Blogger Widgets

ఆదివారం, జూన్ 20, 2010

ప్రపంచ సంగీత దినోత్సవం

ఆదివారం, జూన్ 20, 2010

 

ఈ రోజు జూన్ 21 వ తేదిన ప్రపంచ సంగీత దినోత్సవంగా జరుపుకుంటారు. అందుకు గాను నేను నాకు నచ్చిన అన్నమయ పాటతో మీ అందరికీ ప్రపంచ సంగీత దినోత్సశుభాకాంక్షలు తెలుపుకుంటున్నాను.

ప. లెండో లెండో మాటాలించరో మీరు
కొండల రాయనినే పేర్కొన్న దిదె జాలి లెండో



చ. మితి మీరెఁజీకట్లు మేటి తలవరులాల

జతనము జతనము జాలోజాలి

యితవరులాల వాయించే వాద్యాల కంటే
నతిఘోషముల తోడ ననరో జాలి లెండో

చ. గాములు వారెడి పొద్దు కావలికాండ్లాల
జాముబాము దిరుగరో జాలోజాలి
దీమనపు పారివార దీవెపంజులు చేఁబట్టి
యేమరక మీలో మీరు యియ్యరో జాలి లెండో

చ. కారుకమ్మె నడురేయి గడచెఁ గట్టికవార
సారెసారెఁ బలుకరో జాలోజాలి
యీరీతి శ్రీ వేంకటేశుఁడిట్టె మేలుకొన్నాడు
గారవాన నిక మానఁ గదరో జాలి లెండో

Happy father's day.

Father's Day is a day honoring Fathers and celebrating fatherhood, paternal bonds, and the influence of fathers in society. It is celebrated on the third Sunday of June in 55 of the world's countries and on other days elsewhere.It is a widely known celebrations. 
I am wishing all father's Happy father's day. 

బుధవారం, జూన్ 16, 2010

Rani Of Jhansi - Lakshmibhai's Determination

బుధవారం, జూన్ 16, 2010

ఆదివారం, జూన్ 13, 2010

దిబ్బలు వెట్టుచు

ఆదివారం, జూన్ 13, 2010


దిబ్బలు వెట్టుచు దేలిన దిదివో | ఉబ్బు నీటిపై నొక హంస ||

అనువున గమల విహారమె నెలవై | ఒనరియున్న దిదె ఒక హంస |
మనియెడి జీవుల మానస సరసుల | వునికి నున్న దిదె ఒక హంస ||

పాలు నీరు నేర్పరచి పాలలో | నోలలాడె నిదె యొక హంస |
పాలుపడిన యీ పరమహంసముల | ఓలి నున్న దిదె యొక హంస ||

తడవి రోమరంధ్రంబుల గ్రుడ్ల | నుడుగక పొదిగీ నొక హంస |
కడు వేడుక వేంకటగిరి మీదట | నొడలు పెంచెనిదె యొక హంస ||

శుక్రవారం, జూన్ 11, 2010

Unity Is Strength

శుక్రవారం, జూన్ 11, 2010

ఆదివారం, జూన్ 06, 2010

అమ్మ ముద్దులే మాకిష్టం

ఆదివారం, జూన్ 06, 2010

ఆటలంటే మాకిష్టం - పాటలంటే మాకిష్టం
ఆటల కన్నా పాటల కన్నా - అల్లరి పనులే మాకిష్టం
సినిమాలంటే మాకిష్టం - మిఠాయిలంటే మాకిష్టం
సినిమా కన్నా మిఠాయి కన్నా - షికార్లు కొట్టుట మాకిష్టం
పిట్టలంటే మాకిష్టం - పువ్వులంటే మాకిష్టం
పిట్టల కన్నా పువ్వుల కన్నా - చెట్లు ఎక్కడం మాకిష్టం
కొత్త బట్టలు మాకిష్టం - పౌడరు స్నోలు మాకిష్టం
బట్టల కన్నా పౌడరు కన్నా - మట్టిలో ఆటలు మాకిష్టం
టీచర్లంటే మాకిష్టం - పాఠాలంటే మాకిష్టం
టీచరు కన్నా పాఠం కన్నా - బడి సెలవంటే మాకిష్టం
వెన్నెలంటే మాకిష్టం - వానలంటే మాకిష్టం
వెన్నెల కన్నా వానల కన్నా - అమ్మ ముద్దులే మాకిష్టం

గురువారం, జూన్ 03, 2010

Carroms

గురువారం, జూన్ 03, 2010

బుధవారం, జూన్ 02, 2010

Bar Billiards

బుధవారం, జూన్ 02, 2010

తెప్పగా మఱ్రాకు మీద

తెప్పగా మఱ్రాకు మీద తేలాడు వాడు - ఎప్పుడు లోకములెల్ల నేలేటివాడు


మోతనీటి మడుగులో యీతగరచినవాడు - పాతగిలే నూతిక్రింద బాయనివాడు
మూతిదోసిపట్టి మట్టిముద్ద పెల్లగించువాడు - రోతయన పేగుల పేరులు గలవాడు

కోడికూత నోరివాని కుర్రతమ్ముడైనవాడు - బూడిద బూసిన వాని బుద్ధులవాడు
మాడవన్నె లేడివెంట మాయలబడినవాడు - దూడల నావుల గాచి దొఱయనవాడు

ఆకసానబారే వూరి అతివల మానముల - కాకుసేయువాడు తురగముపైవాడు
ఏకమై వేంకటగిరి నిందిరారమణి గూడి - యేకాలము బాయని యెనలేని వాడు

మంగళవారం, జూన్ 01, 2010

నల్లి -దోమ

మంగళవారం, జూన్ 01, 2010

సోమవారం, మే 31, 2010

50 States capitals

సోమవారం, మే 31, 2010

Self-Discipline



Self-discipline begins with the mastery of your thoughts.
If you don't control what you think, you can't control what you do.
Simply, self-discipline enables you to think first and act afterward.

                                                                                                                  :  Napoleon Hill

ఆదివారం, మే 30, 2010

Doctor Trickle

ఆదివారం, మే 30, 2010






గురువారం, మే 27, 2010

Pockman

గురువారం, మే 27, 2010

బుధవారం, మే 26, 2010

అన్నమయ్య

బుధవారం, మే 26, 2010

అమ్మ తన పసిపాపకి చందమామని చూపిస్తూ ,గోరుముద్దలు తినిపిస్తూ
"చందమామరావో జాబిల్లిరావో, మంచి కుందనపు పైడికోరవెన్నపాలు తేవో"
ఈ పాటరాసింది తెలుగువాగ్గేయకారుడు కలియుగదైవము వేంకటేశ్వరస్వామి కి గొప్పభక్తుడు అయిన అన్నమయ్య .
అన్నమయ్య చాలాపాటలు రాసారు పాడారు .స్వామి వారికి మేలుకొలుపు అన్నమయ్య పాడినప్పుడు "నిద్రలేచేవారు.మేలుకో శృంగార రాయ మేటి మదన గోపాల మేలుకోవె నా పాలి మించిన నిధానమా " వంటి మేలుకోలుపు పాటలకు స్వామి వారు నిద్రలేసారు. మళ్ళీ రాత్రి జోల పాటలు అన్నమయ్య రాసిన"జో అచ్యుతానంద జోజో ముకుందా,  రావె పరమానంనద , రామ గోవిందా జోజో జోజో" అన్నపాటకు స్వామి వారు హాయిగా నిద్రపోతారు. అన్నమాచార్యలవారు అనేఅనేక వేలపాటలు రాసారు పాడారు. అయానపాటలవల్లే స్వామి వారికి అంతకీర్తికలిగిందా అనిపించేటట్టు వుంటాయి అన్నమయ్య పాటలు సామాన్యమానవులు కు అర్ధమైయ్యె టంత వీలు గా వుంటాయి. అన్నమయ్యపాటలు స్వామి వారికే కాదు అమ్మవారికి కూడాచాలా ఇష్టం  అమ్మవారిమీదకూడా చాలాపాటలు రాసారు.
 " క్షీరాబ్ధి కన్యకకు శ్రీ మహాలక్ష్మికిని నీరజాలయమునకు నీరాజనం" అన్నపాట అమ్మవారి నీరాజనం ఇచ్చుసమయమున పాడారు. అమ్మను చూసి చక్కని తల్లికి చాంగుభళా అంటూ పాట చలా బాగుంటుంది
 అంతే కాకు తిరుతిరు జవరాల అన్న పాట,  వుయ్యాల పాటలు
"అలరచంచలమైన ఆత్మలందుండ నీ యలవాటు చేసెనే వుయ్యాల"  తుమ్మెద పాటలు, గొబ్బిళ్ళ పాటలు, జనపదాలు,  శృంగార గీతాలు, ఆధ్యాత్మిక పదాలు ఇలా చెప్పుకుంటూ పోతే చాలా వుంన్నాయి. అన్నమయ్యరచనలు ఇంచుమించు ముప్పైరెండువేలు పాటలు వుంటాయి.
అన్నమయ్యకు పదకవితాపితామహుడు అన్నబిరుదు కలదు.  




...


అప్పని వరప్రసాది అన్నమయ్య
అప్పసము మాకే కలడన్నమయ్య ||
అంతటికి ఏలికైన ఆదినారాయణు తన
అంతరంగాన నిలిపిన(పెను) అన్నమయ్య
సంతసాన చెలువొందే సనకసనందనాదు-
లంతటివాడు తాళ్ళాపాక అన్నమయ్య ||
బిరుదు టెక్కెములుగా పెక్కుసంకీర్తనములు
హరిమీద విన్నవించె అన్నమయ్య
విరివిగలిగినట్టి వేదముల అర్ఠమెల్ల
అరసి తెలిపినాడు అన్నమయ్య ||
అందమైన రామానుజ ఆచార్యమతమును
అందుకొని నిలచినాడు అన్నమయ్య
విందువలె మాకును శ్రీవేంకటనాఠునినిచ్చె
అందరిలో తాళ్ళపాక అన్నమయ్య ||
27 వతేది మేనెల అన్నమయ్య జన్మదినము గుర్తుచేసుకుంటున్నందుకు నాకు చాలా సంతోషంగావుంది.

గురువారం, మే 20, 2010

వానా వానా వల్లప్ప

గురువారం, మే 20, 2010

ఆదివారం, మే 16, 2010

లక్ష్మీ కటాక్ష రహస్యం

ఆదివారం, మే 16, 2010

ఈరోజు అక్షయతృతియ చాలామంది బంగారం కొనుక్కొని దేవుని దగ్గర పెట్టి పూజ చేస్తారు. ఈరోజు బంగారం కొంటే మంచిది అంటారు. అందరు కోరుకునే లక్ష్మి కొందరి దగ్గర ఎక్కువగా వుంటుంది. మరికొందరికి చేతికి దక్కినట్టే దక్కి జారిపోతుంది. అసలా ఎందుకు జరుగుతోంది దానికి కారణం ఏమిటి?
శ్రీ మహాలక్ష్మి చూపులు ఎలావుంటాయంటే , దుర్మార్గుల విషయంలో అవి పరమ క్రూరంగా ఉంటాయట. అవే చూపులు తన భక్తులైన దీనులపై దయను కురిపిస్తాయట . దారిద్ర్యమనే అరణ్యాన్ని ఇట్టే దహించివేసి ఏంటో ఉదారంగా సంపదను అనుగాహిస్తాయట . ఓ తల్లీ, అలాంటి నీ చల్లనిచుపులతో నా దురద్రుస్టాన్ని పోగుట్టు అని ప్రార్ధిస్తాడు జగన్నాధ పండితరాయలు తన `లక్ష్మి కరునాలహరి'లోఅన్నారట.

 అసలు దీపమే లక్ష్మి. చీకటినుంచి వెలుగులోకి ప్రయాణించడమే జ్ఞానం , అదే సంపద, జ్ఞానము సంపదా బిన్నమైనవి కావు. ఒకటి వుంటే రెండోది ఉన్నట్టే. ఇతరులను వంచించినచో, అవినీతి మార్గాలలోనో ఐశ్వర్యాన్ని సంపాదిస్తే చాలను కుంటారు చాలామంది. అలాంటివారిని లక్ష్మి వరిమ్చిన్నట్టు కనిపించినా అది చంచలం . దయా, సేవాబావం, శ్రమ, వినయం, వివేకం ఉన్నచ్తే లక్ష్మి స్థిరంగా ఉంటంది. లక్ష్మీ కతాక్షసిద్ధిలోని అసలు రహస్యం ఇదే. లక్ష్మీదేవి-----ఆదిలక్ష్మీ, దైర్యలక్ష్మి, గజలక్ష్మి, సంతానలక్ష్మి, విజయలక్ష్మి విద్యాలక్ష్మి, ధనలక్ష్మి అనే అష్టరుపాలలో ఉంటుందని మనకు తెలుసు. వీటిలో `విద్యాలక్ష్మి' అంటే, జ్ఞానం వివేకం వంటి సద్గునసంపద అని కుడా అర్ధం చేసుకోవాలి. అటువంటి లక్ష్మితత్వాన్ని
అందరుసంపాదించాలి.మంచి మనసే లక్ష్మికి సేఫ్టీ లాకరు ! .


లక్ష్మి ఎక్కడవుంతుందని నారదుడు శ్రీ మహావిష్ణువుని అడుగగా.......
శ్రీ మహావిష్ణువు లక్ష్మి దేవి ఎక్కడెక్కడ ఉంటుందో చెప్పారు అవి ఏమిటంటే ..........


`అఖిల విశ్వం సమస్త ప్రాణులు నా అదీనంలో ఉంటే , నీనేమో నా భక్తుల అదీనంలో ఉంటాను . మీరు నా భక్తులు, కనుక మీకు పరమైస్వర్యాన్ని అందించే ఆచల లక్ష్మిని ప్రసాదిస్తాను. అయితే దానికి ముందు నేను చెప్పబోయే మాటలు వినండి - అం.......... లక్ష్మి ఎవరెవరివద్ద ఉంటుందో, ఎవరివద్దవుండదో , వివరించాడు. లక్ష్మిని కోరుకునే వారందరూ తప్పకుండా దృష్టిలో ఉంచుకోవలసిన విషయాలివి.
భగవద్భాక్తులపై కోపగించే వారి గృహంలో లక్ష్మిదేవే కాదు.శ్రీ హరి కుడా ఉండదు. శంఖద్వని వినిపించని చోటా, తులసిని పూజించని చోట, శంఖరుని అర్చించని చోట , బ్రహ్మవేత్తలకు , అతిధులకు భోజనసత్కారాలు జరగని చోట , లక్ష్మి నివసించదు. ఇల్లు కలకలాడుతు లేని చోట , ఇల్లాలు ఎల్లవేళలా కంటతడి పెట్టిన చోట , విష్ణువును ఆరాధించకుండా ఏకాదశి , జన్మాష్టమి రోజులలో భోజనం చేసేవారి ఇంట లక్ష్మి నివసించదు.

హృదయోమ్లో పవిత్రత లోపించినా, ఇతరులను హింసింస్తున్నా. ఉత్తములను నిమ్దిస్తున్నా లక్ష్మి ఆ ఇంటిలోనుంచి పారిపోతుంది. అనవసరం గా గడ్డిపరకలను తెమ్చినా, చెట్లను కొట్టినా లక్ష్మి కటాక్షం లోపిస్తుంది. నిరాసావాధులను, సుర్యోదయ సమయంలో భోజనం చేసే వాని, తడి పాదాలతో నిద్రపోయేవారిని , వివస్త్రులై నిద్రపోయేవారిని, తలక్రిందులు గా మాట్లాడేవారిని, తమ తలకు రాసుకున్న నూనెనుఇతరులకు అంటించే వారిని కుడా లక్ష్మి వరించదు..
శ్రీ హరి దివ్యచరిత్ర, గుణ గానం జరిగే చోట, సాలగ్రామం, తులసి, శంఖద్వని ఉన్నచోట , లక్ష్మి వోరాజిల్లుతుంది.
ఇలా శ్రీ హరి లక్ష్మీకటాక్షం ఎలా కలుగుతుందో, ఎలాకలగాదో చెప్పారు.
సంపద మన ఆదీనం లో ఉండాలి కాని, మనం సంపద ఆదీనం లో ఉండకుడదు . ఏకాస్త గర్వించిన, అహంకరిమ్చినా ఐశ్వర్యం జారిపోతుంది. సద్వినియోగమే సంపద పరమార్ధము. అది విస్మరించినా లక్ష్మి వీడిపోతుంది. ఇదే లక్ష్మి కటాక్ష రహస్యం.....

పరశురాం


ఈరోజు పరశురాముడు జయంతి. 
జమదగ్ని ,రేణుకాదేవి ల చివరి కొడుకు పరశురాముడు. జమదగ్ని చాలా కోపం గలవాడు. అతని భార్య రేణుక తనపతిభక్తితో రోజు నదికి వెళ్ళి తనే స్వయంగా మట్టి కుండచేసి ఇంటికి నీళ్ళుతెచ్చేది. ఒకరోజు రేణుకాదేవి చిత్రరధుడనే రాజును చూసింది. ఆరోజు ఆమె నీళ్ళుతేవటానికి కుండ తయారు చేసినా కుండ తయారుకాలేదు. నీళ్ళు తేలేకపోయింది. ఏమి జరిగింది అని దివ్యదృష్టితోచూడగా రేణుక చిత్రరధుని చూడటంవల్లే పాత్రతయారుకాలేదని గ్రహించి తనపుతృలును పిలిచి తల్లిని నరకమన్నాడు. వారందరు తమవల్లకాదన్నారు. అప్పుడు చివరి కొడుకు పరశురాముడు సరే అని తన తల్లిని నరికి వేశాడు. తండ్రి చెప్పిన మాట చేసినందుకు ఒకకోరిక కోరమనగా తనతల్లిని తిరిగి బ్రతికించమన్నాడు పరశురాముడు.  తండ్రిమాట జవదాటని కొడుకు.పరశురాముడు. తనతల్లికి ఆ గతిపట్టించింది రాజులు కావున పరశురాముడు రాజులుమీదకోపం పెంచుకొని వారిని నాశనంచేయటం మొదలుపెట్టాడు. పరశురాముని పేరు భార్గవరాముడు. (పరశు= గొడ్డలి ) పరశుతో రాజులు ను నరకుతున్నాడుకావునా పరశు రాముడు అని పేరు వచ్చింది. అప్పట్లో పరశురాముడునుండి  రక్షించుకోవటానికి రాజులు అందరు చేతులుకు గాజులు వేసుకొని దాచుకునేవారు.కొందరు గొప్పరాజుల్ పుత్రులును భూదేవి తనలో దాచుకొని రక్షించింది. పరశురాముడు విష్ణువు దశావతారాలలో ఒక అవతారం.

శుక్రవారం, మే 14, 2010

Puzzlezzzzzzzzz........

శుక్రవారం, మే 14, 2010

గురువారం, మే 13, 2010

దొంగ వచ్చె దోబూచి్

గురువారం, మే 13, 2010



 బండి విరిచి పిన్న పాపలతో నాడి 
దుండగీడు వచ్చె దోబూచి

పెరువెన్నలు బ్రియమునవే
మరు ముచ్చిలించు మాయకాడు
వెరవున్నాదన విధము దాచుకొని
దొరదొంగ వచ్చె దోబుచి

పడచు గుబ్బెత పరపుపైపోక
ముడి గొంగు నిద్రముంపునను
పడియు దావద్ద బవళించినట్టి
తోడుకు దొంగ వచ్చెదోబూచి

గొల్లెపల్లెలో యిల్లిలు చొచ్చి 
కొల్లెలాడిన కోడెకాడు
యెల్లయినా వేంకటేశుడు 
ఇదే తొల్లిటి దొంగ వచ్చె దోబూచి్ 

మంగళవారం, మే 11, 2010

The Power of Words

మంగళవారం, మే 11, 2010


A group of frogs were traveling through the woods, and two of them fell into a deep pit. All the other frogs gathered around the pit. When they saw how deep the pit was, they told the two frogs that they were as good as dead. The two frogs ignored the comments and tried to jump up out of the pit with all of their might. The other frogs kept telling them to stop, that they were as good as dead. Finally, one of the frogs took heed to what the other frogs were saying and gave up. He fell down and died.  The other frog continued to jump as hard as he could. Once again, the crowd of frogs yelled at him to stop the pain and just die. He jumped even harder and finally made it out. When he got out, the other frogs said, "Did you not hear us?" The frog explained to them that he was deaf. He thought they were encouraging him the entire time .
This story teaches two lessons:
1.
There is power of life and death in the tongue. An encouraging word to someone who is down can lift them up and help them make it through the
day.

2.
A destructive word to someone who is down can be what it takes to kill them. Be careful of what you say. Speak life to those who cross your path.
The power of words....it is sometimes hard to understand that an encouraging word can go such a long way. Anyone can speak words that tend to rob another of the spirit to continue in difficult times.Special is the individual who will take the time to encourage another

My Blog Lovers

నా యూట్యూబ్ చానల్స్ ప్లీజ్ సబ్స్క్రిబ్ చేయండీ

Diabetic Challenger

DIABETIC CHALLENGER YOUTUBE CHANNEL. PLASE SUBSCRIBE MY CHANNEL...... THANK YOU VERY MUCH.

Ammamma Tho Nenu (అమ్మమ్మ తో నేను

Please subscribe our channel Ammamma Tho Nenu (అమ్మమ్మ తో నేను)