Blogger Widgets

శనివారం, డిసెంబర్ 17, 2011

Flights of Inspiration.

శనివారం, డిసెంబర్ 17, 2011

ఇది అంతా ఏమిటనుకుంటుంన్నారా మనము  ప్రపంచంలో ఎక్కడికి కావాలంటే అక్కడికి flights లో వెళ్ళిపోతున్నాము.  మొట్టమొదట ఆకాశంలో ఎగిరే విమానాన్ని Wright Brothers కనుక్కున్నారని అందరికి తెలుసు.  మరి ఆ విమానాన్ని తయారు చేయటానికి వారు చాలా కష్ష్టపడ్డారో చెప్పలేము.  వారు కృషి వుంటే సాధించలేనిది లేదు అని నిరూపించారు. 
వారు తయారుచేసిన మొదటి విమానం యొక్క డిజైన్. పక్షి ఎగురుటను inspiration గా వారు తీసుకుని డిజైన్ చేసారు.  క్రింద డ్రాయింగ్ 1903 ఫ్లైయర్ ది అని గుర్తించిన రేఖాచిత్రం ఇది. ఇది గోధుమ రంగు కాగితంపై పెన్సిల్ ఉపయోగించి రైట్ బ్రదర్స్ ద్వారా డ్రా చేయబడినది.  కాగితంపై మూడు అభిప్రాయాలుఉన్నాయి. టాప్ వీక్షణ ఫ్లైయర్ లోకి డౌన్ గురించి ఒక "bird's-eye" లా వుంటుంది. ( ఫ్లైట్ లోమొదటి చూసిన మానవులు మీద పక్షి యొక్క ప్రతిచర్య ఇమాజిన్!)  వారు ఆ ఫ్లైట్ కు ఏమి ఉపయోగిమ్చారంటే వాటి సైజెస్ ఇవే.


No blueprint or other drawing of the 1903 Flyer exists.
Some technical specifications for the Flyer:
1 )Gasoline-powered engine weighed 179 pounds, delivered 12 horsepower 
2 propellers, each 8.5 feet in diameter 
2 )ropeller made of 3 layers of 1 1/8 inch spruce, glued together, shaped with hatchet and drawshave .
3  )Wingspan = 40 feet, 4 inches .
4 )Chord = 6 feet, 6 inches .
5 )Wing camber = 1:20 .
6 )Total wing area = 510 square feet .
7 )Horizontal forward rudder = 48 square feet .
8 )Distance from nose to tail = 21 feet, 1 inch .
9 )Unmanned weight = 605 pounds (including engine, propellers, and chain drive)
10 )Wing skeleton covered with white French sateen fabric .
11 )Propeller shafts made of steel .


ఇవి ఉపయోగించి 1902 డిసెంబర్ 17 న Wright Brothers నింగిలో ఎగురవేసి వారి కలను నిజం చేసుకున్నారు.  నిజంగా ఆనాడు వారికి అది కల కానీ నేడు మనకు వేరేదేశాలకు వెళ్ళాలి అంటే మనకు అవసరంగా వుంది. నిజంగా వారు చాలా గ్రేట్.
 Heads  of  to  Wright  brothers .

శుక్రవారం, డిసెంబర్ 16, 2011

ప్రత్యేక పాశురము-ప్రత్యేక నివేదన

శుక్రవారం, డిసెంబర్ 16, 2011


ధనుర్మాసవ్రతము ప్రతీదినము పొంగలి నివేదన అర్పిస్తాము.  కానీ కొన్ని ప్రత్యేక పాశురము లకు ప్రత్యేక నివేదన గోదాసహిత రంగనాదునకు అర్పించాలి.  మరి ఆ ప్రత్యేక పాసురాలు వాటికి అర్పించవలసిన నివేదనలు ఏమిటంటే.....

రోజు  పాశురము ప్రసాదము
మూడవ పాశురము ఓంగి ఉలగళంద ఉత్తమన్ పేర్ పాడి చక్కరపొంగాలి
ఏడవ పాశురము కీశు కీశెన్ఱెంగుం  పులిహోర
పన్నెండవ పాశురము కనైత్త్-ఇళంకత్తెరుమై కన్ఱుక్కిరంగి చక్కరపొంగాలి
పదహారవ  పాశురము నాయగనాయ్ నిన్ఱ నందగోపనుడైయ పులిహోర, దద్యోజనము, చక్కెరపొంగలి 
పద్దెనిమిదవ పాశురము ఉందు మదకళిత్తన్-ఓడాద తోళ్  చక్కరపొంగాలి
ఇరవైరెండవ పాశురము అంగణ్ మా ఞాలత్తరశర్, అబిమాన చక్కరపొంగాలి
ఇరవైమూడవ పాశురము మారి మలై మురైంజిల్ మన్ని క్కిడందుఱంగుం పులిహోర, దద్యోజనము
ఇరవైనాల్గవ పాశురము అన్ఱివ్వులగమ్ అళందాయ్ అడి పోత్తి దద్యోజనము
ఇరవైఏడవ పాశురము కూడారై వెల్లుమ్ శీర్ గోవిందా, ఉన్ఱనై పాయసము, పులిహోర, దద్యోజనము
ఇరవైఎనిమిదవ పాశురము కఱవైగళ్ పిన్ శెన్ఱు కానం    దద్యోజనము
ఇరవైతొమ్మిదవ పాశురము శిత్తం శిఱుకాలే వందున్నై  పులిహోర, దద్యోజనము, చక్కెరపొంగలి
ముప్పైవ పాశురము వఙ్గక్కడల్ కడైంద అప్పము,పులిహోర,దద్యోజనము,చక్కెరపొంగల 

తిరుప్పావై ద్వితీయ పాశురము

దనుర్మాసవ్రతము ముప్పై రోజుల వ్రతము కదా అయితే గోపికలు మొదటిపాసురములో వారికి ఏమికావాలో ఎలాచేయాలో అల్లోచించారు.  వారు భగవత్ప్రాప్తి కావాలని వ్రతము ప్రారంభించారు అని తెలుస్తోంది.  మరి రెండవ పాసురములో వారు ఏమిచేస్తున్నారో తెలుసుకుందామా.
పాశురము 
  వైయత్తు వాళ్ వీర్గాళ్! నాముం నం పావైక్కు
వైయత్తు వాళ్ వీర్గాళ్! నాముం నం పావైక్కు
శెయ్యుం కిరిశైగళ్ కేళీరో పాఱ్కడలుళ్
పైయత్తుయిన్ఱ పరమనడి పాడి
నెయ్యుణ్ణోం పాలుణ్ణోం నాట్కాలే నీరాడి
మైయిట్టెళుదోం మలరిట్టు నాం ముడియోమ్
శెయ్యాదన శెయ్యోం తీక్కుఱళై చ్చెన్ఱోదోమ్
ఐయముం పిచ్చైయుం ఆందనైయుం కైకాట్టి
ఉయ్యుమాఱెణ్ణి ఉగందేలోర్ ఎమ్బావాయ్
 


తాత్పర్యము:  భగవంతుని దర్శించుటకు వెళ్ళేవారు భాగాత్ప్రాప్తి కోసం కొన్ని నియమాలు పాటించాలని.  శ్రీ కృష్ణుడు అవతరించిన ఈ లోకములో పుట్టి దు:ఖమైన ఈ లోకములో కూడా భగవదనుగ్రహముచే ఆనందము అనుభవించుచుతున్న వారలారా!  మేము మా వ్రతమునకు ఏర్పరచుకోనిన నియామాలు వినండి.  పాలసముద్రములో పడుకొని నిద్రించుతున్న పరమాత్మ యొక్క పాదపద్మాలకు మంగళము పాడతాము.  మేము ఈవ్రతము చేసినంతన కాలమున నీటిని కానీ పాలను కాని అనుభవించము.  తెల్లవారుజాముననే నిదురలేచి చల్లనినీటినే స్నానము చేసెదము.  కళ్ళకు కాటుకను అలంకరించము.  తలకు పరిమలబరితమగు పూలదండలను ధరించము.  మా పెద్దలు విడిచిపెట్టిన చేడుపనులు మేము ఆచరించము.  ఇతరులకు బాధ కలిగే మాటలు కానీ, అసత్యాలను కాని ఎప్పుడూమాటాడము.  ఇతరులకు హాని uకలిగించము.  ఇతరులకు హానిలాగే ఆలోచనలు చేయము.  ఙ్ఞానసంపన్నులైన మహాత్ములను ధనధాన్యాదులచే ఎక్కువ సత్కారిచుదుము.  బ్రహ్మచారులకు బిక్షుకలుకు బిక్షపెట్టేదము.  భగవంతుని కళ్యాణ గుణాలను కీర్తించేదము.  గురువు ను పరబ్రహ్మగా భావించాలని మన పెద్దలు చెప్పారు కదా అందుకే గురువులను పూజించి ఆచార్య కృపపోందేదము.  వ్రతనీయమాలు ఏ రీతిగా చెప్పబడినవో ఆవిధంగా పాటిద్దాం అనుకున్నారు. శ్రీ కృష్ణుని పొందుదాము.


విశేషార్ధము :
1 .  వైయత్తు వాళ్ వీర్గాళ్!  :-
ఈ లోకములో ఆనందము అనుభవించువారలారా!  అని సంబోధించుచున్నారు.
2 . నాముం నం పావైక్కు చ్చెయ్యుఙ్గిరిశైగళ్ కేళీరో!  :-
మేము మా వ్రాతములో చేయు క్రియలను వినుడు.
3 . పాఱ్కడలుళ్ పైయత్తుయిన్ఱ పరమనడి పాడి  :-
పాలసముద్రములో మెల్లగా పాడుకొనిన పరమపురుషుని పాదములకు మంగళము పాడి.
4 . నెయ్యుణ్ణోం పాలుణ్ణోం  :-
నేతులారగించము- పాలు తాగము.
5 .  నాట్కాలే నీరాడి  :-
తెల్లవారుజ్హాముననే స్నానము చేయవలెను.
6 . మైయిట్టెళుదోం  :-
కాటుకను మాకళ్ళకు అలంకరించము.
7 .   మలరిట్టు నాం ముడియోమ్  :-
మేము మాకోప్పులలో పూలు ధరించము.
8 . శెయ్యాదన శెయ్యోం  :-
"మా పెద్దలు చేయని పనులను మేమూ చేయము"
9 .  తీక్కుఱళై చ్చెన్ఱోదోమ్  :-
ఇతరులకు అనర్ధమును కల్గించు తప్పు మాటలను పలుకము.
10 .  ఐయముం పిచ్చైయుం ఆందనైయుం కైకాట్టి  :-
దానమును, భిక్షమును చాలు అన్నంతవరకు  ఇచ్చి  అయ్యో! ఏమియు చేయలేకపోతిమే అని విచారింతుము.
11 . ఉయ్యుమాఱెణ్ణి యుగందు :-
పైన విధంగా ఉజ్జీవించు విధములను పరిశీలించి సంతోషించి ఈ వ్రత నీయమాలను వినండి.




జై శ్రీమన్నారాయణ్

గురువారం, డిసెంబర్ 15, 2011

తిరుప్పావై ప్రధమ పాశురము

గురువారం, డిసెంబర్ 15, 2011

ఈ ధనుర్మాసం వ్రతం చాలా శ్రేష్టమైనది.  ఈ నెలరోజులు సూర్యోదయానికి మునుపే నిద్ర లేచి భగవంతుని ఆరాధించాలి.
ఈ వ్రతాన్ని త్రేతాయుగంలో భరతుడు ఆచరించాడు.  ద్వాపరయుగంలో గోపికలు శ్రీ కృష్ణుని భర్తగా కోరి ఈ నెలరోజులు కాత్యాయనీదేవి వ్రతం చేస్తారు.  ఈ వ్రతము మనము కూడా చేద్దాం.  అయితే మొదటి రోజు పాశురం గురించి మనం తెలుసుకుందాం   చుక్కలు పెట్టిన పాసురము నాకు విశేష నివేదన స్వామివారికి అర్పించాలి .

*మార్గళి త్తింగళ్ మది నిఱైంద నన్నాళాల్
  నీరాడ ప్పోదువీర్ పోదుమినో నేరిళైయీర్
  శీర్ మల్గుం ఆయ్ ప్పాడి చ్చెల్వ చ్చిఱుమీర్గాళ్
  కూర్వేల్ కొడుందోళిలన్ నందగోపన్ కుమరన్
  ఏరారంద కణ్ణి యశోదై ఇళమ్ శింగం
  కార్మేని చ్చెంగణ్ కదిర్మదియం పోల్ ముగత్తాన్
  నారాయణనే నమక్కే పఱైతరువాన్
  పారోర్ పుగళప్పడిందేలోర్ ఎమ్బావాయ్
 

తాత్పర్యము:   ఆహా మనము అవలంభించిన వ్రతమునకు మిక్కిలి అనుకూలమైన సమయము వచ్చింది కదా.
ఈ మార్గశిరమాసమును శ్రీ కృష్ణులు వారు  మాసములలో మార్గశిరమాసము తన స్వరూపముగా భగవద్గీతలో చెప్పారు.  మార్గశిరమాసము అనగా మనము అవలంభించిన మార్గమునకు శిరస్సు అని ( అతి ప్రదానమైన సమయము అని భావము)  " వాసుదేవతరుచ్చాయానాతిశీతానఘర్మదా" అంటే శ్రీ కృష్ణుడనే చెట్టు యొక్క నీడ ఎక్కువ చల్లనిదీ కాదు, ఎక్కువ వేడిదీ కాదు అని అర్ధము.  వాసుదేవస్వరూపమైన మార్గశిరమాసము కూడా సమశీతోష్ణముగా వుండు కాలము.  మనము మేలుకొనే సమయము బ్రాహ్మీముహూర్తము మరియు ఈ మార్గశిరమాసములో పైరులు పండి పెరిగి ఉండే కాలము.  అతి మనోహరముగా వుంది వెన్నెలను వెదజల్లు శుక్లపక్షము.  పవిత్రమైన దినము వ్రతము ప్రారంభించమని మనకు కాలమును ప్రకాసించుటలోని భావము.
భాగవత్సమాగమమును కోరి భగవంతుని సంతోషపెట్టుటకై పనులోనర్చునట్టి సమయము సంప్రాప్తించుటచే ఉత్తమోత్తమ సమయము అని ఆహ్లాదమును వెల్లిబుచ్చుట యందలి తాత్పర్యము.  చెలికత్తెలను మేల్కొని స్నానముచేసి, రండని పిలుచునపుడు "  ప్రకృతి మండలము అందనంత అనుభవించువారలారా! అని ఆండాళ్ళు సంబోధించింది.  ఈ పిలుపులో ఒక సుందరమైన భావము కలదు.  పమపదమున నివాసము కంటే గోకుమను ప్రకృతిమండలమున నివసించుటచే భగవంతునితో కలసి మెలసి మహానందము అనుభవించుట మహాభాగ్యముగా లభించును.  అందుచే పరమపదమును ఎవగించుకోనుట సంభోధనలోని సౌందర్యముగా గ్రహింపదగును.



My Blog Lovers

నా యూట్యూబ్ చానల్స్ ప్లీజ్ సబ్స్క్రిబ్ చేయండీ

Diabetic Challenger

DIABETIC CHALLENGER YOUTUBE CHANNEL. PLASE SUBSCRIBE MY CHANNEL...... THANK YOU VERY MUCH.

Ammamma Tho Nenu (అమ్మమ్మ తో నేను

Please subscribe our channel Ammamma Tho Nenu (అమ్మమ్మ తో నేను)