ఉత్తర భారతదేశ రాజ్యమైన ఝాన్సీ అనే రాజ్యానికి రాణి.1857లో ఆంగ్లేయుల పరిపాలనకు వ్యతిరేకంగా జరిగిన మొదటి భారత స్వాతంత్ర్య సంగ్రామంలో ప్రముఖ పాత్ర పోషించింది.
నేడు ఝాన్సీ రాణి పుట్టినదినము. ఝాన్సీ లక్ష్మి అసలు పేరు మనికర్ణిక. కాశిలో జన్మించింది. మోరోపంత్ తాంబే మరియు భాగీరథీబా లకు జన్మించింది ఝాన్సి. ఝాన్సి లక్ష్మి స్వాతంత్ర సంగ్రామంలో చురుకుగా పాల్గొన్నవీరనారి. రాణి 1858, జూన్ 17 వ తేదీన గ్వాలియర్ యుద్ధం లో మరణించింది. ఆమె భారత స్వాతంత్ర్యోద్యమ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోవడమే కాక 19వ శతాబ్దంలో మహిళా సాధికారతకు ఆదర్శ ప్రాయంగా నిలిచింది.
అలాంటి ఝాన్సి లక్ష్మీబాయిని గుర్తుచేసుకున్నందుకు నాకు చాలా ఆనందంగా వున్నది.