంస్థలు వున్నాయి.
ఆయనబోధనలొ ముఖ్యముగా సత్యము, ధర్మము, అహింస, ప్రేమ, శాంతి.
అదే మనము ఆచరించుదాం మరి.

బుధవారం, నవంబర్ 18, 2009

పుట్టిన రోజు శుభాకాంక్షలు MICKEY

బుధవారం, నవంబర్ 18, 2009


HAPPY BIRTHDAY TO MICKEY MOUSE


Mickey Mouse 1942 Mickey's Birthday Party

హాయ్ ! ప్రపంచంలో ఉన్నపిల్లలందరు గుర్తుపెట్టుకుంటున్న CARTOON MICKEY MOUSE program. ఈరోజు MICKEY MOUSE birthday. అని అందరుకు తెలుసు.
మిక్కి మౌస్ అన్నది అమెరికాలోని animal cartoon character ,Mickey mouse అన్నది walt disney అనే కంపనీ నుండి 1928 వ సంవత్సరం లో తయారు చేయబడింది. ప్రతీ సంవత్సరం నవంబర్ 18th న మిక్కి మౌస్ పుట్టిన రోజు జరుపుకుంటున్నారు.
పిల్లలకి రాముడు తెలియక పోవొచ్చేమో కానీ మిక్కి మౌస్ తెలియని వారుండరు.
మిక్కి మౌస్ క్లబ్ హౌస్ కి మిక్కినె లీడర్.

మిక్కి మౌస్ మొట్టమొదట plane crazy అని 1928 లో stage program ఇచ్చారు.

తయారు చేసినవారు Walt Disney , UbIwerks

డబ్బింగ్ చెప్పినవారిలో ముఖ్యులు Walt Disney (1928-1947), Jemmy MacDonald (1947-77),Wayne Allwine (1977-2009), Bret Iwan(2009)

ఈరోజు నాకు ఎంతో ఇష్టమైన cartoon character MICKEY MOUSE BIRTHDAY ,

కావునా నాతో పాటు మీరు కూడా wishes చెప్పండి మరి.

శనివారం, నవంబర్ 14, 2009

Childrens day fancy dress show In my school

శనివారం, నవంబర్ 14, 2009

మా స్కూల్లో ఈ రోజు చాచానెహృగారి పుట్టినరోజు సంధర్భముగా Children's day జరుపుకున్నాము. అప్పుడు పద్యాల పోటి పెట్టారు. fancy dress show పెట్టారు. అందరు బాగాతయారు అయ్యారు. మా స్కూల్లో బాగా జరుపుకున్నాము.

శుక్రవారం, నవంబర్ 13, 2009

Happy Childrens day

శుక్రవారం, నవంబర్ 13, 2009








గురువారం, నవంబర్ 12, 2009

MS SUBBULAKSHMI :DEVA DEVAM BHAJE

గురువారం, నవంబర్ 12, 2009

మంగళవారం, నవంబర్ 10, 2009

Ek do ek do badathe kadam

మంగళవారం, నవంబర్ 10, 2009

ఆదివారం, నవంబర్ 01, 2009

మాతెలుగు తల్లి కి మల్లెపూదండ

ఆదివారం, నవంబర్ 01, 2009

ఈ రోజు ఆంద్ర రాష్ట్ర అవతరణ దినోత్సవం గా జరుపుకుంటున్నాం.పొట్టిశ్రీరాములు (1901-1952) గాందేయుడు. ప్రత్యేక ఆంధ్ర రాష్ర్టాఏర్పాటుకు 58 రోజులు ఉపవాస దీక్ష కొనసాగించి ఆత్మార్పణ చేసి అమరజీవిగా ప్రసిద్దుడైనాడు.
అతని అత్మార్పణ ఫలితంగా మనకు ఆంద్ర ప్రదేశ్ ఏర్పడింది.

ఆంద్ర రాష్ట్ర అవతరణ శుభాకాంక్షలు.

గురువారం, అక్టోబర్ 22, 2009

నాగుల చవితి

గురువారం, అక్టోబర్ 22, 2009

ఈరోజు నాగుల చవితి కదా నేను పుట్టలో పాలు పోసారు. అమ్మమ్మ చలిమిడి, చిమిలి చేసింది .నేను పుట్టలో పాలు చలిమిడి, చిమిలి వేసి పూజ చేసాము.
అమ్మమ్మ మాచేత

నమస్తే దేవదేవేశ
నమస్తే ధరణీధర
నమస్తే సర్వ నాగేంద్ర
ఆదిశేష నమో స్తుతే

అన్న శ్లోకం చెప్పించింది.

తరువాత మతాబులు , కాకరపువ్వొత్తులు , టపాసులు పేల్చాము.

పాముకు పాలు పోసేటప్పుడు అమ్మ నాచేత ఇలా చేప్పించింది.

నడుము తొక్కితే నావాడు అనుకో
పడగ తొక్కితే పగవాడు కాదు అనుకో
తోక తొక్కితే తోటి వాడు అనుకో
నా కంట నువ్వుపడకు నీకంట నేను పడకుండా చూడు తండ్రీ.
అని చెప్పించింది.

ఇది ఏమి టి అని అమ్మమ్మను అడిగితే ప్రకృతి ని పూజిచటం మన సంస్కృతి మనది.
మనం విషసర్పమును కూడా పూజించి మన శత్రువును కూడా ఆదరిస్తాము.అని అర్ధము.

పిల్లలుచేత ఇవి చెప్పించటం ఎందుకంటె వారికి మంచి అలవాట్లు నేర్పించటము ముఖ్యవుద్దేశము.
మనలను ఇబ్బంది పెట్టినవారిని , కష్టపెట్టేవారిని క్షమించాలి అని తెలుపుట ఇలాంటివి నేర్పుట ఉద్దేశము.


సోమవారం, అక్టోబర్ 19, 2009

బ్రహ్మకడిగిన పాదము

సోమవారం, అక్టోబర్ 19, 2009



పాట: బ్రహ్మ కడిగిన పాదము

రచన: తాళ్ళపాక అన్నమాచార్యులవారు

రాగం: ముఖారి

తాళం: ఆదితాళము

బ్రహ్మ కడిగిన పాదము
బ్రహ్మము తానె నీ పాదము 11

చెలగి వసుధ గొలిచిన నీ పాదము
బలిత మొపిన పాదము
తలకక గగనము తన్నిన పాదము
బలరిపు గాచిన పాదము 11

కామినిపాపము కడిగిన పాదము
పాము తలనిడిన పాదము
ప్రేమపు శ్రీసత్ పిసికెడి పాదము
పామిడి తురగపు పాదము 11

పరమయోగులకు పరిపరివిధముల
పరమొసగెడి నీపాదము
తిరువేంకటగిరి తిరమన చూపిన
పరమపదము నీ పాదము 11

శనివారం, అక్టోబర్ 17, 2009

దీపావళి శుభాకాంక్షలు

శనివారం, అక్టోబర్ 17, 2009

ద్

దీపావళి రోజు ఏమి చేయాలి మీకు తెలియదా! అయితే

దీపావళి రోజు ఏమి చేయాలి మీకు తెలియదా! అయితే ఇది చదవాలి మరి

దీపావళి అంటే మన అందరికి చాలా ఇష్టం . ఐతే చాలామంది లో దీపావళి అంటే దీపాలు వెలిగించటమే కదా!
అని కాని దీపావళి కి చాలా విశిష్టత వుంది . దీపావళి పండుగ చేసుకునే విధానం కుడా వుంది . ఇవి చాలామందికి తెలిదు. పూర్వపు పద్ధతులు మరచి పోయారు. ఆ రోజుకి స్వీట్స్ కొనుక్కొని వచ్చి వెరైటి వంటలుచేసుకొని , రాత్రి దీపాలు వెలిగించి టపాసు కాల్చుకొని ఎంజాయ్ చేయటమే అనుకుంటున్నారు మనలోచాలామంది.

ఐతే మా అమ్మమ్మ పూర్వపు పద్దతు లు చెప్పింది అవి ఏమిటంటే :

దీపావళి పండుగ ఆశ్విజ బహుళ చతుర్దశి అమావస్య నాడు వస్తుంది. ఇది రెండురోజుల పండుగ త్రయోదసినాటి రాత్రి అపమృత్యు నివారణ కోసం ప్రమిదలతో దీపాలు వెలిగించి ఇంటిముందు వుంచాలి.
నరకచతుర్దసిని ప్రేతచతుర్దసి అని కుడా అంటారు. ఎందుకంటే ఇది యమునికి కుడా ప్రీతి కలిగించేరోజు.యముడు పితృత్వం కూడా ఉన్నా దేవుడు. సూర్యోదయానికి ముందు, రాత్రి తుదిజాములోనువ్వులనూనెతో తలంతుపోసుకోవాలి. ఇలా చేయడంలో చాలా విశేషం వుందిట. దీపావళి పర్వదినాలలోనువ్వుల నూనెలో లక్ష్మి దేవి ఉంటుందిట. . అలాగే నదులు, చెరువులు, బావులు, కాలువలు, వంటి అన్నిజలవనరులలోకి గంగాదేవి ఆ రోజుల్లో
ప్రవేశిస్తుందిట . నువ్వులనునేల్తో అభ్యంగనస్నానం చెయ్యడం వల్ల దారిద్ర్యం తొలగి గంగాస్నాన ఫలం లభిస్తుందిట. నరక బాధలు తప్పుతాయట . చివరకు సన్యాసులు కుడా చేస్తారుట.
స్నానం కూడా ఎప్పుడు పడితే అప్పుడు చెయ్యడం కాదు. సూర్యోదయానికి ముందు నాలుగు ఘడియల కాలంఅరుణోదయం అంటారు . ఆ లోగా చెయ్యాలి.
స్నానం చేసేటప్పుడు ఉత్తరేణి కొమ్మను శిరస్సు మీద తిప్పుతూ ఈ శ్లోకం పాటించాలి .
శీతలోష్ట సమాయుక్త సకంటక దలాన్విత
హరపాప మపామార్గ భ్రామ్యమానః పునః పునః

అపామార్గం అంటే ఉత్తరేణి . ఇలాచేయటం వల్ల నరకం రాదట. నువ్వులనునే , ఉత్తరేను మొదలైనవి ప్రకృతితో మనకు ఎంత ముడిపది వున్నామో తెలుస్తుంది. ప్రక్రుతిసామరస్యంలో మనం జేవించాలని ఇందులో సందేశం. ఇందు వల్ల నరకంబయం అన్నది ఉంటే అది మన భావన ద్వారా ఆ స్థితికి చేరుకున్తామన్నామాట. స్వర్గనరకాలు మనస్సు నందు కల్గేవే. ఇది అంతా మనసుకి శిక్షణ ఇవ్వటమే.
స్నానం తరువాత `యమాయ తర్పయుఆమి, తర్పయామి, తర్పయామి' అంటు మూడుసార్లు నువ్వులతో యమునికి తరపనాలు ఇవ్వాలి.
ఆ తరువాత ఈ శ్లోకం చదవాలి.
యమాయ ధర్మరాజాయ మృత్యువే చాంతకాయచ
వైవస్వతాయ కాలాయ సర్వభూత క్షయాయచ
ఔదుమ్బరాయ ధర్మాయ నీలాయ పరమేష్టినే
మహొదరాయ చిత్రాయ చిత్రగుప్తాయ తే నమః

దీపావళి రోజు మినపాకుతో చేసిన కూరతొ భోజనం చేస్తే మంచిది అని అంటారుట.
దీపదానం:
సాయంకాలం ప్రోదోషసమయంలో నువ్వులనూనెతో దీపాలు పెట్టాలి . విష్ణ్వాలయంలో, శివాలయాలలో, మతాలలో , దీపాలు పెట్టడంతో పాటు నదీతీరాలలో, చేరుగాట్లు, తోటలు, వీధులు, పర్వతాల్పైన చివరకు స్మసానాలల వద్ద కుడా దీపాలు పెట్టాలని పెద్దల శాసనం. దీపావళి రోజున పితృదేవతలు తమతమ సంతానం ఇంటిని దర్సిస్తారట. వారికి మనం పెట్టె దీపాలే దారి చుపిస్తాయట .
దీపావళినాడు మరి ముఖ్యంగా ఐదు ప్రదేశాలలో దీపాలు పెట్టాలిట .అవి:
1) ఇంటిధ్వారం.
2) ధాన్యపుకొట్టు.
౩) బావి.
4) రావిచెట్టు.
5)వంటిల్లు . ఇంట్లో ఆశుచం ( మైల) పాటిస్తున్నాసారే ఈ ఐదు చోట్లా దీపం పెట్టవలసిందే.
ఉల్కాదానం:
యముడు దక్షినదిసగా ఉంటాడు. మగపిల్లలు ఆ దిక్కువైపు నిలబడి దివిటీలు వెలిగించి పితృదేవతలకు దారి చూపించాలి. తర్వాత కాళ్ళు కడుక్కుని లోపలికి వచ్చి ఏదైనా తీపి పదార్ధాలు తినాలి.
లక్ష్మి పూజ :
దీపాలు వెలిగించి వాటిలోకి లక్ష్మి దేవిని ఆహ్వానించి లక్ష్మీపూజ చెయ్యాలి. ఆ తర్వాత బాణసంచా వెలిగించాలి. అర్ధరాత్రి స్త్రీలు అందరు కలసి చేతలు, వాయిద్యాలు మోగించాలి. దారిద్రాన్ని దూరంగా తరిమికొట్టడానికి ఇలా చెయ్యడం ను "అలక్ష్మినిస్సరణం" అని అంటారు. మనం టపాసు పెల్చడంలోని అర్ధం ఇదే.
ఈ టపాసుల వల్ల వర్షాకాలంలో పుట్టిన ఎన్నో క్రిములు కీటకాలు ముక్తి ని పొందుతాయి. కార్తీకమాసం అంతా దీపాలు వెలిగించేది అందుకే.
రోజూ సాయంకాల దీపం వెలిగించిశ్లొకం చదివి తే చాలామంచిధీ.
దీపం జ్యొతిః పరబ్రహ్మ,
దీపం జ్యోతి జనార్దనః
దీపేన హరతే పాపం
సంద్యాదీపం నమోస్తుతే,

సాయంత్రం సంద్యాదీపం వెలిగించీ ధానికి నమస్కారిచుట చాలాపున్యము. దీపం అంటే పరమాత్మ . దీపంకు నమస్కరించుట పరమాత్మకు నమస్కరించుటే అని అమ్మమ్మ చెప్పింది.దీపావళి రోజు శ్రీమహాలక్ష్మికి పూజ చేయాలి. శ్రీసూక్తము గాని, లక్ష్మీసహస్రనామ స్తోత్రం కానీ, అష్టోత్రంకానీ చేసుకోవటంవల్ల లక్ష్మీ కటాక్ష్మము లభిస్తుందిటమరి.
సరే అమ్మమ్మ చెప్పినవి దీపావళి రోజు పాటిస్తారు కధూ ! మరి నేను ఉంటా మరి బాయ్ ...

ఆదివారం, అక్టోబర్ 04, 2009

తిరు తిరు జవరాల తి తి తి తి

ఆదివారం, అక్టోబర్ 04, 2009



తిరు తిరు జవరాల తి తి తి తి:

 


తిరో తిరో జవరాల తి..తి..తి..తి
తరలమైన నీ తారహార మధురే (తిరు తిరు 3)


స స ని స గ స ! మ గ స !
స స ని స గ స ! ప మ గ స !
స స ని స గ స ! మ గ స !
స స ని స గ స ! ప మ గ స !
స స గ గ మ ! గ మ ప ని !
ప ప ని ని స ! ప ని స గ !
మ గ స ని ! ప మ గ స !
ని స గ గ ! స గ మ మ...

ధిమి ధింకి తొంగ తొంగ ధి ధిమీక్కియారే
మమారె పాత్రారావో మజ్జా ! మజ్జా !
కమలనాభుని తమ కపుటింతి నీకు
అమరె తీరుకో ఇదే అవధరించగదో (తిరు తిరు ౩)

స స ని స గ స ! మ గ స !
స స ని స గ స ! ప మ గ స !
స స ని స గ స ! మ గ స !
స స ని స గ స ! ప మ గ స !
స స గ గ మ ! గ మ ప ని !
ప ప ని ని స ! ప ని స గ !
మ గ స ని ! ప మ గ స !
ని స గ గ ! స గ మ మ...

ఝక ఝక్క ఝం ఝం ఝణకీనానీ
ప్రకటపూ ముఱువొప్పె భళా ! భళా !
సకలపతికి సరసపు కొమ్మ
నీ మొకశిరి మెరసే చిమ్ముల మురిపెముల (తిరు తిరు 3)

స గ స ! మ గ స ! ప మ గ స ! ని ప మ గ స !
స గ స ! మ గ స ! ప మ గ స ! ని ప మ గ స !
స గ స ! స మ గ ! స ప మ ! స ని ప ! స స ని !
స ని ప మ గ ! ని ప మ గ స ని !
ని స గ గ ! స గ మ మ..

మాయి మాయి అలమేలుమంగ నాంచారి మతి
బాయని వేంకటపతి పట్టపురాణీ
మ్రోయ చిరుగజ్జలని మ్రోతలాడీని
సోయగమైన నీ సొలపు చూపమరే (తిరు తిరు ౩)
అన్నమాచార్యులవారు రాసిన పాట తిరు తిరు జవరాల తి తి తి తి. ఈ పాట నాకు చాలా బాగ వచ్చు.నాకు చాలా ఇష్టమైన పాట కూడా.
నాకు ఈ పాట నేర్చుకోటానికి 4 రోజులు పట్టింది. lyric రావటానికి మరి పాట పూర్తిగా రావటానికి 10 రోజులు పట్టింది.
మీరు కూడా నేర్చుకొంటారని. నేను ఈ పాటని మీకోసం పోస్ట్ చేస్తున్నాను. మరి నేర్చుకోండి.


శుక్రవారం, అక్టోబర్ 02, 2009

Great Leaders of Congress-లాల్ బహదుర్ శాస్త్రి

శుక్రవారం, అక్టోబర్ 02, 2009

ఈ రోజు భారత రెండవ ప్రధాని లాల్ బహదుర్ శాస్త్రి గారి పుట్టిన రోజు .1904సం.అక్టోబర్ 2వ తేదిన ఉత్తరప్రదేశ్ లోని మొగలాయ్ సరాయ్ గ్రామంలో తండ్రి శారదా ప్రసాద్ రాయ్
శాస్త్రిగారు. గాంధిగారు ప్రారంభించిన సహాయ నిరాకరణ ఉద్యమంలో ను , సత్యాగ్రహము లోను పాల్గొనుటకు ఉత్సాహంగా వుండెవారు . అప్పుడు జైల్లోకూడా స్వాతంత్ర్యము తర్వాత, ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి గోవింద్ వల్లభ్ పంత్ మంత్రివర్గములో గృహ మంత్రిగా పనిచేశాడు.
స్వాతంత్ర భరత దేశానికి నెహ్రు మొదటి ప్రదాని , నెహ్రు తరువాత లాలబహదుర్ శాస్త్రిగారు రెండవ ప్రదాని గా ప్రమాణ స్వీకరము చేసారు.
ఆయన. 1965 యుద్ధంలో పాకిస్తానును కాళ్ళబేరానికి తీసుకువచ్చాడు. తాష్కెంటు లో పాకిస్తానుతో సంధి చర్చలకు వెళ్ళినపుడు 1966 జనవరి 11 న గుండెపోటుతో మరణించాడు. మరణానంతరం ఆయనకు భారతరత్న పురస్కారం లభించింది.

ఈరోజు అయనను మనం తలుచుకొని అయనికి నివాళి అర్పిద్దాం.

గాంధి (MK Gandhi's Speech (Real un-edited Voice))

అందరికీ నమస్కారము. ఈ రోజు మన జాతి పితా గాంధి తాతగారి పుట్టినరోజు.ఈరోజు గాంధిగారిని ఒకసారి స్మరించుకుందాము.

మోహన్ దాస్ కరంచంద్ గాంధీ

జన్మ నామం: మోహన్ దాస్ కరంచంద్ గాంధీ
జననం: అక్టోబరు 2, 1869
పోరుబందరు(గుజరాత్)
మరణం: జనవరి 30, 1948
హత్య చేయబడ్డాడు
వృత్తి :న్యాయవాది
పదవి :మహాత్మ, జాతి పిత
భార్య/భర్త :కస్తూర్బా
సంతానం:హరిలాల్ గాంధీ, మణిలాల్ గాంధీ, రామదాస్ గాంధీ, దేవదాస్ గాంధీ
తండ్రి: కరంచంద్ గాంధీ
తల్లి: పుతలీ బాయి
గాంధి గారు చిన్నప్పటి నుండి మంచి మంచి కదలు విని inspire అయ్యేవారు. ఆయనకు చత్రపతి శివాజి, భగవత్ గీత వంటి వి ఆయన జీవితంపై గొప్పప్రభావము చూపించాయి అనటంలో అసత్యము లేదు.
గాంధి గొప్పస్వాతంత్ర సమర యోధుడు. మనభారతీయులందరు చేత పూజలు అందుకుంటున్నారు.ప్రజలు అయనని జాతి పితగా గుర్తించారు. పిల్లలు బాపుజీగా తలుస్తారు.
గాంధి గారు సత్యాగ్రహము, సహాయ నిరాకరణ ఉద్యమము , అహింసా వంటివి ఆయన పాటించేవారు.
గాంధిగారు అహింస అనే అనే అస్త్రముతోనే మనదేశాన్ని పరిపాలించటానికి వచ్చిన బ్రిటిష్ వారిని వారిదేశానికి పారిపోయేలా చేసింది.
గాంధిగారు, నారవస్త్రము , చేతికి కర్ర, కళ్ళకు అద్దాలు, కలిగివుండేవారు.
ఈయన మాట సత్యమేవ జయతే.
ఈరోజు గాంధిగారి పుట్టినరోజు ను
Non-violence day గా జరుపుకోవాలి .
ఈ సంధర్బములో నా బ్లాగ్ మిత్రుల తరుపునా నా తరుపునా గాంధితాతకు నివాళి అర్పిస్తున్నాను.

సోమవారం, సెప్టెంబర్ 28, 2009

చిట్టి చిట్టి బొమ్మల పెళ్ళి

సోమవారం, సెప్టెంబర్ 28, 2009

దసరా కదండి అందరు బొమ్మల కొలువులు పెడతారు కదా అప్పుడు బొమ్మల పెళ్ళి కూడా పెడతారు కదా అందులో బొమ్మల పెళ్ళి కూడా పెడతారు అందుకు పాటలు పాడతాం కదా అందుకు నేను చిట్టి చిట్టి బొమ్మల పేళ్ళి పాట నేర్చుకున్నాను మీరు చూడండి.

చిట్టిబొమ్మల పెండ్లి చేయవలెనగా
శ్రింగారవాకిళ్ళు సిరితోరణాలు
గాజుపాలికలతో, గాజుకుండలతో
అరటి స్తంభాలతో అమరె పెండ్లరుగు.

చిన్నన్న పెట్టెనే వన్నెచీరల్లు
పెద్దన్న పెట్టెనే పెట్టెల్లసొమ్ము
నూరుదునె బొమ్మ, నీకు నూటొక్కకొమ్ము
పోతునే బొమ్మ, నీకు పెన్నేఱునీళ్ళు

కట్టుదునె బొమ్మ, నీకు కరకంచుచీర
తొడుగుదునే బొమ్మ, నీకు తోపంచురవిక
ఒడిబియ్యం పెడుదునే, ఒడిగిన్నె పెడుదు
అత్తవారింటికీ పోయి రమ్మందు

అత్త చెప్పినమాట వినవె ఓ బొమ్మ
మామచెప్పినపనీ మానకే బొమ్మ
రావాకుచిలకమ్మ ఆడవే పాప
రాజుల్లు నీచేయి చూడవచ్చేరు..

శ్రీ రాజరాజేశ్వరి దేవి అష్టకం

ఆదివారం, సెప్టెంబర్ 27, 2009

దసరా పండగ శుభాకాంక్షలు

ఆదివారం, సెప్టెంబర్ 27, 2009


నాబ్లాగ్ మిత్రులకు , నా స్నేహితులకు, నా ఆత్మ బందువులకు, అందరికీ ఈ దసరా పండుగ ఆనంద ఆరోగ్య ఐస్వర్యాలు లభించాలని కోరుకుంటున్నాను. అందరికీ దసరా పండుగ శుభాకాంక్షలు.

Shaheed Bhagat Singh

Let salute Bhagadh Singh


ఈ రోజు ప్రముఖ భారత స్వాతంత్ర సమరయోధుడు భగత్ సింగ్ పుట్టిన రోజు. సెప్టెంబర్ 27th 1907 లో ప్రస్తుత పాకిస్తాను లోని లాయల్ జిల్లా బంగాగ్రామంలో జన్మించారు. భగత్ సింగ్ తల్లి తండ్రులు విద్యావతి,కిషన్ సింగ్. వీరు సర్దార్ కుటుంబము.భగత్ సింగ్ కుటుంబంలోని వారందరు స్వాతంత్రపోరటయోదులే. భగత్ సింగ్ పుట్టిన రోజు నాడు వారందరూ జైలు నుండి విడుదల అయ్యారు. అప్పుడు వారి కుటుంబము పండగ చేసుకుని ఆసందర్బములోని భగత్ సింగ్ అని నామకరణము చేసారు.

భగత్ సింగ్ చాలా గొప్ప దేశభక్తుడు. ఎలాఅంటే జిలియన్ వాలాబాగ్ ఉదంతంజరిగినప్పుడు ఆ ప్రదేశము అంతా రక్తముతో తడిసినది. భగత్ సింగ్ ఆ ఘటన జరిగినప్పుడు చిన్నవయసు అప్పుడు భగత్ సింగ్ అక్కడ భూమికి ముద్దుపెట్టుకొని ఆ మట్టిని ఇంటిదగ్గర పెట్టుకున్నాడు. అంత దేశభక్తికలవాడు.అతని ఉద్యమాలు భారత స్వాతంత్ర ఉద్యమం.
అయన ప్రద్దాన సంస్ఠలు నజవాన్ భారత్ సభ,కీర్తికిసాన్ పార్టి, హిందుస్తాన్ సోసలిస్ట్ రిపబ్లికన్ అసోషియెషన్. మొదలగున్నవి ప్రద్దాన సంస్తలు.
భగత్ సింగ్ ఉద్యమాలలో చాలా ఉత్సాహంగా పాల్గొనేవారు.అసెంబ్లీపై బాంబు విసిరేసిన సంఘటనకి కాస్త ముందుగా తన సహచరుడు సుఖ్‌దేవ్‌కు రాసిన లేఖలో భగత్ సింగ్ " నాకూ ఆశలూ, ఆంక్షలూ ఉన్నాయి. ఆనందమైన జీవనం గడపాలని ఉంది. అయితే అవసరమొచ్చినప్పుడు వీటన్నిటినీ త్యజించగలను. ఇదే అసలైన బలిదానం."
భగత్ సింగ్ ముఖ్యమైన కొటేషన్ ఇన్క్విలాబ్ జిందాభాద్.

బాంబ్ కేసులో, భగత్ సింగ్ ని పోలీసులు అరెస్ట్ చేశారు.. వాళ్ళు దీని మీద విచారణ జరుపుతున్న సమయంలోనే, పోలీసు అధికారిని చంపిన సంగతి కూడా బయటపడింది.. దాంతో, ఆయనతో పాటు ఆయన స్నేహితులైన రాజగురు, సుఖదేవ్ కి కూడా మరణశిక్ష పడింది..

కానీ జైల్లో ఉన్నప్పుడు కూడా, భగత్ సింగ్ ఉద్యమాలని చేయడం ఆపలేదు.. బ్రిటీష్ ఖైదీలకి, భారతీయ ఖైదీలకి చూపిస్తున్న అసమానతలని పారద్రోలడానికి, 63 రోజుల పాటు, నిరాహార దీక్ష చేశారు.. దానితో ఆయన పేరు భారత దేశం మొత్తం మారుమ్రోగింది.. (అంతకుముందు వరకూ ఆయన కేవలం పంజాబ్ ప్రాంత వరకు మాత్రమే పరిమితమయ్యారు)

చివరికి మార్చ్23, 1931న రాజ గురు, సుఖదేవ్ తో సహా భగత్ సింగ్ ని ఉరి తీశారు…. అలా ఒక విప్లవకారుని ప్రాణం అనంత వాయువుల్లో కలిసిపోయింది..

Let salute the people who made us prude.
Shahid Bhagat singh's birth day
Hope you all Indian's are aware of this day
Damnit , no most of your not,
hmm don't worry
Lemmy show your something
why this this is important days for Indians.


మహిషాసుర మర్ధిని ఆది శంకరాచార్య విరచిత


మహిషాసుర మర్ధిని అమ్మవారు నవరాత్రులు నవ అవతారాలలో ధర్శనము ఇచ్చారు. మహిషాసురుని వధించుటకు అమ్మ ఉగ్ర రూపము ధరించారు.అప్పుడు ఆమెను దేవతలు అందరు అమెను స్తుతించారు. అలానె శంకారాచార్యులవారు మహిషాసుర మర్ధిని స్తోత్రాన్ని పాడారు అది మంచిగా గుర్తింపు ఉన్న పాట.నవరాత్రుల తరువాత ఈరొజు మహిషాసుర మర్ధిని స్తోత్రము చదువుతారు.

అయి గిరినందిని నందితమేదిని విశ్వవినోదిని నందనుతే
గిరి వరవింధ్యశిరోధినివాసిని విష్ణువిలాసిని జిష్ణునుతే
భగవతి హే శితికంఠకుటుంబిణి భూరికుటుంబిణి భూరికృతే
జయ జయ హే మహిషాసురమర్దిని రమ్యకపర్దిని శైలసుతే

సురవరహర్షిణి దుర్ధరధర్షిణి దుర్ముఖమర్షిణి హర్షరతే
త్రిభువనపోషిణి శంకరతోషిణి కిల్బిషమోషిణి ఘోషరతే
దనుజనిరోషిణి దితిసుతరోషిణి దుర్మదశోషిణి సింధుసుతే
జయ జయ హే మహిషాసురమర్దిని రమ్యకపర్దిని శైలసుతే

అయి జగదంబ మదంబ కదంబవనప్రియవాసిని హాసరతే
శిఖరిశిరోమణి తుంగ హిమాలయశృంగనిజాలయ మధ్యగతే
మధుమధురే మధుకైతభగంజిని కైతభభంజిని రాసరతే
జయ జయ హే మహిషాసురమర్దిని రమ్యకపర్దిని శైలసుతే

అయి శతఖండ విఖండితరుండ వితుండితశుండ గజాధిపతే
రిపుగజగండ విదారణచండ పరాక్రమశుండ మృగాధిపతే
నిజ భుజదండ నిపాటితఖండ విపాటితముండ భటాధిపతే
జయ జయ హే మహిషాసురమర్దిని రమ్యకపర్దిని శైలసుతే

అయి రణ దుర్మదశత్రువధోదిత దుర్ధరనిర్జర శక్తిభృతే
చతురవిచార ధురీణమహాశివదూతకృత ప్రమతాధిపతే
దురిత దురీహ దురాశయ దుర్మతి దానవదూత కృతాంతమతే
జయ జయ హే మహిషాసురమర్దిని రమ్యకపర్దిని శైలసుతే

అయి శరణాగత వైరివధూవర వీరవరాభయ దాయికరే
త్రిభువన మస్తకశూలవిరోధి శిరోధికృతామల శూలకరే
దుమి దుమి తామర దుందుభినాదమహోముఖరీకృత తిగ్మకరే
జయ జయ హే మహిషాసురమర్దిని రమ్యకపర్దిని శైలసుతే

అయి నిజ హుంకృతి మాత్రనిరాకృత ధూమ్రవిలోచన ధూమ్రశతే
సమరవిశోషితశోణితబీజసముద్భవశోణితబీజలతే
శివ శివ శుంభ నిశుంభమహాహవతర్పిత భూతపిశాచరతే
జయ జయ హే మహిషాసురమర్దిని రమ్యకపర్దిని శైలసుతే

ధనురనుసంగరరక్షణసంగపరిస్ఫురదంగనటత్కటకే
కనకపిశంగ పృషత్కనిషంగ రసద్భటశృంగ హటావటుకే
కృత చతురంగబలక్షితిరంగ ఘటద్బహురంగ రటద్వటుకే
జయ జయ హే మహిషాసురమర్దిని రమ్యకపర్దిని శైలసుతే

సురలలనాత తథేయి తధేయి తథాభినయోత్తమనృత్యరతే
హాసవిలాసహులాసమయి ప్రణతార్తజనేమితప్రేమభరే
ధిమికిటధిక్కటధిక్కటధిమిధ్వనిఘోరమృదంగనినాదలతే
జయ జయ హే మహిషాసురమర్దిని రమ్యకపర్దిని శైలసుతే

జయ జయ జప్య జయేజ్ఞయశబ్దపరస్తుతితత్పర విశ్వనుతే
ఝణఝణఝింఝిమిఝింకృతనూపురశింజితమోహితభూతపతే
నటితనటార్ధనటీనటనాయకనాటితనాట్య సుగానరతే
జయ జయ హే మహిషాసురమర్దిని రమ్యకపర్దిని శైలసుతే

అయి సుమనసుమనసుమనసుమనసుమనోహర కాంతియుతే
శ్రితరజనీరజనీరజనీరజనీరజనీకర వక్త్రవృతే
సునయనవిభ్రమరభ్రమరభ్రమరభ్రమరభ్రమరాధిపతే
జయ జయ హే మహిషాసురమర్దిని రమ్యకపర్దిని శైలసుతే

మహితమహాహవమల్లమతల్లిక మల్లిత రల్లక మల్లరతే
విరచిత వల్లికపల్లికమల్లికఝిల్లికభిల్లికవర్గవృతే
సృతకృతఫుల్లసముల్లసితారుణతల్లజపల్లవసల్లలితే
జయ జయ హే మహిషాసురమర్దిని రమ్యకపర్దిని శైలసుతే

అవిరళగండగళన్మదమేదురమత్తమతంగజరాజగతే
త్రిభువనభూషణభూతకళానిధిరూపపయోనిధిరాజసుతే
అయి సుదతీజనలాలసమానసమోహనమన్మధరాజమతే
జయ జయ హే మహిషాసురమర్దిని రమ్యకపర్దిని శైలసుతే

కమలదళామలకోమలకాంతిబలాకలితాతులఫాలతలే
సకలవిలాసకళానిలయక్రమకేళికలత్కలహంసకులే
అలికులసంకులకువలయమండలమౌళిమిలద్వకులాలికులే
జయ జయ హే మహిషాసురమర్దిని రమ్యకపర్దిని శైలసుతే

కలమురళీరవవీజితకూజితలజ్జితకోకిలమంజుమతే
మిలితమిలిందమనోహరగుంజితరాజితశైలనికుంజగతే
నిజగణభూతమహాశబరీగణరంగణసంభృతకేళితతే
జయ జయ హే మహిషాసురమర్దిని రమ్యకపర్దిని శైలసుతే

కటితటపీతదుకూలవిచిత్రమయూఖతిరస్కృతచంద్రరుచే
ప్రణతసురాసురమౌళిమణిస్ఫురదంశులసన్నఖసాంద్రరుచే
జితకనకాచలమౌళిపదోఝితదుర్ధరనిర్ఝరతున్డకుచే
జయ జయ హే మహిషాసురమర్దిని రమ్యకపర్దిని శైలసుతే

విజితసహస్రకరైకసహస్రకరైకసహస్రకరైకనుతే
కృతసురతారకసంగరతారకసంగరతారకసూనునుతే
సురథసమానసమాధిసమానసమాధిసమానసుజాతరతే
జయ జయ హే మహిషాసురమర్దిని రమ్యకపర్దిని శైలసుతే

పదకమలం కరుణానిలయే వరివస్యతి యోనుదినం న శివే
అయి కమలే కమలానిలయే కమలానిలయస్స కధం న భవేత్
తవ పదమేవ పరం పదమిత్యనుశీలయతో మమ కిం న శివే
జయ జయ హే మహిషాసురమర్దిని రమ్యకపర్దిని శైలసుతే

కనకలసత్కలశీకజలైరనుషి..తి తెఢ్గణరంగభువం
భజతి స కిం ను శచీకుచకుంభతటీపరిరంభసుఖానుభవం
తవ చరణం శరణం కరవాణి నతామర వాణి నివాశి శివే
జయ జయ హే మహిషాసుర మర్దిని రమ్య కపర్దిని శైలసుతే

తవ విమలేందు కలం వదనేందు మలం సకలం ననుకూలయతే
కిము పురుహూత పురీందు ముఖీ సుముఖీ భిరసౌ విముఖీ క్రియతే
మమ తు మతం శివ నామ ధనే భవతీ కృపయా కుముత క్రియతే
జయ జయ హే మహిషాసుర మర్దిని రమ్య కపర్దిని శైలసుతే

అయి మయి దీన దయాళు తయా కృప యైవ త్వయా భవితవ్య ముమే
అయి జగతో జననీ కృపయాసి యథాసి తథాను మితాసిరతే
యదుచిత మత్ర భవ త్యురరీ కురుతా దురుతాప మపా కురుతే
జయ జయ హే మహిషాసుర మర్దిని రమ్య కపర్దిని శైలసుతే

శనివారం, సెప్టెంబర్ 26, 2009

బతకమ్మపండగ శుభాకాంక్షలు

శనివారం, సెప్టెంబర్ 26, 2009

మా బ్లాగ్ మిత్రులకు అందరకు బతకమ్మ పండగకు శుభాకాంక్షలు .

దుర్గాదేవి (దుర్గాచాలిసా)

నవరాత్రులలో అమ్మవారు ఈ రోజు దుర్గామాతగా మనకు దర్శనము ఇస్తారు. మహిషాసురుని వధించుటకు అమ్మ అష్టమి రోజు కాళీ మాత దుర్గాదేవిగా కనిపిస్తారు.ఈ దుర్గాఅవతారంలో అమ్మ మహిషాసురినితో భయంకరమైన యుద్దంచేస్తారు.ఈమె అరుణ వర్ణ వస్త్ర దారిఅయి సింహవాహనము కలిగి సర్వఅయుధ దారియై రాక్షసులనుండి మనలను రక్షించుటకు వున్నట్టు దర్శనము ఇస్తున్నది.
ఈమెకి ఎర్రని పుష్పాలు, ఎర్రని అక్షింతలు, ఎర్రని వస్త్రాలు , దనిమ్మ పండ్లు వంటివి సమర్పించి . అమ్మ కరుణ మనపై కురిపించుకోవచ్చు.

శుక్రవారం, సెప్టెంబర్ 25, 2009

సరస్వతి వందనం

శుక్రవారం, సెప్టెంబర్ 25, 2009

మరి ఈ రోజు మూలా నక్షిత్రము కదా సరస్వతి పూజ ఈ రోజు చేస్తారు. పిల్లలు కు మంచి చదువులు రావాలని కోరిన విద్యలు వారికి రావాలంటే సరస్వతి మాత కరుణకావాలి ,ఈ మాతను కొలచిన సకల విద్యలు ప్రసాధిస్తుంది. ఈమె తెల్లని వస్త్రదారిని అయ్యి. ఒక చేతితో వీణను మీటుతూ పుస్తకదారియై మనకు దర్శనము ఇస్తుంది .ఈమెకి హంసవాహనము. ఈమాత త్రిమూర్తులలో బ్రహ్మదేవుని అర్ద్దంగి.

పరాశక్తి మొదట దరించిన ఐదు అవతారలలో సరస్వతి మాత అవతారము ఒకటి. సరస్వతి మాత కేవలం చదువులు ప్రసాధించేది మాత్రమే కాదు సర్వశక్తులు యుక్తులు ప్రసాధిస్తుంది.


.

గురువారం, సెప్టెంబర్ 24, 2009

HAPPY BIRTHDAY TO MY............

గురువారం, సెప్టెంబర్ 24, 2009



మా తాత చింతా. రామకృష్ణారావు(ఆంద్రామృతము బ్లాగ్) గారికి ఈరోజు జన్మదినము . మా తాత పుట్టినరోజు మాకు పండగ. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న తాతగారికి నా తరుపున నా బ్లాగ్ మిత్రులద్వారా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాను. తాతా ఇలాంటి పుట్టినరోజులు మళ్ళీ మళ్ళీ జరుపుకోవాలని కోరుకుంటున్నాను.అమ్మమ్మ, అమ్మ, మామయ్య, కాబోయె అత్తయ్య,నా చెల్లెల్లు తరుపున కూడా మీ పుట్టినరోజు శుభాకాంక్షలు..

శ్రీమహాలక్ష్మి LAXMI DARSHAN ॐ


ఈ రోజు అమ్మవారు శ్రీ మహాలక్ష్మి దేవి గా దర్శనము ఇస్తారు.లక్ష్మి దేవి హిందు వుల సాంప్రదాయం ప్రకారం మనకు సిరి సంపదలు, సౌభాగ్యం, సుఖ సంతోషాలును కలుగ జేసే మాత లక్ష్మి మాత. ఈమె క్షీరసముద్ర తనయ. త్రిముర్తులలో శ్రీమహావిష్ణువు అర్ద్దాంగి. అధికంగా లక్ష్మీదేవి చతుర్భుజాలతోను, ధన కుంభంతోను, పద్మాసనగా, పద్మాలను చేతబట్టి, సకలాభరణ భుషితయైనట్లుగా చిత్రించబడుతుంది. లక్ష్మీ దేవి వాహనం గుడ్లగూబ.
సర్వ శుభ లక్షణ నిలయ, సకల సంపత్ప్రదాయిని అయిన లక్ష్మీదేవి స్వరూపాన్ని ఆవిష్కరిస్తున్నది. ఆమె బంగారు మేనికాంతి కలది (హిరణ్యవర్ణాం), బంగారు ఆభరణములు దాల్చినది (సువర్ణ రజతస్రజాం), వెన్నెలలా మెరుస్తున్నది (చంద్రాం), గజరాజుల ఘీంకారములతో సంబోధింపబడుచున్నది (హస్తినాద ప్రబోధినీం), చిరునగవులు చిందించునది (కాంసోస్మితాం), కీర్తిచే శోభిల్లునది (యశసా జ్వలన్తీం), సకల దారిద్ర్యములను నశింపజేయునది (అలక్ష్మీర్మే నశ్యతాం), పద్మమాలను ధరించినది (పద్మమాలినీం), పద్మమునుండి జనించినది (పద్మోద్భవాం), అందరికి ప్రీతిపూర్వకమైన
(ప్రజానాం భవసి )సుక్తములో వివరించారు. శ్రీలక్ష్మి గురించి. దేవి వివిధ రూపాలలో అష్టలక్ష్ములు ప్రసిద్ధం. వారు - ఆదిలక్ష్మి, ధైర్య లక్ష్మి, ధాన్యలక్ష్మి, గజలక్ష్మి, సంతాన లక్ష్మి, విజయ లక్ష్మి, విద్యాలక్ష్మి, ధన లక్ష్మి - ఆయా రూపాలలో ఆ దేవి ఆయా ఫలితాలను ఇస్తుందని భక్తులు విశ్వసిస్తారు.

మహాలక్ష్మిదేవికి క్షీరాన్నము నైవద్యముగా సమర్పిస్తారు. ఈమె కోరిన కోరికలు తీర్చేమాత.


కాత్యాయినీ మాత


నవదుర్గలలో ఈ రోజు కాత్యాయిని మాత.

"కాత్యాయనీ మాత" భాద్రపదబహుళ చతుర్దశి (ఉత్తరభారత పంచాంగ సంప్రదాయము ననుసరించి ఆశ్వయుజ కృష్ణ చతుర్దశి) నాడు, బ్రహ్మ విష్ణు మహేశ్వరుల తేజస్సుతో కాత్యాయన మహర్షి యింట పుత్రికగా అవతరించినది. ఈమె ఆశ్వయుజ శుక్ల సప్తమి, అష్టమి, నవమి తిథుల యందు కాత్యాయన మహర్షి పూజలందుకొని విజయదశమినాడు మహిషాసురుని వధించెను.


కాత్యాయనీ దేవి అమోఘ ఫలదాయిని. కృష్ణ భగవానుని పడయుటకు గోకులమునందలి గోపికలందఱును యమునాతీరమున ఈమెను పూజించిరి. ఈమె స్వరూపము దివ్యము, భవ్యము. బంగారు వర్ణము గలది. నాలుగు భుజములతో విరాజిల్లుచుండును. ఈమె కుడిచేతిలో ఒకటి అభయ ముద్రను, మఱియొకటి వరముద్రను కలిగియుండును. ఎడమచేతిలో ఒకదానియందు ఖడ్గము, వేఱొకదానియందు పద్మము శోభిల్లుచుండును. ఈమెయు సింహవాహన.


ఈ దేవిని భక్తితో సేవించినవారికి ధర్మార్ధకామమోక్షములనెడి చతుర్విధ పురుషార్ధముల ఫలములు లభించును. రోగములు, శోకములు, సంతాపములు, భయములు దూరమగును. జన్మజన్మాంతర పాపములు నశించును.


బుధవారం, సెప్టెంబర్ 23, 2009

సరస్వతి మాత

బుధవారం, సెప్టెంబర్ 23, 2009


అయిదవరోజు అమ్మవారు సరస్వతి మాతగా దర్శనము ఇస్తారు. ఈమె కనకాంబర వర్ణినిగా వుంటారు. చదువుకునేవారికి మంచి చదువును ప్రసాధించు తల్లి కావున ఈమెను చదువులు తల్లిగా కూడా అంటారు. తెల్లని వస్త్ర దానిణి చేతిలో వీణ పుస్తకాలు కలిగి వుంటుంది. ఈమెకి పెరుగన్నము నేవేద్యముగా సమర్పిస్తారు.
స్కందమాత
కుమార స్వామి, కార్తికేయుడు, శక్తిధరుడు అని ప్రసిద్ధుడైన స్కందుని తల్లి యైన దుర్గాదేవిని 'స్కందమాత'పేరున నవరాత్రులలో 5వ రోజున ఆరాధింతురు. ఈమె చతుర్భుజ. షణ్ముఖుడైన బాలస్కందుని ఈమెయొడిలో ఒక కుడిచేత పట్టుకొనియుండును. మరియొక కుడిచేత పద్మము ధరించియుండును. ఎడమవైపున ఒకచేత అభయముద్ర, మరొకచేత కమలము ధరించి, 'పద్మాసన' యనబడు ఈమెయు సింహవాహనయే.

స్కందమాతను ఉపాసించుటవలన భక్తుల కోరికలన్నియు నెఱవేఱును. ఈ మర్త్యలోకమునందే వారు పరమ శాంతిని, సుఖములను అనుభవించుదురు. స్కందమాతకొనర్చిన పూజలు బాల స్కందునకు చెందును.ఈ దేవి సూర్య మండల-అధిష్టాత్రి యగుటవలన ఈమెను ఉపాసించువారు దివ్య తేజస్సుతో, స్వచ్ఛకాంతులతో వర్ధిల్లుదురు.

శ్రీ లలిత త్రిపుర సుందరి దేవి

నాలగవరోజు అమ్మవారు లలితా త్రిపురసుందరి దేవి గా మనకు దర్శనము ఇస్తారు.ఈమెకి అల్లంగారెలు నెవేద్యముగా సమర్పిస్తారు. ఈమె కోరినకోరికలు తీర్చేమాత.
దరహాసము చేయుచు (అవలీలగా) బ్రహ్మాండమును సృజించునది గావున ఈ దేవి 'కూష్మాండ' అను పేరుతో విఖ్యాత యయ్యెను. ఈమె సూర్య మండలాంతర్వర్తిని. ఈమె తేజస్సు నిరుపమానము. ఈమె యొక్క తేజోమండల ప్రభావముననే దశదిశలు వెలుగొందుచున్నవి. బ్రహ్మాండము నందలి సకల వస్తువులలో, ప్రాణులలో గల తేజస్సు ఈమె ఛాయయే.

'అష్టభుజాదేవి' అని కూడ అనబడు ఈమె ఎనిమిది భుజములతో విరాజిల్లిచుండును. ఏడు చేతులలో వరుసగా కమండలువు, ధనుస్సు, బాణము, కమలము, అమృతకలశము, చక్రము, గద - అనునవి తేజరిల్లుచుండును. ఎనిమిదవ చేతితో సర్వసిద్ధులను, నిధులను ప్రసాదించు జపమాల యుండును. ఈమెయు సింహవాహనయే.

భక్తులు ఈ దేవిని చక్కగా ఉపాసించుటచే పరితృప్తయై ఈమె వారి రోగములను, శోకములను రూపుమాపును. ఈమె భక్తులకు ఆయుర్యశోబలములు, ఆరోగ్యభాగ్యములు వృద్ధిచెందును. కొద్దిపాటి భక్తిసేవలకును ఈదేవి ప్రసన్నురాలగును.
కూష్మాండ మాతగా కూడా కొన్ని ప్రదేశాలలో పూజిస్తారు.

సోమవారం, సెప్టెంబర్ 21, 2009

దేశమంటే మట్టి కాదోయ్ దేశమంటే మనుషులోయ్

సోమవారం, సెప్టెంబర్ 21, 2009

దేశమంటే మట్టి కాదోయ్ దేశమంటే మనుషులోయ్ అన్నది ఎవరో తెలుసా గురజాడ అప్పారావు గారు. ఈరోజు అనగా సెప్టెంబర్ 21st న గురజాడ అప్పారావుగారి పుట్టినరోజు . గురజాడ అప్పారావుగారు 1862 september 21st న విశాఖపట్టణం జిల్లా లో యలమంచలి తాలూక లో సర్వసిద్ధి రాయవరం అన్న వూరిలో తండ్రి వెంకట రామదాసు , తల్లి కౌసల్యమ్మలకు జన్మిచినారు.

గురజాడ అప్పారావుగారు తెలుగు సాహిత్యమ్ మీద చాలా కృషిచేసారు.
అప్పారావుగారు అన్నారు ఆధునిక మహిళ భారత దేశ చరిత్రను పునర్నిర్మ్స్తుంది అని అన్నారు.
ఆయన రచనలు మామూలు వాడుక భాషలోనే రాసేవారు. ఆయన పుత్తడిబొమ్మ పూర్ణమ్మ అనే నాటకం మంచి పేరు తెచ్చుకుంది.కన్యాశుల్కము ఆయన రచనలలో మంచి పేరు తెచ్చుకుంది.
తాంబూలాలు ఇచ్చేసాము తన్నుకు చావండి
డామిట్! కథ అడ్డంగా తిరిగింది
పొగ తాగనివాడు దున్నపోతై పుట్టున్‌

గురజాడ అప్పారావు గురించి వినని వారు వుంటారేమో గానీ, కన్యాశుల్కం నాటకంలో ఆయన సృజించిన ఈ వాక్యాలు వినని తెలుగు వారు వుండరు. ఈనాటకంలో ఆయన సృష్టించిన గిరీశం, మధురవాణి, రామప్పంతులు మొదలైన పాత్రలు కూడా అంతే ప్రఖ్యాతి పొందాయి.

అప్పారావుగారి గేయాలలో మనలో దేశభక్తిని పెంచుటకు దేశభక్తి పాట రాసారు అందులో ఒకటి

దేశమును ప్రేమించుమన్నా
మంచి యన్నది పెంచుమన్నా
వొట్టి మాటలు కట్టిపెట్టోయ్‌
గట్టిమేల్‌ తలపెట్టవోయ్‌


పాడి పంటలు పొంగిపొరలే
దారిలో నువు పాటు పడవోయ్‌
తిండి కలిగితే కండ కలదోయ్‌
కండ కలవాడేను మనిషోయ్‌

ఈసురోమని మనుషులుంటే
దేశమేగతి బాగుపడునోయ్‌
జల్దుకొని కళలెల్ల నేర్చుకు
దేశి సరకులు నింపవోయ్‌


దేశాభిమానం నాకు కద్దని
వొట్టి గొప్పలు చెప్పుకోకోయ్‌
పూని ఏదైనాను ఒక మేల్‌
కూర్చి జనులకు చూపవోయ్‌

చెట్టపట్టాల్‌ పట్టుకొని
దేశస్థులంతా నడువవలెనోయ్‌
అన్నదమ్ముల వలెను జాతులు
మతములన్నియు మెలగవలెనోయ్‌


సొంత లాభం కొంత మానుకు
పొరుగు వానికి తోడుపడవోయ్‌
దేశమంటే మట్టి కాదోయ్‌
దేశమంటే మనుషులోయ్‌

అప్పారావుగారి రచనలలో కన్యక, ముత్యాలసరాలు , సారంగదార, సుభద్ర ఇంకా చాలా రచనలు వున్నాయి.

ఈ రోజు అయన గురించి తెలుసుకున్నాను. మా అమ్మావాళ్ళు చిన్నప్పుడు ఆ వురిలోనే పెరిగారుట నాకు ఇవి అన్నీ అమ్మా, తాత నాకు చెప్పారు. నా బ్లాగుద్వారా నేను తెలుసుకున్నది మీరూ తెలుసుకున్నారు కదూ..........

My Blog Lovers

నా యూట్యూబ్ చానల్స్ ప్లీజ్ సబ్స్క్రిబ్ చేయండీ

Diabetic Challenger

DIABETIC CHALLENGER YOUTUBE CHANNEL. PLASE SUBSCRIBE MY CHANNEL...... THANK YOU VERY MUCH.

Ammamma Tho Nenu (అమ్మమ్మ తో నేను

Please subscribe our channel Ammamma Tho Nenu (అమ్మమ్మ తో నేను)