Blogger Widgets

బుధవారం, ఆగస్టు 29, 2012

తెలుగు భాష దినోత్సవ శుభాకాంక్షలు

బుధవారం, ఆగస్టు 29, 2012



తెలుగులో వాడుక భాషా ఉద్యమ పితామహుడుగిడుగు వెంకట రామమూర్తి. గ్రాంధికభాషలో ఉన్న తెలుగు వచనాన్ని ప్రజల వాడుకభాషలోకి తీసుకు వచ్చి, నిత్య వ్యవహారంలోని భాషలో ఉన్న అందాన్నీ, వీలునూ తెలియజెప్పిన మహనీయుడు. ఆంధ్రదేశంలో వ్యావహారిక భాషోద్యమానికి మూలపురుషుడు. బహుభాషా శాస్త్రవేత్త, చరిత్రకారుడు, సంఘసంస్కర్త,హేతువాది. శిష్టజన వ్యవహారికభాషను గ్రంథరచనకు స్వీకరింపజేయడానికి చిత్తశుద్దితో కృషిచేసిన అచ్చతెలుగు చిచ్చర పిడుగు గిడుగు. గిడుగు ఉద్యమంవల్ల కొద్దిమందికో పరిమితమైన చదువు వ్యావహారికభాషలో సాగి, అందరికీ అందుబాటులోకి వచ్చింది. పండితులకే పరిమితమైన సాహిత్యసృష్టి, సృజనాత్మకశక్తి ఉన్న ప్రతి ఒక్కరికీ వీలైంది.గిడుగురామ్మూర్తి జయంతి ఆగష్టు 29 నితెలుగు భాషా దినోత్సవంగా జరుపుకుంటున్నాము.  గిడుగు రామమూర్తి పుట్టిన రోజు ఆగష్టు 29 ని తెలుగు భాషా దినోత్సవముగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము మరియు  ప్రజలు పాటిస్తున్నారు

విశ్వనాథ సత్యనారాయణ గారు రామమూర్తి పంతులు గారిగురించి ఇలా అన్నారు.  "రామ్మూర్తి పంతులు తెలుగు సరస్వతి నోములపంట".  అని ఇంకా  "రామ్మూర్తి పంతుల వాదాన్ని అర్థం చేసుకోక, దురర్థం కలిగించి తెలుగువాళ్ళు ఎంతో నష్టపోయినారు".
రోజు సభలు జరిపి, పదోతరగతి, ఇంటర్వార్షిక పరీక్షల్లో తెలుగులో ప్రతిభ చూపుతున్న విద్యార్థులకు ప్రోత్సాహకాలని, తెలుగు భాషా చైతన్య సమితి లాంటి స్వచ్ఛంధ సంస్థలు అందచేస్తున్నాయి. ప్రభుత్వ కార్యాలయాలలో తెలుగు వినియోగం పెంచడానికి ఎంతగానో కృషి చేస్తున్నారు.  ప్రపంచంలో తెలుగు భాష ఒక విశిష్టమైన స్థానాన్ని కలిగివుంది.  ప్రపంచీకరణ వలన పిల్లలను ఇంగ్లీషు మాధ్యమములో చదివించటానికి ఎక్కువ మంది తల్లిదండ్రులు ఆసక్తి చూపుతున్నారు. ప్రస్తుతము కేవలం 27% మంది పిల్లలు మాత్రమే తెలుగు మాధ్యమములో చదువుతున్నారని వినికిడి మరియు లెక్కలు కూడా తెలియ జెప్పుతున్నాయి.  ఇది ఎంతో గొప్ప మార్పుగా చెప్పుకోవచ్చు.  తెలుగు భాష దినోత్సవ శుభాకాంక్షలు .

ఆదివారం, ఆగస్టు 26, 2012

మదర్ థెరీస జయంతి

ఆదివారం, ఆగస్టు 26, 2012

మదర్ థెరీసాగా పేరు పొందిన ఆగ్నీస్ గోక్షా బొజాక్షువు (ఆగష్టు 261910 – సెప్టెంబరు 51997మాసిడోనియాలో అల్బేనియన్ సంతతికి చెందిన కుటుంబంలో జన్మించింది. ఈమె తన జీవితాన్ని పేద రోగులకు సేవచేయడంలోనే గడిపింది. ఈమె సేవకు గుర్తింపుగా 1979 లో ప్రతిష్టాత్మక నోబెల్ శాంతి పురస్కారము లభించింది. ఈమెకు తరవాత భారతదేశ ప్రభుత్వం కూడా 1980లో భారతరత్నను ప్రకటించింది.  ఈరోజు మదర్ థెరీస జయంతి సందర్బంగా అందరికి శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాను.

నా షో పేరు హరివిల్లు

ఆకాశం లో ఎప్పుడైనా హరివిల్లు వస్తుంది కానీ ఆదివారం మాత్రం ప్రపంచం మొత్తం మీద ఒకేసారి హరివిల్లు వస్తుంది అదే నా షో పేరు హరివిల్లు.  ఆహరివిల్లు కూడా ఉదయం 10:30 నుండి మద్యాహ్నం 12:00  గంటలవరకు వస్తుంది.  అది కూడా ఎక్కడబడితే అక్కడ రాదండి కేవలం  Online Radio Josh Live  లో మాత్రమే  వస్తుంది.  ఇది  కేవలము live ప్రోగ్రాం మాత్రమె కాబట్టి అస్సలు మిస్ అవ్వకండి.  నా కబుర్లు, పాటలు , కదలు వినటమే కాదండి మీరు నాతో సరదాగా మాట్లాడైవచ్చును.  నాతో మాట్లాడి నాప్రశ్నలకు జవాబులు చెప్పెయవచ్చు.  మరి హరివిల్లు షోను అస్సలు మిస్ అవ్వద్దు.   
మరి నా షోపేరు చెప్పేసాను కదా,  మరి నాతో మాట్లాడాలి అంటే 
Skype id: radiojoshlive
US: 914-214-7574
UK: 20-3286-9594
AUS: 28003-4546
Local Number: 040-4200-2003  
ఈ నెంబర్స్ కాల్ చేసి నాతో మాట్లాడైవచ్చు.  మరి నా షోను మిస్ కాకండి.  ధన్యవాదములు. 

బుధవారం, ఆగస్టు 22, 2012

మాటిమాటికి వ్రేలు మడిచి

బుధవారం, ఆగస్టు 22, 2012


మాటిమాటికి వ్రేలు మడిచి యూరించుచు నూరుగాయలు దినుచుండు నొకడు
ఒకని కంచములోనిదొడిసి చయ్యనమ్రింగి చూడలేదని నోరు చూపు నొకడు
యేగురార్గులు చల్దులెలమి పన్నిదమాడి ఊర్కొని కూర్కొని కుడుచునొక్కడు
యిన్ని యుండగ పంచియిడుట నెచ్చెలితనమనుచు బంతెనగుండులాడునొకడు
కృష్ణు చూడుమనుచు కికురించి పలుమ్రోల మేలిభక్ష్యరాసి మెసగునొకడు
నవ్వునొకడు సఖుల నవ్వించు నొకడు ముచ్చటాడు నొకడు మురియునొకడు 

(పోతన భాగవత పద్యం )


అచ్చపురాల యమునలోపల
ఇచ్చగించి భుజియించితి కృష్ణ

ఊరుగాయలును నొద్దికచద్దులును
నారగింపుచును నందరిలో
సారె బాలుల సరసాల తోడ
కోరి చవులు గొంటివి కృష్ణా

ఆకసంబున కాపుర ముఖ్యులు
నాకలోకపు నాందులును
కైకొని యజ్ఞకర్తయాతడని
జోక గొనియాడఁ జొక్కితి కృష్ణా

పేయలు లేవు పిలువుడనుచు
కోయని నోరఁగూతలును
మాయల బ్రహ్మము మతము మెచ్చుచు
చేయని మాయలు సేసితి కృష్ణా

ఆదివారం, ఆగస్టు 19, 2012

Know U R GK

ఆదివారం, ఆగస్టు 19, 2012

World Photography Day. First photos of The World.

Earliest Known Photograph [1825]


2. The First Photograph Ever Taken “View from the Window at Le Gras” [Circa, 1826]


3. The First Light Picture and Human Potrait Ever Taken [Oct,Nov 1839]

4. The Photo of the first Photographic Studio [1893]


Today World Photography Day, So Happy Photography Day.

ప్రపంచ మానవత్వదినోత్సవ శుభాకాంక్షలు

Today is World Humanitarian Day. This is a good way to show we believe in humanity.
Today is World Humanitarian Day. This is a good way to show we believe in humanity.
నేడు ప్రపంచ మానవత్వ దినోత్సవము.  అందువల్ల మన మానవాళి అందరికి  ప్రపంచ మానవత్వదినోత్సవ శుభాకాంక్షలు

శుక్రవారం, ఆగస్టు 17, 2012

చూడరమ్మ సతులారా సోబాన పాడరమ్మ

శుక్రవారం, ఆగస్టు 17, 2012


ప|| చూడరమ్మ సతులారా సోబాన పాడరమ్మ |
కూడున్నది పతి చూడి కుడుత నాంచారి ||

చ|| శ్రీమహాలక్ష్మియట సింగారాలకే మరుదు |
కాముని తల్లియట చక్కదనాలకే మరుదు |
సోముని తోబుట్టువట సొంపుకళలకేమరుదు |
కోమలాంగి ఈ చూడి కుడుత నాంచారి ||

చ|| కలశాబ్ధి కూతురట గంభీరలకే మరుదు |
తలపలోక మాతయట దయ మరి ఏమరుదు |
జలజనివాసినియట చల్లదనమేమరుదు |
కొలదిమీర ఈ చూడి కుడుత నాంచారి ||

చ|| అమరవందితయట అట్టీ మహిమ ఏమరుదు |
అమృతము చుట్టమట ఆనందాలకేమరుదు |
తమితో శ్రీవేంకటేశు దానె వచ్చి పెండ్లాడె |
కౌమెర వయస్సు ఈ చూడి కుడుత నాంచారి ||

బుధవారం, ఆగస్టు 15, 2012

స్వాతంత్ర్యదినోత్సవ శుభాకాంక్షలు

బుధవారం, ఆగస్టు 15, 2012

100 సంవత్సరముల విదేశీయుల పాలన నుండి శాశ్వితాముగా విముక్తి పొందిన దినమును మనము స్వాతంత్ర్య దినోత్సవముగా జరుపుకుంటున్నాము.  ఈ సంవత్సరము మనము 66వ స్వాతంత్రయదినోత్సవముగా జరుపుకుంటున్నాము .  ఎందరో మహానుబావులు ఎన్నో త్యాగాలు చేసి స్వాతంత్ర్య భారతదేశానికి మనకు అప్పగించారు.  దీనికి కొంతమంది అహింసా మార్గములో ప్రయత్నించారు.  మరికొందరు హింసా మార్గములో ప్రయత్నించారు. చివరికి 1947 ఆగష్టు 15 న స్వాతంత్ర్యము పొందాం.  అలా త్యాగాలు చేసి సాధించిన భారత మాతకు వందనం తెలుపుతూ.  వారిని గుర్తు చేసుకొని జెండా ఎగురవేసాం కదా.  ఈ స్వాతంత్ర్యదినోత్సవ దిన సందర్భముగా అందరికి నా శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాను.

మంగళవారం, ఆగస్టు 14, 2012

బంగారు పువ్వులు పూచే తల్లికి భారత దాత్రికి వందనం

మంగళవారం, ఆగస్టు 14, 2012

Flag India animated gif 240x180

బంగారు పువ్వులు పూచే తల్లికి భారత దాత్రికి వందనం


 స్వాతంత్ర్య దినోత్సవం సమర్బముగా అందరికి శుభాకాంక్షలు.

సోమవారం, ఆగస్టు 13, 2012

భారత్ మాతా ఆలయం

సోమవారం, ఆగస్టు 13, 2012






భారత్ మాతా ఆలయం పవిత్ర స్థలం హరిద్వార్ వద్ద ఆశ్రమం కు సప్త సరోవర్ దగ్గరగా ఉంది. భారత్ మాతా యొక్క మందిర్ స్వామి సత్యమిత్రనంద్  గిరి ద్వారా ఉద్భవించింది జరిగినది. ఈ దేవాలయం ను మరియు భారతదేశం కు , శ్రీమతి యొక్క లేట్ ప్రధాన మంత్రి 15 మే న ఇందిరా మహాత్మా గాంధీ, 1983 గారిచే ఏర్పరచారు .

భారతదేశం యొక్క తల్లి దేవత గా ప్రాతినిధ్యం భారత్ మాతా రూపంలో భారత్ మాతా భారతదేశం యొక్క తల్లి దేవత చిత్రించబడినది అని అర్ధం. భారత్ మాతా ఇక్కడ  కుంకుమ రంగు తో చీర కట్టుకొని ఒక రూపం లో ఒక మహిళ గా చిత్రం మరియు ఆమె కూడా ఒక చేతిలో భారతీయ జెండా ను కలిగి వుంటుంది.  ఆమెను  "తల్లి భారతదేశం" అని పిలుస్తారు.

భారత్ మాతా ఆలయం కూడా ఎనిమిది కథలు కలిగి "ఎనిమిది అంతస్థుల ఆలయం" అని అంటారు. ఈ దేవాలయం దాదాపు 180 అడుగుల ఎక్కువ. ఎలివేటర్లు యాత్రికులకు సహాయంగా  ఆలయం లో అమర్చబడి ఉంటాయి. భారత్ మాతా ఆలయం ఒక నిర్దిష్ట మత దేవుళ్లు తో , అనేక పౌరాణిక ఇతిహాసాలు యొక్క పురాణాలు, నాయకులు మరియు స్వాతంత్ర సమరయోధులు ఆధారపడి ఉన్నాయి ఆ ఎనిమిది కథలు ఉన్నాయి గా. ఇది దేశ రాజ్యాంగం లో ప్రధాన పాత్ర పోషించిన వారి గురించి చూపిస్తుంది.

మొదటి ఫ్లోర్లో  భారత్ మాతా చాలా అందమైన విగ్రహం ఒక చేతిలో పాలు ఒక కుండ పట్టుకొని మరియు ఇతర చేతిలో ధాన్యం కుప్పతో  హాల్ లో అలంకరించి ఉంది.

రెండవ అంతస్తు న 'షూర్ మందిర్' భారతదేశ వాస్తవ నాయకులుకు అంకితమై ఉంది.

ఆలయం 'మాతృ మందిర్'  మూడవ ఫ్లోర్ లో భారతదేశం యొక్క మహిళల సాఫల్యంనకు  అంకితమై ఉంది అక్కడ  మైత్రి, మీరా బాయి, సావిత్రి మొదలైన వారికి అంకితమై వుంటుంది.

బౌద్ధ, జైన మరియు సిక్కు వివిధ మతాల గొప్ప పుణ్యాత్ముల పరిచయం గా నాల్గవ ఫ్లోర్ 'సంత్ మందిర్' గా పిలుస్తారు.  కోఎగ్జిస్టెన్స్ అన్ని మతాలు గోడపై ఒక సింబాలిక్ రూపంలో వర్ణించబడింది.

ఐదవ అంతస్తు అసెంబ్లీ హాల్ ఉంది. భారతదేశం యొక్క సహజ బ్యూటీస్ కూడా చిత్రాలు మరియు చారిత్రక వాస్తవాలను ద్వారా ప్రదర్శించారు.

దేవతల వివిధ రూపాల్లో వంటి సతి, దుర్గ, పార్వతి, కాళి, రాధా, సరస్వతి మొదలైన కూడా ఉన్నాయి ఆరవ అంతస్తు లో అన్ని దేవతల  శక్తి ఉంది

ఏడవ అంతస్తు మత్స్యావతారము, కూర్మావతారము, వరాహావతారము, నరసింహ , వామనుడు, పరశురామ , రామ, కృష్ణ, బుద్ధ , కల్క్యావతారము వంటి అవతారంలు  తో విష్ణువుకు  అంకితమై ఉంది

ఎనిమిదవ అంతస్తు భక్తులు ఒక విశాలదృశ్య హరిద్వార్ దృష్టిలో, హిమాలయాలు, మరియు సప్త సరోవర్  మహత్వము పొందగలరు అక్కడ శివుడు యొక్క విగ్రహం అంకితంగా  ఉంది.

ఆదివారం, ఆగస్టు 12, 2012

Catch me live 2day @ 10:30 am

ఆదివారం, ఆగస్టు 12, 2012


Hey friends catch me live today (Sunday) show
with your little RJ Sree Vaishnavi
from 10:30 am to 12:00 pm
only on RadioJoshLive
Masth Maza Masth Music :)
My show Name is Harivillu
Fun with me
If you want to talk with me plz call these numbers

Skype id: radiojoshlive
US: 914-214-7574
UK: 20-3286-9594
AUS: 28003-4546
Local Number: 040-4200-2003
Thank You Very Much.

గురువారం, ఆగస్టు 09, 2012

శ్రీకృష్ణావతార జన్మదినం

గురువారం, ఆగస్టు 09, 2012

ఈ భారతావనిలో శ్రీకృష్ణుడు అంటే తెలియని వారుండరు. ఆయనే ఈ నవభారత నిర్మాణానికి సూత్రధారుడు. శ్రీకృష్ణుని భగవంతుని అవతారంగా, మానవ రూపంలో, జన్మించిన దేవునిగా ఆరాధించామేగాని మానవుడిగా పుట్టిన ఆ దేవదేవుని మానవునిగాక; వారి లీలలను మానవ మనుగడతో సరిపోల్చుకుంటూ అర్థం చేసుకోవడం కూడా అంతే ముఖ్యంగా తెలుసుకోవాలి.
అట్టి "శ్రీకృష్ణావతార జన్మదినం" మనకు చాలా పవిత్రమైన పుణ్యదినం.  శ్రీముఖనామ సంవత్సర దక్షిణాయన 
వర్షఋతువు శ్రావణ బహుళ అష్టమి రోహిణి నక్షత్రం నాల్గవపాదం బుధవారం నాడు అర్థరాత్రి యదువంశంలో దేవకీదేవి, వసుదేవుల పుత్రునిగా "శ్రీకృష్ణుడు" జన్మించాడు. అంటే! (క్రీస్తు పూర్వం 3228 సం||)
కృష్ణ జన్మాష్టమి అనగానే మనకు చిన్ని చిన్ని ముద్దుల మొహము కల యశోదనందనుడు కృష్ణుడు గుర్తు వచ్చేస్తాడు.  శ్రీ మహావిష్ణువు మన లోకాన్ని కాపాడటానికి ఎన్నో జన్మలు ఎత్తారు.అందులో  ఎనిమిదవ అవతారము శ్రీకృష్ణుడుగా జన్మించారు. కృష్ణ జన్మాష్టమిని కృష్ణాష్టమి అని లేదా జన్మాష్టమి లేదా గోకులాష్టమి లేదా అష్టమి రోహిణి అని అంటారు .
శ్రీకృష్ణుడు దేవకి వసుదేవులకు దేవకి ఎనిమిదో గర్భంగా శ్రావణమాసము కృష్ణ పక్షం అష్టమి తిధి రోజు కంసుడు వారిని బంధించిన  చెరసాలలో జన్మించాడు.
కృష్ణాష్టమి నాడు భక్తులు పగలంతా ఉపవాసం ఉండి, సాయంకాలం శ్రీకృష్ణుని పూజిస్తారు. శ్రావణ మాసంలో లభించే పళ్ళు, శొంఠి, బెల్లం కలిపిన వెన్న, పెరుగు, మీగడ స్వామికి నైవేద్యం పెడతారు. ఊయలలు కట్టి అందులో శ్రీకృష్ణ విగ్రహాల్ని పడుకోబెట్టి ఊపుతూ జోల పాటలు, కీర్తనలు పాడతారు.   వీధుల్లో ఎత్తుగా ఉట్లు కట్టి పోటీపడి వాటిని కొడతారు.
భక్తిశ్రద్ధలతో శ్రీకృష్ణ జయంతి వ్రతంగా ఆచరిస్తే గోదానం చేసిన ఫలితం, కురుక్షేత్రంలో సువర్ణదానం చేసిన ఫలం దక్కుతుందని బ్రహ్మాండ పురాణం చెప్పింది. కలియుగంలో కల్మషాల్ని హరించి, పుణ్యాల్ని ప్రసాదించే పర్వదినం ఇదని కూడా వివరించింది.. శ్రీకృష్ణ జన్మాష్టమిని గురించి తొలి తెలుగు వాగ్గేయకారుడు తాళ్ళపాక అన్నమాచార్యుడు ఒక కీర్తనలో ఇలా చెప్పారు.
చిన్నవాడు నాలుగుచేతులతోనున్నాడు

కన్నప్పుడే శంఖముచక్రముచేతనున్నది

నడురెయి రోహిణి నక్షత్రమునబుట్టె
వడి కృష్ణుడిదివో దేవతలందు
పడిన మీ బాధలెల్ల ప్రజలాల యిప్పుడిట్టె
విడుగరాయ మీరు వెరవకుడికను

పుట్టుతనె బాలుడు అబ్బురమైన మాటలెల్ల
అట్టె వసుదేవుని కానతిచ్చెను
వట్టిజాలింకేల దేవతలాల మునులాల
వెట్టి వేములు మానెను వెరవకుడికను

శ్రీవేంకటనాథుడే యీసిసువు తానైనాడు
యీవల వరము లెల్లా నిచ్చుచును
కావగ దిక్కైనా డిక్కడనె వోదాసులల
వేవేగ వేడుకతోడ వెరవకుడికను
ఆ బాలకృష్ణుడు దినదిన ప్రవర్థమాన మగుచూ తన లీలావినోదాదులచే బాల్యమునుండే, అడుగడుగునా భక్తులకు జ్నానోపదేశం చేస్తూ వచ్చినాడు. ఈ బాలకృష్ణుడు ఇంటింటా తన స్నేహితులతో వెన్నముద్దలు దొంగలిస్తూ వెన్నదొంగగా ముద్రవేసుకున్నాడు. అలా వెన్నముద్దల దొంగతనంలో కూడా మానవులకు అందని దేవరహస్యం ఉందిట. వెన్న జ్నానానికి సంకేతంగా చెప్తారు. పెరుగును మధించగా మధించగా కాని వెన్న లభ్యంకాదు కదా! అట్టి తెల్లని వెన్నను తాను తింటూ, ఆ అజ్నానమనే నల్లని కుండను బద్దలుకొట్టి మానవులలో జ్నానజ్యోతిని వెలిగించడమే కృష్ణ సందేశంగా భావించాలి అని చెప్తూ వుంటారు.  
అలాగునే మరోచిన్నారి చేష్టలో మరో సందేశాన్ని చెప్తారు. గోపికలు కుండలలో ఇండ్లకు నీళ్లను యమునానదిలో నుండి తీసుకుని వెళుతూవుంటే, రాళ్లను విసిరిచిల్లు పెట్టేవాడట. అలా ఆకుండ మానవశరీరము అనుకుంటే ఆకుండలోని నీరు 'అహంకారం' ఆ అహంకారం కారిపోతేనేగాని జీవికి ముక్తి లభించదని ఇలా వారి లీలలోని అంతర్యాన్ని భాగవతోత్తములు వివరిస్తూ ఉంటారు.
ఇక చిన్న తనమునుండే అనేకమంది రాక్షసులను సంహరిస్తూ దుష్టశిక్షణ శిష్టరక్షణ కావిస్తూ కురుపాండవ సంగ్రామములో అర్జునునకు రథసారధియై అర్జునిలో ఏర్పడిన అజ్నానందకారాన్ని తొలగించుటకు "విశ్వరూపాన్ని" చూపించి గీతను బోధించి, తద్వారా మానవాళికి జ్నానామృతాన్ని ప్రసాదించాడు. 

మంగళవారం, ఆగస్టు 07, 2012

"హరిత విప్లవ పిత" పుట్టినరోజు శుభాకాంక్షలు.

మంగళవారం, ఆగస్టు 07, 2012



"హరిత విప్లవ పిత" గా పేరొనబడే ఎమ్‌.ఎస్‌. స్వామినాధన్‌ భారత వ్యవసాయరంగంలో అభివృద్ధికి చేసిన కృషి ప్రశంసనీయం.  నేడు మనకు తగినంత ఆహారం పొందడం అంటు జరుగుతోంది అంటే దీని కారణం అయిన Prof M.S. స్వామినాథన్.  ఈయన ఒక ఆదర్శ శాస్త్రవేత్త మరియు ఈయనను హరిత విప్లవం కారకుడుగా చెప్పుకోవచ్చు . M.S. స్వామినాథన్ ఆగష్టు 7, 1925 న గల కుంభకోణం లో జన్మించాడు. స్వామినాథన్కు  11 ఉన్నప్పుడు అతని తండ్రి మరణించాడు. స్వామినాథన్  భారతదేశం లో వున్నా శాస్త్రవేత్తలలో గొప్ప  జన్యుశాస్త్రవేత్త మరియు ప్రఖ్యాత అంతర్జాతీయ నిర్వాహకుడు, ఉంది "హరిత విప్లవం," ఒక కార్యక్రమం ఇది కింద గోధుమ, బియ్యం మొలకల అధిక దిగుబడి రకాలు పేద రైతుల రంగాలలోనాటింపచేశారు . స్వామినాథన్ భారతదేశం లో గోధుమ అధిక దిగుబడి రకాల పరిచయంచేసి  మరియు అభివృద్ధి పరిచారు, తన నాయకత్వం మరియు విజయం కోసం "భారతదేశం లో హరిత విప్లవం తండ్రి", అని అంటారు. అతను M.S. స్వామినాథన్ రీసెర్చ్ ఫౌండేషన్ వ్యవస్థాపకుడు మరియు ఛైర్మన్ గా వున్నారు. అతని పేర్కొంది దృష్టి ఆకలి మరియు పేదరికం ప్రపంచం ఉద్యమించారు. డా స్వామినాథన్ ముఖ్యంగా పర్యావరణపరంగా స్థిరమైన వ్యవసాయం ఉపయోగించి, స్థిరమైన అభివృద్ధికి భారతదేశం కదిలే ఒక న్యాయవాది ఉంది , స్థిరమైన ఆహార భద్రత కలిగించారు మరియు ఒక "సతత హరిత విప్లవం" అని పిలిచే జీవవైవిధ్యం చూపించారు, విప్లవం యొక్క సంరక్షణ 1972 నుండి 1979 వరకు ఆయన అగ్రికల్చరల్ రీసెర్చ్ ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ డైరెక్టర్ జనరల్గా, మరియు అతను 1979 నుండి 1980 వరకు వ్యవసాయ శాఖ మంత్రిగా పని చేశారు. అతను అంతర్జాతీయ వరి రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ (1982-88) డైరెక్టర్ జనరల్ పనిచేశాడు మరియు 1988 లో ప్రకృతి మరియు సహజ వనరుల ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ అధ్యక్షుడు అయ్యాడు.  డాక్టర్ స్వామినాథన్ ప్రాథమిక మరియు అనువర్తిత ప్లాంట్ బ్రీడింగ్, వ్యవసాయ పరిశోధన మరియు అభివృద్ధి మరియు సహజ వనరుల పరిరక్షణకు లో సమస్యలు విస్తృత న సహచరులు మరియు విద్యార్ధులు సహకారంతో ప్రపంచవ్యాప్తంగా పని చేసింది.  స్వామినాథన్ "ఎకనామిక్ ఎకాలజీ యొక్క తండ్రి" గా యునైటెడ్ నేషన్స్ ఎన్విరాన్మెంట్ ప్రోగ్రాం వర్ణించారు.  డాక్టర్ స్వామినాథన్ అనేక అసాధారణ అవార్డులు మరియు బహుమతులు అందుకున్నాడు. ఈ బహుమతులు కొనసాగటానికి మరియు తన పని విస్తరించేందుకు సహాయం చేసింది, ఇది పెద్ద మొత్తంలో డబ్బు, ఉన్నాయి.  జీవ ఒక పర్యావరణ సంబంధిత నిలకడగా ఆధారంగా ఉత్పాదకత, మరియు "1991 జీవ వైవిధ్య పరిరక్షణా ప్రోత్సాహకం.  అతను ప్రపంచవ్యాప్తంగా విశ్వవిద్యాలయాలు నుండి 50 గౌరవ డాక్టరేట్ డిగ్రీలు కలిగి ఉంది.  జాతీయ అవార్డులు అతను దేశం ప్రయోజనకరంగా తన పని కోసం భారతదేశం లో పలు అవార్డులను సన్మానించారు చెయ్యబడింది.  ఇన్ని చేసిన ఇంత గొప్ప హరిత విప్లవకారుడు M . S. స్వామినాధన్ ను మనం ఆదర్శంగా తీసుకోవాలి.  So, M . S .స్వామినాధన్ గారు ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్నారు కావునా.  ఆయనకీ మన బ్లాగ్ ద్వారా ఇలాంటి పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని ఆశిస్తూ M . S . స్వామినాధన్ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాం.

సోమవారం, ఆగస్టు 06, 2012

పెన్సిలిన్ ప్రదాత అలెగ్జాండర్ ఫ్లెమింగ్

సోమవారం, ఆగస్టు 06, 2012

 పెన్సిలిన్‌,అలెగ్జాండర్‌ ఫ్లెమింగ్‌, జయంతి

స్కాట్లాండ్‌లో 1881 ఆగస్టు 6న ఓ రైతు కుటుంబంలో ఎనిమిది సంతానంలో చివరివాడిగా పుట్టిన ఫ్లెమింగ్‌, ఏడేళ్ల వయసులోనే తండ్రిని కోల్పోయాడు. అమ్మ పొలం పనులు చేస్తుంటే అక్కడి బడిలోచదివిన అతడు, ఆపై లండన్‌లో ఉండే పెద్దన్నయ్య దగ్గరకు వెళ్లి హైస్కూల్లో చేరాడు. అయితే ఆర్థిక ఇబ్బందుల వల్ల చదువు మధ్యలోనే ఆపేసి షిప్పింగ్‌ కంపెనీలో గుమాస్తాగా చేరాల్సి వచ్చింది. అనుకోకుండా ఆస్తి కలిసి రావడంతో తిరిగి ఇరవయ్యేళ్ల వయసులో చదువును కొనసాగించడం ప్రపంచానికెంతో మేలు చేకూర్చింది. సెయింట్‌ మేరీస్‌ కాలేజీలో వైద్యవిద్యలో చేరి చురుగ్గా చదువుతూనే రైఫిల్‌ షూటింగ్‌, ఈత, వాటర్‌పోలో క్రీడల్లో బహుమతులు పొందుతూ ఉండేవాడు. డిగ్రీ పొందాక పరిశోధనల్లో నిమగ్నమయ్యాడు. ఇరవై ఏళ్ల వయసులో తిరిగి చదువు మొదలెట్టి గొప్ప శాస్త్రవేత్త అయ్యాడు. గడ్డురోగాల నుంచి ప్రాణాలు కాపాడే మందు కనిపెట్టి మహోపకారం చేశాడు. ఆయన  1881 ఆగస్టు 6న జన్మించారు. అంటే ఈరోజు అలెగ్జాండర్ ఫ్లెమింగ్ పుట్టిన రోజు  .  ఈయన 1923లో లైసోజేమ్‌ అనే ఎంజైమును కనిపెట్టాడు.  1928లో పెన్సిలిన్‌ అనే యాంటిబయాటిక్‌ను కనిపెట్టాడు.  పెన్సిలిన్ లేదా పెనిసిలిన్ ఒక రకమైన మందు. ఇవి పెన్సిలియమ్ (Penicillium) అనే శిలీంద్రము నుండి తయారుచేయబడిన సూక్ష్మజీవి శకాలు(Antibiotic). వీటిని బాక్టీరియా కు సంబంధించిన ఇన్ఫెక్షన్స్ లో విరివిగా ఉపయోగిస్తారు.  ప్రకృతిలో తయారైన కొన్ని పదార్ధాల సమ్మేళనాలను కూడా "పెనిసిలిన్" అని వ్యవహరిస్తారు.  మొదటి ప్రపంచ యుద్ధం మొదలవడంతో సైనికులకు చికిత్సలు చేసే బృందానికి నాయకత్వం వహించాడు. గాయాలకు సూక్ష్మజీవుల వల్ల ఇన్ఫెక్షన్‌ సోకి చాలా మంది సైనికులు చనిపోవడాన్ని గమనించిన ఫ్లెమింగ్‌, యుద్ధానంతరం బ్యాక్టీరియాపై పరిశోధనలు చేయసాగాడు. వాటిలో భాగంగా 'స్టెఫైలో కోకి' (Staphylo cocci) సూక్ష్మజీవులపై పరిశోధన చేస్తుండగా ఓ రోజున చిన్న పొరపాటు జరిగింది. ఆ బ్యాక్టీరియా ఉన్న పాత్రలను బల్లపై పెట్టి మర్చిపోయి ఇంటికి వెళ్లిపోయాడు. ఆ మర్నాడు వచ్చి చూస్తే బయటి వాతావరణం ప్రభావం వల్ల ఓ పాత్రలో నీలిరంగులో బూజులాంటి తెట్టు (ఫంగస్‌) కట్టి ఉండడం గమనించాడు. చిత్రంగా ఆ బూజు ఆశించినంత మేరా పాత్రలో సూక్ష్మజీవులు నాశనమై కనిపించాయి. అంటే ఆ బూజులో సూక్ష్మజీవులను చంపే పదార్థమేదో ఉందన్నమాట! దాంతో ఫ్లెమింగ్‌ దానిపై పరిశోధనలు చేసి చిన్న కుంచెలాగా ఉండే పదార్థాన్ని వేరుచేయగలిగాడు. లాటిన్‌లో పెన్సిలియమ్‌ అంటే చిన్న కుంచె అనే అర్థం ఉండడంతో దానికి 'పెన్సిలిన్‌' అని పేరు పెట్టాడు. దాన్ని 1928లో కనిపెట్టగా, మరిన్ని పరిశోధనలు చేసి ఓ మందుగా మార్చి వాడుకలోకి తీసుకు రావడానికి 17 సంవత్సరాలు పట్టింది. దీంతో యాంటీబయాటిక్‌ యుగానికి నాంది పలికినట్టయింది. వెయ్యేళ్ల కాలంలోనే అతి గొప్ప ఆవిష్కరణగా, కోట్లాది మంది ప్రాణాలకు రక్షణగా గుర్తింపు పొందింది 'పెన్సిలిన్‌'. తొలి యాంటీ బయోటిక్‌గా పేరొందిన ఆ మందును కనిపెట్టిన శాస్త్రవేత్తే అలగ్జాండర్‌ ఫ్లెమింగ్‌. వేరే ప్రయోగం చేస్తుండగా జరిగిన చిన్న పొరపాటు వల్ల ఇది బయటపడడం విశేషం. పెన్సిలిన్‌ వల్ల క్షయ, న్యూమోనియా, టైఫాయిడ్‌ లాంటి ఎన్నో ప్రాణాంతక వ్యాధుల నుంచి మానవాళికి రక్షణ కలుగుతోంది. దీన్ని కనిపెట్టినందుకు ఫ్లెమింగ్‌ 1945లో నోబెల్‌ బహుమతిని పొందారు.  1999లో టైమ్స్‌ పత్రిక ఫ్లెమింగ్‌ను 20వ శతాబ్దంలోని 100 ప్రముఖ వ్యక్తుల్లో ఒకరిగా కీర్తించింది.  ఫ్లెమింగ్‌ పెడింగ్టన్‌లోని సెయింట్‌ మెరీస్‌ హాస్పిటలు వైద్య పాఠశాలలలో ఎంబిబిఎస్‌ చదివారు.  ఫ్లెమింగ్‌ సిప్టమర్‌ మేరియన్‌ మెకెల్రాట్‌ అనే నర్సును పెళ్లిచేసుకున్నారు.  ఫ్లెమింగ్‌ మొదటి ప్రపంచ యుద్ధంలో రాయల్‌ ఆర్మి మెడికల్‌ కోర్‌లో కెప్టెన్‌గా పనిచేశారు. యుద్ధ భూమిలో చాలా మంది సూక్ష్మజీవుల బారినపడి చనిపోవడం ఫ్లెమింగ్‌ పెన్సిలిన్‌ కనిపెట్టడానికి ప్రేరణ.  పెన్సిలిన్‌ సృష్టి ఆధునిక వైద్యశాస్త్ర గమనాన్నే మార్చివేసింది. పెన్సిలిన్‌ ప్రపంచవ్యాప్తంగా లక్షలాది ప్రాణాలు కాపాడింది. ఇప్పటికీ కాపాడుతూనే ఉంది.  పెన్సిలిన్‌ స్కార్లెట్‌ ఫీవర్‌, న్యుమోనియా, మెనింజైటిస్‌, డిఫ్తీరియా, గొనోరియాపై బాగా పనిచేస్తుంది.  ఫ్లెమింగ్‌కు రాయల్‌ కాలేజ్‌ ఆఫ్‌ సర్జన్స్‌, ఇంగ్లాడు హంటేరియన్‌ ప్రొఫెసర్‌ షిప్‌ ఇచ్చింది.  ఫ్లెమింగ్‌ 11.3.1955న గుండెపోటుతో మరణించారు.   వైద్యశాస్త్రంలో అద్భుతమైన యాంటీబయాటిక్ మందుగా పేరుపొందిన పెన్సిలిన్ పేరు చెప్పగానే అలెగ్జాండర్ ఫ్లెమింగ్ దాన్ని కనిపెట్టినట్టు గుర్తొస్తాడు. 1945లో వైద్యశాస్త్రానికి నోబెల్ బహుమానం ఈ పెన్సిలిన్ కనుగొన్నందుకు ఫ్లెమింగ్ తో పాటు హొవార్డ్ ఫ్లోరె, ఎర్నెస్ట్ చెయిన్ అనే మరో ఇద్దరు శాస్త్రవేత్తలకు కూడా ఇచ్చారు. 

ఆదివారం, ఆగస్టు 05, 2012

Little RJ Sree Vaishnavi Only On RadioJoshLive 2Day

ఆదివారం, ఆగస్టు 05, 2012


Hey friends catch me live today (Sunday) show
with your Little RJ Sree Vaishnavi
10:30 am to 12:00 pm
only on RadioJoshLive
Masth Maza Masth Music :)
My Show Name is Harivillu
Fun with me
If you want to talk with me plz call these numbers

Skype id: radiojoshlive

US: 914-214-7574

UK: 20-3286-9594

AUS: 28003-4546

Local Number: 040-4200-2003

Thank You Very Much.

శనివారం, ఆగస్టు 04, 2012

అద్భుతమైన భావన స్నేహం

శనివారం, ఆగస్టు 04, 2012


అద్భుతమైన భావన స్నేహం
ప్రతి సంవత్సరం ఆగష్టు యొక్క మొదటి ఆదివారం నాడు స్నేహితులు, ప్రేమికులు మరియు కుటుంబ సభ్యుల మధ్య 'ఫ్రెండ్షిప్ డే 'ని  సెలబ్రేట్ చేసుకొనే ఒక ప్రత్యేక రోజు పరిగణిస్తారు.

కానీ మీరు స్నేహితుల రోజు ఎందుకు, ఎప్పటినుండి చేసుకుంటున్నారో తెలుసుకున్నారా.
స్నేహితుల రోజును మొట్టమొదట అమెరికా సంయుక్త కాంగ్రెస్ ఫ్రెండ్స్ యొక్క గౌరవార్ధం  ఒక రోజును  అంకితం చేయాలని నిర్ణయించుకుంది.  అలా అంకితము  చేసిన రోజునే  ఫ్రెండ్షిప్ డే జరుపుకొనే సంప్రదాయం సంవత్సరం 1935 సంవత్సరంలో ప్రారంభమైంది  ఈ సంవత్సరం 77 వ స్నేహితుల రోజుగా జరుపుకుంటున్నాము.  

ఎందుకు ఫ్రెండ్షిప్ డే ఆ కాలంలో అవసరం.
ఆ కాలంలోని ప్రజలు మొదటి ప్రపంచ యుద్ధం వినాశకరమైన ప్రభావాలు అనుభవించారు . వారుమద్య  పెరుగుతున్న విరోధాలు, అవిశ్వాసం మరియు మరొక యుద్ధం పరిస్థితులు ఏర్పడి వివిధ  దేశాల మధ్య ద్వేషం ఏర్పడింది  . అందువలన దేశాల మధ్య అలాగే వ్యక్తులు మధ్య స్నేహంబందం యొక్క అవసరం ఉంది. దీని ఫలితంగా ఫ్రెండ్షిప్ డే సంయుక్త కాంగ్రెస్ ఆ సంవత్సరం 1935 లో తీసుకోవడం జరిగింది .

నేషన్స్ అంతటా ఫ్రెండ్షిప్ డే ఏర్పడింది.
ఈ అద్భుతమైన భావన విజయం స్నేహం కారణం ఒక రోజు అంకితము చేసి ఆ యొక్క సంప్రదాయం అలవరచుకోవటానికి అనేక ఇతర దేశాలును కూడా  ఆకర్షించింది. ఫ్రెండ్స్ గౌరవార్ధం ఒక రోజు జరుపుకొనే ఈ అందమైన ఆలోచన మనస్పూర్తిగా ప్రపంచవ్యాప్తంగా అనేక ఇతర దేశాలు అంగీకరించాయి జరిగినది.

మన చరిత్రలో కూడా స్నేహం గురించి చెప్పే కదలు చాలా వున్నాయి. 
మనకు బాగా తెలిసిన రామాయణంలో రాముడు సుగ్రీవునితో స్నేహం చేసి రాక్షస సంహారం చేసాడు.  స్నేహితుడు తోడూ వుంటే ప్రతీది విజయమే పొందవచ్చు అని నిరూపించే కధలు చాలా వున్నాయి.  మహాభారతం లో స్నేహం యొక్క ప్రాముఖ్యత ను శ్రీ కృష్ణుడు తన ఆప్యాయతను, ప్రేమను,  సోదర, రక్షణ, మార్గదర్శకత్వం, సాన్నిహిత్యం కూడా అల్లరిద్వారా శ్రీ కృష్ణ స్నేహం అనేక రంగులుగా  ప్రదర్శించాడు.   
స్నేహితులు అందరికి ప్రపంచ స్నేహితుల దినోత్సవ శుభాకాంక్షలు   

Pencil Story

Nicolas-Jacques Conté పేరు విన్నారా?  వింటే సరే వినకపోతే ఇప్పుడు తెలుసుకోండి ఈయన గురించి.  మనం చిన్నప్పటినుండి స్కూల్కి వెళ్ళేప్పుడు మన చేతిలో వుండే పెన్సిల్ను మొట్టమొదట  కనుక్కున్నారు .  ఈరోజు 4 August 1755 Nicolas-Jacques Conté న పుట్టిన రోజు.  ఈయన ఫ్రెంచ్ పైంటర్, balloonist, army officer, మరియు ఈయన మనం వాడుకొనే ఆధునిక పెన్సిల్ ను కనుక్కొన్నారు. 
NICOLAS-JACQUES CONTÉ

మనం భయపడాలని ఈ పక్షి ప్రయత్నం.

ఇక్కడ ఒక పక్షి వుంది చూసారా!  ఈ పక్షిగారు మనలను బయపెట్టతానికి ఎంత ప్రయత్నము చేస్తోందో చూడండి.  దానిని సంతృప్తి పరచటానికి వీలయితే భయపడండి మరి.


శుక్రవారం, ఆగస్టు 03, 2012

కరుణశ్రీ @ శతజయంతి

శుక్రవారం, ఆగస్టు 03, 2012

  
                                  కరుణశ్రీ గారి శతజయంతి నేడు.  ఈయన ఆగస్టు 4 న 1912 జన్మించారు.  ఈయన అసలు పేరు జంద్యాల పాపయ్య శాస్త్రి.  కరుణశ్రీగా ప్రసిద్ధులైన జంధ్యాల పాపయ్య శాస్త్రి రచించిన ఖండకావ్యంలోని ఒక కవితా ఖండంపేరు పుష్పవిలాపం. కవి ఇందులోని చక్కని పద్యశైలి, భావుకత, కరుణారసాల వల్ల ఈ పద్యాలు జనప్రియమైనాయి. అమరగాయకుడు ఘంటసాల వెంకటేశ్వరరావు పాడిన కుంతి విలాపము మరియు పుష్పవిలాపం మంచి పేరు వచ్చింది.  జంధ్యాల వారికి గుర్తింపు వచ్చింది.  పువ్వులు గురించి కవులు అనేక కావ్యాలు, కవిత్వాలు రాసారు.  వాటి అన్నిటికంటే పుష్పవిలాపంకు పేరు బాగా వచ్చింది. పుష్పవిలాపం విన్న తరువాత పువ్వులను ఎవరు మొక్కనుండి పువ్వులను తుమ్చలేరు అనటంలో సందేహం లేదు.  కరుణరసంతో సాగుతున్న ఈ కావ్యం వల్లే జంధ్యాల వారికి కరుణశ్రీ అన్నపేరు వచ్చిందేమో కదా!  జంద్యాల పాపయ్య శాస్త్రి గారి కలం పేరు కరుణశ్రీ.  ఈయన కరుణశ్రీ, ఉదయశ్రీ, విజయశ్రీ, కళ్యాణకల్పవల్లి అనే రచనలు పేరు వచ్చింది .  వీరు  కదాగాయిత్రి అనే శీర్షికతో 12 సంపుటాలను రచించారు.  తెలుగు బాల శతకాన్ని బొమ్మలతో కూడిన ముద్దు బాలశిక్షను, పద్మావతీ శ్రేనివాసం పేరుతో వెంకటేశ్వర స్వామి చరిత్రను రచించారు. సాంప్రదాయాన్ని, అభ్యుదయాన్ని మేళవించిన కవిగా సాహిత్యములో స్థానం పొందారు.  ఇక్కడనేను పాడిన పుష్పవిలాపము మరియు ఘంటసాల వారి కుంతివిలాపము పొందుపరిచాను.  విని ఆనందిమ్చండి .  సాహిత్య ప్రియులందరికీ జంద్యాల వారి శతజయంతి  శుభాకాంక్షలు.  

లిఫ్ట్ కనిపెట్టినవారు ఓటిస్



E.G. ఓటిస్ఇలాషా గ్రేవ్స్ ఓటిస్ (august 3 1811-61), అమెరికన్ శాస్త్రవేత్త యొక్క చిత్రంఅతను 1854 లోన్యూ యార్క్ వరల్డ్ యొక్క ట్రేడ్ ఫెయిర్ లో అది ప్రదర్శించడంపై తన 'భద్రతా ఎలివేటర్ ఉంది.  ఆతను ప్రదర్శన సమయంలో, ఓటిస్ మద్దతు కేబుల్ కట్ కలిగి ముందు లిఫ్ట్ వేదిక మీద పెరిగింది. అతని లిఫ్ట్ డిజైన్ ఒక భద్రతా బ్రేక్పడిపోవడం నుండి వేదిక నిరోధించే మరియు ఓటిస్ గాయపర్చని ఇది ఒక పరికరం ప్రవేశపెట్టారు. 1852 లో పేటెంట్ అతని కల్పనఅతని గొప్ప మెప్పును తెచ్చింది మరియు అతను Yonkers, న్యూయార్క్ వద్ద ఒక కర్మాగారాన్ని ఏర్పాటుమొదటి పబ్లిక్ లిఫ్ట్ బ్రాడ్వే, న్యూయార్క్ లో ఒక స్టోర్ లో మార్చి 1857, 23 వ  ప్రారంభించారు. అతను కూడా ఒక ఆవిరి-నడుపబడే ఎలివేటర్ పేటెంట్ పొందారు.  మొట్ట మొదట లిఫ్ట్ ను కనుక్కున్నది ఓటిస్  .  ఓటిస్ పుట్టున రోజు నేడే.  అలాంటి శాస్త్రవేత్త గురించి తెలుస్కోవటం గొప్పగా వుంది కదా.  ఎందుకంటే మనం లిఫ్ట్ ఎప్పుడు ఎక్కుతూ వుంటాము.  కానీ ఎవరు తయారు చేసారో తెలిసింది కదా.

బుధవారం, ఆగస్టు 01, 2012

रक्षा बंधन की बहुत बहुत बधाई

బుధవారం, ఆగస్టు 01, 2012

Raksha Bandhan Ki Bahut Bahut Badhai


रक्षा बंधन  की बहुत बहुत बधाई 

రక్షాబంధన శుభాకాంక్షలు.


రాకీ పౌర్ణమి. శుభములు
మీకును భగవంతుడిచ్చు మేలుగ నెపుడున్.
నాకున్న యన్న మీరే.
మీ కానుక దీవెన లవి. మేలగు నాకున్.
భారతీయ సంప్రదాయములో రాఖి పౌర్ణమి విశిష్టమైన స్థానం కలిగివుంది.  ఈ పండుగను రక్షాబంధనం (రాఖీ) పండుగ గానూ, జంద్యాల పూర్ణిమ, వైఖానస మహర్షి జయంతి గాను, హయగ్రీవ జయంతి గాను , వరుణ పూజల రూపంలో ఈ పూర్ణిమను ఉత్సవంగా అందరూ జరుపుకుంటుంటారు. మహాభారత కథలోనూ రక్షాబంధన ప్రసక్తి మనకు కనిపిస్తుంది. ధర్మరాజు కృష్ణుడిని రక్షాబంధన విశేషాలను గురించి అడిగినప్పుడు కృష్ణుడు దీనివల్ల కలిగే మేలును ఆయనకు వివరించాడు. రక్షాబంధనాన్ని ఒకసారి కట్టించుకుంటే ఇక ఆ సంవత్సరమంతా దుష్ట, ప్రేత, పిశాచ బాధ ఉండదని, అనారోగ్యాన్ని, అశుభాన్ని పోగొడుతుందని కృష్ణుడు చెప్పాడు. ఈ సందర్భంగా పూర్వం జరిగిన ఓ సంఘటనను కూడా ఆయన వివరించాడు. పూర్వకాలంలో దేవతలకు, రాక్షసులకు విపరీతంగా యుద్ధం జరుగుతుండేది. ఆ యుద్ధంలో రాక్షసుల ధాటికి దేవతలు తట్టుకోలేక బాధపడుతుండేవారు. ఆ పరిస్థితి చూసి ఎలాగైనా దేవేంద్రుడికి విజయం కలగాలని ఇంద్రుడి భార్య శచీదేవి అతడికి రక్ష కట్టింది. ఆ తర్వాత యుద్ధానికి వెళ్ళిన ఇంద్రుడు రాక్షసులను చీల్చి చెండాడాడు. రక్షాబంధనానికి అంత గొప్ప శక్తి ఉంది. ఈ రక్షాబంధనం సందర్భంలో చదివే శ్లోకం.
'యేన బద్ధో బలీ రాజా దానవేంద్రో మహాబలః, 

తేనత్వామభిబధ్నామి రక్షే మా చల మా చల'

దీనిలో రక్షాబంధనం అంటే సాక్షాత్తూ శ్రీ మహావిష్ణు శక్తేనని తెలియచెప్పే భావం ఇమిడి ఉంది.  బలిచక్రవర్తి రక్షకోరిన సోదరిని రక్షిస్తూ ఎలాంటి ఆటంకాలెదురైనా తడబడక ధైర్యంతో ఎదురొడ్డి నిలిచినవాడు. అటువంటి మహావీరునితో తన అన్నని పోలుస్తూ తనకి రక్షణ నివ్వమని కోరుతుంది. ఈ రాఖీ కట్టిన సోదరికి తగిన బహుమానం ఇస్తూ ఆశీర్వధిస్తాడు అన్న. రాఖీ పౌర్ణమి, శ్రావణ పున్నమిరోజును యిలా ఎన్నోరకాలుగా దేశమంతా ప్రజలు ఆనందోత్సాహాలతో జరుపుకుంటారు. దేవతారాధనలు, ప్రకృతి దేవతారాధనలు, ఆత్మీయతానురాగబంధాలు... సకల పూజారాధనలు అందుకునే రోజు ఈ శ్రావణ పౌర్ణమి.  చరిత్రలో మొగలాయి చక్రవర్తుల ఏలుబడిలో ఈ రక్షాబంధనానికి మరికొంత కొత్త విశిష్టత సమకూరింది. రాఖీ కట్టే ఆచారం తమ స్త్రీల రక్షణ కోసం రాజపుత్రులు చేసిన ఏర్పాటని పండితులు పేర్కొంటున్నారు. చిత్తూరు మహారాణి కర్ణావతి గుజరాత్‌ నవాబైన బహదూర్‌షా తమ కోటను ముట్టడించబోతున్నప్పుడు తనను రక్షించమని ఢిల్లీ చక్రవర్తిగా ఉన్న హుమయూన్‌కు రక్షాబంధనాన్ని పంపి ప్రార్థించిందట. ఆ రక్షాబంధనాన్ని స్వీకరించిన హుమయూన్‌ ఆ రాణిని తన సోదరిగా భావించి బహదూర్‌షాను తరిమి వేశాడని ఆనాటి నుంచి సోదరీసోదర బంధానికి గుర్తుగా ఈ రక్షాబంధనం ప్రచారంలోకి వచ్చిందని అంటారు.  శ్రావణ పూర్ణిమ నాడు నూతన యజ్ఞోపవీతాలను ధరించే ఆచారాన్ననుసరించి ఇలా ఈ పండుగ పేరు వ్యవహారంలోకి వచ్చింది దీనినే జంద్యాల పౌర్ణమి గా అంటారు.
హయగ్రీవ జయంతి గా కూడా జరుపుకుంటారు. 
జ్ఞానానందమయం దేవం నిర్మలస్పటికాకృతిం  |
ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవముపాస్మహే ||       
వ్యాఖ్యా ముద్రాం కరసరసిజైః పుస్తకం శంఖచక్రే
బిభ్రద్భిన్నస్పటికరుచిరే పుండరీకే నిషణ్ణః |
అమ్లానశ్రీరమృతవిశదైరంశుభిః ప్లావయన్ మాం
ఆవిర్భూయాదనఘ మహిమా మానసే వాగధీశః ||

అది లక్ష్మీమయమైన మాసంలో వచ్చినది కనుక సంపదలు ఇచ్చే శక్తి ఉంది. దానితో పాటు సర్వ విద్యా స్వరూపుడైన భగవంతుని విద్యాప్రదమైన అవతారం హయగ్రీవ అనే అవతారం జరిగింది ఈ శ్రావణ పూర్ణిమ రోజే. అందుకే ఈ రోజుకి అంత ప్రాధాన్యం. మనిషికి ప్రధానమైనది జ్ఞానం, జ్ఞానానికి ఆధారం శాస్త్రాలు, శాస్త్రాలకు మూలం వేదం. ఆవేదాన్ని లోకానికి అందించిన అవతారం హయగ్రీవ అవతారం. విద్య చదువుకున్న వారికందరికి కంకణం కడుతారు, వారు రక్షకులు అవుతారు అని. జ్ఞానికి రక్షగా ఉంటారని. ఆ జ్ఞానం చెప్పే భగవంతునికి చెందిన వాటంతటికి రక్ష. ఆ కంకణ ధారణ అనేదే రక్షబంధనం అయ్యింది. వేదం చదువుకునే వారందరూ శ్రావణ పూర్ణిమ నాడు ఆరంభంచేసి నాలుగు నెలలు వేదాధ్యయనం చేస్తారు. ఆతరువాత వేద అంగములైన శిక్షా, వ్యాకరణం, నిరుక్తం, కల్పకం, చందస్సు మరియూ జ్యోతిష్యం అనే షడంగములను అధ్యయనం చేస్తారు. విద్యారక్షకుడైన భగవంతుడిని ఉపాసన చేసుకొని మొదలు పెడుతారు. వేదాన్ని కొత్తగా నేర్చే వారే కాక, వేదాన్ని నేర్చినవారు తిరిగి ఇదే రోజునుండి మరచిపోకుండా నవీకరణం చేసుకుంటూ అధ్యయణం మొదలు పెడుతారు. హయగ్రీవుడిగా అవతరించి లోకాన్ని ఉద్దరించిన రోజు.

ఇక శ్రీ మహావిష్ణువు విజయగాధా పరంపరలలో హయగ్రీవావతారంలో జరిగిన విజయం కూడా విశేషంగా చెబుతారు. పూర్వం ఓసారి హయగ్రీవుడు అనే ఓ రాక్షసుడు దేవిని గురించి తీవ్రంగా తపస్సు చేశాడు. ఆ తపస్సుకు మెచ్చిన దేవి వరం కోరుకొమ్మన్నప్పుడు తనకు మరణం లేకుండా చూడమన్నాడు. అయితే అది ఆమె సాధ్యపడదని చెప్పినప్పుడు హయగ్రీవం (గుర్రపు తల) ఉన్నవాడి చేతిలో మాత్రమే తనకు మరణం వచ్చేలా అనుగ్రహించమన్నాడు. ఆమె ఆ రాక్షసుడిని అనుగ్రహించి అంతర్థానమైంది. ఆ వరంతో ఆ రాక్షసుడు దేవతలను ముప్పతిప్పలు పెడుతుండేవాడు. విష్ణుమూర్తి ఆ రాక్షసుడిని యుద్ధంలో నిరంతరం ఎదిరిస్తున్నా ఫలితం లేకపోయింది. చివరకు శివుడు ఓ ఉపాయాన్ని పన్నాడు. శ్రీ మహావిష్ణువు ధనుస్సుకు బాణాన్ని సంధించి ఉంచి విపరీతమైన అలసట కలిగి అగ్రభాగాన వాలి నిద్రపోయాడు. ఆయనను నిద్రలేపటానికి దేవతలెవరికీ ధైర్యం చాలలేదు. అయితే ఆ దేవతలంతా ఓ ఆలోచనకు వచ్చి వమ్రి అనే ఓ కీటకాన్ని పంపి ధనుస్సుకున్న అల్లెతాడును కొరకమని చెప్పారు. అలా చేస్తే తాడు వదులై విల్లు కదలి విష్ణువుకు మెలకువ వస్తుందన్నది వారి ఆలోచన. అయితే ఆ పురుగు తాడును కొరకగానే దేవతలు ఊహించని విధంగా వింటికి ఉన్న బాణం విష్ణువు మెడకు తగిలి ఆ దెబ్బకు విష్ణువు తల ఎటో ఎగిరి వెళ్ళింది. దేవతలు అంతటా వెదికారు కానీ ఆ తల కనిపించలేదు. బ్రహ్మదేవుడు వెంటనే దేవిని గురించి తపస్సు చేశాడు. అప్పుడామె ప్రత్యక్షమై ఒక గుర్రపు తలను తెచ్చి విష్ణుమూర్తి శరీరానికి అతికించమని చెప్పింది. దేవతలు అలాగే చేశారు. ఆ హయగ్రీవం అతికిన విష్ణుమూర్తిలో మళ్ళీ జీవం వచ్చి లేచాడు. ఆ లేచిన రోజే శ్రావణ పూర్ణిమ. ఆ తర్వాత హయగ్రీవుడుగా మారిన విష్ణుమూర్తి రాక్షసుడిని సులభంగా జయించాడు. దేవీ శక్తి మహిమను, శ్రీ మహావిష్ణు తత్వాన్ని ఈ కథ తెలియచెప్తుంది. అందుకే శ్రావణ పూర్ణిమ నాడు హయగ్రీవ జయంతి కూడా జరపడం కనిపిస్తుంది. ఇలా శ్రావణ పూర్ణిమను ఎన్నెన్నో రకాలుగా పండుగగా, ఉత్సవంగా జరుపుకోవడం తరతరాలుగా వస్తోంది. మరి 
 బ్లాగ్ మిత్రులుకు రక్షాబంధన శుభాకాంక్షలు. 

శనివారం, జులై 28, 2012

Can you draw this Answer

శనివారం, జులై 28, 2012


Can you draw this

Can you draw this house in one stroke.  The importing thing is  without lifting the pen from the paper and without crossing an already drawn part?

I will tell how to draw this picture without lifting the pen from the paper and without crossing an already drawn part.

Can you draw this

Can you draw this house in one stroke.  The importing thing is  without lifting the pen from the paper and without crossing an already drawn part?

మొదటి ప్రపంచ యుద్ధం


ఈరోజుకు ప్రపంచం మొత్తం చరిత్రలో ఒకవిశేషం వుంది అది ఏంటి అంటే నేటికి మొదటి ప్రపంచ యుద్ధం జరిగి 98 సంవత్సరములు పూర్తి అయ్యింది.   ఈ యుద్దము యూరప్ లో మధ్య ప్రాచ్య దేశాలలో జరిగింది. జర్మనీ సామ్రాజ్య విస్తరణ కాంక్ష వల్ల 1914 జూలై 28 న జర్మనీ నాయకత్వం లోని కేంద్ర రాజ్యాల అమెరికన్, బ్రిటన్ నాయకత్యంలోని మిత్ర రాజ్యలకు మధ్య ఈ యుద్ధం ప్రారంభమయ్యింది. ఇది 1914 జూన్ 28న మొదలై, 1918 నవంబర్ 11న ముగిసింది.  మొదటి ప్రపంచ యుద్ధం యూరప్, ఆఫ్రికా, మధ్యప్రాచ్య దేశాలు, చైనా, ఫసిఫిక్ దీవుల ప్రాంతాల్లో జరిగింది. నాలుగేళ్ల పాటు జరిగిన ఈ మహాయుద్ధంలో ఆమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్ నేతృత్వంలోని మిత్ర రాజ్యాలు విజయం సాధించాయి. 1919 జూన్ 28న శాంతి ఒప్పందం కుదిరింది.  ఈ యుద్ధం అనంతరం జర్మన్, రష్యన్, ఓట్టోమన్, ఆస్ట్రో-హంగేరియన్ సామ్రాజ్యాలు కుప్పకూలిపోయాయి. యూరప్, మధ్య ప్రాచ్యంలో పలు కొత్త దేశాలు ఏర్పడ్డాయి. జర్మనీ వలసులుగా ఉన్న పలు దేశాలు ఇతర శక్తుల ఆధీనంలోకి వెళ్లిపోయాయి. ఈ యుద్ధం తర్వాత నానాజాతి సమితి ఏర్పడింది.  ఈ యుద్ధం వాళ్ళ చనిపోయిన సైనికబలగాలు : 5,525,000, మరి గాయపడిన సైనికులు : 12,831,500, ఇంకా తప్పిపోయిన సైనికులు : 4,121,000.  ఒకే ఒక కాంక్ష కక్ష వల్ల ఇన్ని వేలమంది జీవితాలను కోల్పోవటం జరిగింది.   చరిత్ర మనకు చాలా పాటా లు మనకు నేర్పించింది కదా.

My Blog Lovers

నా యూట్యూబ్ చానల్స్ ప్లీజ్ సబ్స్క్రిబ్ చేయండీ

Diabetic Challenger

DIABETIC CHALLENGER YOUTUBE CHANNEL. PLASE SUBSCRIBE MY CHANNEL...... THANK YOU VERY MUCH.

Ammamma Tho Nenu (అమ్మమ్మ తో నేను

Please subscribe our channel Ammamma Tho Nenu (అమ్మమ్మ తో నేను)