Blogger Widgets

గురువారం, డిసెంబర్ 15, 2011

ధనుర్మాస వ్రతం

గురువారం, డిసెంబర్ 15, 2011



రేపటి నుండి ధనుర్మాసం కదండి. సూర్యదేవుడు ధనుస్సురాశిలో ప్రవేశించడంతో మొదలై భోగిపండుగ రోజువరకూ, సూర్యుడు మకరరాశిలోకి ప్రవేశించేంతవరకూ ఉండే మాసం - "ధనుర్మాసం". వైష్ణవ సాంప్రదాయంలో అత్యంత పవిత్రమైన మాసం ఇది. మాసమంతా వైష్ణవాలయాల్లో ప్రత్యేక పూజలు చేస్తారు. గోదాదేవి రచించిన "తిరుప్పావై" ని ఈ మాసం రోజులు పఠిస్తారు.ముఖ్యంగా కలియుగ వైకుంఠమైన తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామి వారి ఆలయంలో ఈ నెల రోజులు సుప్రభాతానికి బదులుగా తిరుప్పావైని పఠిస్తారు. అటువంటి పవిత్రమైన ధనుర్మాసంలో శ్రీమహావిష్ణువును "మధుసూదనుడు" అనే పేరుతో పూజించాలి. ప్రతిదినం పూజించి మొదటి పదిహేను రోజులూ నైవేద్యంగా పులగం లేదా చెక్కరపొంగలిని, తర్వాతి పదిహేను రోజులు దద్యోదనమును సమర్పించాలి. ధనుర్మాసం మొత్తం ఇంటి ముందు ఆవుపేడను కలిపిన నీటిని చల్లి బియ్యపుపిండితో అందమైన ముగ్గులు పెట్టి, ముగ్గుల మధ్యలో ఆవు పేడతో చేసి, పసుపు, కుంకుమలు, వివిధ పూలను అలంకరించిన గొబ్బిళ్ళను ఉంచవలెను. ఈ విధంగా చేయడం వల్ల కన్యకు మంచి భర్త లభిస్తాడు. సౌభాగ్యం కలకాలం వర్థిల్లుతుంది.
ధనుర్మాస వ్రతంప్రత్యక్ష భగవానుడైన శ్రీసూర్యభగవానుడు మేషరశి మొదలు పన్నెండురాశులలో సంచరిస్తుంటాడు. ద్వాదశాత్మడైన ఆదిత్యుడు, తన దివ్యయాత్రలో ధనస్సు రాశిలోనికి ప్రవేశిస్తూనే "ధనుర్మాసం" ప్రారంభమై, సూర్యుడు మకర రాశిలోనికి ప్రవేశించేంతవరకూ, అంటే మకర సంక్రాంతి పర్వదినం ముందురోజు భోగి వరకు వుంటుంది. ఈ నెలరోజుల పాటూ "ధనుర్మాసవ్రతం" ఆచరించాలి.


 ప్రతిరోజు సూర్యోదయానికి కంటే ఐదుఘడియలు ముందుగా నిద్రలేచి కాలకృత్యాలను పూర్తిచేసుకుని, తలస్నానం్ చేసి నిత్యపూజలు, సంధ్యావందనాలను ముగించి, అనంతరం ధనుర్మాస వ్రతాన్ని ఆచరించాలి. మధుసూధనస్వామిని ఆవు పాలు, కొబ్బరి నీరు, పంచామృతాలతో అభిషేకించాలి.  తులసీ దళాలతోనూ, వివిధ రకాలైన పుష్పాలను ఉపయోగించి స్వామి వారిని అష్టోత్తర శతనామాలతోగానీ,సహస్రనామాలతోగానీ, పూజించాలి. నైవేద్యంగా మొదటి పదిహేనురోజులూ 'చెక్కర పొంగలి' ని గానీ, భియ్యం, పెసరపప్పు కలిపి వండిన 'పులగం'ను గానీ సమర్పించాలి. తర్వాత పదిహేను రోజులూ 'దద్యోదనం' నైవేద్యంగా సమర్పించాలి. తర్వాత ధూపదీప, దక్షిణతాంబూలాలను సమర్పించి నమస్కరించుకోవాలి. మధుసూధనస్వామివారిని పూజించడంతో పాటూ బృందావనంలో తులసిని పూజించడం చేయాలి. ఈ మాసమంతా విష్ణుపురాణాన్ని, విష్ణుగాథలను చదువుతూగానీ, వింటూగానీ గడపడం, వైష్ణవాలయాలను దర్శించడం చేయాలి. ఈ విధంగా ప్రతిరోజు ధనుర్మాసం మొత్తం ధనుర్మాస వ్రతాన్ని ఆచరించడం శ్రేష్ఠం. నెలరోజుల పాటూ చేయలేనివారు 15 రోజులుగానీ, 8 రోజులుగానీ, 6 రోజులుగానీ, 4 రోజులుగానీ, లేదంటే కనీసం ఒక్కరోజు అయిన ఆచరించాలని శాస్త్రవచనం.వ్రతాన్ని ఆచరించడం పూర్తయ్యాక శ్రీమధుసూధన స్వామివారి విగ్రహాన్ని


"మధుసూదన దేవేశ ధనుర్మాస ఫలప్రదతవ మూర్తి ప్రదానేన మమసంతు మనోరథాః||"


అనే శ్లోకాన్ని పఠిస్తూ పండితుడికి దానం ఇవ్వాలి. పండితుడు దానన్ని స్వీకరిస్తూ -"ఇందిరా ప్రతి గృహ్ణాతు" అని పండితుడు ఇచ్చే ఆశీర్వచనాన్ని స్వీకరించడం వల్ల సకల కోరికలు సిద్ధిస్తాయని చెప్పబడుతోంది. 
ఈవిధంగా ధనుర్మాసవ్రతాన్ని ఆచరించడం వలన కోరిన కోరికలు తీరడంతోపాటూ ఇహలోకంలో సౌఖ్యం, పరంలో మోక్షం సిద్ధిస్తుందనేది పురాణ కథనం. ధనుర్మాసవ్రతాన్ని ఒక్కరోజు ఆచరించడం వల్ల వేయిసంవత్సరాలపాటూ నిత్యం వివిధదేవతలను ఆరాధించినంత ఫలం లభిస్తుందనేది పండితాభిప్రయం.కాత్యాయనీవ్రతంఈ వ్రతాన్ని ధనుర్మాసంలో వివాహంకాని అమ్మాయిలు ఆచరించాలని చెప్పబడుతోంది. పూర్వం ఈ వ్రతాన్ని స్వయంగా శ్రీకృష్ణుడి సలహా మేరకు గోపికలు ఆచరించి శ్రీకృష్ణుడినే భర్తగా పొందినట్లు కథనం. శ్రీగోదాదేవి ఈ వ్రతాన్ని ఆచరించి శ్రీరంగనాథుడిని భర్తగా పొందినట్లు పురాణాలు వెల్లడిస్తున్నాయి.వ్రత విధానంధనుర్మాసంలో ప్రతిరోజూ తెల్లవారుజామునే నిద్రలేచి, కాలకృత్యాలు తీర్చుకుని తలస్నానం చేయాలి. ఇంటిముందు శుభ్రపరిచి పేడనీటితో కళ్ళాపి చల్లి, బియ్యపు పిండితో ముగ్గులను తీర్చిదిద్ది, ముగ్గుల మధ్యలో ఆవుపేడతో చేసిన గొబ్బిళ్ళను ఉంచి, వాటిని గుమ్మడి, బీర, చామంతి, బంటి వంటి పూలతో అలంకరించి నమస్కరించాలి. అనంతరం కాత్యాయనీదేవిని షోడశోపచారాలు , అష్టోత్తరాలతో పూజించి నైవేద్యంసమర్పించాలి. ఈ విధంగా ప్రతిరోజూ ధనుర్మాసమంతా ఆచరించాలి.

ధనుర్మాసం లో పాడవలసిన పాసురాలు ఇవి.  మా పిన్నిగారు రామ లక్ష్మిగారు పాడిన తిరుప్పావై పాసురాలు మీ ముందువుంచుతున్నాను. 





అనేక దీక్షలు, వ్రతాలుతో ఏదోఒక పద్దతిలో జీవితాన్ని మరింత సమర్దవంతముగా నడుపుకోవటానికి , జీవితాన్ని అర్ధవంతముగా తీర్చిదిద్దుకోవటానికి అందరు ప్రయత్నమూ చేస్తారు.
అందుకో ఒకటి వైదిక సాధనాలను సమన్వయము చేస్తూ గోదాదేవి నడచిన మార్గమే మార్గశిరం.  ఈ మార్గశిరమాసాన్ని తానుగా శ్రీ కృష్నులవారు చెప్పారు.  అతన్ని పొందేమార్గమే మార్గశిరవ్రతము.  


గోదాదేవి మనకందించిన ఈ ధనుర్మాసవ్రతము ప్రాపంచిక ఫలితాలైన వర్షాలను, పాడిని, పంటను,సంవృద్ది చేస్తుంది.  సంపదలను ఇస్తుంది.  సత్పరిపాలకులను ప్రవర్తింపచేస్తుంది.  దేసప్రగతికి, ప్రజాశ్రేయస్సుకు సోపానాలను దిద్దగలిగే పాలకులును తయారు చేస్తుంది.  వాతావరణాన్ని సానుకూల పరుస్తుంది.  శాంతియుతంగా పరస్పర ప్రేమానురాగాలు పెరిగి సోదరభావం వెల్లివిరిసేలా చేస్తుంది.  పిల్లలలోసత్ప్రవర్తన, క్రమశిక్షణ అలవారుస్తుంది. ఇదే దనుర్మాసవ్రతం.
  ఈ ధనుర్మాసం పూజ అందరు బాగా జరుపుకోవాలని అనుకుంటున్నాను.

సూక్తి:  నీవు ఎంత చిన్న ధర్మము ఆచరించినా అది ఎంత గొప్ప ఆపదనుండైనా రక్షిస్తుంది.
సర్వేజనాః సుఖినోభవంతు.  సమస్త సంమంగాళాని భవంతు.

జై శ్రీమన్నారాయణ్

బుధవారం, డిసెంబర్ 14, 2011

తొల్లింటి వలె గావు తుమ్మెదా

బుధవారం, డిసెంబర్ 14, 2011

తొల్లింటి వలె గావు తుమ్మెదా యింక వొల్లవుగా మమ్మువో తుమ్మెదా

తోరంపు రచనల తుమ్మెదా కడు దూరేవు గొందులే తుమ్మెదా
దూరినా నెఱుగవు తుమ్మెదా మమ్ము వోరగా చూడకు వో తుమ్మెదా

తొలి ప్రాయపు మిండ తుమ్మెదా కడు తొలిచేవు చేగలే తుమ్మెదా
తొలకరి మెరుగువే తుమ్మెదా ఇంక ఉలికేవు మముగని వో తుమ్మెదా

దొరవు వేంకటగిరి తుమ్మెదా మా తురుమేల చెనకేవు తుమ్మెదా
దొరకెనీ చనవులు తుమ్మెదా ఇంక ఒరులెఱింగిరి గదవో తుమ్మెదా

మంగళవారం, డిసెంబర్ 13, 2011

సత్యానికి-అసత్యానికి

మంగళవారం, డిసెంబర్ 13, 2011

సత్యానికి అసత్యానికి దూరం ఎంత?


మీరు ఈ కద చదివే ముందు ఒకసారి జవాబు ఒకసారి అల్లోచించండి.
ఒకానొకరోజు రాత్రి నిద్రలో అక్బర్ గారికి ఒక డౌట్ వచ్చింది.  ఆ డౌట్ ఏమిటంటే  సత్యానికి అసత్యానికి దూరం ఎంతా అని ? ఎంత ఆలోచించినా జవాబు దొరకలేదు.  అప్పుడు అక్బర్ రేపు దివాణం లో నా ప్రజలను అడుగుదాం అనుకున్నాడు.  మరుసటి రోజు దివాణంలో అక్బర్ తన డౌట్ ని అడిగాడు.  సత్యానికి అసత్యానికి దూరం ఎంత అని అప్పుడు ఎవరు చెప్పలేకపోయారు అందరూ ఆలోచనలో పడ్డారు.  రోజు కొంత సమయం తరువాత అక్కడే వున్నా బీర్బల్ మంత్రిని అడిగారు.  బీర్బల్ గారు మీరు అయినా చెప్పండి అని అడుగగా గబుక్కున నాలుగు వేళ్ళు దూరం అన్నారు.  అదేంటి వివరంగా చెప్పండి అనగా బీర్బల్ గారు ఇలా అన్నారు.
కన్నుతో చూసేదే సత్యం.   మరి చూడకుండా చెవితో వినేదే అసత్యం.  మరి కన్నుకు చెవికి మద్య దూరం నాల్గు వేళ్ళు అంత దూరం మహారాజ అని చెప్పాడు బీర్బల్.
కధ చాలాబాగుంది కదా.

సోమవారం, డిసెంబర్ 12, 2011

పరశురాముని జయంతి

సోమవారం, డిసెంబర్ 12, 2011

ఈరోజు పరశురాముని జయంతి.  ఆయన జయంతి సందర్బంగా పరశురాముని గురించి కొంత తెలుసుకుందాము.  పరసురాముడు  విష్ణువు యొక్క ఒక అవతారం.  ముఖ్యంగా విష్ణువు యోక్క దశావతారాలలో పరశురామ అవతారం  ఆరవది .  పరసురాముడు ఋషి జమదగ్ని కుమారుడు. అతను పరమ శివుని గురించి తపస్సు చేసాడు. అప్పుడు అతనికి ఒక గొడ్డలి ఆయుధంగా  లభించింది .
ఒకసారి, కార్తవీర్య-అర్జున పేరు గల ఒక రాజు అటవీ లో ఒక వేట యాత్రసమయంలో అతని సైన్యం తో కలిసి జమదగ్ని యొక్క ఆశ్రమమును  సందర్శించారు. జమదగ్ని  తన దివ్య ఆవు సహాయంతో తన అతిధికి  మరియు అతని విస్తారమైన సైన్యంనకు ఆహారం మరియు తగిన  ఏర్పాటులు చేసారు. ఇలా చేయటం చూసి రాజు మొదట  ఆశ్చర్యపడి, తరువాత ఆ రాజుకు  అత్యాశగా  మారింది.  అప్పుడు ఆ రాజు అతనికి ఆ ఆవును ఇమ్మని కోరుకున్నాడు. జమదగ్ని  ఆవు తమకు  అవసరం లేదని చెపుతూనే, ఆవును ఇవ్వటానికి నిరాకరించారు.

రాజు తన సైనికులును  పంపి మరియు బలవంతంగా తన నగరానికి దూరంగా ఆవును తీసుకువెళ్ళారు . ఇది   పరశురామడికి తెలిసి ఆయొక్క ప్రదేశానికి వెళ్ళాడు. అతని సైన్యంను  నాశనం చేసి చివరకు తన గొడ్డలి తో రాజును  హత్య చేసారు. ప్రతీకారంగా, కార్తవీర్య-అర్జునుడు యొక్క కుమారులు ధ్యానంలో వున్నసమయంలో పరశురామ తండ్రి జమదగ్ని ని  హత్య చేస్తారు.  పరశురామ  తన తండ్రి మరణం వినగానే చాలా కోపంతో వచ్చింది.  అప్పుడు  అతని తండ్రి హత్యకు పగ తీర్చుకోవడానికి, అతను మాత్రమే కార్తవీర్య-అర్జున కుమారులును  హత్య చేసాడు.  అంతే కాకుండా మొత్తం రాజ వంశం మొత్తం నాశనం చేసాడు. ఈ విధంగా ఆయన మొత్తం భూమిని  స్వాధీనం చేసుకున్న తరువాత తన తండ్రిగారి  ఆఖరి కర్మలు చేస్తూ తర్వాత కశ్యప  వరకు స్వచ్ఛంద వున్నారు .పరశురాముడు  ఎనిమిది మంది చిరంజీవులలో  ఒక్కరు.
ఒక పురాణాల ప్రకారం, పరశురామ  శివ సందర్శించడానికి వెళ్ళినప్పుడు, అతను వినాయకుడి ద్వారా అడ్డగింప బడి లోనికి వెళ్ళుటకు నిరాకరించబడినాడు. పరశురామ  అతని గొడ్డలి విసిరాడు, మరియు తన తండ్రి ఇచ్చిన  ఆయుధము అని, వినాయకుడి  దాన్ని స్వీకరించదాల్చాడు  అప్పుడు తన దంతము  ఒకటి విరిగినది.  అప్పుడే వినాయకునికి ఏకదంతుడు అని పేరు వచ్చింది.
  
విష్ణువు రాముడుగా  (రామాయణం లో హీరో ) అవతరించారు.  అప్పుడు , పరశురామ  తన అవతార-కార్యము ముగింపు జరిగవలసి వుంది.  అయితే అతను ఒక చిరంజీవి అవ్వటం వల్ల రామునికి  లొంగిపోయారు. అప్పడు పరాసురామ తపస్సుకు వెళ్ళిపోయారు.  ఒక పర్వతము మీద తపస్సు చేసుకుంటున్నారు.  ఇప్పటికీ ఆ పర్వతము మహేంద్ర గా చెప్పబడుతుంది.  తపస్సు లో తన జీవితసమయం గడుపుతారుఇది పరశురామ  తదుపరి మన్వంతర  లో సప్తర్షులు లో ఒకకరుగా వున్నారు.

My Blog Lovers

నా యూట్యూబ్ చానల్స్ ప్లీజ్ సబ్స్క్రిబ్ చేయండీ

Diabetic Challenger

DIABETIC CHALLENGER YOUTUBE CHANNEL. PLASE SUBSCRIBE MY CHANNEL...... THANK YOU VERY MUCH.

Ammamma Tho Nenu (అమ్మమ్మ తో నేను

Please subscribe our channel Ammamma Tho Nenu (అమ్మమ్మ తో నేను)