ఈ రోజు వాల్మీకి జయంతి. వాల్మీకి సుమాలి కుమారుడు. మహర్షి వాల్మీకి షుద్ర కుటుంబంలో జన్మించాడు. ఆయన పుట్టిన పేరు రత్నాకర. వాల్మీకి సంస్కృత సాహిత్యం ఆదికవి గౌరవించబడ్డాడు. వాల్మీకిని మహర్షి వాల్మీకి అని కూడా పిలుస్తారు మరియు ఆది కవి సంస్కృత భాషలో మొదటి కవిగా పరిగణిస్తారు. అతను ఒక గొప్ప యోగి మరియు ఈయన రామాయణ రచయిత.
రామాయణం రాసిన సమయం గురించి విభిన్న అభిప్రాయాలున్నాయి. కొంతమంది ప్రజలు 2,500 సంవత్సరాల క్రితం వ్రాయబదినది అని నమ్ముతారు (సుమారు 500 BC). కొందరు 1,800 సంవత్సరాల క్రితము వ్రాసినట్లు మరికొందరు భావిస్తున్నారు. పుస్తకం చాలా పురాతనమైనది మరియు మహాభారతకు ముందు వ్రాయబడింది అని అందరూ అంగీకరిస్తున్నారు. వాల్మీక రామాయణంగా అందరికీ తెలిసిన వాల్మీకంలో 23వేల శ్లోకాలు 7 కాండాలుగా (ఉత్తరకాండ సహా)విభజించబడి ఉన్నాయి. రామాయణంలో 4 లక్షల ఎనభై వేల పదాలు ఉన్నాయి. రామాయణం దాదాపుగా క్రీపూ 500 లో రాయబడిందని పాశ్చాత్యులు నమ్ముతారు. మహర్షి వాల్మీకి శ్రీ రామ జననం శకంగా తన పుట్టిన ఖచ్చితమైన సమయాలను నిర్వచించటానికి చేస్తుంది కూడా ఆధునిక చరిత్రకారుల మధ్య చాలా చర్చనీయాంశంగా ఉంది. శ్రీ రామ ప్రవాస తన కాలంలో వాల్మీకిని కలుసుకున్నారు. వాల్మీకి రామాయణంలో తాను శ్రీరాముడికి సమకాలీనుడని పేర్కొన్నాడు. శ్రీరాముడు వాల్మీకిని అరణ్యవాసంలో కలిసినట్టు, శ్రీ రాముడు సీతను వనవాసానికి పంపినపుడు వాల్మీకాశ్రమంలోనే ఆవిడ ఉన్నట్టు తెలుస్తుంది. ఈ ఆశ్రమంలోనే సీత లవ-కుశలను కన్నట్టూ, వీరిద్దరి విద్యాభ్యాసం ఇక్కడే వాల్మీకికి శిష్యరికంలో జరిగినట్టు రామాయణం ద్వారా తెలుస్తుంది. వాల్మీకి ఈ కవలలుకు రామాయణం బోధించాడు.
రామాయణంలోని ఉత్తరకాండలో మనకి వాల్మీకి పూర్వాశ్రమ జీవితం గురించి తెలుస్తుంది. ఆ కథనం ప్రకారం వాల్మీకి ఒక బందిపోటు దొంగ, అతని తల్లిదండ్రులు పెట్టిన పేరు రత్నాకర్ . అతను తన కుటుంబంను పోషించటానికి అడవిలో నివసిస్తూ బాటసారులను చంపి, వారి సొత్తును దోచుకుని జీవితం గడిపేవాడు. ఒకరోజు నారద మహర్షిని కూడా దోచుకోబోగా, నారదుడు ఆ దొంగను ఒక ప్రశ్న అడుగుతాడు, కుటుంబం కోసం చేసే ఈ దోపిడి ద్వారా వచ్చే పాపాన్ని కుటుంబం కూడా పంచుకుంటుందా అని ఆదిగాడు. ఔను అని దొంగ అనగా, ఈ విషయాన్ని భార్య నుండి ధృవీకరించుకోమని నారదుడు అంటాడు. భార్యను అడుగగా, పాపాన్ని పంచుకోడానికి నిరాకరిస్తుంది. ఆ విధంగా ఆత్మసాక్షాత్కారం పొంది, నారదుడిని క్షమాపణ కోరి, జీవిత సత్యాన్ని గ్రహిస్తాడు. నారదుడు భగవత్ భక్తిని నేర్పటానికి ప్రయత్నిస్తాడు. "రామ" అని పలకమంటే ఆ దొంగ పలకలేకపోతాడు. చాలా సేపు ప్రయత్నించినా దొంగ ఆ పదాన్ని పలకలేకపోతాడు, అప్పుడు నారదుడు "మరా" అని పదే పదే చెప్పమని, ఆ విధంగా రామ మంత్రాన్ని వాల్మీకికి ఉపదేశిస్తాడు. ఉపదేశం పొందిన దొంగ, జపం చేస్తూ ఉన్న చోటనే తపస్సమాధిలోకి వెళ్ళిపోతాడు. చుట్టూచీమలు పుట్టలు తయారు చేసుకున్నా చలించకుండా తపస్సు చేస్తాడు. చాలా కాలం తపస్సు చేసాక బ్రహ్మ తపస్సుకు మెచ్చి ఆకాశవాణి ద్వారా తపస్సంపన్నం గురించి తెలియపరుస్తూ వాల్మీకి అనే పేరును ఆ దొంగను పిలుస్తాడు. ఆపేరు నిలిచిపోయింది. వల్మీకం అనగా పుట్ట అని అర్థం. వల్మీకం నుంచి ఉద్భవించిన వాడు కాబట్టి వాల్మీకి అయ్యాడు.
వాల్మీకి తపస్సంపన్నత ఆశ్రమవాసం చేయసాగారు. ఆశ్రమ ధర్మాలలో భాగంగా గంగానదీ తీరానికి సంధ్యకు రాగా. భరద్వాజుడనే శిష్యుడు అతని వస్త్రాలను తెస్తాడు. మార్గంలో తామస నది వద్దకు చేరుకుంటారు. తామస నది నిర్మలత్వాన్ని చూసి ఆ నదిలోనే స్నానం చేయాలని నిర్ణయించుకుంటాడు. స్నానానికి నదిలో దిగుతూ ఒక క్రౌంచ పక్షి జంటను సంగమించడం చూస్తాడు. చూసి పరవశానికి గురి అవుతాడు. అదే సమయంలో మగ పక్షి బాణంతో ఛెదింపబడి చనిపోతుంది. భర్త చావును తట్టుకోలేక ఆడ క్రౌంచ పక్షి గట్టిగా అరుస్తూ చనిపోతుంది. ఈ సంఘటనను చూసి వాల్మీకి మనసు కరిగి శోకానికి లోనవుతాడు. ఈ సంఘటనకు కారణం ఎవరా అని చుట్టూ చూస్తాడు. దగ్గరలో ఒక బోయవాడు ధనుర్బాణాలతో కనిపిస్తాడు. వాల్మీకికి కోపం వస్తుంది. ఆ శోకంతో కూడుకున్న కోపంలో ఆ బోయవాడిని శపిస్తూ ఈ మాటలు అంటాడు:
మా నిషాద ప్రతిష్ఠాం త్వమగమః శాశ్వతీః సమాః॥ యత్క్రౌంచమిథునాదేకమవధీః కామమోహితం॥
ఓ కిరాతుడా! నీవు శాశ్వతముగా అపకీర్తి పాలగుదువు.
ఎందుకంటే క్రౌంచ పక్షులజంటలో కామ పరవశమైయున్న ఒక (మగ) పక్షిని చంపితివి.
ఈ విధంగా వాల్మీకి నోట అప్రయత్నంగా వచ్చినదే సంస్కృత సాహిత్యంలో వచ్చిన మొదటి శ్లోకం. అలా మొదలయినది రామాయణ కావ్యం అంతా రాసేవరకూ సాగింది. ఈ మొదట శ్లోక రచన చేసింది వల్మికినే.
అటవీ తెగకు చెందిన వాల్మీకి కరువుల వల్ల బ్రతుకు తెరువు కోసం ఉత్తర భారత దేశం నుండి వలస బాట పట్టాడు. ఆర్య తెగకు చెందిన సప్తబుషులచే జ్ఞానోదయమైన తర్వాత , మహర్షిగా మారి దండకార్యణం గూండా దక్షిణ భారతదేశం, ఆ తర్వాత శ్రీలంకకు వలస వెళ్ళాడు. మార్గమధ్యంలో వివిధ ప్రదేశాల్లో బసచేస్తూ, అడవి ఆకులు, దుంపలు తింటూ విశ్రాంతి సమయంలో తన రామాయణం కావ్యాన్ని దేవనాగరి లిపిలో వ్రాస్తూ, తను వెళ్ళిన ప్రదేశాల్ని కావ్యంలొ పేర్కొన్నాడు. ఆంధ్ర దేశంలో ఉన్న గోదావరి నదితీరంలో విశ్రమించి ఆ తర్వాత వృద్ధాప్య దశ వచ్చే సరికి తమిళనాడు రామేశ్వరం సముద్ర గట్టు వద్ద నున్న షోల్ మీదుగా శ్రీలంక ప్రవేశించాడు. శ్రీలంకలో తన రామాయణాన్ని యుద్ధకాండతో ముగించాడు. వాల్మీకి తన జీవిత కాలాన్ని శ్రీలంకలోనే ముంగిచాడని విష్లేషకుల భావవ.
తమిళనాడు లోని తిరువంచియూర్ లోని మహర్షి వాల్మీకి కి చిన్న ఆలయం (జీవా సమాధి) ఉంది. వాల్మీకి ఆలయం
దసరాముందువచ్చేఅమావాస్య నాడు అనగా శ్రావణబహుళఅమావాస్య రోజును పోలాలఅమావాస్యఅని అంటారు. ఈ పండగ కు కందమొక్క మరియు బచ్చలి మొక్కకు పూజచేస్తారు. పూజలో ఒకకథకూడా చెప్తారు. ఇదిపెళ్ళయినఆడవాళ్ళుపిల్లల కలవారు వారి శ్రేయస్సుకోసంచేస్తారు. పిల్లలు లేనివారు పిల్లలు కలగటానికి ఈ పూజ చేస్తారు. ఈ పూజలో ఆడపిల్లు కావాలనుకునేవారు గారెలు దండ అమ్మవారికి వేస్తామని, మొగపిల్లలు కావలి అనే కోరిక కలవారు పూర్ణం బూరెలు దండ అమ్మవారికి వేస్తామని మొక్కుకుంటారుట. ఈ పోలేరమ్మకు గౌరీదేవి పూజ చేస్తారు. నివేదనగా నవకాయ కూర చేస్తారు, ఇంకా పప్పు తాలికలు, పాలతాలికలు, మినపకుడుములు చేసి అమ్మవారికి నేవేదిస్తారు.
వ్యవసాయం కలవారు ఎద్దులకు పూజ చేస్తారు. అదే వ్యవసాయం లేనివారు ఎద్దు బొమ్మలు మట్టి తో చేసి వాటికి పూజ చేస్తారు. ఇక ఇదే రోజున పోలేరమ్మను ఆరాధించే ఆచారం కూడా చాలా ప్రాంతాలలో కనిపిస్తూ వుంటుంది. గ్రామీణ ప్రాంతాలకి చెందిన ప్రజలు 'పోలాంబ' పేరుతో అమ్మవారిని పూజిస్తారు. ఆమెకి ఇష్టమైన నైవేద్యాలతో పాటు చీరసారెలు సమర్పిస్తారు. ఈ విధంగా చేయడం వలన ఆ తల్లి అనుగ్రహం లభిస్తుందనీ ... ఫలితంగా వర్షాలు పంటలకి అనుకూలంగా కురుస్తాయని విశ్వసిస్తుంటారు. జీవితం ఎలాంటి ఒడిదుడుకులు లేకుండా సుఖశాంతులతో కొనసాగాలంటే పితృదేవతల ఆశీస్సులు కావాలి. అలాగే వర్షాలు బాగా కురవాలంటే గ్రామదేవత అయిన పోలేరమ్మ అనుగ్రహం వుండాలి. వర్షాలుపడితే వ్యవసాయ పనులు చేయడానికి అనుకూలంగా ఎద్దులు ఆరోగ్యంగా వుండాలి. పంటలు బాగా పండినప్పుడే ఆవులకు మేత దొరుకుతుంది. ఫలితంగా లభించే పాలు ఆ కుటుంబ సభ్యులను ఆరోగ్యపరంగాను ... ఆర్ధికంగాను ఆదుకుంటాయి. తమ జీవనాధారానికి తోడ్పాటుని అందించే దేవతను ... పెద్దలను ... పశువులను పూజించే పర్వదినంగా పోలాల అమావాస్య కనిపిస్తుంది. గ్రామదేవతను ఆరాధిస్తూ ... వ్యవసాయానికి సహకరించే పశువులను పూజించే పర్వదినం కనుక ఇది ఎక్కువగా గ్రామీణ ప్రాంతాల్లో కనిపిస్తుంది. ప్రత్యేకతను సంతరించుకుని తన విశిష్టతను చాటుకుంటూ వుంటుంది. ఇక కధ విషయానికి వస్తే: "ఒకకుటుంబంలోఏడుగురుకొడుకులు. అందరికీపెళ్లిళ్ళుచేస్తారు. అందులో, ఏడో కోడలికిఏటపిల్లాడుపుడతాడు. కానీపోలాలఅమావాస్యరోజుచనిపోతాడు. అలాగాఆరుసంవత్సరాలుజరుగుతుంది. అప్పటికేఆమెతోడికోడళ్ళుదేప్పటంమొదలుపెడతారు - ఆమెవలనవారుఆపండుగజరుపుకోలేకపోతున్నారుఅని. ఆబాధభరించలేక ఏడవ సంవత్సరంపిల్లాడుకోనఊపిరితోఉండగానేఅతడినిఒకచాపలోచుట్టేసిఉంచేస్తుంది. అందరూపూజచేసుకుంటారు. అదిఅయ్యాక, ఆమెఆబాబునిభుజంమీదవేసుకునిస్మశానానికిఏడుస్తూవెళ్తుంది. అదిచూసినపార్వతీపరమేశ్వరులువృద్ధదంపతులరూపంలోఎదురయ్యి "ఎవరమ్మానీవు? ఎవరాబాబు? ఎందుకుఏడుస్తున్నావు?" అనిఅడుగుతారు. దానికిఆమె - "ఎవరైతేఏమిటమ్మ - మీరుఆర్చేవారాతీర్చేవారా?" అనిఅడుగుతుంది. దానికివారు - "మేమేఆర్చేవారము -తీర్చేవారము - చెప్పవమ్మా" అంటారు. ఆమెతనగోడుచెప్పుకుంటుంది. వారుఓదార్చిఅంతాశుభంకలుగుతుందిఅనిచెప్పివెళ్ళిపోతారు.అప్పుడుఆమెభుజంమీదఉన్నాబిడ్డతోసహా, ఇదివరకుచనిపోయినబిడ్డలుకూడాలేచివచ్చేస్తారు. వారినిచూసినఆశ్చర్యంలోఆదంపతులనుచూద్దాంఅనితిరిగేసరికివారుఉండరు. అప్పుడు - అదిపార్వతీపరమేశ్వరులుఅనితెలుసుకునిఆనందంగాఇంటికివెళ్ళిపోతుంది. అక్కడఆమెతోడికోడళ్ళుఈమెఅదృష్టానికిఅబ్బురపోయిక్షమార్పణచెప్పుకుంటారు. అప్పటినుండిఆమెప్రతిఏటతప్పకుండాపోలాలఅమావాస్యపూజ జరుపుకుంటుంన్నారు." ఈకథవిన్నతరువాతచెప్పినవారు:"పోలేరమ్మ, నీఇల్లుపాలతో, నేతితోఅలుకుతాను. నాఇల్లుఉచ్చతో, పియ్యతోఅలుకు", అంటారు.వినడానికికొంచం వింతగా వుంటుంది. కాని అది వారి పిల్లలమీదప్రేమకు గుర్తుగా కనిపిస్తుంది . ఆకథఅక్షింతలుచదివినవాళ్ళు,విన్నవాళ్లుతలపైవేసుకుంటారు. తరువాత పూజలో పసుపు కొమ్ముకు దారం కట్టి తోరం చేసి ఆ తోరాన్ని చేసి పూజ అయ్యాక ఆ పసుపుకోమ్మును చిన్నపిల్లలుకు కడతారు. అది వారికి రక్షగా వుంటుంది అని భావిస్తారు.
ఉగాది ప్రతీ సంవత్సరం చాంద్రమానం ప్రకారం చైత్ర శుద్ధ పాడ్యమి రోజు వస్తుంది. ఉగాది పండగకు చారిత్రిక కధలువున్నాయి.
దుష్టులను శిక్షించి, శిష్టులను రక్షించి, ధర్మాన్ని నిలపడానికి శ్రీమహావిష్ణువు ఈ భూమి మీద తిరిగి తిరిగి అవతరిస్తూ వచ్చాడని హిందువుల నమ్మకం. 'అవ తారం' అనే మాటకు 'దిగి రావడం' అని అర్థం ఉంది. ధర్మసంస్థాపనానికి శ్రీమహావిష్ణువు ఎత్తిన అవతారాలలో ప్రధానమైనవి పది. వాటినే దశావతారాలు అంటారు. శ్రీ మహావిష్ణువు ధరించిన అవతారాలలో మత్స్యావతారం మొదటిది.
ఈరోజే మత్స్యము గా అవతరించారు అంటారు.
ద్రవిడ దేశపు రాజైన సత్యవ్రతుడు కృత మాలిక ఒడ్డున జల తర్పణం చేయుచుండగా మత్స్య మొకటి అతని దోసిట పడెను. అది నన్ను రక్షించు రక్షించు అని రాజును వేడు కొనెను. రాజు ఆ మత్స్యాన్ని ఒక భాండం నందుచెను. మరుసటి రోజు ఆమత్స్యం పది నారంగుళములు పెరిగిను. ఈ విధంగా పెరు గుతూపోతున్న చేపను చివరికి సముద్రంలో వేస్తూ నీవేవరివి? అని అడిగెను. దానికి ఆ చేప తాను, జనార్దుడనని చెప్పెను. బ్రహ్మదేవుడు నిద్రిస్తున్న సమయంలో నాలుగు వేదాలను సోమకుడు అనే ఒక రాక్షసుడు దొంగ లించా డని, అతడు కౄర స్వభావుడని చెప్పాడు. అంతేకాక, ధర్మ బద్దమైన జీవన విధానానికి రాక్ష సులు వ్యతిరేకులని కూడా చెప్పాడు. సోమకుడు తాను దొంగిలించిన నాలుగు వేదా లతో సహాసముద్రం అడుగుభాగాన దాగి ఉన్నా డు. మహాజల ప్రళయం రానున్న కార ణంగా ముల్లోకాలు నీట మునుగుతాయి. నేను మీ కోసం ఒక నావను పంపుతాను. మీరు, సప్తఋషులు, ఔషధవృక్షజాతులతో కలిసి, ఆనావలో ఎక్కండి. వాసుకి అనే మహా సర్పంతో ఆనావను కట్టండి. మహాజల ప్రళయం ముగిసేదాకా ఆ నావ నీటిలో తేలియాడేలా నేను చూసుకుంటాను అని ఆ మత్స్యం అభ యమిచ్చింది. చేప రూపంలో ఉన్న విష్ణువు చెప్పిన విధం గానే సత్య వ్రతుడు చేశాడు. అప్పుడు ఆ చేప సముద్రం అడుగు భాగానికి ఈదుకుంటూ వెళ్లాడు. సోమకుడు దాగి ఉన్న చోటికి చేరు కున్నాడు. ఘోర యుద్ధ అనంతరం సోమ కుడు మరణించాడు. శ్రీమహావిష్ణువు నాలుగు వేదాలు రక్షించి తెచ్చి బ్రహ్మదేవునికి అందించాడు. బ్రహ్మదేవుడు వాటిని ముందు తరాల వారికోసం భద్రపరిచాడు. ఆ విధంగా వేదాలు మనకు లభ్య మైన కారణంగా మానవులు సకల ధర్మాలను, శాస్త్రాలను, అభ్యసించే అవకాశం కలిగింది.
మనం చిన్న పిల్లలకు కధలు చెప్తాం కదా అందులో విక్రమార్క మాహారాజు కధలు కూడా చెప్తాం. ఆ విక్రమార్క మహారాజు పటాభిషేకం జరిగిన రోజు కూడా ఈరోజే. ఇవి చరిత్రలోని కొన్ని అంశాలు.
ఈ ఉగాది అందరికి ఎన్నో ఎన్నెన్నో ఆనందాలు ఇవ్వాలి అని కోరుకుంటూ శ్రీ దుర్ముఖి నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు.
వేలిముద్రలు ద్వారా DNA స్వీకరించి ఒక వ్యక్తి యొక్క DNA మరియు వేరొక వ్యక్తి యొక్క ఏకైక లక్షణాలను విశ్లేషించే ఒక టెక్నిక్. DNA వేలిముద్రలు ద్వారా ప్రసూతి / పితృత్వాన్ని పరీక్ష ద్వారా తెలుసుకోగలరు , ఫోరెన్సిక్స్, మరియు విపత్తు బాధితుల గుర్తించగలరు సమూలంగా. "DNA వేలిముద్రలు" మానవ గుర్తింపు సాధనంగా వేలిముద్రలు సాంప్రదాయికగా ఉపయోగాన్ని సూచిస్తాయి వాడబడుతున్నాయి. క్లాసిక్ వేలిముద్రలు పొందటానికి కష్టం మరియు ఉపయోగపడే నమూనాలను సంబంధించినదిగావుంది . సరిగా నిర్వహిస్తున్నపుడు, DNA ఆధారిత పరీక్ష మాత్రమే అందిస్తుంది, ప్రత్యేక సాక్ష్యం, అది ఒక వ్యక్తి యొక్క గుర్తింపును సాక్ష్యంగా బయాస్ లేకుండా అందిస్తుంది. DNA పరీక్షా ద్వారా అసలైన నేరస్తులకు శిక్ష పడేటట్టు చెయవచ్చు. ఇలాంటి DNA ని కనుక్కొన్న శాస్త్రవేత్త గురుంచి తెలుసుకుందాం.
James Watson - జేమ్స్ వాట్సన్. జీవశాస్త్రంలో విశేష కృషి చేసిన శాస్త్రవేత్త. అమెరికాలోని షికాగో నగరంలో 1928 ఏప్రిల్ 6న సంపన్న కుటుంబంలో పుట్టిన జేమ్స్ డేవీ వాట్సన్ బాల మేధావిగా పేరుపొందాడు. రేడియో క్విజ్ కార్యక్రమాల్లో చురుగ్గా రాణించిన జేమ్స్ 15 ఏళ్ల కల్లా షికాగో విశ్వవిద్యాలయంలో ప్రవేశం పొందాడు. జంతుశాస్త్రంలో పట్టభద్రుడయ్యాక 'వాట్ ఈజ్ లైఫ్' అనే గ్రంథం చదివి ఉత్తేజితుడై జన్యుశాస్త్ర (జెనెటిక్స్) అధ్యయనం ఆరంభించాడు. ఆపై 22 ఏళ్లకే డాక్టరేట్ సాధించాడు. పరిశోధనలు కొనసాగించి లండన్లోని కేవిండిష్ లాబరేటరీలో ఫ్రాన్సిస్ క్రీక్, మారిస్ విల్కిన్స్తో కలిసి డీఎన్ఏను ఆవిష్కరించగలిగాడు. 'డబుల్ హెలిక్స్' అనే గ్రంథం రాశాడు. జీవశాస్త్రంలో అద్భుతమైన ఆవిష్కరణగా పేరొందినది ఏమిటో తెలుసా? డీఎన్ఏ నిర్మాణాన్ని కనిపెట్టడం. ఆ పరిశోధనలో ప్రముఖ పాత్ర వహించిన శాస్త్రవేత్తే జేమ్స్ వాట్సన్. ఇందుకుగాను నోబెల్ బహుమతిని అందుకునేనాటికి అతడి వయసు 25 సంవత్సరాలే! ఆయన పుట్టిన రోజు -1928 ఏప్రిల్ 6 .
మానవ శరీరం కోట్లాది జీవకణాలతో నిర్మితమైందని మీరు పాఠాల్లో చదువుకుని ఉంటారు. ఒకో కణంలో సైటోప్లాజమ్ అనే జెల్లీలాంటి ద్రవ పదార్థం ఉంటుంది. కణ కేంద్రమైన న్యూక్లియస్లో క్రోమోజోమ్స్ అనే రసాయనిక పోగులుంటాయి. ఇవి క్లిష్టమైన DNA(Deoxy ribo Nucleic Acid) అనే రసాయనంతో తయారై ఉంటాయి. డీఎన్ఏ సర్పిలాకారపు నిచ్చెన (spiral ladder) రూపంలో ఉండే అతి పొడవైన రెండు దారాల్లాంటి నిర్మాణంతో మెలికలు తిరిగి ఉంటుంది. దీన్ని డబుల్ హెలిక్స్ అంటారు. జీవపదార్థాల్లో సమాచార మార్పిడికి ఇదెంతో కీలకం.
జేమ్స్ పరిశోధన వల్ల జీన్ క్లోనింగ్, జీన్ బ్యాంకులు, జెనెటిక్ ఇంజినీరింగ్ అందుబాటులోకి వచ్చాయి. వీటి వల్ల పుష్ఠికరమైన ఆహార పదార్థాల ఉత్పత్తి, నాణ్యమైన ఔషధాల ఉత్పాదన, రోగ నిర్దారణలో ప్రమాణాలు సాధ్యమవుతున్నాయి. జేమ్స్ సారధ్యంలో కేన్సర్కి కారణమైన ఆంకోజీన్ను కనుగొన్నారు. ఎనభై రెండేళ్ల వయసులో ఆయన ఇప్పటికీ పరిశోధనలను చురుగ్గా కొనసాగిస్తుండడం విశేషం. అలాంటి జేమ్స్ వాట్సన్ కి జన్మదిన శుభాకాంక్షలు.
రోగ నిర్దారణకు అప్పట్లో కొత్తవరావడి సృష్టించారు ప్రపంచంలో వైద్యరంగంలో రోగనిర్దారణకు(రేడియోగ్రఫీ) మరియు రోగ నిర్మూలనకు(రేడియో థెరఫీ) కొరకు ఉపయోగించే ఎక్స్ కిరణాలను కనుగొన్న ప్రఖ్యాత శాస్త్రవేత్త విల్హేల్మ్ కన్రాడ్ రాంట్జెన్. ఈయన కనుగొనే ఎక్స్ కిరణాలు వైద్యరంగలములోనె కాక భద్రతా రంగంలో ఉపయోగపడుతున్నాయి. విల్హేల్మ్ కన్రాడ్ రాంట్జెన్ (మర్చి 27,1845 - ఫిబ్రవరి 10,1923) జర్మన్ దేశ భౌతిక శాస్త్ర శాస్త్రవేత్త. 1895 నవంబర్ 8 న విద్యుదయస్కాంత తరంగాలలో వివిధ తరంగ దైర్ఘ్యలుల అవధులలో గల ఎక్స్- కిరణాలను కనుగున్నాడు. ఈ పరిశోధన వల్ల 1991 లో భౌతిక శాస్త్రంలో మొదటి సారి నోబెల్ బహుమతి పొందారు. ఈయన చేసిన కృషికి గాను ఆవర్తన పట్టిక లో 111 పరమాణు సంఖ్య గల మూలకానికి రాంట్ జీనియమ్ అనిపేరు పెట్టి గౌరవించారు.
రాయింట్జన్ మార్చి 27, 1845 న జర్మనీలోని లెన్నెస్ లో జన్మించాడు. ఈయన తండ్రి ఒక రైతు. తల్లి ఒక డచ్ మహిళ. హాలెండ్ లో విద్యాభ్యాసం జరిగింది.1865 లో యుట్రెచ్ యూనివర్సిటీ లో చేరుటకు ప్రయత్నాలు ప్రారంభించాడు. కాని జూరిచ్ లో గల ఫెడెరల్ పాలిటెక్నిక్ సంస్థ లో చేరి పరీక్షలను ఉత్తీర్ణుడయ్యాడు. అచట మెకానికల్ ఇంజనీరుగా చేరాడు. 1869 లో తత్వశాస్త్రమునందు జూరిచ్ విశ్వవిద్యాలయం నుండి పి.హె.డి పట్టాను పొందాడు. ఆ విశ్వవిద్యాలయంలో ప్రముఖ ప్రొపెసర్ అయిన ఆగస్ట్ కుండ్త్ యొక్క ప్రియమైన శిష్యుడయ్యాడు. ఎక్స్ కిరణాలను రాయింట్ జన్ కిరణాలని అందురు. కాని రాయింట్ జనే స్వయంగా వాటిని ఎక్జ్ కిరణాలని పిలిచాడు. ఈ కిరణాలను కనుగొని లోకానికి పరోపకారం చేసినందుకు కృతజ్ఞతగా ఈయనకు 1901 లో భౌతిక శాస్త్రం తరపున నోబెల్ బహుమతి లభ్యమయింది. ఈ ఎక్స్ రే వెనుక ఎంతో ఆసక్తి కరమైన కథ ఉంది.
రాయింట్ జన్ కేథోడ్ రే ట్యూబ్(శూన్య గాజు నాళం) తో పరిశోధనలు చేసేవాడు. గది అంతా చీకటిగా ఉన్నప్పుడు యీ ట్యూబ్ గుండా కాంతి కిరణాలను పంపడం జరిగింది. పైగా ట్యూబ్ చుట్టూ నల్లని కాగితాన్ని కాంతి కిరణాలు ఏ కొంచెం కూడా వెలువడకుండా కప్పి ఉంచాడు. ఇలా చేసినప్పటికి కాథోడ్ ట్యూబ్ కు సమీపంలో ఉన్న బేరియం ప్లాటినో సైనైడ్ స్ఫటికం వింత మెరుపులతో ప్రకాశించ సాగింది. నల్లటి కాగితాన్ని కప్పి ఉంచినప్పటికీ కాథోడ్ ట్యూబ్ నుంచి ఏవో అజ్ఞాత కిరణాలు వెలువడి బేరియం ప్లాటినో సైనైడ్ స్ఫటికం మీద పడి అది మెరిసేటట్లు చేసిందని యీయన ఊహించగలిగాడు.
ఈ కిరణాలను కాగితం గుండా, చెక్క గుండా, లోహపు పలకల గుండా ప్రయాణం చేయగలవని యీయన కనుగొన్నాడు. ఈ కిరణాలు కూడా ఓ రకమైన కాంతి కిరణాలే అని అయితే వీటితరంగ దైర్ఘ్యంచాలా తక్కువ కావటం వల్ల మనుషుల కళ్ళకు కనిపించవని రాయింట్జన్ వెల్లడించాడు. మామూలు కాంతి కిరణాలే ఫోటోగ్రాఫిక్ ప్లేట్ల మీద ప్రభావం చూపుతూ ఉండగా, యీ కిరణాలు మాత్రం చూపకుండా ఉంటాయా అనే ఆలోచన రాయింట్ జెన్ కి రావటం - శాస్త్ర ప్రపంలో ఒక సరికొత్త అధ్యాయానికే కారణభూతమైనది.
ప్రయోగం చేయటం కోసం రాయింట్ జన్ ఫోటో గ్రాఫిక్ ప్లేటు మీద తన భార్య చేతిని ఉంచి యీ కిరణాలను ప్రసారం చేసి ఫోటోను డెవలప్ చేసి చూసి ఆశ్చర్యపోయాడు. చేతి ఎముకలు ఉంగరంతో సహా ఆ ఫోటో లో వచ్చింది. చుట్టూ మాంసం ఉన్నట్లు మసక మసకగా ఉంది. అంటే సజీవంగా ఉన్న మనిషి కంకాళాన్ని ఈ కిరణాల ద్వారా ఫోటో తీయవచ్చని స్పష్టంగా తేలింది. దురదృష్ట వశాత్తు రాయింట్ జన్, ఆయనతో కలిసి పనిచేసిన మరో ఇద్దరు పరిశోధకులు యీ ఎక్స్ కిరణాల తాకిడికే క్రమ క్రమంగా మరణించారు. ఈ ఎక్స్-కిరణాల వల్ల ఎంతో ప్రయోజనం కలుగుతున్నప్పటికీ వాటిని మితిమీరి వాడితే మాత్రం ప్రమాదం తప్పదు. యీ కారణంగానే ఎక్స్-కిరణాలను నిరంతరం గురి కాబట్టే రాయింట్ జన్ ఆ కిరణాల ప్రభావంగానే చనిపోయాడని తెలుస్తోంది.
1901 లో రాంట్ జెన్ కు మొదటి భౌతిక శాస్త్రంలో నోబెల్ బహుమతివచ్చింది. ఈ బహుమతి ఆయన ఎక్స్ కిరణాలు కనుగొని విశేష సేవలందించినందుకు గాను యివ్వబడింది. కాని రాంట్ జెన్ ఆ బహుమతికి వచ్చిన ఆర్థిక ప్రతిఫలాన్ని తన విశ్వవిద్యాలయమునకు దానమిచ్చాడు.పియరీ క్యూరీవలే రాంట్ జన్ తన పరిశోధనకు పేటెంట్ హక్కులను తిరస్కరించాడు.ఎందువలనంటే మానవాళికి తన పరిశోధన యొక్క ఫలితాలు ఉపయోగకరంగా ఉండాలని.ఈ కిరణాలకు తన పేరు కూడా పెట్టరాదని కోరుకున్నాడు.
రమ్ ఫోర్డ్ మెడల్(1896)
మాటెక్కీ మెడల్(1896)
ఎలియట్ క్రెస్సన్ మెడల్(1897)
భౌతిక శాస్త్రం లో నోబెల్ బహుమతి(1901)
నవంబరు 2004 లో పరమాణు సంఖ్య 111 గా గల మూలకానికి ఆయన పై గౌరవార్థంరాంట్జెనీయం(Rg) అనిIUPACసంస్థ నామకరణం చేసింది.IUPAPకూడా ఈ పేరును నవంబర్ 2011 లో దత్తత తీసుకుంది.