హాయ్ ! ప్రపంచంలో ఉన్నపిల్లలందరు గుర్తుపెట్టుకుంటున్న CARTOON MICKEY MOUSE program. ఈరోజు MICKEY MOUSE birthday. అని అందరుకు తెలుసు. మిక్కి మౌస్ అన్నది అమెరికాలోని animal cartoon character ,Mickey mouse అన్నది walt disney అనే కంపనీ నుండి 1928 వ సంవత్సరం లో తయారు చేయబడింది. ప్రతీ సంవత్సరం నవంబర్ 18th న మిక్కి మౌస్ పుట్టిన రోజు జరుపుకుంటున్నారు. పిల్లలకి రాముడు తెలియక పోవొచ్చేమో కానీ మిక్కి మౌస్ తెలియని వారుండరు. మిక్కి మౌస్ క్లబ్ హౌస్ కి మిక్కినె లీడర్.
మిక్కి మౌస్ మొట్టమొదట plane crazy అని 1928 లో stage program ఇచ్చారు.
తయారు చేసినవారు Walt Disney , UbIwerks
డబ్బింగ్ చెప్పినవారిలో ముఖ్యులు Walt Disney (1928-1947), Jemmy MacDonald (1947-77),Wayne Allwine (1977-2009), Bret Iwan(2009)
ఈరోజు నాకు ఎంతో ఇష్టమైన cartoon character MICKEY MOUSE BIRTHDAY ,
మా స్కూల్లో ఈ రోజు చాచానెహృగారి పుట్టినరోజు సంధర్భముగా Children's day జరుపుకున్నాము. అప్పుడు పద్యాల పోటి పెట్టారు. fancy dress show పెట్టారు. అందరు బాగాతయారు అయ్యారు. మా స్కూల్లో బాగా జరుపుకున్నాము.
ఈ రోజు ఆంద్ర రాష్ట్ర అవతరణ దినోత్సవం గా జరుపుకుంటున్నాం.పొట్టిశ్రీరాములు (1901-1952) గాందేయుడు. ప్రత్యేక ఆంధ్ర రాష్ర్టాఏర్పాటుకు 58 రోజులు ఉపవాస దీక్ష కొనసాగించి ఆత్మార్పణ చేసి అమరజీవిగా ప్రసిద్దుడైనాడు. అతని అత్మార్పణ ఫలితంగా మనకు ఆంద్ర ప్రదేశ్ ఏర్పడింది.
దీపావళి రోజు ఏమి చేయాలి మీకు తెలియదా! అయితే ఇది చదవాలి మరి
దీపావళి అంటే మన అందరికి చాలా ఇష్టం . ఐతే చాలామంది లో దీపావళి అంటే దీపాలు వెలిగించటమే కదా! అని కాని దీపావళి కి చాలా విశిష్టత వుంది . దీపావళి పండుగ చేసుకునే విధానం కుడా వుంది . ఇవి చాలామందికి తెలిదు. పూర్వపు పద్ధతులు మరచి పోయారు. ఆ రోజుకి స్వీట్స్ కొనుక్కొని వచ్చి వెరైటి వంటలుచేసుకొని , రాత్రి దీపాలు వెలిగించి టపాసు కాల్చుకొని ఎంజాయ్ చేయటమే అనుకుంటున్నారు మనలోచాలామంది.
ఐతే మా అమ్మమ్మ పూర్వపు పద్దతు లు చెప్పింది అవి ఏమిటంటే :
దీపావళి పండుగ ఆశ్విజ బహుళ చతుర్దశి అమావస్య నాడు వస్తుంది. ఇది రెండురోజుల పండుగ త్రయోదసినాటి రాత్రి అపమృత్యు నివారణ కోసం ప్రమిదలతో దీపాలు వెలిగించి ఇంటిముందు వుంచాలి. నరకచతుర్దసిని ప్రేతచతుర్దసి అని కుడా అంటారు. ఎందుకంటే ఇది యమునికి కుడా ప్రీతి కలిగించేరోజు.యముడు పితృత్వం కూడా ఉన్నా దేవుడు. సూర్యోదయానికి ముందు, రాత్రి తుదిజాములోనువ్వులనూనెతో తలంతుపోసుకోవాలి. ఇలా చేయడంలో చాలా విశేషం వుందిట. దీపావళి పర్వదినాలలోనువ్వుల నూనెలో లక్ష్మి దేవి ఉంటుందిట. . అలాగే నదులు, చెరువులు, బావులు, కాలువలు, వంటి అన్నిజలవనరులలోకి గంగాదేవి ఆ రోజుల్లో ప్రవేశిస్తుందిట . నువ్వులనునేల్తో అభ్యంగనస్నానం చెయ్యడం వల్ల దారిద్ర్యం తొలగి గంగాస్నాన ఫలం లభిస్తుందిట. నరక బాధలు తప్పుతాయట . చివరకు సన్యాసులు కుడా చేస్తారుట. స్నానం కూడా ఎప్పుడు పడితే అప్పుడు చెయ్యడం కాదు. సూర్యోదయానికి ముందు నాలుగు ఘడియల కాలంఅరుణోదయం అంటారు . ఆ లోగా చెయ్యాలి. స్నానం చేసేటప్పుడు ఉత్తరేణి కొమ్మను శిరస్సు మీద తిప్పుతూ ఈ శ్లోకం పాటించాలి . శీతలోష్ట సమాయుక్త సకంటక దలాన్విత హరపాప మపామార్గ భ్రామ్యమానః పునః పునః అపామార్గం అంటే ఉత్తరేణి . ఇలాచేయటం వల్ల నరకం రాదట. నువ్వులనునే , ఉత్తరేను మొదలైనవి ప్రకృతితో మనకు ఎంత ముడిపది వున్నామో తెలుస్తుంది. ప్రక్రుతిసామరస్యంలో మనం జేవించాలని ఇందులో సందేశం. ఇందు వల్ల నరకంబయం అన్నది ఉంటే అది మన భావన ద్వారా ఆ స్థితికి చేరుకున్తామన్నామాట. స్వర్గనరకాలు మనస్సు నందు కల్గేవే. ఇది అంతా మనసుకి శిక్షణ ఇవ్వటమే. స్నానం తరువాత `యమాయ తర్పయుఆమి, తర్పయామి, తర్పయామి' అంటు మూడుసార్లు నువ్వులతో యమునికి తరపనాలు ఇవ్వాలి. ఆ తరువాత ఈ శ్లోకం చదవాలి. యమాయ ధర్మరాజాయ మృత్యువే చాంతకాయచ వైవస్వతాయ కాలాయ సర్వభూత క్షయాయచ ఔదుమ్బరాయ ధర్మాయ నీలాయ పరమేష్టినే మహొదరాయ చిత్రాయ చిత్రగుప్తాయ తే నమః దీపావళి రోజు మినపాకుతో చేసిన కూరతొ భోజనం చేస్తే మంచిది అని అంటారుట. దీపదానం: సాయంకాలం ప్రోదోషసమయంలో నువ్వులనూనెతో దీపాలు పెట్టాలి . విష్ణ్వాలయంలో, శివాలయాలలో, మతాలలో , దీపాలు పెట్టడంతో పాటు నదీతీరాలలో, చేరుగాట్లు, తోటలు, వీధులు, పర్వతాల్పైన చివరకు స్మసానాలల వద్ద కుడా దీపాలు పెట్టాలని పెద్దల శాసనం. దీపావళి రోజున పితృదేవతలు తమతమ సంతానం ఇంటిని దర్సిస్తారట. వారికి మనం పెట్టె దీపాలే దారి చుపిస్తాయట . దీపావళినాడు మరి ముఖ్యంగా ఐదు ప్రదేశాలలో దీపాలు పెట్టాలిట .అవి: 1) ఇంటిధ్వారం. 2) ధాన్యపుకొట్టు. ౩) బావి. 4) రావిచెట్టు. 5)వంటిల్లు . ఇంట్లో ఆశుచం ( మైల) పాటిస్తున్నాసారే ఈ ఐదు చోట్లా దీపం పెట్టవలసిందే. ఉల్కాదానం: యముడు దక్షినదిసగా ఉంటాడు. మగపిల్లలు ఆ దిక్కువైపు నిలబడి దివిటీలు వెలిగించి పితృదేవతలకు దారి చూపించాలి. తర్వాత కాళ్ళు కడుక్కుని లోపలికి వచ్చి ఏదైనా తీపి పదార్ధాలు తినాలి. లక్ష్మి పూజ : దీపాలు వెలిగించి వాటిలోకి లక్ష్మి దేవిని ఆహ్వానించి లక్ష్మీపూజ చెయ్యాలి. ఆ తర్వాత బాణసంచా వెలిగించాలి. అర్ధరాత్రి స్త్రీలు అందరు కలసి చేతలు, వాయిద్యాలు మోగించాలి. దారిద్రాన్ని దూరంగా తరిమికొట్టడానికి ఇలా చెయ్యడం ను "అలక్ష్మినిస్సరణం" అని అంటారు. మనం టపాసు పెల్చడంలోని అర్ధం ఇదే. ఈ టపాసుల వల్ల వర్షాకాలంలో పుట్టిన ఎన్నో క్రిములు కీటకాలు ముక్తి ని పొందుతాయి. కార్తీకమాసం అంతా దీపాలు వెలిగించేది అందుకే. రోజూ సాయంకాల దీపం వెలిగించిశ్లొకం చదివి తే చాలామంచిధీ. దీపం జ్యొతిః పరబ్రహ్మ, దీపం జ్యోతి జనార్దనః దీపేన హరతే పాపం సంద్యాదీపం నమోస్తుతే, సాయంత్రం సంద్యాదీపం వెలిగించీ ధానికి నమస్కారిచుట చాలాపున్యము. దీపం అంటే పరమాత్మ . దీపంకు నమస్కరించుట పరమాత్మకు నమస్కరించుటే అని అమ్మమ్మ చెప్పింది.దీపావళి రోజు శ్రీమహాలక్ష్మికి పూజ చేయాలి. శ్రీసూక్తము గాని, లక్ష్మీసహస్రనామ స్తోత్రం కానీ, అష్టోత్రంకానీ చేసుకోవటంవల్ల లక్ష్మీ కటాక్ష్మము లభిస్తుందిటమరి. సరే అమ్మమ్మ చెప్పినవి దీపావళి రోజు పాటిస్తారు కధూ ! మరి నేను ఉంటా మరి బాయ్ ...
స స ని స గ స ! మ గ స ! స స ని స గ స ! ప మ గ స ! స స ని స గ స ! మ గ స ! స స ని స గ స ! ప మ గ స ! స స గ గ మ ! గ మ ప ని ! ప ప ని ని స ! ప ని స గ ! మ గ స ని ! ప మ గ స ! ని స గ గ ! స గ మ మ...
ధిమి ధింకి తొంగ తొంగ ధి ధిమీక్కియారే
మమారె పాత్రారావో మజ్జా ! మజ్జా !
కమలనాభుని తమ కపుటింతి నీకు
అమరె తీరుకో ఇదే అవధరించగదో (తిరు తిరు ౩)
స స ని స గ స ! మ గ స !
స స ని స గ స ! ప మ గ స !
స స ని స గ స ! మ గ స !
స స ని స గ స ! ప మ గ స !
స స గ గ మ ! గ మ ప ని !
ప ప ని ని స ! ప ని స గ !
మ గ స ని ! ప మ గ స !
ని స గ గ ! స గ మ మ...
ఝక ఝక్క ఝం ఝం ఝణకీనానీ
ప్రకటపూ ముఱువొప్పె భళా ! భళా !
సకలపతికి సరసపు కొమ్మ
నీ మొకశిరి మెరసే చిమ్ముల మురిపెముల (తిరు తిరు 3)
స గ స ! మ గ స ! ప మ గ స ! ని ప మ గ స !
స గ స ! మ గ స ! ప మ గ స ! ని ప మ గ స !
స గ స ! స మ గ ! స ప మ ! స ని ప ! స స ని !
స ని ప మ గ ! ని ప మ గ స ని !
ని స గ గ ! స గ మ మ..
మాయి మాయి అలమేలుమంగ నాంచారి మతి
బాయని వేంకటపతి పట్టపురాణీ
మ్రోయ చిరుగజ్జలని మ్రోతలాడీని
సోయగమైన నీ సొలపు చూపమరే (తిరు తిరు ౩)
అన్నమాచార్యులవారు రాసిన పాట తిరు తిరు జవరాల తి తి తి తి. ఈ పాట నాకు చాలా బాగ వచ్చు.నాకు చాలా ఇష్టమైన పాట కూడా.
నాకు ఈ పాట నేర్చుకోటానికి 4 రోజులు పట్టింది. lyric రావటానికి మరి పాట పూర్తిగా రావటానికి 10 రోజులు పట్టింది.
మీరు కూడా నేర్చుకొంటారని. నేను ఈ పాటని మీకోసం పోస్ట్ చేస్తున్నాను. మరి నేర్చుకోండి.
ఈ రోజు భారత రెండవ ప్రధాని లాల్ బహదుర్ శాస్త్రి గారి పుట్టిన రోజు .1904సం.అక్టోబర్ 2వ తేదిన ఉత్తరప్రదేశ్ లోని మొగలాయ్ సరాయ్ గ్రామంలో తండ్రి శారదా ప్రసాద్ రాయ్ శాస్త్రిగారు. గాంధిగారు ప్రారంభించిన సహాయ నిరాకరణ ఉద్యమంలో ను , సత్యాగ్రహము లోను పాల్గొనుటకు ఉత్సాహంగా వుండెవారు . అప్పుడు జైల్లోకూడా స్వాతంత్ర్యము తర్వాత, ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి గోవింద్ వల్లభ్ పంత్ మంత్రివర్గములో గృహ మంత్రిగా పనిచేశాడు. స్వాతంత్ర భరత దేశానికి నెహ్రు మొదటి ప్రదాని , నెహ్రు తరువాత లాలబహదుర్ శాస్త్రిగారు రెండవ ప్రదాని గా ప్రమాణ స్వీకరము చేసారు. ఆయన. 1965 యుద్ధంలో పాకిస్తానును కాళ్ళబేరానికి తీసుకువచ్చాడు. తాష్కెంటు లో పాకిస్తానుతో సంధి చర్చలకు వెళ్ళినపుడు 1966 జనవరి 11 న గుండెపోటుతో మరణించాడు. మరణానంతరం ఆయనకు భారతరత్న పురస్కారం లభించింది.
ఈరోజు అయనను మనం తలుచుకొని అయనికి నివాళి అర్పిద్దాం.
అందరికీ నమస్కారము. ఈ రోజు మన జాతి పితా గాంధి తాతగారి పుట్టినరోజు.ఈరోజు గాంధిగారిని ఒకసారి స్మరించుకుందాము.
మోహన్ దాస్ కరంచంద్ గాంధీ
జన్మ నామం:మోహన్ దాస్ కరంచంద్ గాంధీ జననం: అక్టోబరు 2, 1869 పోరుబందరు(గుజరాత్) మరణం: జనవరి 30, 1948 హత్య చేయబడ్డాడు వృత్తి :న్యాయవాది పదవి :మహాత్మ, జాతి పిత భార్య/భర్త :కస్తూర్బా సంతానం:హరిలాల్ గాంధీ, మణిలాల్ గాంధీ, రామదాస్ గాంధీ, దేవదాస్ గాంధీ తండ్రి: కరంచంద్ గాంధీ తల్లి: పుతలీ బాయి గాంధి గారు చిన్నప్పటి నుండి మంచి మంచి కదలు విని inspire అయ్యేవారు. ఆయనకు చత్రపతి శివాజి, భగవత్ గీత వంటి వి ఆయన జీవితంపై గొప్పప్రభావము చూపించాయి అనటంలో అసత్యము లేదు. గాంధి గొప్పస్వాతంత్ర సమర యోధుడు. మనభారతీయులందరు చేత పూజలు అందుకుంటున్నారు.ప్రజలు అయనని జాతి పితగా గుర్తించారు. పిల్లలు బాపుజీగా తలుస్తారు. గాంధి గారు సత్యాగ్రహము, సహాయ నిరాకరణ ఉద్యమము , అహింసా వంటివి ఆయన పాటించేవారు. గాంధిగారు అహింస అనే అనే అస్త్రముతోనే మనదేశాన్ని పరిపాలించటానికి వచ్చిన బ్రిటిష్ వారిని వారిదేశానికి పారిపోయేలా చేసింది. గాంధిగారు, నారవస్త్రము , చేతికి కర్ర, కళ్ళకు అద్దాలు, కలిగివుండేవారు. ఈయన మాట సత్యమేవ జయతే. ఈరోజు గాంధిగారి పుట్టినరోజు నుNon-violence dayగా జరుపుకోవాలి . ఈ సంధర్బములో నా బ్లాగ్ మిత్రుల తరుపునా నా తరుపునా గాంధితాతకు నివాళి అర్పిస్తున్నాను.
దసరా కదండి అందరు బొమ్మల కొలువులు పెడతారు కదా అప్పుడు బొమ్మల పెళ్ళి కూడా పెడతారు కదా అందులో బొమ్మల పెళ్ళి కూడా పెడతారు అందుకు పాటలు పాడతాం కదా అందుకు నేను చిట్టి చిట్టి బొమ్మల పేళ్ళి పాట నేర్చుకున్నాను మీరు చూడండి.
నాబ్లాగ్ మిత్రులకు , నా స్నేహితులకు, నా ఆత్మ బందువులకు, అందరికీ ఈ దసరా పండుగ ఆనంద ఆరోగ్య ఐస్వర్యాలు లభించాలని కోరుకుంటున్నాను. అందరికీ దసరా పండుగ శుభాకాంక్షలు.
ఈ రోజు ప్రముఖ భారత స్వాతంత్ర సమరయోధుడు భగత్ సింగ్ పుట్టిన రోజు. సెప్టెంబర్ 27th 1907 లో ప్రస్తుత పాకిస్తాను లోని లాయల్ జిల్లా బంగాగ్రామంలో జన్మించారు. భగత్ సింగ్ తల్లి తండ్రులు విద్యావతి,కిషన్ సింగ్. వీరు సర్దార్ కుటుంబము.భగత్ సింగ్ కుటుంబంలోని వారందరు స్వాతంత్రపోరటయోదులే. భగత్ సింగ్ పుట్టిన రోజు నాడు వారందరూ జైలు నుండి విడుదల అయ్యారు. అప్పుడు వారి కుటుంబము పండగ చేసుకుని ఆసందర్బములోని భగత్ సింగ్ అని నామకరణము చేసారు.
భగత్ సింగ్ చాలా గొప్ప దేశభక్తుడు. ఎలాఅంటే జిలియన్ వాలాబాగ్ ఉదంతంజరిగినప్పుడు ఆ ప్రదేశము అంతా రక్తముతో తడిసినది. భగత్ సింగ్ ఆ ఘటన జరిగినప్పుడు చిన్నవయసు అప్పుడు భగత్ సింగ్ అక్కడ భూమికి ముద్దుపెట్టుకొని ఆ మట్టిని ఇంటిదగ్గర పెట్టుకున్నాడు. అంత దేశభక్తికలవాడు.అతని ఉద్యమాలు భారత స్వాతంత్ర ఉద్యమం.
అయన ప్రద్దాన సంస్ఠలు నజవాన్ భారత్ సభ,కీర్తికిసాన్ పార్టి, హిందుస్తాన్ సోసలిస్ట్ రిపబ్లికన్ అసోషియెషన్. మొదలగున్నవి ప్రద్దాన సంస్తలు.
భగత్ సింగ్ ఉద్యమాలలో చాలా ఉత్సాహంగా పాల్గొనేవారు.అసెంబ్లీపై బాంబు విసిరేసిన సంఘటనకి కాస్త ముందుగా తన సహచరుడు సుఖ్దేవ్కు రాసిన లేఖలో భగత్ సింగ్ " నాకూ ఆశలూ, ఆంక్షలూ ఉన్నాయి. ఆనందమైన జీవనం గడపాలని ఉంది. అయితే అవసరమొచ్చినప్పుడు వీటన్నిటినీ త్యజించగలను. ఇదే అసలైన బలిదానం."
భగత్ సింగ్ ముఖ్యమైన కొటేషన్ ఇన్క్విలాబ్ జిందాభాద్.
బాంబ్ కేసులో, భగత్ సింగ్ ని పోలీసులు అరెస్ట్ చేశారు.. వాళ్ళు దీని మీద విచారణ జరుపుతున్న సమయంలోనే, పోలీసు అధికారిని చంపిన సంగతి కూడా బయటపడింది.. దాంతో, ఆయనతో పాటు ఆయన స్నేహితులైన రాజగురు, సుఖదేవ్ కి కూడా మరణశిక్ష పడింది..
కానీ జైల్లో ఉన్నప్పుడు కూడా, భగత్ సింగ్ ఉద్యమాలని చేయడం ఆపలేదు.. బ్రిటీష్ ఖైదీలకి, భారతీయ ఖైదీలకి చూపిస్తున్న అసమానతలని పారద్రోలడానికి, 63 రోజుల పాటు, నిరాహార దీక్ష చేశారు.. దానితో ఆయన పేరు భారత దేశం మొత్తం మారుమ్రోగింది.. (అంతకుముందు వరకూ ఆయన కేవలం పంజాబ్ ప్రాంత వరకు మాత్రమే పరిమితమయ్యారు)
చివరికి మార్చ్23, 1931న రాజ గురు, సుఖదేవ్ తో సహా భగత్ సింగ్ ని ఉరి తీశారు…. అలా ఒక విప్లవకారుని ప్రాణం అనంత వాయువుల్లో కలిసిపోయింది..
మహిషాసుర మర్ధిని అమ్మవారు నవరాత్రులు నవ అవతారాలలో ధర్శనము ఇచ్చారు. మహిషాసురుని వధించుటకు అమ్మ ఉగ్ర రూపము ధరించారు.అప్పుడు ఆమెను దేవతలు అందరు అమెను స్తుతించారు. అలానె శంకారాచార్యులవారు మహిషాసుర మర్ధిని స్తోత్రాన్ని పాడారు అది మంచిగా గుర్తింపు ఉన్న పాట.నవరాత్రుల తరువాత ఈరొజు మహిషాసుర మర్ధిని స్తోత్రము చదువుతారు.
అయి నిజ హుంకృతి మాత్రనిరాకృత ధూమ్రవిలోచన ధూమ్రశతే సమరవిశోషితశోణితబీజసముద్భవశోణితబీజలతే శివ శివ శుంభ నిశుంభమహాహవతర్పిత భూతపిశాచరతే జయ జయ హే మహిషాసురమర్దిని రమ్యకపర్దిని శైలసుతే
మరి ఈ రోజు మూలా నక్షిత్రము కదా సరస్వతి పూజ ఈ రోజు చేస్తారు. పిల్లలు కు మంచి చదువులు రావాలని కోరిన విద్యలు వారికి రావాలంటే సరస్వతి మాత కరుణకావాలి ,ఈ మాతను కొలచిన సకల విద్యలు ప్రసాధిస్తుంది. ఈమె తెల్లని వస్త్రదారిని అయ్యి. ఒక చేతితో వీణను మీటుతూ పుస్తకదారియై మనకు దర్శనము ఇస్తుంది .ఈమెకి హంసవాహనము. ఈమాత త్రిమూర్తులలో బ్రహ్మదేవుని అర్ద్దంగి.
పరాశక్తి మొదట దరించిన ఐదు అవతారలలో సరస్వతి మాత అవతారము ఒకటి. సరస్వతి మాత కేవలం చదువులు ప్రసాధించేది మాత్రమే కాదు సర్వశక్తులు యుక్తులు ప్రసాధిస్తుంది.
మా తాత చింతా. రామకృష్ణారావు(ఆంద్రామృతము బ్లాగ్) గారికి ఈరోజు జన్మదినము . మా తాత పుట్టినరోజు మాకు పండగ. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న తాతగారికి నా తరుపున నా బ్లాగ్ మిత్రులద్వారా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాను. తాతా ఇలాంటి పుట్టినరోజులు మళ్ళీ మళ్ళీ జరుపుకోవాలని కోరుకుంటున్నాను.అమ్మమ్మ, అమ్మ, మామయ్య, కాబోయె అత్తయ్య,నా చెల్లెల్లు తరుపున కూడా మీ పుట్టినరోజు శుభాకాంక్షలు..
ఈ రోజు అమ్మవారు శ్రీ మహాలక్ష్మి దేవి గా దర్శనము ఇస్తారు.లక్ష్మి దేవి హిందు వుల సాంప్రదాయం ప్రకారం మనకు సిరి సంపదలు, సౌభాగ్యం, సుఖ సంతోషాలును కలుగ జేసే మాత లక్ష్మి మాత. ఈమె క్షీరసముద్ర తనయ. త్రిముర్తులలో శ్రీమహావిష్ణువు అర్ద్దాంగి. అధికంగా లక్ష్మీదేవి చతుర్భుజాలతోను, ధన కుంభంతోను, పద్మాసనగా, పద్మాలను చేతబట్టి, సకలాభరణ భుషితయైనట్లుగా చిత్రించబడుతుంది. లక్ష్మీ దేవి వాహనం గుడ్లగూబ. సర్వ శుభ లక్షణ నిలయ, సకల సంపత్ప్రదాయిని అయిన లక్ష్మీదేవి స్వరూపాన్ని ఆవిష్కరిస్తున్నది. ఆమె బంగారు మేనికాంతి కలది (హిరణ్యవర్ణాం), బంగారు ఆభరణములు దాల్చినది (సువర్ణ రజతస్రజాం), వెన్నెలలా మెరుస్తున్నది (చంద్రాం), గజరాజుల ఘీంకారములతో సంబోధింపబడుచున్నది (హస్తినాద ప్రబోధినీం), చిరునగవులు చిందించునది (కాంసోస్మితాం), కీర్తిచే శోభిల్లునది (యశసా జ్వలన్తీం), సకల దారిద్ర్యములను నశింపజేయునది (అలక్ష్మీర్మే నశ్యతాం), పద్మమాలను ధరించినది (పద్మమాలినీం), పద్మమునుండి జనించినది (పద్మోద్భవాం), అందరికి ప్రీతిపూర్వకమైన (ప్రజానాం భవసి )సుక్తములో వివరించారు. శ్రీలక్ష్మి గురించి. దేవి వివిధ రూపాలలో అష్టలక్ష్ములు ప్రసిద్ధం. వారు - ఆదిలక్ష్మి, ధైర్య లక్ష్మి, ధాన్యలక్ష్మి, గజలక్ష్మి, సంతాన లక్ష్మి, విజయ లక్ష్మి, విద్యాలక్ష్మి, ధన లక్ష్మి - ఆయా రూపాలలో ఆ దేవి ఆయా ఫలితాలను ఇస్తుందని భక్తులు విశ్వసిస్తారు.
మహాలక్ష్మిదేవికి క్షీరాన్నము నైవద్యముగా సమర్పిస్తారు. ఈమె కోరిన కోరికలు తీర్చేమాత.
అయిదవరోజు అమ్మవారు సరస్వతి మాతగా దర్శనము ఇస్తారు. ఈమె కనకాంబర వర్ణినిగా వుంటారు. చదువుకునేవారికి మంచి చదువును ప్రసాధించు తల్లి కావున ఈమెను చదువులు తల్లిగా కూడా అంటారు. తెల్లని వస్త్ర దానిణి చేతిలో వీణ పుస్తకాలు కలిగి వుంటుంది. ఈమెకి పెరుగన్నము నేవేద్యముగా సమర్పిస్తారు. స్కందమాత కుమార స్వామి, కార్తికేయుడు, శక్తిధరుడు అని ప్రసిద్ధుడైన స్కందుని తల్లి యైన దుర్గాదేవిని 'స్కందమాత'పేరున నవరాత్రులలో 5వ రోజున ఆరాధింతురు. ఈమె చతుర్భుజ. షణ్ముఖుడైన బాలస్కందుని ఈమెయొడిలో ఒక కుడిచేత పట్టుకొనియుండును. మరియొక కుడిచేత పద్మము ధరించియుండును. ఎడమవైపున ఒకచేత అభయముద్ర, మరొకచేత కమలము ధరించి, 'పద్మాసన' యనబడు ఈమెయు సింహవాహనయే.
స్కందమాతను ఉపాసించుటవలన భక్తుల కోరికలన్నియు నెఱవేఱును. ఈ మర్త్యలోకమునందే వారు పరమ శాంతిని, సుఖములను అనుభవించుదురు. స్కందమాతకొనర్చిన పూజలు బాల స్కందునకు చెందును.ఈ దేవి సూర్య మండల-అధిష్టాత్రి యగుటవలన ఈమెను ఉపాసించువారు దివ్య తేజస్సుతో, స్వచ్ఛకాంతులతో వర్ధిల్లుదురు.
నాలగవరోజు అమ్మవారు లలితా త్రిపురసుందరి దేవి గా మనకు దర్శనము ఇస్తారు.ఈమెకి అల్లంగారెలు నెవేద్యముగా సమర్పిస్తారు. ఈమె కోరినకోరికలు తీర్చేమాత. దరహాసము చేయుచు (అవలీలగా) బ్రహ్మాండమును సృజించునది గావున ఈ దేవి 'కూష్మాండ' అను పేరుతో విఖ్యాత యయ్యెను. ఈమె సూర్య మండలాంతర్వర్తిని. ఈమె తేజస్సు నిరుపమానము. ఈమె యొక్క తేజోమండల ప్రభావముననే దశదిశలు వెలుగొందుచున్నవి. బ్రహ్మాండము నందలి సకల వస్తువులలో, ప్రాణులలో గల తేజస్సు ఈమె ఛాయయే.
'అష్టభుజాదేవి' అని కూడ అనబడు ఈమె ఎనిమిది భుజములతో విరాజిల్లిచుండును. ఏడు చేతులలో వరుసగా కమండలువు, ధనుస్సు, బాణము, కమలము, అమృతకలశము, చక్రము, గద - అనునవి తేజరిల్లుచుండును. ఎనిమిదవ చేతితో సర్వసిద్ధులను, నిధులను ప్రసాదించు జపమాల యుండును. ఈమెయు సింహవాహనయే.
భక్తులు ఈ దేవిని చక్కగా ఉపాసించుటచే పరితృప్తయై ఈమె వారి రోగములను, శోకములను రూపుమాపును. ఈమె భక్తులకు ఆయుర్యశోబలములు, ఆరోగ్యభాగ్యములు వృద్ధిచెందును. కొద్దిపాటి భక్తిసేవలకును ఈదేవి ప్రసన్నురాలగును. కూష్మాండ మాతగా కూడా కొన్ని ప్రదేశాలలో పూజిస్తారు.
దేశమంటే మట్టి కాదోయ్ దేశమంటే మనుషులోయ్ అన్నది ఎవరో తెలుసా గురజాడ అప్పారావు గారు. ఈరోజు అనగా సెప్టెంబర్ 21st న గురజాడ అప్పారావుగారి పుట్టినరోజు . గురజాడ అప్పారావుగారు 1862 september 21st న విశాఖపట్టణం జిల్లా లో యలమంచలి తాలూక లో సర్వసిద్ధి రాయవరం అన్న వూరిలో తండ్రి వెంకట రామదాసు , తల్లి కౌసల్యమ్మలకు జన్మిచినారు.
గురజాడ అప్పారావుగారు తెలుగు సాహిత్యమ్ మీద చాలా కృషిచేసారు.
అప్పారావుగారు అన్నారు ఆధునిక మహిళ భారత దేశ చరిత్రను పునర్నిర్మ్స్తుంది అని అన్నారు.
ఆయన రచనలు మామూలు వాడుక భాషలోనే రాసేవారు. ఆయన పుత్తడిబొమ్మ పూర్ణమ్మ అనే నాటకం మంచి పేరు తెచ్చుకుంది.కన్యాశుల్కము ఆయన రచనలలో మంచి పేరు తెచ్చుకుంది.
తాంబూలాలు ఇచ్చేసాము తన్నుకు చావండి
డామిట్! కథ అడ్డంగా తిరిగింది
పొగ తాగనివాడు దున్నపోతై పుట్టున్
గురజాడ అప్పారావు గురించి వినని వారు వుంటారేమో గానీ, కన్యాశుల్కం నాటకంలో ఆయన సృజించిన ఈ వాక్యాలు వినని తెలుగు వారు వుండరు. ఈనాటకంలో ఆయన సృష్టించిన గిరీశం, మధురవాణి, రామప్పంతులు మొదలైన పాత్రలు కూడా అంతే ప్రఖ్యాతి పొందాయి.
అప్పారావుగారి గేయాలలో మనలో దేశభక్తిని పెంచుటకు దేశభక్తి పాట రాసారు అందులో ఒకటి
దేశమును ప్రేమించుమన్నా మంచి యన్నది పెంచుమన్నా వొట్టి మాటలు కట్టిపెట్టోయ్ గట్టిమేల్ తలపెట్టవోయ్
చెట్టపట్టాల్ పట్టుకొని దేశస్థులంతా నడువవలెనోయ్ అన్నదమ్ముల వలెను జాతులు మతములన్నియు మెలగవలెనోయ్
సొంత లాభం కొంత మానుకు
పొరుగు వానికి తోడుపడవోయ్
దేశమంటే మట్టి కాదోయ్
దేశమంటే మనుషులోయ్
అప్పారావుగారి రచనలలో కన్యక, ముత్యాలసరాలు , సారంగదార, సుభద్ర ఇంకా చాలా రచనలు వున్నాయి.
ఈ రోజు అయన గురించి తెలుసుకున్నాను. మా అమ్మావాళ్ళు చిన్నప్పుడు ఆ వురిలోనే పెరిగారుట నాకు ఇవి అన్నీ అమ్మా, తాత నాకు చెప్పారు. నా బ్లాగుద్వారా నేను తెలుసుకున్నది మీరూ తెలుసుకున్నారు కదూ..........
ఈ రోజు అమ్మవారు శ్రీ అన్నపూర్ణేశ్వరి అవతారములో దర్శనము ఇచ్చును.ఆమెను నిత్యం కొలిచిన వారికి అన్నానికి లోటు ఉండదని ప్రతీతి. మానవులకు మాత్రమే కాకుండా సకల జీవరాశులకు ఆహారం అనేది ఆమె కృపవల్లనే... లభిస్తుందని పండితులు పేర్కొంటున్నారు. పార్వతీ దేవీ అవతారమైన దుర్గాదేవీ సాక్షాత్తు భర్త అయిన పరమేశ్వరునికి ఓ సమయంలో భిక్షాటనకు వస్తే పాయసాన్నాన్ని వడ్డిస్తుంది. అంటే ఆకలిగొని ఎవరైనా తన ఇంటికి వస్తే... కలిగిన దాంట్లో సగమైనా పెట్టాలనే విధానాన్ని లోకానికి బోధించడమే దీని అర్థమని పండితులు చెబుతున్నారు.
చంద్రఘంటాదేవి ఈ తల్లి తన శిరమున దాల్చిన అర్ధచంద్రుడు ఘంటాకృతిలో ఉండుటచే ఈమెకు 'చంద్రఘంట' యను పేరు స్థిరపడెను. ఈమె శరీరము బంగారు కాంతి మయము. ఈమె తన పది చేతులలో ఖడ్గము మొదలగు శస్త్రములను, బాణము మున్నగు అస్త్రములను ధరించియుండును. ఈమె సింహ వాహన. ఈమె సర్వదా సన్నాహయై యుద్ధముద్రలోనుండును. ఈమె గంటనుండి వెలువడు భయంకరధ్వనులను విన్నంతనే క్రూరులై దైత్య దానవ రాక్షసులు ఎల్లప్పుడు వడగడలాడుచుందురు. కాని భక్తులకును, ఉపాసకులకును ఈమె మిక్కిలి సౌమ్యముగను, ప్రశాంతముగను కన్పట్టుచుండును. ఈ దేవి ఆరాధన సద్యఃఫలదాయకము. భక్తుల కష్టములను ఈమె అతి శీఘ్రముగా నివారించుచుండును. ఈ సింహవాహనను ఉపాసించువారు సింహ సదృశులై పరాక్రమశాలురుగా నిర్భయులుగా ఉందురు. ఏవిధమైన భయములును వారిని బాధింపజాలవు.
దసరా ఒక హిందువుల ముఖ్యమైన పండుగ . ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి నుండి తొమ్మిది రోజులు దేవీ నవరాత్రులు పదవ రోజు విజయ దశమి కలసి దసరా అంటారు. ఇది ముఖ్యముగా శక్తి ఆరాధనకు ప్రాధాన్యత ఇచ్చే పండుగ. ఈ పండుగకు నవరాత్రి, శరన్నవరాత్రి అనీ అంటారు. శరదృతువు ఆరంభంలో వచ్చే పండుగ కనుక ఈ పేరు వచ్చింది.
ఈ పండుగకు ఈ పది రోజులు పది అవతారాలుగా అమ్మవారిని అలంకరించుకొని పూజ చేస్తారు. రోజు ప్రతి ఇంట్లోను లలితా సహస్త్రమ్ చదువుతారు. బొమ్మలకొలువులు పెడతారు. బ్రహ్మదేవుని వరాల వలన వరగర్వితుడైన మహిషాసురుడు దేవతల్తో ఘోరమైన యుద్ధమి చేసి వారిని ఓడించి ఇంద్రపదవి చేపట్టాడు. దేవేంద్రుడు త్రిమూర్తులతో మొర పెట్టుకొనగా మహిషునిపై వారిలో రగిలిన క్రోధాగ్ని ప్రకాశవంతమైన తేజముగా మారింది .త్రిమూర్తుల తేజము కేంద్రీకృతమై ఒక స్త్రీరూపమై జన్మించింది.
ఈ దసరా రోజులలో అమ్మవారి అవతారాలు:
మొదటి రోజు -శైలపుత్రి అవతారం రెండవ రోజు- బ్రహ్మచారిణి (బాలా త్రిపురసుందరి) మూడవ రోజు-చంద్రఘంటాదేవి నాల్గవ రోజు-కూష్మాండాదేవి ఐదవ రోజు-స్కందమాత ఆరవ రోజు-కాత్యాయినీదేవి ఏడవ రోజు-కాళరాత్రీదేవి ఎనిమిదవ రోజు-మహాగౌరీదేవి తొమ్మిదవ రోజు-సిధ్ధిదాత్రీదేవి గానవరాత్రులు అమ్మవారు దర్సనం ఇస్తారు . ఒక్కొక్కప్రదేశంలోను ఒక్కొక్క పేరుతో అమ్మవారిని కొలుస్తారు.కొన్ని ప్రదేశాలలో పార్వతిదేవిని కనకదుర్గగాను,మహాలక్ష్మిగాను, అన్నపూర్ణగాను,బాలాత్రిపుర సుందరిగాను,రాజరాజేస్వరీ దేవిగాను,మహిషాసుర మర్ధినిగాను కొలుస్తారు. నిన్నటి రోజును శైలపుత్రిగా పూజించారు.
శైలపుత్రి
సతీదేవి యోగాగ్నిలో తనువును త్యజించి, పిదప పర్వతరాజైన హిమవంతుని యింట పుత్రికయై అవతరించినందున ఆమెకు శైలపుత్రి అను నామము. వృషభవాహనారూఢయైన ఈ మాతకు కుడిచేతిలో త్రిశూలము, ఎడమచేతిలో కమలము విరాజిల్లుచుండును. తలపై చంద్రవంకను ధరించియుండును. పార్వతి, హైమవతి అనునవియు ఆమె పేర్లే. శైలపుత్రి మహిమలు, శక్తులు అనంతములు. వాంఛితములను ప్రసాదించు తల్లి.
నేటిదినమును బాలాత్రిపురసుందరి అవతారములో అమ్మవారిని పూజించవచ్చు.ఈరోజు చిన్నపిల్లలకు పసుపురాసి పూజచేసి వారిలో అమ్మవారిని చిన్నపిల్లగా చూస్తారు. ఈమెను బ్రహ్మచారిణి అని అందురు.
బ్రహ్మచారిణి
'బ్రహ్మచారిణి' యనగా తపమాచరించు తల్లి. బ్రహ్మమునందు చరించునది.కుడి చేతియందు జపమాలను, ఎడమచేతియందు కమండలువును ధరించును. పరమేశ్వరుని పతిగా బడయుటకు తీవ్రమైన తపమొనర్చి ఉమ యని ప్రసిద్ధి వహించెను. ఈ దేవి స్వరూపము జ్యోతిర్మయము. మిక్కిలి శుభంకరము. భక్తులకును, సిద్ధులకును అనంత ఫలప్రదము. బ్రహ్మచారిణీ దేవి కృపవలన ఉపాసకులకు నిశ్చలమగు దీక్ష, సర్వత్ర సిద్ధి, విజయము ప్రాప్తించును.
విశ్వకర్మ పుట్టిన రోజును ఈరోజు పెద్దపెద్ద కంపెనీలలోను పరిస్రమలలోను జరుపుకుంటారు.
అసలు విశ్వకర్మ అంటే ఎవరో తెలుసా? మన భూమిని తయారుచేసింది విశ్వకర్మ.అతను దేవతల శిల్పి, బ్రహ్మ ఆదేశించటం తో అతను భూమిని విశ్వాన్ని తయారు చేసారు. విశ్వకర్మ హిందూ పురాణాల ప్రకారం ఎన్నో పట్టణాలను నాలుగు యుగాలలో నిర్మించాడు. సత్యయుగంలో దేవతల నివాసం కోసం స్వర్గలోకం నిర్మించాడు. త్రేతాయుగంలో సువర్ణ లంకను శివుని కోసం నిర్మించాడు. ద్వాపర యుగంలో ద్వారక నగరాన్ని మరియు కలియుగంలో హస్తినాపురం మరియు ఇంద్రప్రస్థం నిర్మించాడు.
It's Grandparents Day, and We Want to Let You Know Once Again How Much We Love You
It would be so nice if we had an extra-special message this Grandparents Day -- something that had never been said before, new words to express how much we love and appreciate you.
This Grandparents Day, it would be so nice to surprise you with something completely original that lets you know how much you mean to us. It would be nice to find a new way to let you know how grateful we are for all that you are and all that you do.
But the best message is probably the simplest. And that is to say, once again, "Thank you for caring so much about us, for being a part of our lives, and may you always know how very much we love you." - Taylor MacKenzie