Blogger Widgets

ఆదివారం, ఏప్రిల్ 21, 2024

కలియుగంలో కోరికలు తీర్చేదేముడయ్యా ఈ హనుమయ్య .........హనుమాన్ చాలీసా ఎలా పుట్టింది?

ఆదివారం, ఏప్రిల్ 21, 2024

 




హనుమాన్ చాలీసా పుట్టుక గురించి చాలా ఆసక్తికరమైన చరిత్ర ఉంది. ఇది 16వ శతాబ్దంలో మహాకవి తులసీదాసు చేత రచించబడింది. తులసీదాసు రామభక్తికి ప్రసిద్ధి చెందిన కవి-సన్యాసి మరియు రామచరితమానస అనే ఇతిహాసం రచయిత. హనుమాన్ చాలీసాలో నలభై శ్లోకాలు ఉంటాయి, అందుకే దీనిని ‘చాలీసా’ అని అంటారు, ఇందులో ‘చాలీస్’ అనే పదం నుండి వచ్చింది, దీని అర్థం హిందీ భాషలో ‘నలభై’.

హనుమాన్ చాలీసా వెనుక కథ?

వారణాసి లో ఒక సదాచార సంపన్నుడు తన ఏకైక కుమారుడు కి ఒక అమ్మాయి ని ఇచ్చి వివాహం చేస్తాడు.వారిద్దరూ చిక్కగా జీవనం సాగిపోతుండగా విధి ప్రభావంగా ఆ వక్తి మరణించాడు.దానిని చూసి అతని భార్య తట్టుకోలేకపోయింది ఎంతో బాధపడింది.తన భర్త శవ యాత్రకు అడ్డు పడింది.అది చూసి చుట్టూ పక్కల వాళ్ళు తనని పట్టుకున్నారు యాత్ర సాగుతుంది.ఈ యాత్ర తులసి దాస్ ఆశ్రమం మీదుగా జరుగుతుంది.ఆ అమ్మాయి అందరిని విడుచుకుని వెళ్లి తులసి దాస్ కాళ్ళ మీద పడుతుంది ఎంతో విలపిస్తోంది.ధ్యన్యమ్ లో నిమగ్యమై ఉన్న తులసీదాస్ 'దీర్ఘసుమంగళీభవ' అన్ని దీవించాడు దానితో ఆమె దీనంగా జరిగింది అంత తులసీదాస్ కు వివరించింది.అది విన్న తులసి దాస్ తల్లి నా నోట రాముడు ఎప్పుడు  అసత్యం పలికించాడు అని శవయాత్ర దక్కరకు వెళ్లి శవానికి కట్లు విప్పి రామనామాన్ని జపించి తన కమండలం లో నీళ్లను శవం మీద జల్లుతాడు వెంటనే ఆ యువకుడు పునర్జీవితుడు అయ్యాడు.ఆ మహాత్యమును చుసిన జనులు అందరు రామ భక్తులు అయ్యారు.అది చూసి మరియు చెప్పుడు మాటలు విన్న అక్బర్ తులసి దాస్ ను పిలిపించి అదే రామ నమ మహిమ తో సభ అందరి ముందు ఒక శవాన్ని తెప్పించి బ్రతికించమని చెప్పాడు.జనన మరణాలు నా చేతిలో ఉండవు అని శవాన్ని బ్రతికించలేను అని రాజు చెప్పిన దానిని దిక్కరించాడు తులసి దాస్ అందుకు రాజు జైలు లో పెట్టించి చిత్రహింసలు పెట్టారు 

మహా రామ భక్తుడు అయినా తులసి దాస్ ను అలా హింసలు పెడుతుంటే రామ భక్తుడు అయినా హనుమాన్ తన వానర సైనం తో అక్బర్ మహల్ పై దాడి చేసారు.వందల సంఖ్యలో వానరులని చూసి రాజ్యం లోని వారు అందరు హడిలిపోయారు.కారాగారం లో ఉన్న తులసి దాస్ ను విడిపించకపోతే విధ్వంసం తప్పుడు అని చెప్పారు అక్కడి పండితులు అక్బర్ కి.వెంటనే తులసి దాస్ ను విడిపించారు.తనని కాపాడానికి మహా బాల శాలి అయినా హనుమంతుడు వచ్చాడని గ్రహించాడు తులసీదాస్.అప్పుడు హనుమంతుడు మహాకాయుడు అయ్యి దర్శనం ఇచ్చాడు.

హనుమంతుడిని చుసిన ఆనందం లో తులసీదాస్ నలభై దోహాలు ఆశువుగా స్వామిని స్తుతించాడు .తులసీదాస్ చేసిన స్తోత్రం కి హనుమంతుడు ప్రసన్నం అయ్యి ఈ స్తోత్రం చదివిన వారికీ తాను రక్షగా ఉంటాను అన్ని చెప్పాడు. 

హనుమాన్ చాలీసాలో సూర్యుడు మరియు భూమి దూరం వెల్లడి చేయబడింది

హనుమాన్ చాలీసా వాస్తవంగా సూర్యుడు మరియు భూమి మధ్యలో ఉన్న దూరంను సమర్థంగా చెప్పుతుంది. కానీ అసలు శాస్త్రిక సూత్రం వేరే. వేగం (S) = దూరం (D) ÷ సమయం (T) అనే సామాన్య శాస్త్రిక సూత్రం ఉంది. రికార్డ్ల ప్రకార, 1672లో జాన్ రిచర్ మరియు జోవాన్నికో కాసిని భూమి మరియు సూర్యుడు ఉన్న దూరంను భూమి వ్యాసాల ప్రమాణంగా 22,000 

పన్నెండు వేల దివ్య మైళ్ల దూరంలో ఉన్న సూర్యుడు, మీరు దానిని (సూర్యుడిని) మింగడానికి ప్రయత్నించారు, ఇది ఒక తీపి ఫలంగా భావించి, ఇక్కడ, యుగం అంటే నాలుగు యుగాల (1 పూర్తి మహాయుగం) దైవిక సంవత్సరాలలో ఏకం అవుతుంది. .

సత్యయుగం = 4800 దివ్య సంవత్సరాలు

త్రేతాయుగం = 3600 దివ్య సంవత్సరాలు

ద్వాపరయుగం = 2400 దివ్య సంవత్సరాలు

కలియుగం = 1200 దివ్య సంవత్సరాలు

కాబట్టి, 1 దివ్య యుగం అంటే 12,000 దివ్య సంవత్సరాలు.

సంస్కృతంలో,  సహస్ర  అంటే 1000 మరియు 1  యోజన  అంటే దాదాపు 8 మైళ్లకు సమానం.

కాబట్టి, 12,000 x 1000 x 8 = 96,000,000 మైళ్లు.

శాస్త్రవేత్తల ఇటీవలి లెక్కల ప్రకారం సూర్యుడు మరియు భూమి మధ్య దూరం 92,960,000 మైళ్లు.

భూమి సూర్యుని చుట్టూ ఎలిప్టికల్ కక్ష్యలో తిరుగుతుంది కాబట్టి, ఈ దూరం రుతువులను బట్టి మారుతుంది. ఉత్తర అర్ధగోళంలో వేసవిలో, శీతాకాలంలో కంటే భూమి సూర్యుడికి దగ్గరగా ఉంటుంది.

హనుమాన్ చాలీసా లేదా ఏదైనా మహామంత్ర జపం అనేది ఉత్పాదక మనస్తత్వానికి సానుకూల ధృవీకరణ. మనందరికీ తెలిసినట్లుగా, వాంఛనీయ ఫలితాన్ని సాధించడానికి సానుకూల మనస్తత్వాన్ని సృష్టించేందుకు ధృవీకరణలు సహాయపడతాయి. 

కలియుగంలో  కోరికలు  తీర్చేదేముడయ్యా  ఈ  హనుమయ్య .....ఈ హనుమాన్ జయంతికి అందరు తప్పకుండ పదకొండు సార్లు కనీసం హనుమాన్ చాలీసా పాటించడానికి ప్రయత్నిచండి .అన్ని రకాల బాధలు,ఆరోగ్య సమస్యలు అన్ని తొలిగిపోతాయి 



గురువారం, ఏప్రిల్ 18, 2024

ఒంటిపూట జోష్ ని పెంచే స్నాక్స్ నిమిషంలో(Simple and easy snack perfect fo...

గురువారం, ఏప్రిల్ 18, 2024

బుధవారం, ఏప్రిల్ 03, 2024

పియర్ జాన్సన్ @ హీలియం (chemistry helium gas)

బుధవారం, ఏప్రిల్ 03, 2024

1868లో పియర్ జాన్సన్ అనే ఫ్రెంచి ఖగోళ శాస్త్రజ్ఞుడు ఒక సూర్య గ్రహణం పరిశోధన సమయంలో ఒక క్రొత్త పసుపు రంగు స్పెక్ట్రల్ లైన్ కనుగొన్నాడు. ఇది హీలియం మూలకం సూచించే స్పెక్ట్రల్ లైను. నార్మన్ లాక్యర్ అనే మరో శాస్త్రవేత్త ఇదే గ్రహణాన్ని పరిశీలిస్తూ "హీలియం" అనే క్రొత్త మూలకం పేరు ప్రతిపాదించాడు. వీరిద్దరూ హీలియంను కనుగొన్నవారిగా గుర్తింపు పొందారు.
హీలియం (Helium) ( సంకేతం He) , ఒక రంగు, రుచి, వాసన లేని, హానికరం గాని (non-toxic), తటస్థమైన  ఒకే అణువు కలిగిన (monatomic రసాయనమూలకము. ఇది ఆవర్తన పట్టికలో ఉత్కృష్ట వాయువుల జాబితాలో ప్రధమంగా వస్తుంది. దీని పరమాణు సంఖ్య 2. దీని మరిగే ఉష్ణోగ్రత మరియు ద్రవీకరణ ఉష్ణోగ్రతఅన్ని మూలకాలలో అతి తక్కువ. ఇది దాదాపు అన్ని పరిస్థితులలోను వాయువుగానేఉంటుంది.
1903లో అమెరికా సహజ వాయువు నిల్వలలో పెద్ద మోతాదులో హీలియం కూడా ఉన్నట్లు గుర్తించారు. హీలియంను అధికంగా క్రయోజెనిక్స్ (cryogenics) సాంకేతికతలోను, సముద్రపు లోతులలో శ్వాసపీల్చడానికి వినియోగించే పరికరాలలోను (deep-sea breathing systems), అతివాహక అయస్కాంతాలను కూలింగ్ చేయడానికి, హీలియం డేటింగ్ ప్రక్రియలోను, బెలూన్లను ఉబ్బించడానికి, ఎయిర్ షిప్ (airships)లను తేలికగా చేయడానికి వాడుతారు. ఇంకా అనేక పారిశ్రామిక వినియోగాలున్నాయి. ఉదా: arc welding సిలికాన్ వేఫర్స్(silicon wafers) తయారీ వంటివి.  కొద్ది మోతాదులో హీలియం నాయువును పీల్చినట్లయితే మనిషి మాటలోని గరుకుదనంలో (timbre and quality) కొంత తాత్కాలికమైన మార్పు వస్తుంది.క్వాంటమ్ మెకానిక్స్ అధ్యయనం చేసే శాస్త్రవేత్తలకు హీలియం ద్రవరూపపు (liquid helium-4's two fluid phases, helium I and helium II) లక్షణాలు చాలా ఉపయోగకరమైనవి. ముఖ్యంగా super fluidity అధ్యయనంలోను, absolute zero వద్ద పదార్ధపు లక్షణాలను అధ్యయనం చేసే అతివాహకత (superconductivity) పరిశోధనలలోను.

అన్ని మూలకాలలోను హీలియం రెండ అతి తేలికైన మూలకం. మరియు విశ్వంలోఅత్యధికంగా లభించే రెండవ పదార్ధం. నిశ్వంలో హీలియం అధికంగా మహా విస్ఫోటనం(Big Bang) సమయంలో ఏర్పడింది. అంతే గాకుండా నక్షత్రాలలో హైడ్రోజెన్మూలకం న్యూక్లియర్ ఫ్యూషన్ (en:nuclear fusion) కారణంగా హీలియంగా మారుతుంటుంది. భూమిమీద మాత్రం హీలియం పరిమాణం చాలా తక్కువ. భూమి మీది హీలియం కొన్ని మూలకాల రేడియో యాక్టివ్ డికే (radioactive decay) కారణంగా తయారౌతున్నది. ఇలా తయారైన హీలియం సహజ వాయువులో కలిసి ఉంటుంది. దానిని ఫ్రాక్షనల్ డిస్టిలేషన్ (fractional distillation) ప్రక్రియ ద్వారా వేరు చేస్తారు..
పేరుసంకేతముపరమాణు సంఖ్య : హీలియం, He, 2
ఎలక్ట్రాన్ విన్యాసం : 1s2
ప్రామాణిక పరమాణు భారం :4.002602(2) g·mol−1
రసాయన సిరీస్ : జడ వాయువులు
గ్రూపుపీరియడ్బ్లాక్ : 181s

శనివారం, ఫిబ్రవరి 03, 2024

నేను ఏమీ చేయలేను అనుకునేవారికి భగవద్గీత నుండి సమాధానం

శనివారం, ఫిబ్రవరి 03, 2024

 మనం జీవితంలో ఎన్నో అనుకుంటూ వుంటాం.  కొన్ని పనులు అనుకోగానే అవుతాయి కొన్ని పనులైతే ఎన్నిసార్లు చేపట్టినా అవ్వదు.  అలాంటప్పుడు మనకి నిరాశా నిస్పృహ వస్తాయి.  కొంతమంది అయితే డిప్రషన్లోకి వెళ్ళిపోతారు.  అంతలా చేస్తాయి  నిరాశా నిస్పృహ .   మనం వింటు వుంటాం ప్రతీ సమస్యకి ఒక పరిష్కారం వుంటుంది అని.  మనం ప్రయత్నిస్తూ వుండాలి అంతే. 

కృష్ణుడు భగవద్గీతను అర్జునికి ఒకనికే చెప్పలేదు.  మనకోసం చెప్పివుంటాడేమో .  ఇప్పుడు అందరు ఏదన్న సమస్య వస్తే మానసిక వైద్యునిదగ్గరికి వెల్తూన్నారు. వాళ్లు కౌన్సిలింగ్స్ ఇస్తారు.  అలాగే యుద్దభూమిలో అర్జునుడు తనవారిని చూసి యుద్దం చేయను, చేయలేను అంటూ అర్జుని విషాధం దానితరువాత శ్రీ కృష్ణులువారు భగవద్గీత చెప్పారు.  అయితే మనజీవితంలో అన్వయించుకుంటే    ప్రతీ సమస్యకి భగవత్గీతలో సమాధానం దొరుకుతుంది.  చూసే దృక్కోణం బట్టి సమాధానం వుంటుంది. 

ఈరోజు ఒకసమస్యని చూసి గీతలో కృష్ణుడు ఏమి చెప్పారో చూద్దాంరండి. 

సమస్య ఏమిటంటే :  

ఒకపని తలపెట్టాను. ఆపని ఎన్నిసార్లు చేసినా పూర్తీ అవ్వటంలేదు.. ఏ పని చేసినా మంచి ఫలితాలు రావటంలేదు. కష్టం వృధా అవుతొంది తప్పా మంచి ఫలితం రావటంలేదు.  మనస్సులో ధైర్యంలేదు. నేను ఏమి చేసినా ఇంతే .  ఎప్పుడు ఫెయిల్ అవుతూనే ఉంటుంది . ఏమి చేయాలన్నా భయం నేను చేయగలనా లేదా. ఒకవేళ చేస్తే పర్ఫెక్ట్ అవుతుందో లేదో .  మనసునిండా tension .  మనసు కృంగిపోతుంది.  

ఈ సమస్య సర్వసాధారణంగా మనలో చాలామంది అంటూ ఉంటారు. మనం వింటూనే వున్నాం కదా మరి ఈ సమస్యకి గీత ఏమి చెప్తోందో చుద్దాం.  

నేను ఏమీ చేయలేను అనుకునేవారికి భగవద్గీత నుండి సమాధానం. 


 గీతలో సాంఖ్య యోగము, భగవద్గీతలో రెండవ అధ్యాయంలో మూడవ శ్లోకం చూడండి. 

||శ్లోకము 2-3||

క్లైబ్యం మాస్మగమః పార్థ నైతత్త్వయ్యుపపద్యతే |
క్షుద్రం హృదయ దౌర్బల్యం త్వక్యోత్తిష్ట పరన్తప ||3||

చూడండి. దీని అర్ధం ఏమిటంటే 

“  పార్థా ! పిరికితనాన్ని తెచ్చుకోవద్దు ; అది నీకు ఎంత మాత్రమూ తగదు ; తుచ్ఛమైన హృదయదౌర్బల్యాన్ని విడిచిపెట్టి యుద్ధానికి సంసిద్ధుడవు కా ! ”

హృదయ దౌర్భల్యం, పిరికితనం, అధైర్యం వంటివి మన మనసున చేరిన బుద్ది నశిస్తుంది. విచక్షణ జ్ఞానము ఉండదు. 

అందువల్లే ఎంతో గొప్ప సాటిలేని వీరుడు అయిన అర్జునుడు కూడా తనలోని అంతఃశత్రువులైన హృదయ దౌర్బల్యానికి పిరికితనానికి లోనై యుద్ధం చేయకూడదు అనుకున్నాడు. ఒకానొక బుద్ధిశాలి ఎప్పుడూ వర్తమాన పరిస్థితుల వైపు కాక,అంతిమలక్ష్యం వైపు దృష్టిపెట్టాలి.  విజ్ఞతయే ధర్మయుద్ధానికి మూలం . ధర్మయుద్ధమే అంతిమ విజయానికి మార్గం.జీవన సమరంలో వెనుకడుగు వేసే ప్రతి సందర్భంలోనూ మన అడుగులు ముందుకు వేస్తూంటేగమ్యం చేరువ అవుతూ ఉంటుందిచివరికి లక్ష్యాన్ని చేరుతాం . 

పరిష్కారం : ఎప్పుడు నిరుత్సాహ పడకూడదు. నీశక్తి నీలోనే ఉంది . అది నువ్వు గ్రహించాలి. నువ్వు ఇప్పటికే చాలా విజయాలు సాధించావు అలాంటి నువ్వా ఇలా క్రుంగిపోతున్నావా ? లే  దైర్యం తెచ్చుకో .  నీచమైన పిరికితనం వదిలిపెట్టు . ఉత్సాహంతో దైవంమీద భారం వేసి పని మొదలు పెట్టు. తప్పకుండా విజయం సాధిస్తావు. 

ఇదండీ భగవద్గీతలో మన సమస్యకి సాంఖ్యా శాస్త్రంలో సమాధానం దొరికింది.  మీకు నచ్చి ఉంటుందని ఆశిస్తున్నాను. ధన్యవాదములు. 

శనివారం, జనవరి 27, 2024

చిన్నకథ పెద్దనీతి Story Telling

శనివారం, జనవరి 27, 2024

శనివారం, ఏప్రిల్ 02, 2022

ఉగాది పచ్చడి తయారి పండగ వెనక కధ

శనివారం, ఏప్రిల్ 02, 2022

నమస్కారమండి, అమ్మమ్మ తో నేను చానల్ కి స్వాగతం. ఉగాది పచ్చడి తయారి పండగ వెనక కధ నేను అమ్మమ్మ ఈ వీడియో లు చేయటానికి చాలా కష్టపడుతున్నాము. మీకు కనకా మా వీడియోలు నచ్చినట్టు అయితే మా చానల్ ని సబ్క్రైబ్ చేయండి. మమ్మల్ని ప్రోత్సహింస్తున్నందుకు మీఅందరికీ మా ధన్యవాధములు. Hii everyone welcome to our channel ammamma tho nenu I wish u all a happy ugadi.All of u plz watch full vedio and share ur comments.And also plz tell what u prepared for todays lunch specials,how do u celebrate?

శనివారం, జూన్ 12, 2021

ఇమ్యునిటీ బూస్టర్ బన్ (Immunity booster bun)

శనివారం, జూన్ 12, 2021

                      

నమస్కారం.అందరికీ డయాబెటిక్ చాలెంజర్ చానల్ కి స్వాగతం. వర్షాకాలం వచ్చింది కదండి. డయాబెటిక్ వారికి ఇమ్యునిటి తక్కువగా వుంటుంది కదండి. వారికి ఇమ్యునిటి పెంచుకోటంకోసం ఒక మంచి రిసిపి చెప్పానండి. అది ఇప్పటివరకు ఎవరైనా చేసారో లేదో నాకు తెలియదుకానీ. నేను స్వయంగా చేసాను. చాలా రుచిగా వుంది. మీరు కూడా చేసి రుచి చూడండి. మీ అభిప్రాయం నాతో పంచుకోండి మరి. Please watch my blog also http://laharicom.blogspot.com/ -~-~~-~~~-~~-~- Please watch: "(212) నిముషాలలో తయారుచేసుకునే సుపర్ వెజిటేబుల్ ఫ్రై........😋😋😋😋😋(Instant stirfry with vegetable) " https://www.youtube.com/watch?v=WXwzg...

బుధవారం, జనవరి 24, 2018

రామచరిత మానస

బుధవారం, జనవరి 24, 2018

ఈరోజు రధసప్తమి చాలా మంచి రోజు కదా ! అందుకే ఈరోజు నుండి కొంచెం కొంచెంగా రామచరిత మానస చదువుకుందాం అనిపించింది , నాతో పాటుగా మీకు కూడా అందిస్తున్నాను. ముందుగా మనం రామచరితమానస చదివేముందు. మనకు రామచరిత మానస ను మనకు అందించిన కవివరేణ్యులు గురించి తెలుసుకుందాం వారికి ముందుగా నమస్కారములు తెలుపుకుందాం.
గోస్వామి తులసీదాసు ఉత్తరప్రదేశ్‌ బాండా జిల్లా రాజ్‌ పూర్‌లో ఆత్మారాం దుబే మరియు హుల్సీ దేవి దంపతులకు జన్మించాడు. రామాయణాన్ని సంస్కృతంలో విరచించిన వాల్మీకి యొక్క అవతారమే తులసీదాసు అని అంటారు. భక్తి, కావ్య రచన, తాదాత్మ్యత, భాష వీటిని చూస్తే ఆయన అపర వాల్మీకి అనటానికి ఏ సందేహమూ లేదు తులసీదాసు తన జీవితాన్ని రామభక్తికి అంకితం చేశాడు. గోస్వామి తులసీదాసు అవధ ప్రాంత కవి, తత్వవేత్త. ఉత్తరప్రదేశ్‌లోని లక్నో సమీప ప్రాంతాలను అప్పట్లో అవధ దేశంగా పిలిచేవారు. తులసీదాసు జీవిత కాలంలో సంస్కృతంతో పాటుగా హిందీలో 22 రచనలు చేశాడు.
రామచరిత మానస్:
వాల్మీకి రచించిన రామాయణాన్ని సామాన్య ప్రజలు కూడా చదవడానికి వీలుగా హిందీలో అనువదించాడు తులసీదాసు. దీనికి శ్రీరామచరితమానస్‌గా తులసీదాసు నామకరణం చేశాడు. ఈ మహాగ్రంథం రచనా కార్యక్రమాన్ని దశరథనందనుడైన శ్రీరాముని రాజ్య రాజధాని అయోధ్యలో చేపట్టాడు. గ్రంథం పూర్తికావటానికి రెండు సంవత్సరాల ఏడు నెలల సమయం పట్టింది. అయితే ఈ గ్రంథంలోని ఎక్కువ భాగం రచనను తులసీదాసు వారణాసిలో చేశాడు.ఆయన తదనంతరం వారణాసిలో "తులసీ ఘాట్" ఏర్పడింది. తులసీదాసు ఇతర రచనల్లో దోహావళి, కవితావళి, గీతావళి, వినయ పీఠిక, జానకీ మంగళ్‌, రామలాల నహచాచు. రామాంజ ప్రసన్న, పార్వతి మంగళ్‌, కృష్ణ గీతావళి, హుమాన్‌ బాహుక, సంకట మోచనస వైరాగ్య సందీపిని, హనుమాన్‌ చాలీసా వంటివి ఉన్నాయి.
అవసాన సమయంలో ఆఖరికి వారణాశిలో స్థిరపడ్డాడు. అక్కడే క్రీ.శ.1623లో తన తనువు చాలించాడు. అభినవ వాల్మీకి, భక్తశిరోమణి అయిన తులసీదాస కవులకు నమస్కారములు.
ఈరోజు నుండి రామచరితమానస .................._/\_
సత్యం శివమ్ సుందరం శ్రీ గణేశాయనమః శ్రీ జానకీవల్లబో విజయతే శ్రీరామచరిత మానసము
ప్రధమ సోపానం
బాలకాండము
మంగళాచరణం
శ్లోకం: వర్ణానామర్ధసంఘానాం రసానాం ఛాందసామపి
మంగళానాం చ కర్తారౌ వందే వాణీవినాయకౌ||
భవానీశంకరౌ వందే శ్రద్దావిశ్వాసరూపిణౌ
యాభ్యామ్ వినా న పశ్యంతి సిద్ధాః స్వాంతఃస్థమీశ్వరమ్||

వందే బోధమయం నిత్యం గురుం శంకరరూపిణమ్
యమాశ్రితో హి వక్రో2పి చంద్రాః సర్వత్ర వంద్యతే||
సీతారామగుణగ్రామపుణ్యారణ్య విహారిణౌ
వందే విసుద్ధవిజ్ఞానౌ కవీశ్వరాకపీశ్వరౌ ||

ఉద్భవస్థితిసంహారకారిణీం క్లేశహారిణీం
సర్వశ్రేయస్కరీం సీతాం నతో౭హం రామవల్లబామ్ ||

|| స్వస్తి || _/\_

My Blog Lovers

నా యూట్యూబ్ చానల్స్ ప్లీజ్ సబ్స్క్రిబ్ చేయండీ

Diabetic Challenger

DIABETIC CHALLENGER YOUTUBE CHANNEL. PLASE SUBSCRIBE MY CHANNEL...... THANK YOU VERY MUCH.

Ammamma Tho Nenu (అమ్మమ్మ తో నేను

Please subscribe our channel Ammamma Tho Nenu (అమ్మమ్మ తో నేను)