Blogger Widgets

బుధవారం, నవంబర్ 14, 2012

కార్తీక పురాణం 1వ రోజు

బుధవారం, నవంబర్ 14, 2012


సూతుడు కార్తీక మహా పురాణాన్ని ఇలా చెప్పసాగాడు... 
పూర్వం నైమిశారన్యమునకు సూతమహర్షి రాగా ఆయనను శౌనకాది మునులు సత్కరించి, సంతుషుని చేసి కైవల్యదాయకం అయిన కార్తీకమాశ మహాత్మ్యమును వినిపించి మమ్ములను ధన్యులను చేయమని కోరారు. వారి కోరికను మన్నించిన వ్యాస శిష్యుడైన సూతముని.   ''శౌనకాదులారా! మా గురువుగారైన భగవాన్ వేదవ్యాస మహర్షులవారు ఈ కార్తీక మహత్యాన్ని ''అష్టాదశ పురాణాలలోని స్కాంద, పద్మ పురాణాలు రెండింటా కూడా వక్కాణించి ఉన్నారు. ఋషిరాజైన శ్రీ వశిషుల వారిచే రాజర్షి అయిన జనకునకు స్కాంద పురాణంలోనూ, హేలావిలాస బాలమణి అయిన సత్యభామకు, లీలామానుష విగ్రహుడైన శ్రీకృష్ణ పరమాత్మచే పద్మ పురాణంలోనూ ఈ కార్తీక మహాత్మ్యమును సవివరంగా ఉన్నది. మన అదృష్టంవల్ల నేతి నుండి కార్తీక మాసం ప్రారంభం. కావున ప్రతిరోజూ నిత్య పారాయణంగా ఈ నెల అంతా కార్తీక పురాణ శ్రవణం చేసుకుందాం. ముందుగా స్కాంద పురాణంలోని వశిష్ట ప్రోక్తమైన కార్తీక మహాత్యాన్ని వినిపిస్తాను వినండి..'' అంటూ చెప్పసాగాడు.  

జనకుడు వశిష్టుని కార్తీక వ్రాత ధర్మములు అడుగుట.. పూర్వం ఒకసారి సిద్ధాశ్రమంలో జరుగుతున్నా యోగానికి అవసరమైన ద్రవ్యార్ది అయిన వశిష్ఠ మహర్షి జనకమహారాజు ఇంటికి వెళ్ళాడు. జనకునిచే యుక్త మర్యాదలు అందుకుని తను వచ్చిన విషయాన్ని ప్రస్తావించాడు.  అందుకు జనకుడు ఆనందంగా అంగీకరించి ''హే బ్రహ్మర్షీ! మీకు ఎంత ద్రవ్యం కావాలన్నా నిరభ్యంతరంగా ఇస్తాను. కానీ సర్వ పాపహరమైన ధర్మ సూక్ష్మాన్ని నాకు తెలియజేయండి.. సంవత్సరంలోని సర్వ మాసముల కంటే కూడా కార్తీకమాసం అత్యంత మహిమాన్వితమైనది. ఈ కార్తీక వ్రతాన్ని ఆచరించడం వల్ల సమస్త ధర్మాల కన్నా శ్రేష్ఠతరమైనదని, చెప్తూ ఉంటారు. ఈ నెలకు అంత ప్రాముఖ్యత ఎలా కలిగింది.. ఆ వ్రతం ఉత్క్రుష్ట ధర్మం ఏ విధంగా అయింది'' - అని అడుగగా మునిజన విశిష్టుడైన వశిష్టుడు చిరునవ్వు నవ్వి ఇలా చెప్పారు. జనక మహారాజా! పూర్వజన్మలలో ఎంతో పుణ్యం చేసుకుంటేనే గానీ సత్వశుద్ధి కలగదు. ఆ సత్వశుద్ధి కలిగిన నీలాంటి వారికి మాత్రమే ఇటువంటి పుణ్యప్రదమైంది, విన్నంతమాత్రంచేత అన్ని పాపాలనూ అణచివేసేదీ అయిన కార్తీక మహాత్యాన్ని వినాలనే కోరిక కలుగుతుంది. విశ్వశ్రేయాన్ని దృష్టిలో ఉంచుకుని నువ్వు అడిగిన సంగతులను చెప్తాను, విను.. 

కార్తీకమాసంలో సూర్యుడు తులా సంక్రమణంలో ఉండగా సహృదయతతో ఆచరించే స్నాన, దాన, జప, పూజాదులు విశేష ఫలితాలు ఇస్తాయని తెలుసుకో.. ఈ కార్తీక వ్రతాన్ని తులా సంక్రమనాడిగా గానీ, శుద్ధ పాడ్యమి నుండి గానీ ప్రారంభించాలి. ముందుగా - ''సర్వపాప హారం పుణ్యం వ్రతం కార్తీక సంభవం నిర్విఘ్నం కురుమే దేవ దామోదర నమోస్తుతే'' ఓ దామోదరా! నా ఈ వ్రతం నిర్విఘ్నంగా పూర్తి చేయుము తండ్రీ'' అని నమచేసిస్కారపూర్వకంగా సంకల్పించుకుని కార్తీక స్నానం ఆచరించాలి. 

కార్తీకమండలి సూర్యోదయ వేళ కావేరీనదిలో స్నానం చేసినవారి పుణ్యం చెప్పనలవి కాదు. సూర్యుడు తులారాశిలో ప్రవేశించగానే, గంగానది ద్రవరూపం ధరించి సమస్త నదీజలాలకు చేరుతుంది. వాపీకూప తటాకాది సమస్త సజ్జలాశాయాల్లో కూడా విష్ణువు వ్యాపించి వుంటాడు. బ్రాహ్మణుడైన వాడు కార్తీకమాసంలో నదికి వెళ్ళి హరి ధ్యానయుతుడై కాళ్ళూచేతులూ కడుక్కుని ఆచమనం చేసి శుద్ధాత్ముడై మంత్రయుక్తంగా భైరవాజ్ఞను తీసుకుని మొలలోతు నీటిలో నిలబడి స్నానం చేయాలి. తర్వాత దేవతలకు, ఋషులకు, పితరులకు తర్పణాలు వదలాలి.
అనంతరం అఘమర్షణ మంత్రజపంతో బొటనవేలితో నీటిని చెలికి మూడు దోసిళ్ళ నీళ్ళను గట్టుమీదికి జల్లి తీరం చేరాలి. చేరగానే కట్టుబత్తలను పిండాలి. దీన్నే యక్షతర్పణం అంటారు. అనంతరం ఒళ్ళు తుడుచుకుని తెల్లటి పొడి మది వస్త్రాలను ధరించి హరిస్మరణ చేయాలి. గోపీచందనంతో 12 ఊర్ధ్వ పున్ద్రాలను ధరించి, సంధ్యావందనం, గాయత్రీ జపాలను ఆచరించాలి.  తర్వాత ఔపోసన చేసి బ్రహ్మయజ్ఞమాచరించి తోటలోంచి తెచ్చిన మంచి తాజా పుష్పాలను, శంఖ చక్రదారి అయిన విష్ణువును సాలగ్రామంలో ఉంచి భక్తితో షోడశోపచారాలతో పూజించాలి. అటు పిమ్మట కార్తీక పురాణం చదివి గానీ విని గానీ స్వగృహం చేరి దేవతార్చన చేసి భోజనం చేయాలి. ఆపైన ఆచమించి పునః పురాణ కాలక్షేపం చేయాలి.   సాయంకాలం కాగానే ఇతర పనులన్నిటినీ విరమించుకుని శివాలయంలో కానీవిష్ణు ఆలయంలో కానీ యథాశక్తి దీపాలను వెలిగించిదేవుని ఆరాధించి భక్ష్య భోజ్యాదులు నివేదించి శుద్ధ వాక్కులతో హరిణి స్తుతించి నమస్కరించుకోవాలి.  కార్తీకమాసం అంతా ఇలాగే వ్రతాన్ని చేసినవారు పునరావృత రహితమైన వైకుంఠాన్ని పొందుతున్నారుప్రస్తుత పూర్వ జన్మార్జితమైన పాపాలన్నీ కూడా కార్తీక వ్రతం వలన హరించుకుపోతాయివర్ణాశ్రమ లింగావయో బేధరహితంగా ఈ వ్రతాన్ని ఎవరు ఆచరించినా సరేవాళ్ళు మొక్షార్హులు కావడం నిస్సంశయం.  జనకరాజాతనకు తానుగా ఈ వ్రతాన్ని ఆచరించలేకపోయినాఇతరులు చేస్తుండగా చూసిఅసూయారహితుడై ఆనందించేవారికి ఆరోజు చేసిన పాపాలన్నీ విశ్నుక్రుపాగ్నిలో ఆహుతైపోతాయి.
కార్తీక సోమవార వ్రతం:

వశిష్ఠ ఉవాచ:   హే జనకమహారాజావినినంత మాత్రంచేతనే మనోవాక్కాయకర్మల ద్వారా చేసిన సర్వ పాపాలనూ హరింపచేసే కార్తీక మహత్యాన్ని శ్రద్ధగా విను.. ఈ కార్తీకమాసంలో శివునికి ఇష్టమైన కార్తీక సోమవార వ్రతం ఆచరించేవారు తప్పనిసరిగా కైలాసాన్ని చేరుకుంటారు.కార్తీకంలో వచ్చే ఏ సోమవారం రోజయినా సరే స్నానజపాడులను ఆచరించినవారు వెయ్యి అశ్వమేధ యాగాల ఫలాన్ని పొందుతారుఈ సోమవారా వ్రాత విధి రకాలుగా ఉంది.   1.ఉపవాసం 2. ఏకభక్తం 3. నక్తం 4.అయాచితం 5.స్నానం 6. తిలాపాపం

ఉపవాసం:  చేయగలిగిన వారు కార్తీక సోమవారం నాడు పగలంతా అభోజనంగా ఉందిసాయకాలం శివాభిషేకం చేసినక్షత్ర దర్శనానంతరం తులసితీర్థం మాత్రమే సేవించాలి
ఏకభక్తం:  సాధ్యం కానివాళ్ళు ఉదయం స్నానజపాదులు యథావిధిగా ముగించిమధ్యాహ్నం భోజనం చేసి రాత్రి భోజనానికి బదులు శైవ తీర్ధమో తులసి తీర్ధమో తీసుకోవాలి.

నక్తం:  పగలంతా ఉపవాసం ఉందిరాత్రి నక్షత్ర దర్శనం తర్వాత భోజనం కానీ ఉపాహారం కానీ తీసుకోవాలి.
అయాచితం:  భోజనానికి తాము ప్రయత్నించకుండా ఎవరైనా వారికి వారుగా పిలిచి భోజనం పెడితే మాత్రమే భోజనం చేయాలిదీన్నే అయాచితం అంటారు.
స్నానం:   పైన సూచించిన వాటికి వేటికీ శక్తి లేనివారు సమంత్రక స్నానజపాదులు చేసినట్లయితే సరిపోతుంది.
తిలాపాపం: 
మంత్ర జప విధులు కూడా తెలియని వాళ్ళు కార్తీక సోమవారం నాడు నువ్వులను దానం చేసినా సరిపోతుంది.


పై ఆరు పద్ధతుల్లో దేవిని ఆచరించినా కార్తీక సోమవార వ్రతం చేసినట్లే అవుతుందికానీతెలిసి ఉండి కూడా ఏ ఒక్క పద్ధతినీ ఆచరించని వాళ్ళు ఎనిమిది యుగాల పాటు కుమ్బీపాక రౌరవాది నరకాలని పొందుతారని ఆర్షవాక్యంఈ వ్రతాన్ని ఆచరించడం వలన అనాధలుస్త్రీలు కూడా విష్ణు సాయుజ్యమును పొందుతారుకార్తీకమాసంలో వచ్చే ప్రతి సోమవారం నాడూ కూడా పగలు ఉపవసించిరాత్రి నక్షత్ర దర్శనానంతరం మాత్రమే భోజనం చేస్తూ ఆ రోజంతా భాగవద్ధ్యానంలో గడిపేవాళ్ళు తప్పనిసరిగా శివసాయుజ్యాన్ని పొందుతారు.  సోమవార వ్రతాన్ని చేసేవారు నమక చమక శివాభిషేకం చేయడం ప్రధానం అని తెలుసుకోవాలిఈ సోమవార వ్రత ఫలాన్ని వివరించే ఒక ఇతిహాసాన్ని చెప్తానువినండి.


నిష్టురి కథ:  పూర్వం ఒకానొక బ్రాహ్మణునికి ''నిష్టురి'' అనే కూతురు ఉండేదిఆమె అందంగాఆరోగ్యంగావిలాసంగా ఉండేదిఅయితే సద్గుణాలు మాత్రం లేవుఅనేక దుష్ట గుణాలతో గయ్యాళిగాకాముకురాలిగా ఉండే ఈ నిష్టురిని ఆమె చెడ్డ గుణాలకారణంగా ''కర్కశ'' అని పిలిచేవారు.

నిష్టురి తండ్రి తన బాధ్యత ప్రకారం కర్కాషను సౌరాష్ట్ర బ్రాహ్మణుడైణ మిత్రశర్మ అనే వ్యక్తితో పెళ్ళి జరిపించిచేతులు దులుపుకున్నాడుమిత్రశర్మ చదువుసదాచారాలు ఉన్నవాడుసద్గుణాలు ఉన్నాయిసరసమూ తెలిసినవాడుఅన్నీ తెలిసినవాడు కావడాన కర్కశ ఆడింది ఆటగాపాడింది పాటగా కొనసాగిందిపైగా ఆమె ప్రతిరోజూ తన భర్తను తిడుతూకొడుతూ ఉండేదిఅయినప్పటికీ భార్యపై మనసు చంపుకోలేకపోయాడుపైగా పరువు పోతుందని ఆలోచించాడుకర్కశ పెట్టే బాధలన్నీ భరించాడే తప్పఆమెను ఎన్నడూ శిక్షించలేదుఆమె ఆఖరికి పర పురుషులతో సంబంధం పెత్తుకుని౮ భర్తనుఅతని తల్లితండ్రులను హింస పెట్టేది.
ఒకరోజు ఆమెతో నేస్తం చేసిన ఒక దుర్మార్గుడు ''నీ భర్త కారణంగా మనం తరచూ కలుసుకోలేకపోతున్నాం'' అంటూ రెచ్చగొట్టగా ఆ రాత్రి కర్కశ భర్త నిద్రిస్తుండగా బండరాతితో తల పగలగొట్టి చంపిందిశవాన్ని తానే మోసుకుని వెళ్ళి ఒక పాడుబడ్డ బావిలో వేసింది.ఇదంతా గమనించినప్పటికీ కూడా ఆమె దుర్గుణాలుదుష్ట స్నేహాలు ఎక్కువ కనుక అత్తమామలు ఆమెను ఏమీ అనకుండాతామే ఇల్లు వదిలి వెళ్ళిపోయారు.  అంతటితో కర్కశ మరీ రెచ్చిపోయిందికామంతో కన్నుమిన్ను కానక ఎందరో పురుషులతో సంబంధం పెట్టుకుందిపైగా దాన్నో వ్యాపారం కింద చేయసాగిందిచివరికి ఆమె జబ్బులపాలయిందిపూవు లాంటి శరీరం పుళ్ళతో జుగుప్సాకరంగా తయారైంది.విటులు అసహ్యంతో రావడం తగ్గించారుసంపాదన పోయిందిఅప్పటిదాకా భయపడినవారంతా ఆమెను అసహ్యించుకోసాగారుఆ హీనురాలికి జబ్బులే తప్ప బిడ్డలు పుట్టలేదుచివరికి తినడానికి తిండి లేకఉండటానికి ఇల్లు లేకఒంటినిండా రోగాలతో వీధిలో దిక్కులేని చావు తెచ్చుకుందియమదూతలు ఆమెను నరకానికి తీసికెళ్ళి శిక్షించారు.  భర్తను హింసించిన కర్కశకు భయానక నరకం

భర్తను విస్మరించిపర పురుషులను చేరిన కర్కశ పాపాలకు ఆమెను మండుతున్న ఇనుప స్తంభాన్ని కౌగిలించుకోవాలిముళ్ళ గదలతో తల పగిలేట్లు కొట్టారురాతిమీద వేసి చితక్కొట్టారుసీసం చెవుల్లో వేశారుకుంభీపాక నరకానికి పంపారుఆమె చేసినా పాపాలకు గానూ ముందు పది తరాలువెనుక పది తరాలుఆమెతో కలిసి 21 తరాలవాళ్ళను కుంభీపాక నరకానికి పంపారుఆ తర్వాత ఆమె 15 సార్లు కుక్కగా జన్మించింది. 15వ సారి కళింగ దేశంలో కుక్కగా పుట్టి ఒకానొక బ్రాహ్మణ గృహంలో ఉంటూ ఉండేది.
సోమవార వ్రత ఫలంవల్ల కుక్క కైలాసం చేరుట:
ఒక కార్తీక సోమవారం నాడు ఆ బ్రాహ్మణుదు పగలు ఉపవాసం ఉండిశివాభిభిషేకం మొదలైనవి చేసినక్షత్ర దర్శనానంతరం నకట స్వీకారానికి సిద్ధపడిఇంటి బయట బలిని విడిచిపెట్టాడుఆరోజంతా ఆహారం దొరకక పస్తు ఉన్న కుక్క ప్రదోష దినాన ఆ బలి అన్నాన్ని భుజించిందిబలి భోజనం వల్ల డానికి పూర్వ స్మృతి కలిగి ''ఓ విప్రుడానన్ను రక్షించు'' అంటూ మూలిగిందిఆ కుక్క మూలుగులు విన్న విప్రుడు కుక్క మాట్లాడటాన్ని చూసి విస్తుపోతూనే ''ఏం తప్పు చేశావు.. నిన్ను నేను ఎలా రక్షించగలను?!'' అనడిగాడు.

అప్పుడు కుక్క ''ఓ బ్రాహ్మణుడాపూర్వజన్మలో నేనొక విప్ర వనితనుకామంతో ఒళ్ళు తెలీక జారత్వానికి ఒడికట్టానుపతితను,భ్రష్టను అయిభర్తను కూడా చంపానుఆ పాపాలవల్ల నరకానికి వెళ్ళాను...'' అంటూ మొదలుపెట్టి అంతా వివరంగా చెప్పింది.చివరికి నాకు ఇలా పూర్వ జన్మలు ఎందుకు గుర్తొచ్చాయో మాత్రం బోధపడటంలేదు, దయచేసి చెప్పు'' అంది.
బ్రాహ్మణుడు జ్ఞాన చక్షువుతో తెలుసుకుని ''శునకమాఈ కార్తీక సోమవారం నాడు ప్రదోష వేళ వరకూ పస్తు ఉండి నేను విడిచిన బలి భక్షణం చేశావు కదాఅందువల్ల పూర్వజన్మ జ్ఞానం కలిగింది..'' అన్నాడు.

డానికి కుక్క ''కరుణామయుడివైన ఓ బ్రాహ్మణానాకు మోక్షం ఎలా సిద్ధిస్తుందో చెప్పు'' అని అడిగింది.
దయాళుడైన భూసురుడు తాను చేసిన అనేకానేక కార్తీక సోమవార వ్రతాలలో ఒక సోమవార వ్రత ఫలాన్ని ఆ కుక్కకు ధారపోయగా ఆ క్షణమే కుక్క తన శునక దేహాన్ని వదిలి దివ్య స్త్రీ సరీరిని అయిప్రకాశ మానహార వస్త్ర్ర విభూషిత అయిపితృ దేవతా సమంవితయై కైలాసం చేరిందికనుకనే ఓ జనక మహారాజానిస్సంశయంగా కార్తీక సోమవార వ్రతాన్ని ఆచరించు'' అంటూ చెప్పాడు వశిష్టుడు.

బాలలదినోత్సవ శుభాకాంక్షలు .

పిల్లల కు ఒక రోజు వుంది.  ఆ రోజు పిల్లలకు ప్రత్యేకమైన రోజు. ప్రపంచవ్యాప్తముగా బాలల దినోత్సవం ను ప్రతి సంవత్సరం  నవంబర్ 20 న జరుపుకుంటారు.

పండితుడు జవహర్ లాల్ నెహ్రూ - నవంబర్ 14  న పురాణ స్వాతంత్ర్య సమరయోధుడు జన్మించినారు.   నెహ్రు గారి పుట్టిన రోజు  వార్షికోత్సవంను బాలల దినోత్సవంగా జరుపుకుంటున్నాము.  మన చాచా  నెహ్రుగారు స్వతంత్ర భారతదేశం యొక్క మొదటి ప్రధాన మంత్రి .నెహ్రూ గారికి పిల్లలు అంటే చాలా ప్రేమ.  అందుకే  అతని మీద  ప్రేమ తో  బాలల దినోత్సవంతో నెహ్రు గారి  పుట్టిన రోజు జరుపుకుంటారు.

 రోజు పిల్లల సంక్షేమ మా నిబద్ధత పునరుద్ధరణ మరియు చాచా నెహ్రూ గారి కల  ద్వారా ప్రత్యక్షంగా  వాటిని నేర్పినట్టు  ప్రతి ఒకటి గుర్తుచేస్తుంది.  బాలలదినోత్సవ శుభాకాంక్షలు .

సోమవారం, నవంబర్ 12, 2012

దీపావళి విధివిదానం మరియు శుభాకాంక్షలు

సోమవారం, నవంబర్ 12, 2012

దీపావళి అంటే మన అందరికి చాలా ఇష్టం . ఐతే చాలామంది లో దీపావళి అంటే దీపాలు వెలిగించటమే కదా!
అని కాని దీపావళి కి చాలా విశిష్టత వుంది . దీపావళి పండుగ చేసుకునే విధానం కుడా వుంది . ఇవి చాలామందికి తెలిదు. పూర్వపు పద్ధతులు మరచి పోయారు. ఆ రోజుకి స్వీట్స్ కొనుక్కొని వచ్చి వెరైటి వంటలుచేసుకొని , రాత్రి దీపాలు వెలిగించి టపాసు కాల్చుకొని ఎంజాయ్ చేయటమే అనుకుంటున్నారు మనలోచాలామంది.

దీపావళి పండుగ ఆశ్విజ బహుళ చతుర్దశి అమావస్య నాడు వస్తుంది. ఇది రెండురోజుల పండుగ త్రయోదసినాటి రాత్రి అపమృత్యు నివారణ కోసం ప్రమిదలతో దీపాలు వెలిగించి ఇంటిముందు వుంచాలి.
నరకచతుర్దసిని ప్రేతచతుర్దసి అని కుడా అంటారు. ఎందుకంటే ఇది యమునికి కుడా ప్రీతి కలిగించేరోజు.యముడు పితృత్వం కూడా ఉన్నా దేవుడు. సూర్యోదయానికి ముందు, రాత్రి తుదిజాములోనువ్వులనూనెతో తలంటు పోసుకోవాలి. ఇలా చేయడంలో చాలా విశేషం వుందిట. దీపావళి పర్వదినాలలోనువ్వుల నూనెలో లక్ష్మి దేవి ఉంటుందిట. . అలాగే నదులు, చెరువులు, బావులు, కాలువలు, వంటి అన్నిజలవనరులలోకి గంగాదేవి ఆ రోజుల్లో
ప్రవేశిస్తుందిట . నువ్వులనునేల్తో అభ్యంగనస్నానం చెయ్యడం వల్ల దారిద్ర్యం తొలగి గంగాస్నాన ఫలం లభిస్తుందిట. నరక బాధలు తప్పుతాయట . చివరకు సన్యాసులు కుడా చేస్తారుట.
స్నానం కూడా ఎప్పుడు పడితే అప్పుడు చెయ్యడం కాదు. సూర్యోదయానికి ముందు నాలుగు ఘడియల కాలం అరుణోదయం అంటారు . ఆలోగా చెయ్యాలి.
స్నానం చేసేటప్పుడు ఉత్తరేణి కొమ్మను శిరస్సు మీద తిప్పుతూ ఈ శ్లోకం పాటించాలి .
శీతలోష్ట సమాయుక్త సకంటక దలాన్విత
హరపాప మపామార్గ భ్రామ్యమానః పునః పునః
అపామార్గం అంటే ఉత్తరేణి . ఇలాచేయటం వల్ల నరకం రాదట. నువ్వులనునే , ఉత్తరేను మొదలైనవి ప్రకృతితో మనకు ఎంత ముడిపది వున్నామో తెలుస్తుంది. ప్రక్రుతిసామరస్యంలో మనం జేవించాలని ఇందులో సందేశం. ఇందు వల్ల నరకంబయం అన్నది ఉంటే అది మన భావన ద్వారా ఆ స్థితికి చేరుకున్తామన్నామాట. స్వర్గనరకాలు మనస్సు నందు కల్గేవే. ఇది అంతా మనసుకి శిక్షణ ఇవ్వటమే.
స్నానం తరువాత `యమాయ తర్పయుఆమి, తర్పయామి, తర్పయామి' అంటు మూడుసార్లు నువ్వులతో యమునికి తరపనాలు ఇవ్వాలి.
ఈ శ్లోకం చదవాలి.
యమాయ ధర్మరాజాయ మృత్యువే చాంతకాయచ
వైవస్వతాయ కాలాయ సర్వభూత క్షయాయచ
ఔదుమ్బరాయ ధర్మాయ నీలాయ పరమేష్టినే
మహొదరాయ చిత్రాయ చిత్రగుప్తాయ తే నమః

దీపావళి రోజు మినపాకుతో చేసిన కూరతొ భోజనం చేస్తే మంచిది అని అంటారుట.
దీపదానం:
సాయంకాలం ప్రోదోషసమయంలో నువ్వులనూనెతో దీపాలు పెట్టాలి . విష్ణ్వాలయంలో, శివాలయాలలో, మతాలలో , దీపాలు పెట్టడంతో పాటు నదీతీరాలలో, చేరుగాట్లు, తోటలు, వీధులు, పర్వతాల్పైన చివరకు స్మసానాలల వద్ద కుడా దీపాలు పెట్టాలని పెద్దల శాసనం. దీపావళి రోజున పితృదేవతలు తమతమ సంతానం ఇంటిని దర్సిస్తారట. వారికి మనం పెట్టె దీపాలే దారి చుపిస్తాయట .
దీపావళినాడు మరి ముఖ్యంగా ఐదు ప్రదేశాలలో దీపాలు పెట్టాలిట .అవి:
1) ఇంటిధ్వారం.
2) ధాన్యపుకొట్టు.
౩) బావి.
4) రావిచెట్టు.
5)వంటిల్లు . ఇంట్లో ఆశుచం ( మైల) పాటిస్తున్నాసారే ఈ ఐదు చోట్లా దీపం పెట్టవలసిందే.
ఉల్కాదానం:
యముడు దక్షినదిసగా ఉంటాడు. మగపిల్లలు ఆ దిక్కువైపు నిలబడి దివిటీలు వెలిగించి పితృదేవతలకు దారి చూపించాలి. తర్వాత కాళ్ళు కడుక్కుని లోపలికి వచ్చి ఏదైనా తీపి పదార్ధాలు తినాలి.
లక్ష్మి పూజ :
దీపాలు వెలిగించి వాటిలోకి లక్ష్మి దేవిని ఆహ్వానించి లక్ష్మీపూజ చెయ్యాలి. ఆ తర్వాత బాణసంచా వెలిగించాలి. అర్ధరాత్రి స్త్రీలు అందరు కలసి చేతలు, వాయిద్యాలు మోగించాలి. దారిద్రాన్ని దూరంగా తరిమికొట్టడానికి ఇలా చెయ్యడం ను "అలక్ష్మినిస్సరణం" అని అంటారు. మనం టపాసు పెల్చడంలోని అర్ధం ఇదే.
ఈ టపాసుల వల్ల వర్షాకాలంలో పుట్టిన ఎన్నో క్రిములు కీటకాలు ముక్తి ని పొందుతాయి. కార్తీకమాసం అంతా దీపాలు వెలిగించేది అందుకే.
రోజూ సాయంకాల దీపం వెలిగించి శ్లొకం చదివి తే చాలామంచిధీ.
దీపం జ్యోతిః పరంబ్రహ్మ దీపం సర్వతమోపహమ్ |
దీపేన సాధ్యతే సర్వమ్ సంధ్యా దీప నమ్మోస్తుతే ||
దీపజ్యోతిని పరబ్రహ్మ స్వరూపంగా, మనోవికాసానికి, ఆనందానికి, నవ్వులకు, సజ్జనత్వానికి, సద్గుణ సంపత్తికి నిదర్శనంగా భావిస్తారు.
దీపం జ్యొతిః పరబ్రహ్మ,
దీపం జ్యోతి జనార్దనః
దీపేన హరతే పాపం
సంద్యాదీపం నమోస్తుతే,

సాయంత్రం సంద్యాదీపం వెలిగించీ ధానికి నమస్కారిచుట చాలాపున్యము. దీపం అంటే పరమాత్మ . దీపంకు నమస్కరించుట పరమాత్మకు నమస్కరించుటే .  
దిబ్బు దిబ్బు దీపావళి
మళ్ళీ వచ్చే నాగులచవితి...
అంటూ చిన్న పిల్లలంతా గోగునార కట్టలకి చిన్న చిన్న గుడ్డ ముక్కల్ని కట్టి వెలిగించి దిష్టి తీయడాన్ని మనం సంప్రదాయం గా కొన్ని ప్రాంతాలల్లో చూస్తూంటాం.   ఆ దీపం వెలిగించిన తరువాత కాళ్ళు కడుక్కుని ఇంటిలోపలకు వచ్చి తీపి పదార్థం తింటారు. దీపావళి రోజు శ్రీమహాలక్ష్మికి పూజ చేయాలి. శ్రీసూక్తము గాని, లక్ష్మీసహస్రనామ స్తోత్రం కానీ, అష్టోత్రంకానీ చేసుకోవటంవల్ల లక్ష్మీ కటాక్ష్మము లభిస్తుందిటమరి.

అసుర నాశనానికి, ధర్మ ప్రతిష్టాపనకు గుర్తుగా అమావాస్యనాడు జరుపుకునే దీపావళి పండుగనాడు లక్ష్మీదేవికి ప్రతీకగా వెలుగులు విరజిమ్మే దీపలక్ష్మిని పూజించడం సర్వశుభాలు ప్రసాదిస్తుంది.
దీపావళి చుట్టూ అనేకానేక కథలు ఉన్నాయి. శ్రీకృష్ణుడు సత్యభామ సహకారంతో నరకాసురుణ్ణీ వధించాడు గనుక ప్రజలు ఆనందంతో మరునాడు దీపావళి సంబరం చేసుకుంటారని ఒక కథ. ఇంకో కథకూడా ఉంది. లంకలో రావణుని సంహరించి , రాముడు సీతాసమేతంగాఅయోధ్య కు తిరిగి వచ్చినప్పుడు ప్రజలు ఆనందంతో ఈ పండుగ జరుపుకున్నారని చెబుతారు. ఉత్తరాదివారు ముఖ్యంగా వ్యాపారులు దీపావళి రోజును కొత్త సంవత్సరంగా పాటిస్తారు.    
దీపావళి శుభాకాంక్షలు

నరకచాతుర్ది నరకవధ




నరకాసురుడు భూదేవి కుమారుడు శాపవశమున నరకాసురుడు శ్రీ కృష్ణుని తో సంహరించబడతాడు. నరకాసురుడు వృత్తాంతం మహాభాగవతము దశమ స్కందం ఉత్తర భాగములొ వస్తుంది. నరకాసురిడి సంహారం జరిగిన రోజు నరక చతుర్దశి జరుపుకొంటారు హిందువులు. తరువాతి రోజుని దీపావళి జరుపుకొంటారు.  ఆశ్వయుజ బహుళ చతుర్దశి నరక చతుర్దశి గా ప్రసిద్ధి పొందింది. నరకాసురుడు నే రాక్షసుడు చెలరేగి సాధు జనాలను పీడిస్తూ దేవ, మర్త్య లోకాలలో సంక్షోభాన్ని కలిగిస్తుంటాడు. కృతయుగం లో హిరణ్యాక్షుని వధించిన వరాహస్వామి కి, భూదేవికి అసుర సంధ్యా సమయంలో జన్మిస్తాడు నరకుడు. అతడు లోక కంటకుడైనామహావిష్ణువు వధించరాదని, తల్లియైన తన చేతిలోనే మరణించేలా వరం పొందుతుంది భూదేవి. మహావిష్ణువు ద్వాపరయుగంలో శ్రీకృష్ణ భగవానునిగా అవతరించినప్పుడు భూదేవి సత్యభామ గా జన్మిస్తుంది.
అప్పటికి నరకాసురుడు లోక కంటకుడై చేస్తున్న అధర్మకృత్యాలను అరికట్టడానికి సత్యభామా సమేతంగా తరలి వెళ్తాడు శ్రీకృష్ణుడు. వారి మధ్యజరిగిన భీకర సంగ్రామంలో భూదేవి అంశ అయిన సత్యభామ శరాఘాతాలకు మరణిస్తాడు నరకుడు. తన పుత్రుని పేరైనా కలకాలం నిలిచి ఉండేలా చేయమని సత్యభామ ప్రార్థించడంతో ఆ రోజు నరక చతుర్థశిగా పిలువబడుతుందని వరం ప్రసాదిస్తాడు శ్రీకృష్ణుడు. నరకుని చెరనుండి సాధుజనులు, పదహారువేలమంది రాజకన్యలు విడిపించబడ్డారు, ధ్రర్మం సుప్రతిష్టమైంది. నరకాసురుని పీడ విరగడైందన్న సంతోషంతో ఆ మరుసటి రోజు ప్రజలు సంబరాలు జరుపుకుంటారు.   భూమాత ఎంత గొప్పదో కదా.  కొడుకు లోకకంతకుడు అని తెలిసి క్షమించకుండా మరణశిక్ష విధించింది.   
ఈ సంబరాలు జరుపుకునే రోజు అమవాస్య కావడంతో, చీకటిని పారద్రోలుతూ ప్రజల దీపాలతో తోరణాలు వెలిగించి, బాణాసంచా కాల్చి వేడుక చేసుకున్నారు. కాలక్రమంలో అదే దీపావళి పర్వదినంగా మారింది.  

ఆదివారం, నవంబర్ 11, 2012

శ్రీ మహాలక్ష్మి కటాక్ష రహస్యం.

ఆదివారం, నవంబర్ 11, 2012

శ్రీ మహాలక్ష్మి అమ్మ చూపులు ఎలా వుంటాయి అంటే దుర్మార్గుల విషయంలో అవి పరమ క్రూరంగా ఉంటాయి. అవే చూపులు తన భక్తుల పైన  దీనులపై దయను కురిపిస్తాయి . దరిద్రమును దహించివేసి ఎంతో ఉదారంగా సంపదను అనుగాహిస్తాయట . 
ఓ మహాలక్ష్మి తల్లీ, అలాంటి నీ చల్లని చూపులతో నా దురదృష్టాన్ని పోగుట్టు అని ప్రార్ధిస్తాడు జగన్నాధ పండితరాయలు తన `లక్ష్మి కరుణ రస లహరి లో.
పల్లవి
మహా లక్ష్మి కరుణా రస లహరి
మామవ మాధవ మనోహరి శ్రీ
అనుపల్లవి
మహా విష్ణు వక్ష స్థల వాసిని
మహా దేవ గురు గుహ విశ్వాసిని
(మధ్యమ కాల సాహిత్యమ్)
మహా పాప ప్రశమని మనోన్మని
మార జనని మంగళ ప్రదాయిని
చరణము
క్షీర సాగర సుతే వేద నుతే
క్షితీశాది మహితే శివ సహితే
భారతీ రతి శచీ పూజితే
భక్తి యుత మానస విరాజితే
(మధ్యమ కాల సాహిత్యమ్)
వారిజాసనాద్యమర వందితే
నారదాది ముని బృంద నందితే
నీరజాసనస్థే సుమనస్థే
సారస హస్తే సదా నమస్తే
దీపావళి రోజు సముజ్వల దీపాలతోరణాల మధ్య శ్రీ వైభవలక్ష్మిని నిలుపుకొని భక్తి శ్రద్దలతో పూజించుకొనే రోజు . అసలు దీపమే లక్ష్మి. చీకటి నుంచి వెలుగులోకి ప్రయాణించడమే జ్ఞానం , అదే సంపద, జ్ఞానము, సంపద బిన్నమైనవి కావు. ఒకటి వుంటే రెండోది ఉన్నట్టే. ఇతరులను వంచించినచో, అవినీతి మార్గాలలోనో ఐశ్వర్యాన్ని సంపాదిస్తే చాలను కుంటారు చాలామంది. అలాంటివారిని లక్ష్మి వరించినట్టు కనిపించినా అది చంచలం . దయా, సేవాబావం, శ్రమ, వినయం, వివేకం ఉన్నచోట లక్ష్మి స్థిరంగా ఉంటుంది. లక్ష్మీ కటాక్షం సిద్ధిస్తుంది ఇదే  అసలు రహస్యం. 
లక్ష్మీదేవి అష్టరూపాలలో కనిపిస్తుంది అవి ఆదిలక్ష్మీ, దైర్యలక్ష్మి, గజలక్ష్మి, సంతానలక్ష్మి, విజయలక్ష్మి విద్యాలక్ష్మి, ధనలక్ష్మి దేవిలా ఉంటుందని మనకు తెలుసు. వీటిలో `విద్యాలక్ష్మి' అంటే, జ్ఞానం వివేకం వంటి సద్గుణ సంపద అని కుడా అర్ధం చేసుకోవాలి. అటువంటి లక్ష్మితత్వాన్ని అందరుసంపాదించాలి.మంచి మనసే లక్ష్మిదేవికి కచ్చితమైన సేఫ్టీ లాకరుగా చెప్పవచ్చు .
లక్ష్మి దేవి ఎక్కడ వుంటుంది అని నారదుడు శ్రీ మహావిష్ణువుని అడుగగా  అప్పుడు 
శ్రీ మహావిష్ణువు లక్ష్మి దేవి ఎక్కడెక్కడ ఉంటుందో చెప్పారు అవి ఏమిటంటే 
"అఖిల విశ్వం సమస్త ప్రాణులు నా అదీనంలో ఉంటే , నేను నా భక్తుల అదీనంలో ఉంటాను . మీరు నా భక్తులు, కనుక మీకు పరమైస్వర్యాన్ని అందించే ఆచలలక్ష్మిని ప్రసాదిస్తాను. అయితే దానికి ముందుగా నేను చెప్పబోయే మాటలు వినండి - అంటూ లక్ష్మి ఎవరెవరి వద్ద ఉంటుందో, ఎవరివద్దవుండదో , వివరించాడు. లక్ష్మిని కోరుకునే వారందరూ తప్పకుండా దృష్టిలో ఉంచుకోవలసిన విషయాలివి.
  • భగవద్భాక్తులపై కోపగించే వారి గృహంలో లక్ష్మిదేవే కాదు.శ్రీ హరి కుడా ఉండదు. 
  • శంఖద్వని వినిపించని చోటా. 
  • తులసిని పూజించని చోట.
  • శంఖరుని అర్చించని చోట.
  • బ్రహ్మవేత్తలకు , అతిధులకు భోజన సత్కారాలు జరగని చోట.  లక్ష్మి దేవి నివసించదు. 
  • ఇల్లు కళ కళ లాడుతూ ఉండని  చోట.
  • ఇల్లాలు ఎల్లవేళలా కంటతడి పెట్టిన చోట.
  • విష్ణువును ఆరాధించకుండ.
  • ఏకాదశి మరియు జన్మాష్టమి రోజులలో భోజనం చేసేవారి ఇంట లక్ష్మి నివసించదు.
  • హృదయములో పవిత్రత లోపించిన, ఇతరులను హింసింస్తున్న. ఉత్తములను నిందిస్తున్న లక్ష్మి ఆ ఇంటిలోనుంచి పారిపోతుంది. 
  • అనవసరం గా గడ్డిపరకలను తెంచిన.
  • చెట్లను కులగొట్టినా లక్ష్మి కటాక్షం లోపిస్తుంది. 
  • నిరాసావాధులను, సుర్యోదయ సమయంలో భోజనం చేసే వాని, తడి పాదాలతో నిద్రపోయేవారిని , వివస్త్రులై నిద్రపోయేవారిని, తలక్రిందులుగా మాట్లాడేవారిని, తమ తలకు రాసుకున్న నూనెను ఇతరులకు అంటించే వారిని కుడా లక్ష్మి వరించదు.
శ్రీహరి దివ్యచరిత్ర, గుణగానం జరిగే చోట, సాలగ్రామం, తులసి, శంఖద్వని ఉన్నచోట , లక్ష్మి విరజిల్లుతుంది.
ఇలా శ్రీ హరి లక్ష్మీకటాక్షం ఎలా కలుగుతుందో, ఎలాకలగాదో చెప్పారు.
సంపద మన ఆదీనం లో ఉండాలి కాని, మనం సంపద ఆదీనం లో ఉండకూడదు . ఏకాస్త గర్వించిన, అహంకరము చూపిన  ఐశ్వర్యం జారిపోతుంది. సద్వినియోగమే సంపద పరమార్ధము. అది విస్మరించినా లక్ష్మి వీడిపోతుంది. ఇదే శ్రీ మహాలక్ష్మి కటాక్ష రహస్యం.  ఈరోజు ధనత్రయోదశి.  అందరకు ఇష్టమైన ధనలక్ష్మి కరుణ,  అనుగ్రహము కలగాలని కోరుకుంటున్నాను. 

దశావతారములో కృష్ణావతారము


దశావతారములో కృష్ణావతారము 

శుక్రవారం, నవంబర్ 09, 2012

దశావతారంలో రామావతారము

శుక్రవారం, నవంబర్ 09, 2012


దశావతారంలో రామావతారము

జాణతనాలాడేవేలే జంపు గొల్లెతా, వోరి



జాణతనాలాడేవేలే జంపు గొల్లెతా, వోరి
ఆణిముత్యముల చల్ల లవి నీకు కొల్లలా

పోయవే కొసరుచల్ల బొంకుగొల్లెతా , వోరి
మాయింటి చల్లేల నీకు మనసయ్యీరా
మూయకువే చల్ల చాడిముచ్చు గొల్లెతా, వోరి
పోయవో పోవొ మాచల్ల పులు సేల నీకును

చిలుకవే గోరంజల్ల జిడ్డు గొల్లెతా , వోరి
పలచిని చల్ల నీకు బాతి గాదురా
కలచవే లోనిచల్ల గబ్బి గొల్లెతా , వోరి
తొలరా మా చల్లేల దొరవైతి నీకు

అమ్మకువే చల్లలు వయ్యారి గొల్లెత, వోరి
క్రమ్మర మాతోడనిట్టె గయ్యాళించేవు
సొమ్మెలం బోయేవేలె సొంపు గొల్లెతా, వోరి
దిమ్మరి కోనేటిరాయ తిరమైతి నీకును

గురువారం, నవంబర్ 08, 2012

మనిషి లో పోజిటివ్ నెగెటివ్

గురువారం, నవంబర్ 08, 2012

మంచి - చెడు , సత్యం - అసత్యం , భయం -అభయం , సంతృప్తి - అసంతృప్తి 

మంచి - చెడు , సత్యం - అసత్యం , భయం -అభయం , సంతృప్తి - అసంతృప్తి ఇలాంటివి అన్ని మనకు ప్రేరణ కలిగించేవే . ఐతే భయాన్ని అదుపులో వుంచితే జాగ్రత్తగా పవర్తిస్తే అదే ప్రేరణగా వుపయోగపడుతుంది.
అలాగే మనచుట్టూవున్నా వాతావరణం నుండే ప్రేరణ పుడుతుంది. అది పాజిటివ్ ప్రేరణ కావచ్చు, లేదా నేగేటివ్ ప్రేరణ కావచ్చు.  దీనికి సంభందించిన ఒక కదా వుంది.  అది ఏమిటంటే 

ఒక ఊర్లో ఇద్దరు అన్నదమ్ములు వున్నారు . వారిలో ఒకడు పచ్చి తాగుబోతుగా వుండి చెడు ,అసత్యం ,భయం , అసంతృప్తి కలిగి జీవితం లో అన్ని కోల్పోయి నట్టువుంటాడు. రెండవ వాడు మంచిగా అబివృద్ధి చెంది , పెద్ద పారిశ్రామికవేత్తగా మంచి, సత్యవ్రతునిగా భయం లేని వానిగా సంతృప్తి కలిగి జీవితం లో వున్నత స్థానం లో వున్నాడు. ఇది గమనించిన ఒకతను ఆ అన్నాదమ్ముల దగ్గారుకు విడి విడిగా వెళ్లి " మీరు ఇద్దరూ ఒక ఇంటిలో వారే కదా మరి ఒకరు మంచి గా మరొకరు చెడుగా ఎలా వున్నారు"? అని అడిగాడు.  ముందుగా తాగు భోతు ని అడగగా" మానాన్నాతాగుతాడు . మా నాన్న దగ్గరనుండి ఈ లక్షణాలు నాకు అబ్బాయి" . అందుకే ఇలా తయారయ్యాను అన్నాడు .


రెండవ వాడిని అడుగగా" మానాన్న కష్టపడి పని చేసేవాడు .ఈనాడు నేను ఈ స్థాయి లో వుండటానికి మా నాన్నగారే ప్రేరణ" అని సమాధానం ఇచ్చాడు.


ఇందులో మనం అర్ధం చేసుకోవలసింది వారి తండ్రికి రెండు లక్షణాలు వున్నాయి . మంచి - చెడు వున్నాయి . వాటిలో చెడ్డ లక్షణాలను ఆదర్శం గా ఒకడు తీసుకొని నెగెటివ్ ప్రేరణకు గురి అయ్యాడు. వాటిలో మంచి లక్షణాలను మరొకడు ఆదర్శం గా తీసుకొని పాజిటివ్ ప్రేరణకు గురి అయ్యి మంచి స్థాయిని చేరాడు .

ప్రతీ మనిషి లో పోజిటివ్ నెగెటివ్ లక్షణాలు వుంటాయి. మనం వాటి లో పాజిటివ్ ప్రేరణ మాత్రమె తీసుకోవాలి . అలా అయితేనే గోప్పవారిమి అవ్వగాలము.

దశావతారంలో పరశురామవతారము


దశావతారంలో పరశురామవతారము 

బుధవారం, నవంబర్ 07, 2012

దశావతారంలో వామనావతారం

బుధవారం, నవంబర్ 07, 2012


దశావతారంలో వామనావతారం 

మంగళవారం, నవంబర్ 06, 2012

దశావతారంలో నరసింహావతారము

మంగళవారం, నవంబర్ 06, 2012


దశావతారంలో నరసింహావతారము 

సోమవారం, నవంబర్ 05, 2012

దశావతారంలో వరాహావతారము

సోమవారం, నవంబర్ 05, 2012



                                               దశావతారంలో వరాహావతారము 

దోమకి భారత రత్న అవార్డు ఇవ్వాలిట!!!!!!!!!

దోమకి భారత రత్న అవార్డు ఇవ్వాలిట!!!!!!!!!
మన ప్రభుత్వము చేయలేని పని తను చేసానని ఒక మీడియాకి సమాచారము అందించింది. ఇది తెలిసి దోమ సంఘాలు వాళ్లకు భారతరత్న అవార్డు వచ్చేవరకు పోరాటము చేస్తాము అని వివరించాయి దోమలు. ఇంతకి ఎందుకు భారత రత్న ఇవ్వాలిట అంటే. 
కసబ్ కి కుట్టి వాడికి డెంగు జ్వరం కలిగిచెప్రయత్నంచేసి జ్వరం వచ్చేలా చే
సాయట. ప్రస్తుతం కసబ్ పరిస్తితి తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు మీడియా వారు. ఇది ఇలావుండగా దోమకి మన ప్రభుత్వం భారతరత్న ఇస్తుందో లేదొ చూడాలి మరి.
మీడియావారు ఒక పోల్ నిర్వర్తించారు . అది ఎమిటి అంటె దోమకి భారత రత్న ఇస్తారనుకుంటున్నారా ? లేదా? అవును అయితే Yes అని కాదు అయితే No అని sms చేయండి. మీరు sms చేయవలసిన నెంబరు ౧౨౩౪౫౬౭

శనివారం, నవంబర్ 03, 2012

దశావతారంలో కూర్మావతారము

శనివారం, నవంబర్ 03, 2012

దశావతారంలో రెండవది కూర్మావతారము 

శుక్రవారం, నవంబర్ 02, 2012

దశావతారంలో మత్స్యావతారం

శుక్రవారం, నవంబర్ 02, 2012


దశావతారంలోమత్స్యావతారం 

గురువారం, నవంబర్ 01, 2012

శ్రీరంగరంగనాధునీ

గురువారం, నవంబర్ 01, 2012


గంగా శంకాశ కావేరీ శ్రీరంగేశ మనోహరీ కళ్యాణకారి కలుషారీ
నమస్తేస్తు సుధాఝరీ ఆ ..............ఆ...............

శ్రీరంగరంగనాధునీ దివ్యరూపమే చూడవే
శ్రీదేవి రంగనాయకీ నామం సంతతం పాడవే
నీలవేణిలో నీతిముత్యాలు..........కృష్ణవేణిలో అలలగీతాలు
నీలవేణిలో నీతిముత్యాలు నీరజాక్షునికి పూలుగా
కృష్ణవేణిలో అలలగీతాలు కృష్ణ గీతలే పాడగా  || శ్రీరంగరంగ ||

కృష్ణాతీరాన అమరావతిలో శిల్పకళావాణి పలికిన శ్రుతిలో
అలలైపొంగేనూ జీవన గీతం కలలే పలికించు మధుసంగీతం
చల్లగా గాలి పల్లకీలోన పాట ఊరేగగా
వెల్లువై  గుండె పల్లె పదమల్లి  పల్లవే పాడగా
శ్రీ త్యాగరాజ కీర్తనైసాగె తీయనీ జీవితం    || శ్రీరంగరంగ ||

గంగను మరపించు ఈ కృష్ణవేణి వెలుగులు ప్రవహించు తెలుగింటి రాణీ
పాపాల హరియించు పావన జలమూ పచ్చగ ఈ నెల పండించు ఫలమూ
ఈ ఏటి నీటి పాయలే తేటగీతులే పాడగా
సిరులెన్నో పండి ఈ భువీ స్వర్గ లోకమై మారగా
కల్లకపటమే కానరానీ ఈ పల్లె సీమలో   || శ్రీరంగరంగ ||

శ్రీరంగరంగనాధునీ దివ్యరూపమే చూడవే
శ్రీదేవి రంగనాయకీ  నామం సంతతం పాడవే..................

అంధ్రప్రదేశ అవతరణ దినోత్సవము


ఆంద్ర ప్రదేశ్
నవంబర్ 1 వ తేదీ అంటే ఇవాళ ఆంద్ర ప్రదేశ్ అవతరణ దినోత్సవము . 1953 వ సంవత్సరం ఇదే రోజు పదకొండు తెలుగు మాట్లాడే జిల్లాలు కలిసి ప్రత్యేక రాష్ట్రంగా అవతరించాయి. అంతకు ముందు ఇవి మద్రాస్ రాష్ట్రంలో ఉండేవి. రాష్ట్ర తొలి ముఖ్యమంత్రిగా టంగుటూరి ప్రకాశం పంతులు పనిచేసారు. అనంతరం 1956 నవంబర్ ఇదే రోజున నిజాం పాలనలో ఉన్న తెలంగాణా ప్రాంతాన్ని ఆంద్ర ప్రదేశ్ లో విలీనం చేసారు. ఆంధ్రప్రదేశ్ తో పాటు కేరళ, బీహార్, కర్నాటక, మధ్యప్రదేశ్ , రాజస్తాన్, అస్సాం, పశ్చిమ బెంగాల్ రాస్ట్రాలు ఏర్పడ్డాయి. 1966 లో పంజాబ్, హర్యానా రాష్ట్రాలు ఏర్పడ్డాయి.  2000 సంవత్సరము లో చత్తీస్ ఘడ్ రాష్ట్రము ఏర్పడింది.నవంబర్ 1 వ తేదీ అంటే ఇవాళ ఆంద్ర ప్రదేశ్ అవతరణ దినోత్సవము సందర్బముగా అంధ్రప్రదేశ అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు.  

మంగళవారం, అక్టోబర్ 30, 2012

అట్ల తదియ

మంగళవారం, అక్టోబర్ 30, 2012



అట్ల తద్దోయ్ - ఆరట్లోయ్                                       ముద్దపప్పోయ్ -మూడట్లోయ్

అట్ల తదియ పండుగ గురుంచి. అట్ల తదియ ఈ పండుగ ప్రతి సవత్సరం ఆశ్విజ బహుళ తదియ రోజు వస్తుంది. ఈ తదియ రోజు తెలవారుజామునే ఆడవారు చిన్న పెద్ద అన్దరూ నిద్ర లేచి కాలకృత్యాలు తీర్చుకొని , గోంగూర పచ్చడి, నువ్వుల పొడి, పులుసు, పెరుగు వేసుకొని తెల్ల వారుజామునే భోజనం చేస్తారు.ఆ తరువాత ఆటలే ఆటలు, చెమ్మచెక్కలు, ఉయ్యాలు అడతారు. అన్నట్టు ముందురోజే చేతుల నిండా గోరింట పెట్టుకుంటారు. తదియ రోజు చాలా సంతోషం గా ఆడుకుంటారు. ఉయ్యాల పోటీలు పెట్టుకుంటారు. పల్లెల్లో చాలా బాగా జరుపుకుంటారు. పొద్దు ఎక్కాగా తల స్నానం చేసి దేవుడుకి దణ్ణం పెట్టుకొని రోజు అంతా ఉపవాసం వుంటారు. సాయంత్రం చంద్రోదయం అయ్యాక స్నానం చేసి పార్వతి దేవికి పూజచేస్తారు. పూజచేసి చంద్రుడిని దర్శించుకుంటారు . 
ఈ వ్రతము చేయాలనుకునే వారు ఈ కథను చదువుకోవాలి.
ఒక రాచ చిన్నది తోడి చెలికత్తెలతో కలసి అట్ల తద్దె నోమును నోచుటకు వుపవాసముండెను, మూడు జాములు దాటు సరికి రాచ బిడ్డ సుకుమారి యగుటచే శోషవచ్చి పడిపోయెను. అంతట నామె అన్నలు వచ్చి ఆమె అట్లు పడి పోవుటకు కారణమును తల్లి వలన గ్రహించిరి, వారు తమ చెల్లెలు చంద్రుడు వచ్చు వరకు నుండ లేదని అనుకొని ఒక చింతచెట్టు కొమ్మకు అద్దము కట్టి దానికి యెదుట అరికె కుప్పకు అగ్గిని పెట్టి చెల్లిని లేపి "అడుగో చంద్రుడు వచ్చెను. భోజనమును చేయు" మనిరి. అద్దములో నిప్పు చూచి చంద్రుడే వచ్చెననుకొని, ఆమె భోజనము జేసెను.
కొంతకాలమునకు ఆమెకు యుక్త వయస్సు రాగా నామె అన్నలు పెండ్లి సంబంధములను చూచుచుండిరి. ఎన్ని సంబంధములు వెదకినను ముసలి వరుడే దొరకుటచే, కడకు వారు విసిగి తమ చెల్లెలిని ముసలివానికిచ్చి పెండ్లి చేయ నిశ్చయించిరి. ఆ సంగతి తెలసి ఆ రాచబిడ్డ "అయ్యో! అట్లతద్ది నోము నోచిన వారికి పడుచు మగడు దొరుకునని చెప్పిరి, కాని నాకీ ముసలి మగడేల దాపరించుచున్నాడు!" అని విచారించి, వృద్ధ భర్తను వివాహమాడుట కంగీకరింప లేదు. అన్నలామెనెంతో బలవంతపెట్టి వివాహమును జేయనెంచిరి. కాని ఆమె యందులకు సమ్మతింపక, ఒక నాటి రాత్రి అడివికి పోయి ఒక మర్రిచెట్టు క్రింద తపస్సు చేయుచుండెను.
కొంత కాలమునకు పార్వతి పరమేశ్వరులామెను చూచి "ఓ కన్యామణీ! నీ వేల తపస్సు చేయు చున్నావు? మేము పార్వతీ పరమేశ్వరులము. నీ కష్టమును మాతో చెప్పుము" అనిరి. అంత నామె వారిని అతి భక్తితో  నమస్కరించి తన వివాహ విషయమును చెప్పెను. వారది విని "అమ్మా! నీవు అట్లతద్దె నోము నోచి చంద్ర దర్శనము కాక పూర్వమే భోజనము జేసి యుల్లంఘన చేసితివి. అందుచే నీకు ముసలి మగని సంబంధము వచ్చుచున్నది. కావున నీవు యింటికి పోయి నోము నోచుకుని దీపాల వేళ వరకు వుపవాసముండిన పిమ్మట భోజనము జేయు" మని చెప్పి అదృశ్యమయిరి. అంత నామె తన యింటికి వెళ్ళి జరిగిన విషయమును తల్లి దండ్రులకు చెప్పి యధావిధిని నోము నోచుకొనెను. తరువాత నామెకు చక్కని పడుచు మగనితో  పెండ్లి జరిగెను.
దీనికి వుద్యాపనము
అట్లతద్దెనాడు నోము నోచుకొని, పగటి వేళ భోజనము చేయక, నీరు త్రాగక, వుపవాసముండి, చీకటి పడినంతటనే గౌరీదేవికి పదియట్లు నైవేద్యము పెట్టి, విడిగా పదియట్లను, ఒక తోరమును ముత్తైదువునకు వాయనమియ్యవలెను. అట్లు పది సంవత్సరములు చేసిన పిమ్మట పదేసి అట్లు, కొంత డబ్బును, నల్లపూసలను, లక్క జోడును పదిమంది ముత్తైదువులకు వాయన మియ్యవలెను. పద్ధతి తప్పినను ఫలము తప్పదు, భక్తి తప్పకుండిన ఫలము కలుగును.

కారుణ్యమూర్తి హెన్రీ డ్యూనాంట్‌


''మన నాగరికతకు యుద్ధం ఎలా చేయాలో తెలుసు కాని, శాంతి ఎలాగ సాధించాలో తెలియదు'' అని ఇటాలియన్‌ రచయిత గుల్మిల్మో పెరేరో'' తన పుస్తకంలో ఎంతో భాదను వ్యక్తం చేశారు.  

1895వ సంవత్సరంలో ఫ్రాంకో-సార్డియన్ కూటమికి, ఆస్ట్రియా సామ్రాజ్యవాద సైనిక దళాలకు మధ్య జరిగిన యుద్ధంలో దాదాపు 40 వేలమంది సైనికులు అసువులు బాయగా, వేలాది మంది గాయపడ్డారు. ఈ యుద్ధంలో గాయపడ్డ క్షతగాత్రులను ఆదుకుని, వారికి సేవలందించేందుకు అప్పట్లో స్విట్జర్లాండ్‌కు చెందిన హెన్రీ డునాంట్ అనే వ్యక్తి ముందుకొచ్చాడు.
ఆ సంఘటన తరువాత... తానే ఇలాంటి వారికోసం ఓ సేవాసంస్థను ఎందుకు స్థాపించకూడదని ఆలోచనలో పడ్డాడు హెన్రీ డునాంట్. 
దేశ దేశాల మధ్య యుద్ధాలు, అంతర్యుద్ధాలు, హత్యలు, కలహాలతో సతమతమవుతున్న సమయంలో ఈ ప్రపంచంలో 125 సంవత్సరాల క్రితం ఈ ఉద్యమం ఏర్పడింది.  చిన్న చిన్న విషయాలలోనే  పెద్ద విషయాలు దాగివుంటాయి. అక్కడనుండే గొప్ప  గొప్ప ఉద్యమాలు ఆవిర్భవిస్తాయి అనే విషయాన్ని రుజువు చేసారు  కారుణ్యమూర్తి, కర్తవ్య దీక్షాపరుడు అయిన హెన్రీ డ్యూనాంట్‌ ప్రారంభించిన యుద్ధ క్షతగాత్రుల సహాయ కార్యక్రమం శాఖోపశాఖలుగా విస్తరిల్లింది.  అతని ఆలోచనల ఫలితంగా ఏర్పడిన సంస్థే ఈ రెడ్‌క్రాస్ ఇంటర్నేషనల్ సౌసైటీ. అంతర్జాతీయ స్థాయిలో ఏర్పాటైన ఈ సంస్థ ఇప్పుడు దాదాపు అన్నిరకాల సేవా కార్యకలాపాలను నిర్వహిస్తోంది.
హెన్రీ డ్యూనాంట్‌ (1828-1910) చేసిన ఆ గొప్ప సేవలో నుండే 'రెడ్‌ క్రాస్‌'' జన్మించింది. 1862లో తన ఈ ''చిన్న'' ప్రయోగం గురించి పుస్తకంగా ప్రచురించగానే క్షతగాత్రుల దయనీయస్థితి గురించి యూరప్‌లో ప్రజలు మేల్కొన్నారు. ఈయనే రెడ్ క్రాస్ ను ఏర్పరచారు. డ్యూనాంట్‌ స్విట్జర్‌లాండ్‌ దేశస్థుడు కనుక అతని గౌరవార్థం ఆ దేశపు జండారంగులను తల్లక్రిందులు చేసి తెల్ల జెండాపై ఎర్రక్రాసును రెడ్‌క్రాస్‌ గుర్తుగా ఆ కొత్త జెండాను రూపొందించారు. నోబెల్‌ శాంతి బహుమానం ప్రారంభించగానే 1901లో నోబెల్‌ బహుమతిని డ్యూనాంట్‌కు ఇవ్వడం జరిగింది. అంతేకాక 1963లో రెడ్‌క్రాస్‌ శతజయంతి సందర్భంగా నోబెల్‌ శాంతి బహుమానాన్ని రెడ్‌క్రాస్‌ సొసైటీకి ఇచ్చి గౌరవించారు.  
యుద్ధంలో మరణించడం, క్షతగాత్రులుకావడం వారి కర్మ, నుదిటివ్రాత, అన్నభావం నుండి బయటపడింది. ఏ దేశానికి చెందిన వారైనా, గెలిచినా, ఓడినా ఆ క్షతగాత్రు లకు సేవచేయడం మానవధర్మంగా ఈ రెడ్‌క్రాస్‌ భావిస్తోంది. రెండు ప్రపంచ యుద్ధాలలో ''రెడ్‌క్రాస్‌'' ఎనలేని సేవ చేసింది. జర్మనీలో హిట్లర్‌ యుద్ధంలో 'రెడ్‌క్రాస్‌'' జోక్యాన్ని అంగీకరించకపోవడం వల్ల జర్మన్‌ యుద్ధ శిబిరాలలో 90 శాతం మంది చనిపోయారు. దాన్నిబట్టి హిట్లర్‌ ఎంత కౄరుడో ప్రపంచానికి అర్థమయ్యింది. ఈనాడు వందకుపైగా దేశాలు రెడ్‌క్రాస్‌లో భాగస్వాములయ్యాయి. చివరికి అరేబియా, ఇతర మహ్మదీయ దేశాలు కూడా రెడ్‌క్రాస్‌లో భాగస్వాములయ్యాయి. ఆ ముస్లిం దేశాలలో రెడ్‌క్రాస్‌ గుర్తు తెల్లజెండాపై ఎర్రని చంద్రవంకగా మారింది. ఇరాన్‌లో రెడ్‌క్రాస్‌ ఎర్రని సింహం, సూర్యునిగా రూపొందింది. మానవతా దృష్టితో ప్రారంభమైన ఈ రెడ్‌క్రాస్‌ ఉద్యమంలో స్కూళ్ళు, కాలేజీలు భాగస్వామ్యమయ్యాయి.
పరస్పర అవగాహన, స్నేహం, ప్రపంచ శాంతి, సద్భావం ఈనాడు రెడ్‌క్రాస్‌ లక్ష్యాలుగా మారాయి. యుద్ధం వద్దు, శాంతి కావాలి అన్నది రెడ్‌క్రాస్‌ ఆకాంక్ష. రెడ్‌క్రాస్‌ ఒకనైతిక శక్తి. యుద్ధ మేఘాలు కారుమబ్బులులాగా వస్తూ వుంటే, రెడ్‌క్రాస్‌ చీకట్లో కాంతిరేక లాగా మెరుస్తోంది.  యుద్ధాలు లేదా ప్రకృతి వైపరీత్యాలు జరిగినప్పుడు తీవ్రంగా నష్టపోయిన వారిని ఆదుకుని వారికి ఆసరాగా నిలవడం కోసం ప్రత్యేకంగా ఏర్పాటైన సంస్థే "రెడ్‌క్రాస్ సొసైటీ". ఇది ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఇలాంటి సేవా సంస్థలన్నింటిలోకీ అతి పెద్దది.
స్విడ్జర్లాండ్‌ దేశపు జాతీయ జెండాలోని ఎర్రని బ్యాక్‌గ్రౌండ్‌లో తెల్లని క్రాస్‌ ఉంటుంది. దానిని తారుమారు చేసి తెల్లని బ్యాగ్‌డ్రాప్‌లో ఎర్రని క్రాస్‌ను లోగోగా ఏర్పరిచాడు. 8-5-1812న జన్మించిన హెన్రీ డ్యూనెన్ట్‌ గౌరవార్థం ప్రతి సంవత్సరం మే 8న ప్రపంచవ్యాప్తంగా రెడ్‌ క్రాస్‌ దినోత్సవం జరుపుకుంటారు. 1901 లో ఈయనకు నోబెల్‌ బహుమతి లభించింది. నేడు హెన్రీ వర్ధంతి సందర్బంగా ఈ కారుణ్యమూర్తికి  మన బ్లాగ్ ద్వారా నివాళి అందిస్తున్నాను .

సోమవారం, అక్టోబర్ 29, 2012

స్వామి వివేకానంద - సూక్తులు

సోమవారం, అక్టోబర్ 29, 2012


  • మన ఆలోచనలే మనలను తీర్చిదిద్దుతాయి.
  • అజ్ఞానులకు వెలుగుచూపండి. 
  • విద్యావంతులకు మరింత వెలుగుచూపండి.
  • ఆధునిక విద్య పెంచే అహంకారానికి అంతులేకుండా పోతూంది.
  • మీరు పవిత్రులు కండి. అప్పుడు ప్రపంచమంతా పవిత్రంగా కనబడి తీరుతుంది
  • వేదాంత దృక్పధంలో పాపమనేదే లేదు. పొరపాట్లు మాత్రమే ఉన్నాయి.  
  • మీరు పాపాత్ములనీ, ఎందుకూ  పనికిరానివారనీ అనడమే వేదాంతం అది చూసే దృష్టిలోనే పెద్ద పొరపాటు.
  • విగ్రహాన్ని దేవుడని అనవచ్చు. కానీ దైవం విగ్రహమే అని ఆలోచిస్తే, అది పెద్ద పొరపాటు.
  • మతం సిద్ధాంతాలలో,రాద్ధాంతాలలో లేదు. దాని రహస్యమంతా ఆచరణలోనే వుంది. 
  • పవిత్రంగా ఉండటం అంటే  పరులకు మేలు చేయడం- మతమంటే ఇదే.
  • ప్రతి ఒక్కరూ అధికారం కోసమే అర్రులు చాస్తారు. చివరికి మొత్తం వ్యవస్త కుప్పకూలుతుంది.
  • సజీవ దైవాలను సేవించండి. అంధుడు,పేదవాడు, వికలాంగుడు,దుర్బలుడు,కౄరుడు, ఇలా వివిధ రూపాల్లో భగవంతుడు మీ వద్దకు వస్తాడు. వారిలోని భగవంతుని గుర్తించండిచాలు.
  • " నువ్వు దుష్టుడివి " అనవద్దు. " నువ్వు మంచివాడివి ", కానీ"మరింత మెరుగవ్వాలి" అని మాత్రం అనండి.
  • హనుమంతుణ్ణి, జగజ్జననినీ స్మరించండి.మరుక్షణం మీలోని దౌర్బల్యం పిరికితనాలు మటుమాయమవుతాయి.
  • పురాణాలు వర్ణించిన ముప్ఫై మూడు కోట్ల దేవతల్లో విశ్వాసం ఉండీ, మీపై మీకు విశ్వాసం లేకపొతే విముక్తి లేదు.   – స్వామి వివేకానంద.

పలుకు దేనెల తల్లి పవళించెను

పలుకు దేనెల తల్లి పవళించెను
కలికి తనముల విభుని గలసినది గాన

నిగనిగని మోముపై నెఱులు గెలకుల జెదర
పగలైన దాక జెలి పవళించెను
తెగని పరిణతులతో తెల్లవారినదాక
జగదేక పతి మనసు జట్టి గొనె గాన

కొంగు జారిన మెఱుగు గుబ్బ లొలయగ దరుణి
బంగారు మేడపై బవళించెను
చెంగలువ కనుగొనల సింగారములు దొలుగ
అంగజ గురునితోడ నలసినది గాన

మురిపెంపు నటనతో ముత్యాల మలగుపై
పరవశంబున దరుణి పవళించెను
తిరు వేంకటాచలా ధిపుని కౌగిట గలసి
అరవిరై యూరుల జెమట యంటినది గాన

శనివారం, అక్టోబర్ 27, 2012

కాల్ చేసి నాతో మాట్లాడైవచ్చు.

శనివారం, అక్టోబర్ 27, 2012

ఆకాశం లో ఎప్పుడైనా హరివిల్లు వస్తుంది కానీ ఆదివారం మాత్రం ప్రపంచం మొత్తం మీద ఒకేసారి హరివిల్లు వస్తుంది అదే నా షో పేరు హరివిల్లు. ఆహరివిల్లు కూడా ఉదయం 10:30 నుండి మద్యాహ్నం 12:00 గంటలవరకు వస్తుంది. అది కూడా ఎక్కడబడితే అక్కడ రాదండి కేవలం Online Radio Josh Live లో మాత్రమే వస్తుంది. ఇది కేవలము live ప్రోగ్రాం మాత్రమె కాబట్టి అస్సలు మిస్ అవ్వకండి. నా కబుర్లు, పాటలు , కదలు వినటమే కాదండి మీరు నాతో సరదాగా మాట్లాడైవచ్చును. నాతో మాట్లాడి నాప్రశ్నలకు జవాబులు చెప్పెయవచ్చు. మరి హరివిల్లు షోను అస్సలు మిస్ అవ్వద్దు.
మరి నా షోపేరు చెప్పేసాను కదా, మరి నాతో మాట్లాడాలి అంటే


Skype id: radiojoshlive

US: 914-214-7574

UK: 20-3286-9594

AUS: 28003-4546

Local Number: 040-4200-2003

ఈ నెంబర్స్ కాల్ చేసి నాతో మాట్లాడైవచ్చు. మరి నా షోను మిస్ కాకండి. ధన్యవాదములు.


భూకాంత సౌభాగ్య లక్ష్మి





తగునయ్య హరినీకు దానము దెచ్చుకొనిన
జగములో భూకాంత సౌభాగ్య లక్ష్మి

కిమ్ముల శిశుపాలుని గెలిచి చేకొంటివిగా
సమ్మతించి రుక్మిణి జయలక్ష్మి
అమ్ముమొనను జలధి నడచి లంక సాధించి
కమ్మర జెకొన్న సీత ఘన వీర లక్ష్మి

నరకాసరునడచి నవ్వుతా జేయివేసితివి
సరిగా సత్యభామెపో సంగ్రామలక్ష్మి
హిరణ్యకశిపు గొట్టి యింద్రాదులకు నీచే
వరమిప్పించిన యాకె వరలక్ష్మి

నిండిన వురము మీద నిఖిల సంపదలతో
అండనుండె యాకెపో ఆదిలక్ష్మి
మెండగు శ్రీవేంకటాద్రిమీద నీసరుస నేగే
గండుమీరె కళాలతో కల్యాణ లక్ష్మి

పసిపాపలను , పువ్వులును, చంద్రుని

   











పసిపాపల నవ్వులను, అందమైన పువ్వులును, అందమైన ప్రకృతిని, అందమైన చల్లని వెన్నెలను పంచే చంద్రుని చూసి ఆనందించని వారు వుండరట.  మీరుకూడా ఏకీభావిస్తున్నారా లేదా?

శుక్రవారం, అక్టోబర్ 26, 2012

మహావిష్ణువు నారదుల సంభాషణ.

శుక్రవారం, అక్టోబర్ 26, 2012


ఒకరోజు మహావిష్ణువు నారదుల మధ్యసంభాషణ.
విష్ణువు :-నారదా ! పంచభుతాలలో ఎవరు గొప్పా?
నారదుడు:- భూమి గొప్పది.
విష్ణువు:- భూమండలం లో భూమి ఒక వంతే కదా. మూడు వంతులు నీరే కదా భూమి ఎలా గొప్పది.
నారదుడు:- అయితే జలం గొప్పది.
విష్ణువు:- అంతటి జలాన్ని అగస్యుడు తాగాడు కదా.
నారదుడు:- అయితే అగస్యుడు గొప్పవాడు.
విష్ణువు:- అంత పెద్ద ఆకాశంలో అగస్యుడు నక్షత్రమే కదా.
నారదుడు:- అయితే ఆకాశమే గొప్పది.
విష్ణువు:- అంత ఆకాశాన్ని భగవంతుడు వామన రుపంలో తన పాదంతో కప్పెసాడు కదా.
నారదుడు:- అయితే భగవంతుని పాదం గొప్పది.
విష్ణువు:- భగవంతుని పాదమే గొప్పది అయితే ,మొత్తం భగవంతుని రూపాన్నే భక్తుడు తన హృదయము లో బంధిస్తున్నాడు కదా .
నారదుడు:- అయితే భక్తుఢే గొప్పవాడు.

గురువారం, అక్టోబర్ 25, 2012

అయ్యో యేమరి నే

గురువారం, అక్టోబర్ 25, 2012

GOPAL KRISHNA - (Litho/Print)

అయ్యో యేమరి నే నాఁడాప్పుడేమై వుంటినో

అయ్యడ నీ దాసి నైతే ఆడరింతుగా


అల్లనాడు బాలుడవై ఆవులగాచేవేళ
చిల్లర దూడనైతే చేరి కాతువుగా
వల్లెగా విటుడవై రేపల్లె లో నుండే నాడు
గొల్లెత నయిన నన్ను కూడుకొందువుగా


మేలిమి రామావతారవేళ రాయి రప్ప నైనా
కాలు మోపి బదికించి కాతువుగా
వాలి సుగ్రీవుల వద్ద వానరమై వుండినాను
యేలి నన్ను పనిగొని యీడేర్తువుగా


వారిధిలో మచ్చ కూర్మావతారములైన నాడు
నీరులో జంతువునైనా నీవు గాతువుగా
యీరీతి శ్రీవేంకటేశ యేలితివి నన్ను నిట్టే
మోరతోపున నిన్నాళ్ళు మోసపోతిగా

My Blog Lovers

నా యూట్యూబ్ చానల్స్ ప్లీజ్ సబ్స్క్రిబ్ చేయండీ

Diabetic Challenger

DIABETIC CHALLENGER YOUTUBE CHANNEL. PLASE SUBSCRIBE MY CHANNEL...... THANK YOU VERY MUCH.

Ammamma Tho Nenu (అమ్మమ్మ తో నేను

Please subscribe our channel Ammamma Tho Nenu (అమ్మమ్మ తో నేను)