Blogger Widgets

మంగళవారం, డిసెంబర్ 04, 2012

రచ్చ కెక్కితివి

మంగళవారం, డిసెంబర్ 04, 2012

రచ్చ కెక్కితివి పండరంగి విఠలా
పచ్చిదేరే వింతలోనే పండరంగివిఠలా

గుట్టుగల దొరవని కొసరి చూచినంతనె
రట్టుగా నవ్వేవు పండరంగి విఠలా
మట్టుమీరి తమకపు మాటలనె నీవలపు
బట్టబయలె సేసేవు పండరంగి విఠలా

సాగినసబలలోన సన్న సేసినంతలోనే
రాగిదేలించేవు పండరంగి విఠలా
వేగిరపు చేతలనె విరిని నీ మోహమెల్ల
బాగుగా వెళ్ళ వేసేవు పండరంగి విఠలా

సతినీవున్నచోటికి దగ్గర వచ్చినంతనె
రతి గూడితివి పండరంగి విఠలా
గతియైన శ్రీవేంకటనాథ యేలితివి
పతివై కోవిలకుంట్ల పండరంగి విఠలా

కార్తీక పురాణం 21వ రోజు

పురంజయుడు కార్తీక ప్రభావము నెరు౦గుట
ఈవిధముగా యుద్దమునకు సిద్దమైవచ్చిన పురంజయునకు, కాంభోజాది భూపాలకులకు భయంకరమైన యుద్ద జరిగింది. ఆ యుద్దములో రధికుడు రధికునితోను, అశ్వసైనికుడు అశ్వ సైనికునితోను, గజ సైనికుడు గజ సైనికునితోను, పదాతులు పదాతి సైనికులతోను, మల్లులు, మల్ల యుద్ద నిపుణులతోను ఖడ్గ, గద, బాణ, పరశువు మొదలగు ఆయుధాలు ధరించి, ఒండొరులడీకొనుచు హుంకరించుకొనుచు, సింహనాదములు చేసికొనుచు, శూరత్వవీరత్వములను జూపుకోనుచు, భేరీ దుందుభులు వాయించుకొనుచు, శంఖములను పురించుకొనుచు, ఉభయ సైన్యములును విజయకంక్షులై పోరాడిరి. ఆ రణభూమి నెందు చూచినను విరిగిన రథపు గుట్టలు, తెగిన మొ౦డెములు, తొండలు, తలలు, చేతులు, - హాహా కారములతో దీనావస్థలో వినిపిస్తున్న ఆక్రందనలు, పర్వతాలవలె పడియున్న ఏనుగుల, గుఱ్ఱముల కళేబరాల దృశ్యములే ఆ మహా యుద్దమును వీరత్వముజూపి చచ్చిపోయిన ప్రాణులని తీసుకువెళ్ళడానికి దేవదూతలు పుష్పక విమానముపై వచ్చిరి. అటువంటి భయంకరమైన యుద్దము సూర్యాస్తమయము వరకు జరిగినది. కాంభోజాది భూపాలురసైన్యము చాలా నష్టమై పోయెను. అయినను, మూడు అక్షౌహిణులున్న పురంజయుని సైన్యము నెల్ల అతిసాహసముతో, పట్టుదలతో ఓడించినది. పెద్దసైన్యమునన్నను పురంజయునికి అపజయమే కలిగెను. దానితో పురంజయుడు రహస్య మార్గ మున శత్రువుల కంట పడకుండా తన గృహానికి పారి పోయెను. బలోపేతులైన శత్రురాజులు రాజ్యమును ఆక్రమించుకున్నారు. పురంజయుడు విచారముతో సిగ్గుతో దు:ఖించుచుండెను ఆసమయములో వశిష్టులు వచ్చి పురంజయుని ఊరడించి "రాజా! మున్నొక సారి నీవద్దకు వచ్చితిని. నీవు ధర్మాన్ని తప్పినావు. నీవు చెస్తున్న దురాచారాలకు అంతులేదు. ఇకనైననూ సన్మార్గుడవయి వుండుమని హెచ్చరించితిని. అప్పుడు నామాట లానలేదు. నీవు భగవంతుని సేవింపక అధర్మ ప్రవర్తునుడ వైవున్నందుననే యీయుద్దమును ఓడి రాజ్యమును శత్రువుల కప్పగించితిని. ఇప్పటికైనా నామాటలాలకింపుము. జయాపజయాలు దైవాదానములని యెఱ్ఱి ౦గియు, నీవు చింతతో కృంగిపోవుటయేల? శత్రురాజులను యుద్దములో జయించి, నీ రాజ్యమును నీవు తిరిగి పొందవలెనన్న తలంపుకలదేవి, నాహితోపదేశము నాలకింపుము. ఇది కార్తీక మాసము. రేపు కృత్తికా నక్షత్రముతో కూడిన పౌర్ణమిగాన, స్నానజపాది నిత్యకర్మలాచరించి దేవాలయమునకు వెళ్లి దేవుని సన్నిధిని దీపారాధనము చేసి, భగవన్నామస్మరణమును చేయుచు నాట్యము చేయుము. ఇట్లోనర్చినచో నీకు పుత్ర సంతతి కలుగుతుంది. అంతియేగాదు, శ్రీమన్నారాయణుని సేవించుటవలన శ్రీ హరి మిక్కిలి సంతోషమొంది నీ శత్రువలను దునుమాడుటకు నీకు చక్రాయుధము కూడా ప్రసాదించును. కనుక, రేపు అట్లు చేసిన యెడల పోగొట్టుకున్న రాజ్యమును తిరిగి పొందగలవు. నీవు అధర్మ ప్రవర్తనుడవై దుష్టసహవాసము చేయుట చేతగదానికి అపజయము కలిగినది? గానలెమ్ము. శ్రీహరి నీమదిలో దలచి నేను తెలియజేసినటులచెయు" మని హితోపదేశము చేసెను.


శ్లో// అపవిత్ర: పవిత్ర వానానావ స్దాన్గతోపివా
య: స్మరేతుడరీకాక్షం స బాహ్యాభంతరశుచి||

సోమవారం, డిసెంబర్ 03, 2012

కార్తీక పురాణం 20వ రోజు

సోమవారం, డిసెంబర్ 03, 2012

పురంజయుడు దురాచారుడాగుట:
జనక మహారాజు, చతుర్మాస్య వ్రతప్రభావము వినిన పిమ్మట వశిష్టునితో " గురువర్యా! కార్తీకమాస మహాత్మ్యమును యింకను వినవలయునునెడి కోరిక కల్గుచున్నది. ఈ వ్రత మహాత్మ్యమునందింకను విశేషములు గలవా! యను సంశయము గూడా కలుగుచున్నది. ఐనా సంశయ నివారణ కొరకు మరిన్ని వుదాహరణలు వినిపించి నన్ను కృతార్దునిగాజేయు" డనెను. అ మాటలకు వశిష్టులవారు మందహాసముతో " ఓ రాజా! కార్తీకమాస మహాత్మ్యము గురించి అగస్త్యమహాముని, అత్రిమునికి జరిగిన ప్రసంగ మొకటి కలదు. దానిని వివరించెదరు ఆలకించు" మని అ కథా విధానమును యిట్లు వివరించిరి. పూర్వమొకప్పుడు అగస్త్య మహర్షి అత్రి మహర్షిని గాంచి" ఓ అత్రిమహామునీ! నీవు విష్ణువు అంశయందు బుట్టినావు. కార్తీకమహాత్మ్యమును నీకు ఆ ములాగ్రమున తెలియును, కాన దానిని నాకు వివరింపుము" అని కోరెను. అంత "ఓ అత్రి మహామునీ! నీవు విష్ణువు అంశయందు బుట్టినావు. కార్తీకమాస మహాత్మ్యము నీకు ఆ మూలాగ్రముగా తెలియును, కాన దానిని నాకు వివరింపుము " అని కోరెను. అంత అత్రిమహముని "కుంభసంభవా! నీవడిగిన ప్రశ్న వాసుదేవునికి ప్రితికరముగుటచే నుత్తమమయినది. కార్తీకమాసముతో సమానముగ మాసము. వేదముతో సమానమగు శాస్త్రము. ఆరోగ్యసంపదకు సాటియగు సంపదలేదు. అటులనే శ్రీమన్నారాయణుని కంటెవేరు దేవుడులేడు. ఏ మానవుడైనను కార్తీకమాసమును నదిలో స్నానము చేసినను, శివకేశవుల ఆలయమందు దీపారాధన చేసినను, లేక దీపదానము చేసినను గలుగు ఫలితము అపారము. ఇందుకొక యితిహాసము వినుము. త్రేతాయుగామును పురంజయుడను సూర్యవంశపురాజు అయోధ్యానగరమును రాజధానిగా చేసుకొని రాజ్యమేలుచుండెను. అతడు సమస్త శాస్త్రములు చదివిపట్టభిషిక్తుడై న్యాయముగా రాజ్యపాలన చేసెను. ప్రజలకెట్టి యాపదలు రాకుండ పాలించుచుండెను. అట్లుండ కొంతకాలమునకు పురంజయుడు అమిత ధనాశచేతను, రాజ్యాధికార గర్వముచెతను జ్ఞానహినుడై దుష్ట బుద్ది గలవాడై దయాదాక్షిణ్యములు లేక దేవబ్రాహణ మాన్యములు లాగుకొని, పరమలోభియై, చొరులను జేరదీసి వారిచే దొంగతనములు దోపిడీలు చేయించుచు దొంగలు కొల్లగొట్టుకొని వచ్చిన ధనములో సగమువాటా తీసికోనుచు ప్రజలను భితావహులను చేయుచుండెను. ఇటుల కొంతకాలము జరుగగా అతని దౌష్ట్య ములు నలుదిక్కులా వ్యాపించెను. ఈవార్త కాంభోజరాజును నాయకునిగా చేసుకోని రధ, గజ, తురగ, పదాతి సైన్య బలా న్వితులైర హస్యమార్గము వెంటవచ్చి అయోధ్య నగరమును ముట్టడించి, నలువైపులా శిబిరములు నిర్మించి నగరమును దిగ్భ౦ధముచేసి యుద్దమునకు సిద్దపడిరి.
అయోధ్యా నగరమును ముట్టడి౦చిన సంగతిని చారులవలన తెలిసికోనిన పురంజయుడు తానుకూడా సర్వ సన్నద్దుడై యుండెను. అయినను యెదుటిపక్షము వారధి కబలాన్వితులుగా నుండుటయితాను బలహినుడుగా నుండుటయు విచారించియే మాత్రము భితిచెందక శాస్త్రసమన్విత మైన రథమెక్కి సైన్యాధపతులను పూరికొల్పి, చతురంగబల సమేతమైన సైన్యముతో యుద్ద సన్నద్దుడైన వారిని యెదుర్కొన భేరి మ్రోగించి, సింహనాదము గావించుచు మేఘములు గర్జించునట్లు హు౦కరించి శత్రు సైన్యములు పైబడెను.

ఆదివారం, డిసెంబర్ 02, 2012

కార్తీక పురాణం 19వ రోజు

ఆదివారం, డిసెంబర్ 02, 2012

చతుర్మా స్య వ్రత ప్రభావ నిరూపణ 
ఈ విధముగా నైమిశారణ్య మందున్న మహా మునులందరూ కలిసి చిదానందుని స్తోత్రము చేసిన పిమ్మట జ్ఞాన సిద్దుడను ఒక మహా యోగి " ఓ దీనబాంధవా! వేదవేద్యుడవని, వేద వ్యాసుడవని, అద్వి తీయుడవని, సూర్య చంద్రులే నేత్రములుగా గల వాడవని, సర్వాంతర్యామివని, బ్రహ్మ రుద్ర దేవేంద్రాదులచే సర్వదా పూజింపబడువాడవని, సర్వ౦తర్యామివని, బ్రహ్మ రుద్ర దేవేంద్రులచే సర్వదా పూజింప బడు వాడవని, నిత్యుదవని, నిరాకారుడవని సర్వజనుల చే స్తుతింపబడుచున్న ఓ మాధవా! నికివేమా హృదయ పూర్వక నమస్కారములు సకల ప్రాణి కోటికి ఆధారభూతుడవగు ఓ నంద నందా! మా స్వాగతమును స్వికరింపుము. నీ దర్శన బాగ్యమువలన మేము మాఆశ్రమములు, మా నివాస స్థలములు అన్నీ పవిత్రములైన వి. ఓ దయామయా! మే మి సంసారబందము నుండి బైటపడలే కుంటి మి, మమ్ముద్దరింపుము. మానవుడెన్నిపురాణములు చదివినా, యెన్ని శాస్త్రములు విన్న నీ దివ్య దర్శనముబడ యజాలడు. నీ భక్తులకు మాత్రమే నీవు దృగ్గోచరుడవగుడువు. ఓ గజేంద్రరక్షకా! ఉపేంద్రా! శ్రీధరా! హృషికేశా!నన్ను కాపాడుము" అని మైమరచి స్తోత్రము చేయగా, శ్రీ హరి చిరునవ్వు నవ్వి " జ్ఞాన సిద్దా! నీసోత్ర వచనమునకు నేనెంత యు సంత సించితిని. నీకిష్ట మొచ్చిన వరమును కోరుకొనుము" అని పలికెను. అంత జ్ఞాన సిద్దుడు " ప్రద్యుమ్నా! నేనీ సంసార సాగరము నుండి విముక్తుడను కాలేక శ్లేష్మమున పడిన యీగ వలె కొట్టుకోనుచున్నాను. కనుక, నీపాద పద్మముల పైనా ధ్యానముండుట నటుల అనుగ్రహింపుము. మరేదియు నాకక్కర లేదు " అని వేడుకొనెను. అంత శ్రీమన్నారాయణుడు " ఓ జ్ఞాన సిద్దుడా! నీ కోరిక ప్రకారమటులనే వరమిచ్చితిని. అదియునుగాక, మరొకవారము కూడా కోరుకొనుము యిచ్చెదను. ఈలోక మందు అనేక మంది దురాచారులై, బుద్దిహీనులై అనేక పాపకార్యములు చేయుచున్నారు. అట్టి వారల పాపములు పోవుటకై ఒక వ్రతమును కల్పించుచున్నాను. అ వ్రతమును సర్వజనులు ఆచరించవచ్చును. సావధానుడవై ఆలకింపుము. నేను ఆషాడ శుద్ద దశమిరోజున లక్ష్మి దేవి సహితముగా పాలసముద్ర మున శేషశయ్య పై పవళింతును.  తిరిగి కార్తీక మాసమున శుద్ద ద్వాద శివరకు చాతుర్మాస్యమని పేరు. ఈకాలములో చేయు వ్రతములు నాకు మిక్కిలి ప్రితికరము. ఈ వ్రతముచేయు వారాలకు సకల పాపములు నశించి, నా సన్నీధకి వత్తురు. ఈ చాతుర్మాస్యములందు వ్రతములు చెయనివారు నరకకూపమునుబడుదురు. ఇతరులచేత కూడా ఆచరింపచేయవలయును. దీని మహాత్యమును తెలిసియుండియు, వ్రతము చేయనివారికి బ్రహ్మహత్యాది పాతకములు గలుగును. వ్రతము చేసిన వారి కి జన్మ, జరా, వ్యాధుల వలన కలుగు భాధలుండవు. దినికి నియమితముగా ఆషాడశుద్ద దశమి మొదలు శాకములును, శ్రవణ శుద్ద దశమి మొదలు పప్పుదినుసులను విసర్జిoచవలయును. నాయందు భక్తీ గలవారిని పరీక్షించుటకై నే నిట్లు నిద్రవ్యజమున శయనింతును. ఇప్పుడు నీవోసంగిన స్తోత్రమును త్రిసంధ్యలయందు భక్త శ్రద్దలతో పరించిన వారు నాసన్నీధకి నిశ్చయముగా వత్తురు." అని శ్రీమన్నారాయణుడు మునులకు బోధంచి శ్రీమహాలక్ష్మితో గూడి పాలాసముద్రమును కేగి శేషపానుపు మీద పవ్వళిoచెను. వశిష్టుడు జనక మహారాజుతో " రాజా! ఈ విధముగా విష్ణుమూర్తి, జ్ఞానసిద్దా మొదలగు మునులకు చాతుర్యస్యవ్రత మహత్యమును ఉపదేశించెను. ఈ వ్రత్తంతమును అంగీరసుడు ధనలోభనకు తెలియచేసెను. నేను నీకు వివరించినాను గాన ఈ వ్రతము ఆచరించుటకు స్త్రీ పురుషభేదముల లేదు, అన్ని జాతులవరును చేయవచ్చును. శ్రీ మన్నారయునని ఉపదేశము ప్రకారము ముని పుంగవు లందరూ యీ చాతుర్యాస్యవ్రత ఆచరించి దన్యులై వైకుంఠమున కరిగిరి.

శనివారం, డిసెంబర్ 01, 2012

కార్తీక పురాణం 18వ రోజు

శనివారం, డిసెంబర్ 01, 2012

" ఓ ముని చంద్రా! మీ దర్శనము వలన ధన్యుడ నైతిని సంశయములు తిరునట్లు జ్ఞానోపదేశము చేసితిరి. నేటి నుండి మీ శిష్యుడ నైతిని. తండ్రి- గురువు-అన్న-దైవము సమస్తము మీరే, నా పూర్వ పుణ్య ఫలితా ము వలెనే కదా మీబోటి పుణ్య పురుషుల సాంగథ్యము తటి స్థిం చేను. లేనిచో నెను మహా పాపినయి మహా రణ్య ములో ఒక మొద్దు బారిన చెట్టు ని యుండగా, తమ కృప వలననే నాకు మోక్షము కలిగినది కదా! మీ దర్శన భాగ్యము లేని యెడల ఈ కీ కారణ్యములో తర తరాలుగా చెట్టు రూపమున  వుండవలసినదే  కదా! అట్టి! నేనెక్కడ! మీ దర్శన భాగ్యమెక్కడ! నాకు సద్గతి యెక్కడ? పూనా ఫల ప్రదయియగు యీ కార్తీక మాస మెక్కడ! నాకు పాపత్ముడనగు నేనెక్కడ? ఈ విష్ణ్యాలయమందు ప్రవేశించు టెక్కడ? యివి యన్నియును దైవిక మగు ఘటనలు తప్ప మరొకటి కాదు. కాన, నన్ను తమ శిష్యునిగా పరిగ్రహించి సత్కర్మలను మనవుడెట్లు అను సరించ వలయునో, దాని ఫల మెట్టిదో విశదీకరింపు"డని ప్రార్ధించెను.
" ఓ ధనలోభా! నీడిగిన ప్రశ్నలన్నియు మంచివే. అవి అందరికి వుపయోగార్ధ మైనట్టివి కాన, వివరించెదను శ్రద్దగా అలకిన్పుము ప్రతి మనుజుడు ఆ శరీరమే సుస్థిరమని నమ్మి జ్ఞాన శున్యుడగు చున్నాడు. ఈ భేదము శరీరమునాకే గాని ఆత్మకు లేదు. అట్టి ఆత్మ జ్ఞానము కలుగుటకే సత్మర్మలు చేయవలెనని, సకల శస్త్రములు ఘోషించు చున్నవి. సత్కర్మ  నాచరించి వాటి ఫలము పరమేశ్వ రార్పిత మనరించిన జ్ఞానము కలుగును. మానవుడే, జాతి వాడో, ఎటువంతి కర్మలు ఆచరించావలెనో తెలుసుకొని అటువంటివి ఆచరింపవలెను. బ్రాహ్మణుడు అరుణో దయ స్నానము చేయక, సత్కర్మల నచారించినను వ్యర్ధ మగుఉన్. అటులనే కార్తీక మాసమందు సూర్య భగవానుడు తులారాశిలో ప్రవేశించు చుండగాను విషక మాసములో సూర్యుడు మేష రాశిలో ప్రవేశించు చుండగాను, మాఘ మాసములో సూర్యుడు మకర రాశి యందుండ గాను అనగా ణి మూడు మాసముల యంద యిననూ తప్పక నదిలో ప్రాతః కాల స్నానము  చేయవలెను. అతుల స్నానము లాచరించి దేవర్చన చేసిన యెడల తప్పక వైకుంట ప్రాప్తి కలుగును. సూర్య చంద్రా గ్రహణ సమయములండును తదితర పుణ్యదినముల యందు, స్నానము చేయవచ్చును. ప్రాతః  కాలమున స్నానము చేసిన మనుజుడు సంద్యావందనం సూర్య సమస్కారములు చేయవలెను. అట్లు ఆచరించని వాడు కర్మ బ్రష్టుడగును. కార్తీక మాసమందు అరుణోదయ స్నానమాచరించ రించిన వారికీ చతుర్విధ పురుషార్ధములు సిద్దించును. కార్తీక మాసముతో సమానమైన మాసము, వేదములతో సరితూగు శాస్త్రము, గంగ గోదావరి నదులకు సమన తీ ర్ధములు, బ్రాహ్మణులకు సమానమైన జాతీయు, భార్యతో సరితూగు సుఖమునూ, ధర్మముతో సమానమైన మిత్రుడనూ, శ్రీ హరితో సమానమైన దేవుడునూ లేదని తెలుసుకోనుడు. కార్తీక మాసమందు విధ్యుక్త ధర్మముగా స్నానాదులు ఆచరించిన వారు కోటి యాగములు చేసిన ఫలమును పొంది వైకుంట మునకు పోవుదురు." అని అంగీరసుడు చెప్పగా విని మరల ధన లోభు దితుల ప్రశ్నించెను.
ఓ ముని శ్రేష్టా! చతుర్మా స్య వ్రతమని చెప్పితిరే! ఏ కారణం చేత డని నాచరించ వలెను? ఇది వర కెవ్వ యిన ణి వ్రతమును ఆచరించి యున్నారా? ఆ వ్రతము యొక్క ఫలితమేమి?  విధానమేట్టిది? సవిస్తర౦గా విశదికరింపు'డని కోరెను. అందులకు అంగీ రసుడి టుల చెప్పెను.
" ఓయీ! వినుము చతుర్మా స్య వ్రతమనగా సతి మహా విష్ణువు మహాలక్షితో ఆషాడ శుద్ధ ఏకాదశి దినమున పల సముద్రమున శేషుని పాన్పు పై శయనించి కార్తీక శుద్ధ ఏకాదశి నాడు నిద్ర నుండి లేచును. ఆ నలుగు మాసములకే చతుర్మా స్యమని పేరు. అనగా ఆషాడ శుద్ధ ఏకాదశి' శయన ఏకాదశి' అనియు, కార్తీక శుద్ధ ఏకాదశి ఉత్థాన ఏకాదశి ' అనియు, ఏ వ్రతమునకు, చతుర్మా స్య వ్రాతమనియు పేరు ఈ నలుగు మాసములలో శ్రీ హరి ప్రీతి కొరకు స్నాన,  దన, జప, తపాది సత్కార్యాలు చేసినచో పుణ్య ఫలము కలుగును. ఈ సంగతి శ్రీ మహా విష్ణువు వలన తెలిసి కొంటిని  కాన,  ఆ సంగతులు నీకు తెలియచేయు చున్నాను".
తొల్లికృత యుగంబున వైకుంట మందు గరుడ గంధర్వాది దేవతలచేత, వేదములచేత సేవింప బడుచున్న శ్రీ మన్నారాయణుడు లక్షి దేవి సమేతుడై సింహాసనమున కూర్చుండి యుండగా ఆ సమయమున నారద మహర్షి వచ్చి అడ్మ నేత్రు౦ డను, చతు ర్బాహు౦ డును, కోటి సూర్య ప్రకాశ మాముండును అగు శ్రీ మన్నారాయ ణునకు నమస్కరించి ముకుళిత హస్తాలతో నిలబడి యుండెను. అంత శ్రీ హరి నారదుని గాంచి ఏవి ఏమియు తెలియ నివాని వలె మంద హాసముతో నిట్లనెను." నారదా! నీవు క్షేమమే గదా! త్రిలోక సంచారి వైన నీకు తెలియని విషయములు లేవు. మహామునుల సత్క ర్మా నుష్టా నములు యెట్టి విఘ్నములు లేక సాగుచున్నావా? ప్రపంచమున నే అరిష్ట ములు లేక యున్నవి కదా? ' అని కుశల ప్రశ్న లడిగెను. అంత నారదుడు శ్రీ హరికీ అది లక్ష్మి కీ నమస్కరించి " ఓ దేవా! ఈ జగంబున ని  వేరుగని విషయమున లేవియునూ లేవు అయినను నన్ను వచింపు మనుటచే విన్నవించు చుంటిని ప్రపంచమున కొందరు మనుష్యులు- మునులు కూడా తమకు విధించిన కర్మలను నిర్వర్తించుట లేదు. వారెట్లు విముక్తు లగుదురో యెరుగ లేకున్నాను. కొందరు భుజించ కూడ దనిన పదార్దములు భుజించుచున్నారు. కొందరు పుణ్య వ్రతములు చేయుచు, అవి పూర్తి గాక మునుపే  మధ్యలో మని వేయుచున్నారు. కొందరు సదచారులుగా, మరి కొందరు అహంకార సాహితులుగా, పర నిండా పరాయణులుగా జీవించుచున్నారు. అట్టి వారిని సత్కృపతో పుణ్యత్ముల నొనర్చి  రక్షింపు'మని ప్రార్ధించెను. జగన్నా టక సూత్ర ధారు డ యిన శ్రీ మన్నారాయణుడు కలవార పది లక్ష్మి దేవితో గరుడ గంధర్వాది దేవతలతో వేలకొలది మహర్షులున్న భూలోకానికి వచ్చి, ముసలి బ్రాహ్మణా రూపంతో ఒంటరిగా తిరుగు  చుండెను. ప్రపంచ మంటను తన దయా వ లోకమున వీక్షించి రక్షించు చున్న దామోదరుడు ప్రాణుల భక్తి శ్రద్ధలను పరీక్షించు చుండెను. పుణ్య నదులు, పుణ్య శ్రమములు తిరుగు చుండెను. ఆ విధముగా తిరుగు చున్న భగవంతుని గాంచి కొందరు ముసలి వాడని యె గ తాళి చేయు చుండిరి. కొందరు " యీ ముసలి వానితో మనకేమి పని" యని ఊరకు౦డిరి కొందరు గర్విష్టులైరి మరి కొందరు కమార్తులై శ్రీ హరిణి కన్నేతి యైనను చుడకుండిరి. విరందిరిని భక్త వత్స లుడగు శ్రీ హరి గాంచి " విరి నేతలు తరింప జెతునా? " యని అలోచించుచు, ముసలి బ్రాహ్మణా రూపమును విడిచి శంఖ, చక్ర, గదా, పద్మ, కౌస్తుభ, వనమాలా ద్యలం కార యుతుడై నిజ రూపమును ధరించి, లక్ష్మి దేవితో డను, భక్తులతో డను ముని జన ప్రీతికరమగు నైమిశారణ్య మునకు వెడలెను. ఆ వనమందు తపస్తు చేసుకోను చున్న ముని పుంగవులు స్వయముగా తమ ఆశ్రమముల కరు దెం చిన  సచ్చిదానంద స్వరుపుడగు శ్రీ మన్నారయణుని దర్శించి భక్తి శ్రద్దలతో ప్రణమిల్లి అంజలి ఘటించి అది దైవములగు నా లక్ష్మి నారాయణులనిట్లు స్తోత్రము గావించిరి.

శ్లో|| శాంత కారం! భజగా శయనం ! పద్మ నాభం! సురేశం!
విశ్వా కారం! గగన సదృశం ! మేఘవర్ణం శుభాంగం!
లక్ష్మి కాంతం ! కమల నయనం! యోగి హృద్ద్యాన గమ్యం!
వందే విష్ణు! భవ భయ హారం! సర్వ లోకైక నాథం||

శ్లో|| లక్ష్మీం క్షీర సముద్ర రాజ తనయాం శ్రీ రంగ దామేశ్వరీం
దాసి భూత సమస్త దేవా వనితాం లోకైక దీపంకురాం
త్వాం త్రైలోక్య  కుటుంబిని౦ శర సిజాం వందే ముకుంద ప్రియం|| 

శుక్రవారం, నవంబర్ 30, 2012

కార్తీక పురాణం 17వ రోజు

శుక్రవారం, నవంబర్ 30, 2012

ఓ మునిశ్రేష్టులారా ! ఓ ధనలోభీ ! నీకు కలిగిన సంశయమునాకు జవాబి చెప్పుచున్నా విను.
కర్మవల్ల ఆత్మకు దేహదారణము సంభవించుచున్నది.  కావునా శరీరోత్పత్తికి కర్మే కారణము అగుచున్నది.  శరీరదారణ వలనే  ఆత్మ కర్మ చేయుచున్నది.  కావున కర్మ చేయుటకు శరీరమే కారణము అగుచున్నది.  స్థూల సూక్ష్మ శరీర సంబందమువలన ఆత్మకు కర్మసంభందము కలుగునని మొదట శివుడు పార్వతికి వివరించాడు.  దానిని మీకు వివరించుచున్నాను.  "ఆత్మ" అనగా ఈ శరీరమున అహంకారముగా ఆవహించి వున్నది అని అంగీరసుడు చెప్పగా.
" ఓ మునీంద్రా!  నేనింతవరకు శరీరమే ఆత్మ అని భావించుచున్నాను.  కనుక ఇంకావివరముగా చెప్పబడిన వ్యాక్యార్ధజ్ఞానంకు పాదార్ధజ్ఞానం కారణము అగుచున్నాడు.  కావున "అహంబ్రహ్మ" అను వాక్యార్ధమును గురించి నాకు చెప్పండి" అని ధనలోబుడు కోరాడు.
అప్పుడు ధనలోభునితో అంగీరసుడు ఇలా అన్నాడు ఈ దేహము అంతఃకరణవృత్తికి సాక్షియే .  నేను -నాది అని చెప్పబడు జీవాత్మే అహం అను శబ్దము .  సర్వాంతర్యామే  సచ్చితానందరూపమైన పరమాత్మ "నః " అను శబ్దము,ఆత్మకు ఘటాదుల వాలే శరీరమునాకు అర్ధములేదు.  ఆ ఆత్మ సచ్చితానంద స్వరూపము. బుద్ధి సాక్షి జ్ఞానరూపి శరీరేంద్రియములు మొదలగువానిని వ్యాపారమునందు ప్రవర్తింపచేసి వానికంటె వేరుగా ఉన్నదైఎల్లప్పుడు ఒకేరీతిని ప్రకాశించించునదే  ఆత్మ .  నేను అనునది శారీరేంద్రియాదులలో ఒకటి కాదు అని తెలుసుకో.  దేహేంద్రియాదులు నన్నింటిని ఏది ప్రకాసింపచేయునో అదే నేను.  అందుచే అస్థిరమైన శరీరాదులు కూడా నామరూపము లతో ఉండి నసించునుగాక,  నేను నాది అనునది కేవలము యాత్మ మాత్రమే .
ఇనుము సూదంటు రాయిని అంటిపెట్టుకొని తిరుగునటులు శరీర, ఇంద్రియాలు దేని నాశ్రయించి తిరుగుచుండునో అదే ఆత్మ,   ఆత్మవల్లే పనిచేయును.  నిద్రలో శారీరేంద్రియముల సంబంధము లేక గాఢనిద్రపోయి, మేల్కొన్న తరువాత నేను సుఖనిద్ర పోతిని  సుఖముగా వున్నది అనుకోనునది ఆత్మ. ఆత్మదేహ లక్షణం, వుండుట, జనించుట, పెరుగుట, క్షిణించుట, మరణించుట  వంటి భాగాలు ఆత్మకు వుండవు.  జీవమే పరమాత్మ అని తెలుసుకో.
జీవులచే కర్మఫల మనుభావింపచేసేవాడు పరమాత్మే అతనే పరమేశ్వరుడు.  జీవులా కర్మఫలమనుభవింతురు అని తెలుసుకో.  మానవుడు గుణసంపద కలవాడై గురుశుశ్రూష కలిగి సంసార సంబంధమగు ఆశలన్నీ విడిచి విముక్తి పోందవలెను.  మంచి పనులు తలచిన చిత్తశుద్ధి,  దానివలనే భక్తిజ్ఞాన వైరాగ్యములు గలిగి ముక్తి పొందును. అందువల్ల సత్కర్మనుష్టానం చేయాలి.  మంచిపనులు చేసినగాని ముక్తి లభించదు.  అని అంగీరసుడు చెప్పగా ధనలోబుడు నమస్కరించినాడు. 

గురువారం, నవంబర్ 29, 2012

చలి గాలి వేడేల చల్లీనే కప్పురపు

గురువారం, నవంబర్ 29, 2012


చలి గాలి వేడేల చల్లీనే కప్పురపు
మలయజము తానేల మండీనే

పాపంపు మననేల పారీనే నలుగడల
చూపేల నలువంక జూచీనే
తాపంపు మేనేల తడవీనే పూవింటి
తూపేల చిత్తంబు దూరీనే

వాయెత్తి చిలుకేల వదరీనె పలుమారు
కోయిలలు దామేల గొణిగీనే
రాయడికి నలులేల రసీనే మాతోను
కాయజుడు తానేల కసరీనే

ఏకాంతమునేల యెదురైతినే తనకు
లోకాధి పతికేల లోనైతినే
చేకొనిదే మన్నించె శేషాద్రి వల్లభుడు
పైకొనిదె మమ్మేల పాలించెనే

కార్తీక పురాణం 16వ రోజు

బుధవారం, నవంబర్ 28, 2012

కార్తీక పురాణం 15వ రోజు

బుధవారం, నవంబర్ 28, 2012


దీప ప్రజల్వనముచే ఎలుక పూర్వజన్మ స్మృతితో మనిషి రూపము పొందుట. అంత జనకమహారాజుతో వశిష్ఠ మహాముని - జనకా! కార్తీక మహాత్య్మను గురించి ఎంత చెప్పినా పూర్తి కాదు. కానీ ఇంకొక ఇతిహాసము చెప్తాను చక్కగా వినమనెను.
ఈ మాసములో హరినామ సంకీర్తనలు వినుట, చేయుట, శివకేశవుల వద్ద దీపారాధన చేయుట, పురాణమును చదువుట, వినుట, సాయంత్రము దేవతా దర్శనములు చేయలేనివారు కాలసూత్రమనెడి నరకమున బడి కొట్టుమిట్టాడుదురు. కార్తీక శుద్ధ ద్వాదశీ రోజున మనసారా శ్రీహరిని పూజించిన వారికి అక్షయ పుణ్యము కలుగుతుంది. శ్రీమన్నారాయణుని గంధముతో, పుష్పాలతో, అక్షతలతో పూజించి దూప, దీప నైవేధ్యాలను సమర్పిస్తే విశేష ఫలము పొందగలరు. ఈవిధంగా నెల రోజులు విడవక చేసినవారికి దేవదుందుభులు మోగుచుండగా విమానమెక్కి వైకుంఠమునకు పోవుదురు. నెలరోజులు చేయలేనివారు కార్తీక శుద్ధ త్రయోదశి, చత్రుర్థశి, పూర్ణిమ రోజులలోనానై నిష్ఠతో పూజలు చేసి ఆవునేతితో దీపారాధన చేయవలెను.
ఈ కార్తీక మాసములో ఆవుపాలు పితికినంత సేపు దీపం వెలిగేలా ఉంచితే మరు జన్మలో బ్రాహ్మణుడుగా జన్మించుదురు. ఇతరులు వెలిగించిన దీపాలను సరిగ్గా ఉంచినా, లేక ఆరిపోయిన దీపాలను వెలిగించినా అట్టి వారి సమస్త పాపములు తొలిగిపోవును. దీనికి ఒక కథ కలదు. శ్రద్ధగా వినమని వశిష్ఠులవారు ఇలా చెప్పసాగెను. సరస్వతీ నదీతీరమున శిథిలమైన దేవాలయం ఒకటి ఉంది. కర్మనిష్ఠుడనే దయగల యోగిపుంగవుడు ఆ దేవాలయం వద్దకు వచ్చి కార్తీక మాసమంతయూ అక్కడే ఉంటూ పురాణం చదవాలనే కోరికతో ఆ పాడుబడిన దేవాలయమును శుభ్రముగా చిమ్మి, నీళ్ళతో కడిగి, బొట్లు పెట్టి, ప్రక్క గ్రామానికి వెళ్ళి ప్రమిదలు తెచ్చి, దూదితో వత్తులు వేసి, పన్నెండు దీపాలను వెలిగించి స్వామిని పూజిస్తూ, పురాణాన్ని చదువుతుండెను. ఈ విధంగా కార్తీక మాసము ప్రారంభం నుండి చేయసాగెను. ఒక రోజున ఒక ఎలుక ఆ దేవలయములో ప్రవేశించి, నలుమూలలా వెతికి, తినడానికి ఏమీ దొరక్కపోవడంతో అక్కడ ఆరిపోయి ఉన్న వత్తిని నోట కరచుకొని పక్కనున్న దీపము వద్ద ఆగెను. నోట్లో ఉన్న వత్తి చివరకు అగ్ని అంటుకొని ఆరోపోయిన వత్తి ఈ ఎలుక వల్ల వెలగడంతో దాని పాపాలు నశించి పుణ్యం కలిగినందున వెంటనే దాని రూపము మారి మానవ రూపంలో నిలబడెను. ధ్యాన నిష్ఠలో ఉన్న యోగి పుంగవుడు, తన కన్నులు తెరచి చూడగా, పక్కనే ఉన్న మనిషిని చూసి ఓయీ! నీవు ఎవ్వరవు? ఎందుకు నిలబడ్డావు? అని ప్రశ్నించగా 'ఆర్యా! నేను మూషికమును. రాత్రి నేను ఆహారం కోసం ఈ దేవాలయములోకి ప్రవేశించగా ఇక్కడ కూడా ఏమీ తినడానికి దొరకనందున నెయ్యి వాసనలతో ఉండి ఆరిపోయిన వత్తిని తినాలన్న కోరికతో దాన్ని నోట కరచి పక్కనున్న దీపం చెంత నిలబడి ఉండగా, అదృష్టముకొద్దీ ఈ వద్ది వెలుగటచే నా పాపాలు నశించి పూర్వ జన్మమెత్తాను. కానీ ఓ మహానుభావా! నేను ఎందుకీ ఎలుక రూపంలో పుట్టాను - దానికి గల కారణమేమిటో వివరించమని' కోరెను.  అంత యోగీశ్వరుడు ఆశ్చర్యంతో తన దివ్యదృష్టిచే మొత్తం తెలుసుకుని 'ఓయీ! కిందటి జన్మలో నీవు బ్రాహ్మణుడవు. నిన్ను బాహ్లికుడని పిలిచేవారు. నీవు జైనమతవంశానికి చెందిన వాడవు. నీవు కుటుంబాన్ని పోషించుటకు వ్యవసాయం చేస్తూ, డబ్బుమీద ఆశతో దేవ పూజలు, నిత్యకర్మలు మరచి, చెడు స్నేహాల వల్ల నిషిద్ధాన్నము తింటూ, మంచివాళ్ళను, యోగ్యులను నిందిస్తూ పరుల చెంత స్వార్త చింతన కలవాడవై ఆడపిల్లలను అమ్ముతూ దాని వల్ల సంపాదించిన సొమ్మును దాస్తూ, అన్ని ఆహారాపదార్థాలను తక్కువ ఖరీదుకు కొని తిరిగి వాటిని ఎక్కువ ధరకు అమ్ముతూ అలా సంపాదించిన డబ్బుతో నీవు తినక, ఇతరులకు ఇవ్వక ఆ ధనమును భూ స్థాపితము చేసి పిసినారివై బ్రతికావు. నీవు చనిపోయిన తర్వాత ఎలుక రూపంలో పుట్టి వెనుకటి జన్మ పాపాలను అనుభవిస్తున్నావు. నేడు భగవంతుని వద్ద ఆరిపోయిన దీపాన్ని వెలిగించినందుకు పుణ్యాత్ముడవైతివి. దానివలననే నీకు పూర్వజన్మ రూపాన్ని పొందావు. కాబట్టి నీవు నీ గ్రామానికి పోయి నీ పెరట్లో దాచిపెట్టిన ధనమును త్రవ్వి, ఆ ధనముతో దానధర్మాలు చేసి భగవంతునిని పూజించి మోక్షమును పొందుము' అని నీతిబోధ చేసి పంపించెను.

మంగళవారం, నవంబర్ 27, 2012

చూడవమ్మ యశోదమ్మ

మంగళవారం, నవంబర్ 27, 2012


చూడవమ్మ యశోదమ్మ | వాడ వాడల వరదలివిగో ||

పొంచి పులివాలు పెరుగు | మించు మించు మీగడలు |
వంచి వారలు వట్టిన | కంచపుటుట్ల కాగులివో ||

పేరీ బేరని నేతులు | చూరల వెన్నల జున్నులును |
ఆరగించి యట నగుబాళ్ళు | పార వేసిన బానలివిగో ||

తెల్లని కను దీగల సోగల | చల్ల లమ్మేటి జవ్వనుల |
చెల్లినట్లనె శ్రీ వేంకటపతి | కొల్లలాడిన గురుతు లివిగో ||

వైకుంఠ చతుర్ధశి

కార్తీక మాసం లో శుక్ల చతుర్దశి రోజు  వైకుంఠ చతుర్ధశి అని కూడా అంటారు. 
వైకుంఠ చతుర్ధశి కి ఒక మంచి కధ వుంది.
ఒకసారి ఒకానొక సమయం లో నారద మహాముని భూమిపై సంచరించిన తర్వాత వైకుంఠ ధామ్ చేరుకుంన్నాడు. విష్ణువు  నారద మహా ముని పర్యటన వెనుక వున్నకారణం అడిగారు.  నారదుడు సాధారణముగా  ప్రజలుకు  విష్ణువు యొక్క దీవెనలు ఎలా లభిస్తాయి అని అడుగగా.  విష్ణువు వైకుంఠ చతుర్ధశి రోజున అతనికి పూజించే వారికి దీవెనలు తప్పక  చేరుతాయి.  వారికి స్వర్గానికి దారి ఏర్పడుతుంది అని సమాధానమిచ్చారు.
విష్ణువు అప్పుడు జై-విజయ్ లకు వైకుంఠ చతుర్ధశి రోజున స్వర్గ ద్వారాలు తెరవమని కోరాడు. విష్ణు ఈ రోజు పూజించేవారు స్వర్గానికి వెళ్ళండి అని చెప్పారు.  
కార్తీక వైకుంఠ చతుర్ధశి యొక్క ప్రాముఖ్యత:
ఈరోజు పరమశివుడు విష్ణువు ఒకటే అని గుర్తించిన రోజు.  విష్ణువు కాశీలో శివుని వేయి తామర పుష్పాలు తో పూజించుతున్నారు.  అప్పుడు శివుడు విష్ణువుని పరిక్షించాలి అనుకోని ఒక పువ్వును తగ్గించారు.  విష్ణువు 1000 పువ్వులు పూజ చేస్తూవుంటే అందులో ఒక  పువ్వు తగ్గుతుంది.  అప్పుడు విష్ణువు ఆ ఒక్క పువ్వు స్థానంలో ఏమి ఉంచాలా అని ఆలోచించి.  విష్ణువుని భక్తులు కమలనయనుడు అంటారు కదా అని ఆ పువ్వు స్థానంలో తన ఒక కంటిని అందించడానికి సిద్ధం అయ్యి. తన కంటిని తీసి శివుడుకు అర్పించారు.  అప్పుడు శివుడు ఆనందం తో విష్ణువు దగ్గరకు చేరి తను చాలా ప్రసన్నుడు అయ్యానని చెప్పి.  ఆ పరమేశ్వరుడు ఈ రోజున  విష్ణు కు సుదర్శన చక్రమును ఇచ్చాడు. ఈ రోజు, విష్ణువు మరియు శివుని ద్వారా  స్వర్గం యొక్క తలుపులు తెరవడం జరిగింది . ఈ రోజు ఉపవాసం వున్నవ్యక్తికి  స్వర్గంలో అతని స్థానాన్ని సుస్థిరంగా వుంటుంది. 
భీష్మ పితమః  కు  కూడా ఈ రోజు శ్రీ కృష్ణుడు ఉపదేశించినట్లు చెప్తారు. విష్ణువు కార్తీక శుక్ల చతుర్ధశి రోజున మత్స్య అవతారంగా అవతరించారు. 

కార్తీక పురాణం 14వ రోజు

ఆబోతునకు అచ్చువేసి వదులుట
మరల వశిష్ఠులవారు జనకునిని దగ్గర కూర్చోబెట్టుకుని కార్తీకమాస మహాత్మ్యమును గురించి తనకు తెలిసిన విషయాలను ఉత్సాహంతో ఇలా చెప్పసాగిరి.
ఓ రాజా! కార్తీక పౌర్ణమి రోజున పితృప్రీతిగా వృషోత్సర్జన చేయుట, శివలింగ సాలగ్రామములను దానము చేయుట, ఉసిరికాయలు దక్షిణతో దానము చేయుట మొదలగున్న పుణ్యకార్యాల వల్ల వెనుకటి జన్మయందు చేసిన సమస్త పాపములు నశించుటేగాక, వారికి కోటి యాగములు చేసిన ఫలము దక్కును. ప్రతి మనుజుని పితృదేవతలను తమ వంశమందెవ్వరు ఆబోతునకు అచ్చువేసి వదులునో అని ఎదురుచూస్తుందురు. ఎవడు ధనవంతుడై ఉండీ పుణ్యకార్యములు చేయక, దానధర్మములు చేయక కడకు ఆబోతునకు అచ్చువేసి పెండ్లి అయినా చేయడో అట్టివాడు రౌరవాది సకల నరకములు అనుభవించుటయే కాక వాని బంధువులను కూడా నరకమునకు గురిచేయును.
కాబట్టి, ప్రతి సంవత్సరం కార్తీక మాసమున తన శక్తి కొలదీ దానం చేసి నిష్ఠతో వ్రతమాచరించి సాయంసమయమున శివకేశవుల ఆలయమందు దీపారాధన చేసి ఆ రాత్రంతయూ జాగారముండి మరునాడు తమ శక్తికొలదీ బ్రాహ్మణులకు, సన్యాసులకు భోజనం పెట్టిన వారు ఇహపరములందు స్వరసుఖాలను అనుభవింతురు.
కార్తీకమాసములో విసర్జింపలసినవి

ఈ కార్తీక మాసంలో పరాన్నభక్షణ చేయరాదు, ఇతరుల ఎంగిలి తినరాదు, శ్రాద్ధా భోజనం చేయకూడదు. నీరుల్లిపాయ తినరాదు, తిలాదానము పట్టరాదు. శివార్చన, సంధ్యావందనము చేయనివారు వండిన వంటలు తినరాదు. పౌర్ణమి, అమావాస్య, సోమవారములనాడు, సూర్యచంద్రగ్రహణపు రోజులలో భోజనం చేయరాదు. కార్తీక మాసములో నెల రోజులూ రాత్రులు భోజనం తినరాదు. విధవ వండినది తినకూడదు. ఏకాదశీ, ద్వాదశీ వ్రతములు చేయువారు ఆ రెండు రాత్రులూ తప్పనిసరిగా జాగారము ఉండవలెను.
కార్తీక మాసంలో ఒక్క పూట మాత్రమే భోజనం చేయవలెను. ఈ మాసంలో నూనె రాసుకుని తల స్నానము చేయరాదు, పురాణాలు విమర్శించరాదు. కార్తీక మాసములో వేడినీటితో స్నానము చేసిన కల్లుతో సమానమని బ్రహ్మదేవుడు చెప్పెను. కాబట్టి వేడినీటితో స్నానం చేయరాదు. ఒకవేళ అనారోగ్యముగా ఉండి ఎలాగైనా విడువకుండా కార్తీక మాసవ్రతమును చేయవలెనన్న కుతూహలము కలవారు మాత్రమే వేడినీటి స్నానము చేయవచ్చును. అలా చేయువారు గంగా, గోదావరి, సరస్వతీ, యమున నదుల పేర్లను మనసులో తలచుకుని స్నానము చేయవలెను.
ఏది తనకు దగ్గరలో ఉంటే ఆ నదిలో ప్రాత: కాలమున స్నానము చేయవలెను. అలా చేయనిచో మహాపాపియై జన్మజన్మములు నరకకూపమున పడి కృశింతురు. ఒకవేళ నదులు అందుబాటులో లేనప్పుడు నూతిదగ్గర కానీ, చెరువు దగ్గర కానీ, లేక ఇంటిలోని పంపువద్ద కానీ చేయవచ్చును. అప్పుడు ఈ క్రింది శ్లోకమును చదివి మరీ స్నానమాచరించవలెను.

శ్లో : గంగేచ యమునే చైవ గోదావరీ సరస్వతీ
నర్మదా సింధుకావేరీ జలేస్మిన్ సన్నిధిం కురు!!
అని చదువుకుంటూ స్నానం చేయాలి. కార్తీక మాసవ్రతం చేసేవారు పగలు పురాణ పటనం, హరికథాకాలక్షేపాలతో కాలం గడపాలి. సాయంత్రం పూట సంధ్యావందనాలు పూర్తి చేసి పూజామందిరంలో దీపాలు వెలిగించి, శివకేశవుల్ని అష్టోత్తరాలతో పూజ జేయాలి. ఈ ప్రకారం శివపూజ చేసివారు ధన్యజీవులు. పూజ తర్వాత తన శక్తిని బట్టి బ్రాహ్మణులకు దక్షిణ తాంబూలాలతో సత్కారము చేసి సంతోషపర్చవలెను. ఇలా చేసినవారు నూరు అశ్వమేథ యాగములు చేసిన పుణ్యం, వెయ్యి వాజిపేయ యాగములు చేసిన ఫలం పొందుతారు.
ఈ కార్తీక మాసము నెలరోజులూ బ్రాహ్మణ సమారాధన, శివకేశవుల సన్నిధిని, నిత్యదీపారాధన, తులసికోటవద్ద కర్పూర హారతులతో దీపారాధన చేసినవారికి, వారి వంశీయులకు, పితృదేవతలకు మోక్షము కలుగుతుంది. చేయగల శక్తి ఉండి కూడా ఈ వ్రతాన్ని చేయలేనివారు నక్క, కుక్క, పంది, పిల్లి, ఎలుక వంటి వివిధ జన్మలెత్తుతారు. ఈ వ్రతము శాస్త్రం ప్రకారం ఆచరిస్తే పదిహేను జన్మల పూర్వజ్ఞానము కలుగుతుంది. వ్రతం చేసినా, పురాణం చదివినా, విన్నాకూడా సకలైశ్వర్యములు కలిగి మోక్షాన్ని పొందుతారు.

సోమవారం, నవంబర్ 26, 2012

రేపల్లియ యెద ఝల్లున

సోమవారం, నవంబర్ 26, 2012

రేపల్లియ యెద ఝల్లున పొంగిన రవళి
నవరస మురళి ఆ నందన మురళి
ఇదేనా ఆ మురళి మోహన మురళి
ఇదేనా ఆ మురళి

కాళింది మడుగున కాళీయుని పడగల
ఆబాలగోపాలం ఆ బాలగోపాలుని
అచ్చెరువున అచ్చెరువున విచ్చిన కన్నులజూడ
తాండవమాడిన సరళి గుండెలనూదిన మురళి
ఇదేనా ఇదేనా ఆ మురళి

అనగల రాగమై తొలుత వీనులలరించి
అనలేని రాగమై మరల వినిపించి మరులే కురిపించి
జీవనరాగమై బృందావన గీతమై
కన్నెల కన్నుల కలువల వెన్నెల దోచిన మురళి
ఇదేనా ఇదేనా ఆ మురళి

వేణుగాన లోలుని మురుపించిన రవళి
నటనల సరళి ఆ నందన మురళి
ఇదేనా ఆ మురళి మువ్వల మురళి
ఇదేనా ఆ మురళి

మధురా నగరిలో యమునా లహరిలో
ఆ రాధ ఆరాధనాగీతి పలికించి
సంగీత నాట్యాల సంగమ సుఖవేణువై
రాసలీలకే ఊపిరిపోసిన అందెల రవళి
ఇదేనా ఇదేనా ఆ మురళి

రేపల్లియ యెద ఝల్లున పొంగిన రవళి
నవరస మురళి ఆ నందన మురళి
ఇదేనా ఆ మురళి మోహన మురళి
ఇదేనా ఆ మురళి

కార్తీక పురాణం 13వ రోజు

 

కన్యాదన ఫలము
ఓ జనక చక్రవర్తీ! కార్తీక మాసంలో తప్పనిసరిగా చేయవలసిన ధర్మాలు చాలా ఉన్నాయి. వాటి గురించి వివరిస్తాను సావధానంగా విను.
కార్తీక మాసంలో నదీస్నానం ముఖ్యం. దానికంటే ఒక పేద బ్రాహ్మణుని కుమారినికి ఉపనయనం చేయడం ముఖ్యం. ఒకవేళ ఉపనయనం చేయడానికి ఖర్చు భరించలేనప్పుడు మంత్రాక్షతలు, దక్షిణతాంబూలం, సంభావనలతో తృప్తి పరచినా ఫలితం కలుగుతుంది. ఇలా ఒక పేద బ్రాహ్మణుని బాలునికి ఉపనయనం చేస్తే మనం చేసిన ఎలాంటి పాపాలైనా తొలిగిపోతాయి. ఎన్ని దానధర్మాలు చేసినా కలగని పుణ్యం ఒక పేద బ్రాహ్మణుని బాలునికి చేసిన ఉపనయంతో కలుగుతుంది. మరో పుణ్యకార్యం కన్యాదానం. కార్తీక మాసంలో భక్తి శ్రద్ధలతో కన్యాదానం చేస్తే వారు తరించడమే కాకుండా, వారి పితృదేవతలను కూడా తరింపచేసినవాడవుతాడు. ఇందుకు ఒక ఉదాహరణ చెబుతాను వినమనెను.
సువీర చరిత్ర
ద్వాపరయుగంలో వంగదేశంలో గొప్ప పరాక్రమవంతుడు, శూరుడు అయిన సువీరుడు అనే రాజు ఉండేవాడు. అతని భార్య పేరు రూపవతి. ఒకసారి సువీరుడు శత్రురాజులచే ఓడించబడి, భార్యతో కలసి అరణ్యంలోకి పారిపోయాడు. నర్మదా నదీ తీరంలో పర్ణశాలను నిర్మించుకుని అడవిలో దొరికే కందమూలాలు, పండ్లు తింటూ కాలం గడుపుచున్నాడు. కొన్ని రోజులకు అతని భార్య రూపవతి ఒక బాలికను ప్రసవించింది. ఆ బాలికను అతి గారాబంతో పెంచుతున్నారు. క్షత్రియ వంశమందు జన్మించిన ఆ బాలిక సరైన ఆహార సదుపాయాలు లేకపోయినా చూసేవారికి కనులపండుగగా, ముద్దులొలుకు మాటలతో చాలా ముచ్చటగా ఉండేది. రోజులు గడిచే కొద్దీ, ఆ బాలిక పెరిగి పెండ్లి వయసుకు వచ్చింది.  ఒక రోజు వానప్రస్థుని కుమారుడు ఆమెను చూసి ఆమె అందానికి పరవశుడై ఆమెను తనకిచ్చి పెండ్లి చేయమని సువీరుడు కోరాడు. అందుకు ఆ రాజు 'ఓ మునిపుత్రా ప్రస్తుతం నేను చాలా బీద స్థితిలో ఉన్నాను. నా కష్టాలు తొలగడానికి నాకు కొంత ధనమిస్తే నా కుమార్తె నిచ్చి పెండ్లి చేస్తాను' అన్నాడు. తన చేతిలో చిల్లి గవ్వ లేకపోవడంతో ఆ బాలికమీద మక్కువతో ఆ మునికుమారుడు నర్మదా తీరాన కుబేరుని గూర్చి ఘోరతపస్సు చేసి, కుబేరుని మెప్పించి ధన పాత్ర సంపాదించి, రాజుకు ఆ ధన పాత్రని ఇచ్చి ఆ బాలికను పెండ్లి చేసుకుని తీసుకువెళ్ళి తన తల్లితండ్రులకు నమస్కరించి అంతవరకూ జరిగిన వృత్తాంతమంతా చెప్పి భార్యతో సుఖముగా ఉన్నాడు.  ముని కుమారుడు ఇచ్చిన ధనపాత్రతో సువీరుడు స్వేచ్ఛగా ఖర్చు పెడుతూ భార్యతో సుఖంగా ఉన్నాడు. మరి కొంతకాలానికి సువీరుడికి మరొక కుమార్తె జన్మించింది. ఆ బిడ్డకు కూడా యుక్తవయసు రాగానే మరలా ఎవరైనా ధనం ఇచ్చేవారికి అమ్మవచ్చనన్న ఆశతో ఎదురుచూడసాగాడు. ఒకానొక రోజున ఒక సాధుపుంగవుడు నర్మదా నదీ తీరానికి స్నానం చేయడానికి వస్తూ దారిలో ఉన్న సువీరుడుని కలుసుకుని 'నువ్వెవ్వరిని. నిన్నుచూస్తుంటే రాజవంశస్తుడవలే ఉన్నావు? నువ్వు ఈ అరణ్యంలో ఉండటానికి కారణం ఏమిటని ప్రశ్నించాడు.' సువీరుడు 'మహానుభావా నేను వంగదేశానికి రాజుని. నా రాజ్యాన్ని శత్రవులాక్రమించారు. భార్యతో కలసి ఈ అడవిలో నివసిస్తున్నాను. దరిద్రం కంటే కష్టమైనది ఏదీ లేదు. నాకు ఇద్దరు కుమార్తెలు. నా మొదటి కుమార్తెను ఒక మునిపుత్రునికిచ్చి అతని వద్ద కొంత ధనమును తీసుకొన్నాను. దానితోనే ఇంతవరకూ నెట్టుకొస్తున్నాను అని చెప్పాను.'అప్పుడు ఆ ముని 'ఓ రాజా నువ్వు ఎంత దరిద్రుడివైనా, ధర్మసూక్షమాలోచించకుండా కన్యను అమ్ముకున్నావు. కన్యావిక్రయం మహా పాపాలలో ఒకటి. కన్యను విక్రయించివారు 'అసిపత్రవన'మను నరకం అనుభవిస్తారు. ఆ ధనముతో దేవముని పితృదేవతా ప్రీత్యర్ధం ఏ వ్రతం చేస్తారో వారు నాశనం అయిపోతారు. అంతేకాకుండా కన్యా విక్రయం చేసేవారికి పుత్ర సంతతి కలగకుండా శపిస్తారు. అలానే కన్యను ధనమిచ్చి పెండ్లాడినవారు చేసే గృహస్థ ధర్మాలు వ్యర్థమవుటయే గాక అతడు మహా నరకం అనుభవిస్తాడు. కన్యా విక్రయం చేసేవారికి ఎటువంటి ప్రాయశ్చిత్తం లేదని పెద్దలు వక్కాణించి చెబుతున్నారు. కాబట్టి రాబోయే కార్తీకమాసంలో నీ రెండవ కుమార్తెను నీ శక్తి కొలదీ బంగారు నగలతో అలంకరించి సదాచార సంపన్నుడు, ధర్మబుద్ధి కలవానికి కన్యాదానం చెయ్యి. అలా చేస్తే గంగాస్నానం చేసినంత ఫలం, అశ్వమేధ యాగం చేసినంత ఫలితం పొందుటయే కాకుండా, మొదట కన్యను అమ్మిన పాపం కూడా తొలిగిపోతుంది' అని రాజుకు హితవు చెప్పాడు.అందుకారాజు చిరునవ్వు నవ్వి 'ఓ మునివర్యా! దేహసుఖం కంటే దానధర్మాల వలన వచ్చిన ఫలం ఎక్కువా? తాను బ్రతికుండగా భార్యాబిడ్డలతోను, సిరిసంపదలతోనూ సుఖంగా ఉండకుండా, చనిపోయిన తర్వాత వచ్చే మోక్షం కోసం ప్రస్తుతమున్న అవకాశం చేతులారా జారవిడవమంటారా? ధనమూ, బంగారం ఉన్నవారే ప్రస్తుతలోకంలో రాణింపగలరు. ముక్కూ, నోరు ముసుకుని బక్కచిక్కి శల్యమై ఉన్నవారిని ఈ లోకం గుర్తిస్తుందా?, గౌరవిస్తుందా? ఐహిక సుఖాలే గొప్ప సుఖాలు. కాబట్టి నేనడిగినంత ధనం ఎవరైతే నాకిస్తారో, వారికే నా రెండవ కుమార్తెను కూడా ఇచ్చి పెండ్లి చేస్తాను' అని నిక్కచ్చిగా చెప్పాడు. ఆ మాటలకు సన్యాసి ఆశ్చర్యపడి తన దారిన తాను వెళ్ళిపోయాడు. మరికొన్ని రోజులకు సువీరుడు మరణించాడు. వెంటనే యమభటులు వచ్చి అతన్ని తీసుకుపోయారు. యమలోకములో అసిపత్రమనే నరకభాగంలో పడవేసి అనేక విధాలుగా బాధించారు. సువీరుని పూర్వీకుడైన సృతకీర్తి అనే రాజు ధర్మయుక్తంగా ప్రజలను పాలించి ధర్మాత్ముడై మృతి చెందిన పిమ్మట స్వర్గంలో సర్వసుఖములు అనుభవిస్తున్నాడు. సువీరుడు చేసిన కన్యావిక్రయం వలన ఆ సృతకీర్తిని కూడా యమకింకరులు పాశాలతో బంధించి స్వర్గం నుండి నరకానికి తీసుకొచ్చారు. అప్పుడు సృతకీర్తి 'నాకు తెలిసినంతవరకు దానధర్మాలు, యజ్ఞయాగాదులు చేసి, ఇతరులకు ఉపకారమే చేశాను. మరి నాకు ఇటువంటి దుర్గతి ఎలా కలిగింది?' అనుకుని నిండు సభలో కొలువుదీరియున్న యమధర్మరాజు దగ్గరకు వెళ్ళి నమస్కరించి 'ప్రభూ! నీవు సర్వజ్ఞుడవు. ధర్మమూర్తివి. బుద్ధిశాలివి. ప్రాణకోటినంతటినీ సమంగా చూస్తావు. నేనెప్పుడూ ఏ పాపం చేయలేదు. నన్ను స్వర్గలోకం నుండి నరకలోకానికి తీసుకొచ్చిన కారణం ఏమిటి? దయచేసి తెలియజేయండి' అని ప్రాధేయపడ్డాడు. యమధర్మరాజు సృతకీర్తిని చూస్తూ 'సృతకీర్తి నువ్వు న్యాయమూర్తివి. ధర్మజ్ఞుడవు. నువ్వు ఎటువంటి దురాచారాలు చేయలేదు. కానీ నీ వంశస్తుడు అయిన సువీరుడు తన పెద్ద కుమార్తెను ధనానికి ఆశపడి అమ్ముకున్నాడు. కన్యను అమ్ముకొన్నవారి ఇటు మూడు తరాలు, అటు మూడు తరాలువారు ఎంతటి పుణ్యపురుషులైనా నరకాన్ని అనుభవించడమే కాకుండా నీచజన్మలెత్తవలసి వస్తుంది. నీవు పుణ్యాత్ముడవని, ధర్మాత్ముడవని తెలుసు. కాబట్టి నీకొక ఉపాయం చెప్తాను. నీ వంశస్తుడు సువీరునికి మరొక కుమార్తె ఉంది. ఆమె నర్మదా నతీ తీరాన తల్లి వద్ద పెరుగుతోంది. నా ఆశీర్వాదం వల్ల నీవు మానవ శరీరం దాల్చి, అక్కడకు వెళ్ళి ఆ కన్యను వేదపండితుడు, శీలవంతుడు అయిన ఒక బ్రాహ్మణునికి కార్తీకమాసంలో సాలంకృత కన్యాదానం చేసినవాడు మహాపుణ్యాత్ముడవుతాడు. పుత్రికా సంతానం లేనివారు తమ ధనంతో కన్యాదానం చేసినా, విధి విధానంగా ఆబోతునకు అచ్చువేసి వివాహం చేసినా కన్యాదాన ఫలం లభిస్తుంది. కనుక నీవు వెంటనే భూలోకానికి వెళ్ళి నేను చెప్పినవన్నీ చేసిరా. అలా చేయడం వల్ల నీ పితృగణం తరిస్తారు వెళ్ళిరమ్మని' యమధర్మరాజు పలికెను. సృతకీర్తి యమునకు నమస్కరించి సెలవు తీసుకొని నర్మదా తీరాన ఒక పర్ణకుటీరంలో నివసిస్తున్న సువీరుని భార్యను, కుమార్తెను చూసి సంతోషించి ఆమెతో విషయమంతా చెప్పి, కార్తీకమాసంలో సువీరుని రెండవ కుమార్తెను సాలంకృత కన్యాదాన పూర్వకంగా చతుర్వేదాలు చదివిన ఒక బ్రాహ్మణ కుమారునికిచ్చి అతి వైభవంగా వివాహం చేశాడు. అలా కన్యాదానం చేయడం వల్ల సువీరుడు కూడా పాపవిముక్తుడై స్వర్గలోకంలో ఉన్న పితృదేవతలను కలుసుకున్నాడు.  కన్యాదనం వల్ల మహాపాపాలు కూడా నాశనమవుతాయి. వివాహ విషయంలో వారికి మాట సహాయం చేసినా పుణ్యం కలుగుతుంది. కార్తీక మాసంలో కన్యాదానం చేయాలని దీక్షబూని ఆచరించివాడు విష్ణు సాన్నిధ్యం పొందుతాడు. శక్తి కలిగి ఉండి ఉదాసీనత చూపువాడు శాశ్వత నరకానికి వెళతాడు.

ఆదివారం, నవంబర్ 25, 2012

నాతో మాట్లాడాలి అంటే

ఆదివారం, నవంబర్ 25, 2012


ఆకాశం లో ఎప్పుడైనా హరివిల్లు వస్తుంది కానీ ఆదివారం మాత్రం ప్రపంచం మొత్తం మీద ఒకేసారి హరివిల్లు వస్తుంది అదే నా షో పేరు హరివిల్లు. ఆహరివిల్లు కూడా ఉదయం 10:30 నుండి మద్యాహ్నం 12:00 గంటలవరకు వస్తుంది. అది కూడా ఎక్కడబడితే అక్కడ రాదండి కేవలం Online Radio Josh Live లో మాత్రమే వస్తుంది. ఇది కేవలము live ప్రోగ్రాం మాత్రమె కాబట్టి అస్సలు మిస్ అవ్వకండి. నా కబుర్లు, పాటలు , కదలు వినటమే కాదండి మీరు నాతో సరదాగా మాట్లాడైవచ్చును. నాతో మాట్లాడి నాప్రశ్నలకు జవాబులు చెప్పెయవచ్చు. మరి హరివిల్లు షోను అస్సలు మిస్ అవ్వద్దు.
మరి నా షోపేరు చెప్పేసాను కదా, మరి నాతో మాట్లాడాలి అంటే


Skype id: radiojoshlive

US: 914-214-7574

UK: 20-3286-9594

AUS: 28003-4546

Local Number: 040-4200-2003

ఈ నెంబర్స్ కాల్ చేసి నాతో మాట్లాడైవచ్చు. మరి నా షోను మిస్ కాకండి. ధన్యవాదములు.

కార్తీక పురాణం 12వ రోజు

ద్వాదశీ ప్రశంస: మహారాజా! కార్తీకమాసములో, కార్తీక సోమవారమన కార్తీక ద్వాదశీ వ్రతమును గురించి, సాలగ్రామపు మహిలను గురించి వివరిస్తాను వినుమంటూ వశిష్ఠ మహాముని ఈ విధంగా తెలిపెను. కార్తీక సోమవారం నాడు ఉదయాన్నే లేచి కాలకృత్యాలు తీర్చుకుని నదికి వెళ్ళి స్నానం చేసి ఆచమనం చేసి, శక్తి కొలదీ బ్రాహ్మణులకు దానమివ్వాలి. ఆ రోజంతా ఉపవాసముండి, సాయంకాలం శివాలయానికి గానీ, విష్ణాలయానికి గానీ వెళ్ళి దేవుని పూజించి, నక్షత్ర దర్శనం చేసుకొన్న తర్వాత భోజనం చేయాలి. ఈ విధంగా చేసిన వారికి సకల సంపదలతో పాటు మోక్షం కూడా కలుగుతుంది. కార్తీకమాసంలో శనిత్రయోదశినాడు ఈ వ్రతమాచరిస్తే వంద రెట్లు ఫలితం కలుగుతుంది. కార్తీక శుద్ద ఏకాదశి రోజున ఉపవాసముండి ఆ రాత్రి విష్ణాలయానికి వెళ్ళి శ్రీ హరిని మనసారా ధ్యానించి, శ్రీహరి సన్నిధిలో పురాణ కాలక్షేపం చేసి మరుసటి రోజు బ్రాహ్మణ సమారాధన చేసేనా కోటి యజ్ఞాలు చేసినంత ఫలితం కలుగుతుంది. ఈవిధంగా చేసిన వారికి సూర్యగ్రహణ సమయంలో గంగానదీ స్నానం చేసి కోటి మందికి బ్రాహ్మణలకు భోజనం పెడ్తే ఎంత పుణ్యం లభిస్తుందో దానికి రెట్టింపు పుణ్యం లభిస్తుంది.
కార్తీక శుద్ధ ద్వాదశీ వ్రతమంటే విష్ణువుకు ఎంతో ప్రీతికరం. ఆ రోజున శ్రీమంతులెవరైనా ఆవు కొమ్ములకు బంగారు తొడుగులు తగిలించి, ఆవుకాళ్ళకు వెండి డెక్కలు తగిలించి, దూడతో సహా బ్రాహ్మణుమనికి దానిమిస్తే ఆ ఆవు శరీరం మీద ఎన్ని రోమాలున్నాయో అన్ని సంవత్సరాలు ఇంద్రలోకంలో స్వర్గసుఖాల్ని అనుభవిస్తారని ప్రతీతి. కార్తీక మాసంలో వస్త్రదానం చేసినా గొప్ప ఫలితం కలుగుతుంది. కార్తీక శుద్ధ పాడ్యమి రోజున, కార్తీక పౌర్ణమి రోజున కంచుపాత్రలో ఆవునెయ్యి పోసి దీపముంచినవారికి పూర్వ జన్మలో చేసిన సకల పాపాలూ తొలిగిపోతాయి. ద్వాదశి నాడు యజ్ఞోపవీతాలు బ్రాహ్మణునకు దానమిస్తే ఇహపర సౌఖ్యాలు పొందుతారు. ద్వాదశి రోజున బంగారు తులసి చెట్టుగానీ, సాలగ్రామాన్ని గానీ బ్రాహ్మణునికి దానిస్తే నాలుగు సముద్రముల మధ్య నున్న భూమిని దానం చేసినంత ఫలితం కలుగుతుంది.

సాలగ్రామ దాన మహిమ
పూర్వం గోదావరి నదీ తీరంలోని ఒక పల్లెలో ఒక వైశ్యుడు నివశించేవాడు. అతనికి ధనాన్ని కూడబెట్టడమే పని. తాను తినడు, ఇతరులకు పెట్టడూ, ఎవరకీ దానం చెయ్యడు. పైగా ఇతరులను చులకనగా చేస్తూ తానే గొప్ప శ్రీమంతుడుగా విర్రవీగుతూ, ఎవరికీ ఉపకారం చేయకుండా పరుల దగ్గర నుండి సొమ్ము ఎలా కాజేయాలా అని చూస్తుండేవాడు. ఆ వైశ్యుడు తన పల్లెకు సమీపాన ఉన్న మరో పల్లెలో నివసించే ఒక బ్రాహ్మణునికి అధిక వడ్డీకి తన దగ్గరున్న ధనాన్ని అప్పుగా ఇచ్చాడు. కొంతకాలం గడిచిన తరువాత తన ధనం తిరిగి ఇచ్చేయమని అడిగాడు ఆ వైశ్యుడు. తనకి ఓ నెల రోజులు గడువు ఇవ్వమన్నాడు. ఈ జన్మలో అప్పు తీర్చలేకపోతే మరు జన్మలో మీ ఇంట ఏ జంతువుగానో అయినా పుట్టి మీ ఋణం తీర్చుకుంటానని ప్రాధేయపడ్డాడు.
ఆ మాటలకు ఆ వైశ్యుడు పండిపడి 'అలా వీలు కాదు. నా సొమ్ము నాకు ఇప్పుడే ఇవ్వమని లేకపోతే నరికివేస్తాను' అంటూ ఆవేశంతో ముందూ, వెనుకా ఆలోచించక తన మొలలో ఉన్న కత్తితో ఆ బ్రాహ్మణుని కంఠాన్ని కోశాడు. వెంటనే ఆ బ్రాహ్మణుడు గిలగిలా కొట్టుకుంటూ ప్రాణాలు విడిచాడు. ఆ కోమటి భయపడి అక్కడే ఉంటే రాజభటులు వచ్చి పట్టుకుంటారని తలచి తన గ్రామానికి పారిపోయాడు. బ్రాహ్మణ హత్య మహా పాపం కనుక, అప్పటి నుండి ఆ వైశ్యునికి కుష్టువ్యాధి సోకి నానా బాధలు పడుతూ మరి కొన్నాళ్ళకు మరణించినాడు. వెంటనే యమదూతలు అతనిని తీసుకొని పోయి నరకకూపంలో పడేశారు. ఆ వైశ్యునికి ఒక కుమారుడు ఉన్నాడు. అతని పేరు ధర్మవీరుడు. పేరుకు తగినట్టే తండ్రి సంపాదించిన ధనాన్ని దానధర్మాలు చేస్తూ, పుణ్యకార్యాలు చేస్తూండేవాడు. నీడకొరకు చెట్లు నాటిస్తూ, నీటి కొరకు నూతులు, చెరువులు త్రవ్విస్తూ మంచి కీర్తిని పొందాడు. కొంతకాలానికి త్రిలోక సంచారియగు నారదులవారు యమలోకమును దర్శించి, భూ లోకానికి వచ్చి ధర్మవీరుని ఇంటికి వెళ్ళెను. ధర్మవీరుడు నారదులవారికి సాష్టాంగ దండప్రాణాలాచరించి, విష్ణుదేవునిగా భావించి, ఆర్ఘ్యపాద్యాది విధులచే సత్కరించి, చేతులు జోడించి 'మహానుభావా! నా పుణ్యం కొలది నేడు తమ దర్శనం లభించింది. నేను ధన్యుడను. నా జన్మ తరించింది. నా ఇల్లు పావనమైంది. శక్తి కొలదీ నేను చేసే సత్కార్యాలను స్వీకరించి, తమరు వచ్చిన కార్యాన్ని వివరించ'మని వినయంగా వేడుకున్నాడు.
నారదుడు చిరునవ్వు నవ్వి 'ఓ ధర్మవీరా! నేను నీకు ఒక హితవు చెప్పడానికి వచ్చాను. శ్రీ మహావిష్ణువుకు కార్తీక మాసంలో శుద్ధద్వాదశి మహా ప్రీతికరమైన రోజు. ఆ రోజున స్నాన, దాన, జపాదులలో ఏం చేసినా అత్యంత పుణ్యం లభిస్తుంది. నాలుగు జాతులలో ఏ జాతివారైనా స్త్రీ, పురుషులయినా, జారుడైనా, చోరుడైనా, పతివ్రత అయినా, వ్యభిచారిణి అయినా కార్తీక శుద్ధ ద్వాదశి రోజున సూర్యుడు తులారాశిలో ఉండగా స్నానమాచరించి, నిష్ఠగా పూజ చేసి ఉపవాసం ఉండి, సాలగ్రామ దానం చేస్తే పూర్వజన్మలోని పాపాలే కాకా ఈ జన్మలో చేసిన పాపాలు కూడా తొలగుతాయి. నీ తండ్రి యమలోకములో మహా నరకం అనుభవిస్తున్నాడు. అతన్ని ఆ నరకాన్నుండి తప్పించాలంటే నువ్వు సాలగ్రామ దానం చేయక తప్పదు. అలా చేసి నీ తండ్రి ఋణం తీర్చుకోమని' చెప్పాడు నారదమహర్షి. అప్పుడు ధర్మవీరుడు 'నారద మహర్షీ! నేను గోదానం, భూదానం, హిరణ్యదానం వంటి మహా మహా దానాలే చేశాను. అటువంటి దానాలు చేసినా నా తండ్రికి మోక్షం కలగలేదు. అటువంటప్పుడు ఈ 'సాలగ్రామ'మనే రాతిని దానం చేసినంత మాత్రాన ఆయనకి ఎలా విముక్తి కలుగుతుంది. దీని వలన ఆకలిగొన్న వానికి ఆకలి తీరదు, దాహం గొన్నవారికి దాహం తీరదు. అటువంటి దానాలు చేసినా నా తండ్రికి విముక్తి గలుగుతుంది. అందువల్ల ఈ దానం ఎందుకు చేయాలి' అని అడిగాడు.
ధర్మవీరుని ఉద్దేశించి నారద మహర్షి 'ధర్మవీరా సాలగ్రామమంటే శిలా ప్రతిమ కాదు. శ్రీహరియొక్క ప్రతిరూపం. అన్ని దానలకంటే సాలగ్రామ దానం చేస్తే కలిగే ఫలితం గొప్పది. కాబట్టి నీ తండ్రిని నరకబాధలనుండి విముక్తి పొందటానికి ఈ దానం కంటే మరే మార్గం లేదు' అని చెప్పి నారదుడు వెళ్ళిపోయాడు.
ధర్మవీరుడు ధనబలం కలవాడై ఉండీ, దానధర్మాలు చేసినా సాలగ్రామ దానం చేయలేదు. కొంతకాలానికి అతను చనిపోయాడు. నారదుని మాట పెడచెవిన పెట్టడంతో మరణానంతరం ఏడు జన్మలందు పులిగా, మూడు జన్మలందు వానరమై, అయిదు జన్మలందు ఎద్దుగా, మరో పది జన్మలు పందిగా జన్మించాడు. అలా జరిగిన తరువాత ఒక పేద బ్రాహ్మణుని ఇంట స్త్రీగా పుట్టగా ఆమెకు యవ్వనకాలం రాగానే ఒక విద్వాంసునికి ఇచ్చి పెండ్లిచేశారు. పెండ్లి అయిన కొంతకాలానికి ఆమె భర్త చనిపోయాడు.
చిన్నతనమందే ఆమెకు అష్టకష్టాలు రావడంతో ఆమె తల్లితండ్రులు, బంధువులు చాలా దు:ఖించారు. తండ్రి ఆమెకు ఈ కష్టాలు ఎందుకు వచ్చాయో దివ్యదృష్టితో గ్రహించి వెంటనే ఆమెతో సాలగ్రామ దానం చేయించి 'నాకు బాల వైధవ్యమునకు కారణమైన పూర్వ జన్మ పాపము నశించుగాక' అని చెప్పించి సాలగ్రామ దాన ఫలమును ధారపోయించాడు. ఆ రోజు కార్తీక సోమవారం కావడంతో ఆ సాలగ్రామ దాన ఫలముతో ఆమె భర్త జీవించాడు. పిదప ఆ నూతన దంపతులు చిరకాలము సకల సౌఖ్యాలతో జీవించి, మరణానంతరం స్వరాగానికి వెళ్ళారు. మరి కొంతకాలానికి ఆ బ్రాహ్మణ పుత్రిక మరొక బ్రాహ్మణుని ఇంట కుమారునిగా జన్మించి నిత్యం సాలగ్రామ దానం చేస్తూ ముక్తి పొందాడు. కావున ఓ జనకా! కార్తీక శుద్ధ ద్వాదశి రోజున సాలగ్రామ దానం చేసినా దాని ఫలం ఎంతో ఘనమైంది. కాబట్టి నీవు కూడా ఆ సాలగ్రామ దానం చేయమని చెప్పను.

శనివారం, నవంబర్ 24, 2012

క్షీరాబ్ది ద్వాదశి

శనివారం, నవంబర్ 24, 2012

కార్త్తికంలో వచ్చే అత్యంత పుణ్యప్రదమైన రోజు క్షీరాబ్ది ద్వాదశి. కార్తీక శుక్లపక్ష ద్వాదశి. హరిబోధినీ ద్వాదశి అనీ, యోగీశ్వర ద్వాదశి అని , చినుకు ద్వాదశి, కైశిక ద్వాదశి అనీ అంటారు . ఎల్లప్పుడూ క్షీరసాగరంలో దర్సనం ఇచ్చే  శ్రీమన్నారాయణుడు ఈ ద్వాదశిరోజు శ్రీమహాలక్ష్మీ తో కూడి బృందావనానికి వచ్చి తన ప్రియ భక్తులకు దర్శనమిస్తాడట కావునా ఈ ద్వాదశి ని బృందావన ద్వాదశి అని కూడా అంటారు . బృందావనం అంటే మన ఇంట్లో వుండే  తులసి దగ్గర కు వస్తారు  . ఈరోజు బృందావనంలో శ్రీమహావిష్ణువును అర్చించిన వారికి సకల శుభాలు కలుగుతాయని పెద్దలు చెప్తారు.  మనం ఎప్పుడు దేవుని దగ్గర దీపం వెలిగించినా విలిగించక పూయిన ఒక్క క్షీరాబ్ధి ద్వాదశి రోజు దేవుని దగ్గర దీపం పెడితే సంవత్సరం మొత్తం దీపం వేలిగించినంత పుణ్యం వస్తుంది అని అంటారు.
దూర్వాస మహర్షి వారి చేత శపించ బడి  వారి సిరిసంపదలను, సామ్రాజ్యాన్ని కోల్పోయి తేజోవిహీనుడైన ఇంద్రుడు, తదితర దేవతలు తాము కోల్పోయిన వైభవాన్ని, తేజస్సును తిరిగి పొందడానికి శ్రీమహావిష్ణువు ఆలోచన తో  రాక్షసులతో కలిసి క్షీరసాగరాన్ని మధనం  ప్రారంభించారు. అలా క్షీర సముద్రాన్ని  మధించినరోజు కాబట్టి ఇది క్షీరాబ్ది ద్వాదశి అనీ, ఆషాఢశుద్ధ ఏకాదశినాడు యోగనిద్రకు ఉపక్రమించిన శ్రీహరి నాలుగు నెలల తరువాత కార్తిక శుద్ధ ఏకాదశి నాడు నిద్ర నుండి మేల్కాంచి తొలిసారిగా మునులకు, దేవతలకు క్షీరసాగరం నుండి దర్శినమిచ్చినది ఈ ద్వాదశినాడే కాబట్టి ఇది క్షీరాబ్ది ద్వాదశిగా పిలువబడుతున్నదని అనేక  పురాణాలు చెప్తున్నాయి. అలా శ్రీహరి క్షీరసాగరం నుండి దర్శనమిస్తున్నప్పుడు కొన్ని చినుకు  చుక్కలు మునుల మీద, దేవతలమీద చిలకరించబడ్డాయట. అందుకే ‘చినుకు ద్వాదశి’ అని కూడా పిలుస్తారు.
క్షీరసాగర మధనంలో ఆవిర్భవించిన శ్రీ మహాలక్ష్మిని విష్ణువు వివాహమాడిన రోజు కూడా ఈ క్షీరాబ్ది ద్వాదశి రోజే. అందుకే పవిత్రమయిన ఈరోజు వీరి కల్యాణం జరిపించడం సర్వశుభప్రదమన్న భావనతో విష్ణుస్వరూపమైన ఉసిరి కొమ్మకు, లక్ష్మీస్వరూపమైన తులసికి వివాహం చేస్తారు. ఈరోజే మోహినీ అవతారంతో శ్రీమహావిష్ణువు అమృతం దేవతలకు పంచి ఇచ్చాడట. అందుకనేఈరోజు విష్ణాలయాల్లో స్వామిని మోహినీరూపంతో అలంకరిస్తారు. సుగంధద్రవ్యాలు కలిపిన క్షీరాన్ని అమృత భావనతో భక్తులకు స్వామి ప్రసాదంగా పంచుతారు.
మన పురాణ ఇతిహాసాలలో తులసికున్న ప్రాముఖ్యత, ప్రాధాన్యం వెలకట్టలేనిది. ‘తులసి’ని సాక్షాత్తు శ్రీమన్నారాయణుడి స్వరూపంగా, లక్ష్మీసమేతంగా మన పురాణాలు చెబుతున్నాయి. అందువల్లే తులసిని పూజించినవారి ఇంట ధనధాన్యాదులకు ఎలాంటి లోటు ఉండదని, వారి ఇంట సిరులు పండుతాయని నమ్ముతారు.  తులసి పూజవల్ల అపారమైన పుణ్యఫలాలు సంప్రాప్తిసాయి సత్యాదేవి తులాభారమున . రుక్మిణీదేవి తులసీదళమునుంచి తూచి తకృష్ణుణ్ణి తన వాడుగా చేసుకొంది. దీనితో కృష్ణుడికి తులసి అంటే ఎంత ఇష్టమో తెలుస్తుంది. గోదాదేవి తులసి దండలను శ్రీరంగనాధుని కర్పించి అతనికిష్టురాలై శ్రీరంగనాధుని సాన్నిధ్యం పొందింది. వనవాసంలో కూడా సీతాదేవి తులసిని పూజించింది. తులసి వృత్తాంతం, తులసి ప్రశంస, మన పురాణాలలో అనేకచోట్ల ప్రస్తావించి ఉంది. తులసి జన్మవృత్తాంతం తెలిపే పురాణ గాథ ఒకటి ప్రచారంలో ఉంది.
పురాణగాథ:
తులసి మధురానగరంలో గొప్ప కన్య. శ్రీకృష్ణుని అనురాగాన్ని అపారంగా పొందింది. తులసి, శ్రీకృష్ణుల అనురాగాన్ని ఓర్వలేని రాధ శాపానికి గురై భూలోకాన మాధవీ, ధర్మధ్వజులను రాజదంపతులకు జన్మించింది. ఆ రాజ దంపతులు ఆ బాలికను అల్లారుముద్దుగా పెంచుకుంటుండగా, ఆమెకు యుక్తవయస్సు వచ్చింది. ఆమె రంభ, ఊర్వశి, మేనకల అందానే్నతలదన్నిన అందకత్తెగా ఆమె పేరుగాంచింది. అలాగే ఆమె గుణ రూపాదులలో తుల  లేక పోవడంవల్ల ఆమెకు ‘తులసి’ అని పేరొచ్చింది. బ్రహ్మకోసం తపస్సు చేసి, విష్ణు సాంగత్యాన్ని వరంగా పొందింది. ఇది ఇలా వుండగా శ్రీకృష్ణుని అంశగల సుధాముడు శంఖచూడుడను రాక్షసుడిగా జన్మించాడు. బ్రహ్మనుంచి మరణం లేకుండా వరం పొందాడు. అయితే అతని భార్య పతివ్రతగా ఉన్నంతవరకూ శంక చూడుడికి మరణం సంభవించదని వరమిచ్చాడు. ఒకసారి శంఖచూడుడు తులసి అందానికి పరవశుడై, ఆమెను మోహించి వివాహమాడాడు. తులసిని వివాహం చేసుకున్న శంఖచూడుడు ఆమె ప్రాతివ్రత్య ప్రభావంతో, దేవతలను, మునులను మట్టుబెట్టినా, ఎవరూ ఏమీచేయలేకపోయేవారు. దాంతో శ్రీహరి దేవతలు, మునుల అభీష్టంమేరకు ఓసారి శంఖచూడుడి రూపంలో తులసి దగ్గరికి వెళ్ళాడు. వచ్చింది తన భర్తేననుకుని తులసి శంఖచూడుడి రూపంలో ఉన్న విష్ణువుతో క్రీడించింది. అనంతరం అతను తన భర్తకాదని తెలుసుకుని రాయిని కమ్మనమని శపించింది. శ్రీహరి జరిగిన విషయాన్ని చెప్పగా పశ్చాత్తాప పడింది. శ్రీహరి ఆమెని అనుగ్రహించాడు. ఆమె అప్పటినుంచి లక్ష్మీదేవితో సమానంగా పూజింపబడుతుందని, ఆమె శరీరం గండకీ నదియై ప్రవహించి పుణ్యప్రదమవుతుందని వరమిచ్చాడు. అలాగే ఆమె కేశము తులసిగా జన్మిస్తుందని, తులసి దళాలు, తులసి విష్ణుప్రీతికరాలవుతాయని వరమిచ్చాడు. అలాగే ఆమె శాపాన్ననుసరించి శిలనై సాలగ్రామ రూపాన ఉన్న తాను లక్ష్మీనారాయణాది రూపాలలో ఉంటానని, తులసిని శంఖము, సాలగ్రామమును కూర్చి పూజిస్తే సర్వశ్రేయాలు కలుగుతాయని వరమిచ్చాడు. ఆనాటినుంచి తులసి లక్ష్మీస్వరూపంగా పూజింపబడుతోంది.
తులసి పూజ ఇలా చేయాలి:
తులసి కోట (బృందావనం) ముందు అయిదు పద్మాలు వేసి వాటిమీద దీపాలుంచి తులసి దేవిని లక్ష్మీనారాయణ సమేతంగా పూజించాలి. అయిదు రకాల భక్ష్యాలను, ఫలాలను నివేదించి అయిదు తాంబూలాలను సమర్పించాలి. ప్రదక్షిణ నమస్కారాలతో కార్తీక శద్ధ ఏకాదశి వరకూ పూజించాలి. కార్తీక శుద్ధ ఏకాదశినాడు ఉపవాసం పూజ మొదలైనవి చేసి, తులసీదేవిని, లక్ష్మీనారాయణులను అర్చించాలి. నాటి రాత్రి జాగరణ చేయాలి. ద్వాదశినాడు మానెడు బియ్యపు పిండితో మూడు ముద్దలు చేయాలి. వాటిని నివేదించి తులసివద్ద ఒక దానినుంచాలి. రెండవ దానిని బ్రాహ్మణునికీయాలి. మూడవ దానిని రోటిలోనుంచి పాలు పోసి చెరకు గడలతో దంచాలి. అలాచేయడంవల్ల విశేషమైన పుణ్యఫలాలు లభించి, మోక్షం కలుగుతుందని పురాణాలు చెబుతున్నాయి. మాంగళ్య వృద్ధి, పుత్ర పౌత్రులు, సర్వసౌఖ్యాలు కలుగుతాయని, పూర్వజన్మ పాపాలు కూడా నివారింపబడతాయని అవి చెబుతున్నాయి. తులసి మహత్యం గురించి నారదుడు చెప్పగా, శ్రీకృష్ణుడు ఈ వ్రతాన్ని ఆచరించాడట. అందువల్ల ఇంతటి మహిమాన్విత తులసి పూజ సర్వజనులకు శ్రేయోదాయకమైన పూజగా కొనియాడబడుతోంది.

My Blog Lovers

నా యూట్యూబ్ చానల్స్ ప్లీజ్ సబ్స్క్రిబ్ చేయండీ

Diabetic Challenger

DIABETIC CHALLENGER YOUTUBE CHANNEL. PLASE SUBSCRIBE MY CHANNEL...... THANK YOU VERY MUCH.

Ammamma Tho Nenu (అమ్మమ్మ తో నేను

Please subscribe our channel Ammamma Tho Nenu (అమ్మమ్మ తో నేను)