Blogger Widgets

మంగళవారం, నవంబర్ 29, 2011

కనకమహాలక్ష్మి

మంగళవారం, నవంబర్ 29, 2011


కనకమహాలక్ష్మి

మార్ఘ్హశిరమాసంలో మా అమ్మమ్మ చేసే పూజలల్లో చాలా ముఖ్యమైనది మార్ఘ్హశిర లక్ష్మివారం పూజ. అమ్మమ్మ చాలా నిష్టగా చేస్తుంది. సంవత్సరంలో పన్నెండునెలలో మార్గశిరమాసం చాలా శ్రేష్టమైనది. ఆనెలలో వచ్చె ప్రతీ గురువారం పూజచేస్తారు. లక్ష్మీదేవికి ఇష్టమైన వారం. అందరు పూజలు చేస్తారు.

అమ్మవారు ఇక్కడ ఇలవేలుపు దేవత. స్థానిక కథనం  ప్రకారం, సంవత్సరం 1912 లో, దేవత శ్రీ  కనక మహా లక్ష్మి అమ్మవారు యొక్క విగ్రహం స్తాపించారు. ఇది మున్సిపల్ లేన్ నడుమ, రహదారి మధ్యలో నిలబెట్టారు. రహదారిని విశాలం చేయటానికి గాను మున్సిపల్ అధికారులు,, రోడ్ మధ్యనుండి రహదారి ఒక మూలకు అమ్మవారి విగ్రహాన్ని మార్చారు. ఈ సమయంలో కాలం సంవత్సరం 1917 ప్రమాదకరమైన అంటువ్యాధి `పట్టణం లో  ప్లేగు  'వ్యాప్తి చెందింది , మరియు చాలా మంది చనిపోయారు.  విశాఖపట్నం ప్రజలు ఈ సంఘటన కు భయపడ్డారు. ఇంత వినాశనం ఎందువల్ల జరిగిందో ఆలోచించారు అప్పుడు దేవత `శ్రీ కనక మహా లక్ష్మి ', యొక్క విగ్రహం యొక్క బదిలీ వలన అని తెలిసి , రహదారి మధ్యలో, దాని అసలు స్థానం కి అమ్మవారి విగ్రహాన్ని మళ్లీ నిలబెట్టిరి.  `ప్లేగు 'వ్యాధి నయమయ్యింది మరియు సాధారణ పునరుద్ధరించబడింది. గ్రామస్తులు అది దేవత. యొక్క మిరకిల్ కారణంగా బలమైన నమ్మకం కలిగివున్నారు అక్కడి ప్రజలు. అందువలన అప్పుడు నుండి చాలా భక్తి తో సేవలు  ద్వారా దేవత ఆరాధన చేస్తున్నారు  అక్కడ గ్రామీణులు తరువాత. ఇంకా, సమీపంలో ప్రజలు `శ్రీ కనక  మహా లక్ష్మి అమ్మవారు  ను MOTHER OF TRUTH  మరియు ఎల్లప్పుడూ వారి అవసరాలు నెరవేర్చును.  ఆమె భక్తులును  అనుగ్రహించును  అని బలమైన నమ్మకం ఉంది. మహిళా భక్తులు దేవత "సుమంగళి" గా వారిని అనుగ్రహించును  ఆమె పైన విశ్వాసాలను కలిగి ఉన్నాయి. దేవత యొక్క భక్తులు దేవాలయానికి కొత్తగా పుట్టిన తమ పిల్లలు రప్పించి, దేవత యొక్క అడుగుల వద్ద ఉంచి మరియు దీవెనలు కోరుకుంటారు.  అక్కడ ప్రజలే కాకుండా దేశ విదేశాలనుండి ప్రత్యకం వచ్చి అమ్మ దర్సనం చేసుకుంటారు.  మార్గశిర మాసంలో ఇక్కడ ప్రజలు చాలా ఎక్కువగా వచ్చి వారి కోరికలు విన్నవించుకుంటారు.  కోరికలు తీరినవారు మొక్కును తీర్చుకుంటారు.   మార్గశిర లక్ష్మివారం చాలా ప్రసిద్దమైనది.  

సోమవారం, నవంబర్ 21, 2011

పొడుపు కధలు విప్పండి

సోమవారం, నవంబర్ 21, 2011

ఈ పొడుపు కధలకు జవాబులు మీకు తెలుసా అయితే చెప్పండి. 

 అంతులేని చెట్టుకు అరవై కొమ్మలు
కొమ్మకోమ్మకి కోటి పూలు 
అన్ని పూలకు రెండే కాయలు  
ఏమిటవి చెప్పుకోండి చూద్దాం.
[జ] ఆకాశం, చుక్కలు, సూర్యడు, చంద్రుడు  

అమ్మ కడుపున పడ్డాను 
అంతా సుఖాన వున్నాను 
నీచేదేబ్బలు తిన్నాను 
నిలువునా ఎండిపోయాను
నిప్పుల గుండు తొక్కాను 
గుప్పెడు బూడిదను అయినాను 
అయితే నేను ఎవరు మరి?
[జ]పిడక

చూపులేని కన్ను  సుందరమైన కన్ను 
తోటలేని కన్ను తోట కన్ను  
కన్ను కాని కన్ను కాలకంఠుని  కన్ను 
నా కన్ను కాదు మరి ఎవరి కన్ను?
[జ] నెమలి కన్ను

ఆదివారం, నవంబర్ 20, 2011

తక్కువేమి మనకు రాముండొక్కడుండువరకు

ఆదివారం, నవంబర్ 20, 2011

రామదాసు

మంగళంపల్లి బాలమురళీకృష్ణ
తక్కువేమి మనకు రాముండొక్కడుండువరకు
ప్రక్కతోడుగా భగవతుడు మనచక్రధారియై చెంతనెయుండగ 
ముత్చుసోమకుని మును జంపినయా
మత్స్యమూర్తి మన పక్షముండగను 
సురలకొరకు మందరగిరి మోసిన
కూర్మావతారుని కౄప మనకుండగ 
దురాత్మునా హిరణ్యాక్షు ద్రుంచిన
వరాహమూర్తి మనవాడై యుండగ 
భూమి స్వర్గమును పొందుగ గొలిచిన
వామనుండు మనవాడై యుండగ 
ధరలో క్షత్రియులను దండించిన
పరశురాముడు మనపాలిట నుండగ 
దశగ్రీవు మును దండించినయా
దశరథరాముని దయ మనకుండగ 
ఇలలో యదుకుల మందుదయించిన
బలరాముడు మన బలమైయుండగ 
దుష్టకన్సుని ద్రుంచ్నట్టి
శ్రీకృఇష్ణూ మనపై కౄపతో నుందగ 
కలియుగాంతమున కలిగెడి దైవము
కలికి మనలను కావగ నుండగ 
రామదాసుని గాచెడి శ్రీమ
న్నారాయణు నెరనమ్మి యుండగ .

శనివారం, నవంబర్ 19, 2011

ఝాన్సీ లక్ష్మీబాయి

శనివారం, నవంబర్ 19, 2011


వీర నారి ఝాన్సి లక్ష్మిబాయ్ & ఆమె దత్త పుత్రుడు దామోదర్ 
ఝాన్సీ లక్ష్మీబాయి అసలు పేరు మణికర్ణిక.  ఆమెను అందరు మనూ అని ముద్దుగా పిలిచేవారు.  ఆమె 1828వ సంవత్సరములో మహారాష్ట్ర కు చెందిన ఒక కర్హాడీ బ్రాహ్మణుల వంశంలో వారణాసి లో జన్మించింది. ఆమె తల్లిదండ్రులు మోరోపంత్ తాంబే, భాగీరథీబాయి. వీరిది సంప్రదా య బ్రాహ్మణ కుటుంబం.  ఝాన్సీ లక్ష్మీబాయికి నాలుగు సంవత్సరాల వయసు ఉన్నప్పుడే తల్లి చనిపోయింది. తండ్రి పెంపకంలో పెరిగింది. డీ.బీ పరాస్నిస్ అనే చరిత్రకారుడు రాణీ నవంబర్ 191835 వసంవత్సరంలో జన్మించినట్లు  ఆయన తెలియజేసారు.  పరాస్నిస్ ఝాన్సి రాణీగారి జీవిత చరిత్రలో పేర్కొన్నాడు. నిజానికి ఆమె పుట్టిన దినముకు ఎటువంటి  చారిత్రక ఆధారాలు లేకపోవడం వలన నవంబర్ 19 ,1828 తేదీని అమోదించవలిసి వుంది.  దీనికి ఆధారం 1854లో జాన్ లాంగ్ అనే ఆంగ్లేయుడు రాణిని కలవడానికి వెళ్ళినపుడు ఆమె వయసు  26 ఏళ్ళ స్త్రీ .   

 ఆమె తల్లి చనిపోయిన తరువాత బాజీరావు పీష్వా, మోరోపంత్‌ను బీరూర్‌కి పిలిచి ఆశ్రయమిచ్చి      ఆదుకున్నాడు. బాజీరావుకు సంతానం లేకపోవటంతో నానాసాహెబ్ అనే బాలుడిని దత్తత చేసుకున్నాడు. నానాసాహెబ్ ను మన మనూ నానా అన్నయా అని ఎంతో ప్రేమగా పిలిచేది.  నానా కూడా మనూను చెల్లెలిగా ఆదరించారు మరియు అన్ని విషయాలలో సహాయంగా వున్నాడు నానా.  వీరు  విద్యలన్నీ కలిసి నేర్చుకున్నారు. కత్తిసాము, గురప్రు స్వారీ, తుపాకీ పేల్చటం వంటి విద్యలంటే మనూకు చిన్నప్పటి నుండే చాలా ఇష్టం ఎక్కువ. ఖడ్గం ధరించి, కళ్లెం బిగించి స్వారీ చేస్తూ నానాసాహెబ్ వెంట మనూబాయి దూసుకొని పోయేది.

లక్ష్మీబాయికి 13వ ఏటనే 1842లో ఝాన్సీ రాజైన గంగాధరరావు నెవల్కార్ తో వివాహమైంది. దీంతో ఆమె ఝాన్సీ పట్టణానికి మహారాణి అయ్యింది. మహారాణి అయిన తర్వాత అప్పటి ఆచారాల ప్రకారం ఆమె పేరు లక్ష్మీ బాయి అయింది. 1851లో ఒక కుమారుడికి జన్మనిచ్చింది. ఆ పిల్లవాడు నాలుగు నెలలకే బ్రిటిష్ వారి కుట్ర తో చనిపోయాడు.వాసుదేవ నేవల్కర్ కుమారుడైన దామోదర్ రావు అనే పిల్లవాడిని చనిపోవడానికి కేవలం ఒక్క రోజు ముందుగానే దత్తత తీసుకున్నారు. 1853నవంబర్ 21 వ తేదీన గంగాదార్ మరణించాడు.


 దత్తత తీసుకునే సమయానికి డల్హౌసీ భారత గవర్నర్ జనరల్ గా ఉన్నాడు.  హిందూ సంప్రదాయం ప్రకారం దామోదర్‌రావు రాజు కావాల్సి ఉండగా బ్రిటిష్ ప్రభుత్వం అంగీకరించలేదు. లక్ష్మి బాయి ఈస్ట్ ఇండియా కంపెనీ కి చెందిన ఒక లాయర్ రాబర్ట్ ఎల్లిస్ సలహా తో  లండన్ కోర్టులో దావా వేసింది.కోర్టులో ఎంత వాదించినప్పటికీ ఎటువంటి ప్రయోజనం కలుగలేదు.  బ్రిటిష్ వారు లో ముఖ్యడు నిల్సన్ అనే అతను కుట్రచేసి లక్ష్మి బాయి  పట్టణం విడిచి వెళ్లాలని ఆదేశించారు. కానీ దానికి ఆమె అంగీకరించలేదు.  దానికి మోసపూరితంగా ఝాన్సి లోకి ప్రవేసించి వారు ఝాన్సి రాజ్యాన్ని ఆదినపచుకున్నారు. 1857లో జరిగిన తిరుగుబాటులో ఝాన్సీ పట్టణం లో విప్లవానికి నాంది పలికింది. విప్లవకారులకు కేంద్రం అయింది. ఆ సమయంలోనే ఆమె సైన్యాన్ని సమీకరించి ఆత్మరక్షణ చేసుకుంది. మహిళలకు కూడా యుద్దవిద్యలు నేర్పించినది.  ఆమె పురుషవేషం తో తన దత్త పుత్రుని వీపుకు కట్టుకొని పక్క రాజ్యాలైన దతీయా, ఓర్చాల దాడిని ఎదుర్కొంది. వారిని కూడా తన విప్లవములోపాలుపంచుకోనేటట్టు చేసి చివరకు బ్రిటిష్ సైన్యం పై ఝాన్సీ ముట్టడించింది. రెండు వారాలు పోరాడి ఆఖరికి 1858, జూన్ 17న గ్వాలియర్ యుద్ధం లో మరణించింది.  ఆమె భారత స్వాతంత్ర్యోద్యమ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోవడమే కాక 19వ శతాబ్దంలో మహిళా సాధికారతకు ఆదర్శ ప్రాయంగా నిలిచింది ఝాన్సి లక్ష్మి బాయి.
ఆమె ఆనాడు మొదలు పెట్టిన విప్లవ జ్యోతి పెద్దగా మారి చివరకు మనదేశం నుండి విదేశీయులు వదిలి వెళ్ళేవరకు   ఆగలేదు.
నిజంగా ఆమెకు head 's off  చెప్పాలి.

My Blog Lovers

నా యూట్యూబ్ చానల్స్ ప్లీజ్ సబ్స్క్రిబ్ చేయండీ

Diabetic Challenger

DIABETIC CHALLENGER YOUTUBE CHANNEL. PLASE SUBSCRIBE MY CHANNEL...... THANK YOU VERY MUCH.

Ammamma Tho Nenu (అమ్మమ్మ తో నేను

Please subscribe our channel Ammamma Tho Nenu (అమ్మమ్మ తో నేను)