Blogger Widgets

శుక్రవారం, ఫిబ్రవరి 17, 2012

శ్రీ రామకృష్ణ పరమహంస

శుక్రవారం, ఫిబ్రవరి 17, 2012

శ్రీ రామకృష్ణ పరమహంస ఫిబ్రవరి 18, 1836 న జన్మించారు.  ఈయన హిందూ మత గురువు. 19 వ శతాబ్దపు "బెంగాల్ సాంస్కృతిక పునరుజ్జీవనం" లో ఈయన ప్రభావము చాలా ఉంది. భారత దేశములో మతగురువుల బోధనలకు ఎక్కువ ప్రాముఖ్యాన్ని  ఇస్తారు. కాని రామకృష్ణుని జీవితములోని చాలా విషయములకు ఎన్నో ఆధారములు కలవు. చాలా మంది రామకృష్ణుని శిష్యులు ఉన్నత విద్యావంతులు, అధారములు దొరకనిదే విషయములు ప్రకటించకుండా ఉండడము దీనికి కారణము. అతని శిష్యుడు స్వామీ శారదానంద రామకృష్ణుని చుట్టూ పెరుగుతూ ఆతని జీవితచరిత్రను రచించెను.

రామకృష్ణులకు తల్లిదండ్రులు పెట్టిన పేరు గదాధరుడు. గదాధర్ క్రీ.శ 1836, ఫిబ్రవరి 18 న పశ్చిమబెంగాల్ లోని హుగ్లీ జిల్లాలోని కామార్పుకూర్ అనే కుగ్రామంలో జన్మించారు. వీరి తల్లిదండ్రులు క్షుదీరామ్, చంద్రమణిదేవి. వీరు చాలా పేదబ్రాహ్మణులైనప్పటికీ ధార్మికులు. గదాధరుడు అందగాడు, బాల్యం నుండే ఇతనికి లలితకళలు, చిత్రలేఖనము లో గల ప్రవేశము వలన వారి గ్రామములో ఇతనికి మంచిపేరు ఉండేది. అయితే చదువు మీద కానీ, ధన సంపాదన మీద కానీ ఆసక్తి చూపించకుండెను. ప్రకృతిని ప్రేమిస్తూ గ్రామము బైట పండ్ల తోటలలో స్నేహితులతో కలసి సమయాన్ని గడిపేవాడు.  అతను సాధువులు చెప్పే ఉపన్యాసములు చాలా శ్రద్ధగా వినేవారు. అప్పటినుండి ఆయనలో ఆద్యాత్మిక భావన ఎక్కువ అయ్యింది అనుటలో సందేహం లేదు.
గుడిలో విగ్రహం లో ఆయినా సజీవ దేవుడును చూసారు. కాళీ మాతను పూజించేవారు.  ఎక్కువ అద్యాత్మికత కలిగివుండటం వాళ్ళ రాత్రి పగలు తేడాలేకుండా ఎప్పుడు ద్యానంలోనే వుండేవారు.  అది చూచి అందరు రామకృష్ణ కు వివాహం చేయమని అందరు సూచించారు.  అప్పుడు ఐదు సంవత్సరాల శారదామాత తో వివాహం జరిపించారు.  ఈ శారదా మాతే శ్రీ రామకృష్ణ పరమహంస వారి ప్రధమ శిష్యురాలు గా వుంది.  ఆమె రామకృష్ణ పరమహంస గారి అడుగు జాడలలోనే నడిచింది.  ఆమె కూడా ఆద్యాత్మికత అలవర్చుకున్నది. 
రామకృష్ణ పరమహంస శారదామాతను దేవత పూజించుట 
 ఆమెను రామకృష్ణులవారు కాళీమాతగా కొలచి పూజించేవారు.   రామకృష్ణ పరమహంస అనేకమంది శిష్యులను మనకు అందించారు అందులో ముఖ్యడు వివేకానంద స్వామి.
రామకృషుని బోధనల లో ముఖ్యాంశములు. భగవద్ తత్వం గురించి చెప్పారు.
  1. సృష్టి లో ఏకత్వము
  2. అన్ని జీవులలో దైవత్వము
  3. ఒక్కడే భగవంతుడు, సర్వమత ఐకమత్యము. అన్నిమతాల సారాంశం ఒక్కటే.
  4. మానవ జీవిత ము లో దాస్య కారకాలు కామము, స్వార్థము. కామకాంచనాలనుండి విడివడితే భగవంతున్ని పొందవచ్చు.
  5. మానవసేవే మాధవసేవ
  6. ఒక గమ్యానికి ఎన్నోమార్గాలున్నట్లే భగవంతున్ని చేరడానికి మతాలు కూడా మార్గాలే.
  7. జ్ఞానము ఐకమత్యానికి, అజ్ఞానము కలహాలకి దారి తీస్తాయి.
  8. మానవుడు ఆలోచనతోనే మనిషిగా మారతాడు
  9. భగవంతుని దర్శించడము అందరికీ సాధ్యమే. గృహస్తులు ప్రపంచాన్ని వదిలి చేయనక్కర లేదు కాని వారు శ్రద్దగా ప్రార్థించాలి. శాశ్వతమైన వస్తువులకు క్షణికమైన వస్తువులకు తేడా గమనించే వివేకము కావాలి.
  10. బంధాలను తగ్గించుకోవాలి. దేవుడు శ్రద్దగా చేసే ప్రార్థనలను వింటాడు. భగవంతుని గురించి తీవ్ర వ్యాకులత ఆధ్యాత్మిక జీవితానికి రహస్యము.
  11. కామము, అసూయ దేవుని దర్శనానికి రెండు ముఖ్య శత్రువులు.
 కొన్నాళ్ళకు క్యాన్సర్ వ్యాధితో బాధపడ్డారు.తన నివాసాన్ని ఆరోగ్యరీత్యా దక్షిణేశ్వరం నుండి కాశిపూర్ కు మార్చారు. అప్పుడు శిష్యులు అందరూ ఎంతో సేవచేశారు.చనిపోవడానికి మునుపు ఒకరోజు తన ఆధ్యాత్మిక శక్తులన్నిటినీ స్వామి వివేకానందునికి ధారపోసారు. 16 ఆగష్టు, 1886న మహాసమాధిని పొందెను. అయన వదిలి వెళ్ళిన పదహారు మంది శిష్య సమ్మేళనమునకు స్వామీ వివేకానంద సారధ్యము వహించెను. వివేకానంద ఆ తరువాత మత తత్త్వవేత్త, ఉపన్యాసకుడుగా ప్రసిద్ది చెందారు.

బుధవారం, ఫిబ్రవరి 15, 2012

పుష్పవిలాపం

బుధవారం, ఫిబ్రవరి 15, 2012


కరుణశ్రీగా ప్రసిద్ధులైన జంధ్యాల పాపయ్య శాస్త్రి రచించిన ఖండకావ్యంలోని ఒక కవితా ఖండంపేరు పుష్పవిలాపం. కవి ఇందులోని చక్కని పద్యశైలి, భావుకత, కరుణారసాల వల్ల ఈ పద్యాలు జనప్రియమైనాయి. అమరగాయకుడు ఘంటసాల వెంకటేశ్వరరావు పాడిన పుష్పవిలాపం మంచి పేరు వచ్చింది.  జంధ్యాల వారికి గుర్తింపు వచ్చింది.  పువ్వులు గురించి కవులు అనేక కావ్యాలు, కవిత్వాలు రాసారు.  వాటి అన్నిటికంటే పుష్పవిలాపంకు పేరు బాగా వచ్చింది. కరుణరసంతో సాగుతున్న ఈ కావ్యం వల్లే జంధ్యాల వారికి కరుణశ్రీ అన్నపేరు వచ్చిందేమో కదా!  
ఇందులో ఎలా వివరించారో చూడండి. ఘంటసాలవారి గాత్రముతో వున్నా కొన్ని పద్యాలను మాత్రం under  line  చేసాను. 


చేతులారంగ నిన్ను పూజించుకొరకు
కోడి కూయంగనే మేలుకొంటి నేను;
గంగలో మున్గి ధౌత వల్కలము గట్టి
పూలు కొనితేర నరిగితి పుష్పవనికి
నే నొక పూలమొక్క కడ నిల్చి చివాలున కొమ్మవంచి గో
రానెడు నంతలోన విరు లన్నియు జాలిగ నోళ్ళు విప్పి "మా
ప్రాణము తీతువా" యనుచు బావురు మన్నవి; క్రుంగిపోతి; నా
మానసమం దెదో తళుకు మన్నది పుష్పవిలాప కావ్యమై.
తల్లి యొడిలోన తలిరాకు తల్ప మందు
ఆడుకొను మమ్ములను బుట్టలందు చిదిమి
అమ్ముకొందువె మోక్ష విత్తమ్ము కొరకు!
హౄదయమే లేని నీ పూజ లెందుకోయి?
జడమతుల మేము; జ్ఞానవంతుడవు నీవు;
బుధ్ధి యున్నది; భావ సమౄద్ధి గలదు;
బండబారె నటోయి నీ గుండెకాయ!
శివునకై పూయదే నాల్గు చిన్ని పూలు?
ఆయువు గల్గు నాల్గు గడియల్ కని పెంచిన తీవతల్లి జా
తీయత దిద్ది తీర్తు ము; తదీయ కరమ్ములలోన స్వేచ్ఛమై
నూయల లూగుచున్ మురియుచుందుము; ఆయువు దీరినంతనే
హాయిగ కన్ను మూసెదము ఆయమ చల్లని కాలి వ్రేళ్ళపై.
గాలిని గౌరవింతుము సుగంధము పూసి; సమాశ్రయించు భృం
గాలకు విందు చేసెదము కమ్మని తేనెలు; మిమ్ము బోంట్ల నే
త్రాలకు హాయిగూర్తుము; స్వతంత్రుల మమ్ముల స్వార్ధ బుద్ధితో
తాళుము త్రుంప బోవకుము; తల్లికి బిడ్డకు వేరు సేతువే!
ఆత్మ సుఖమ్ము కోసమయి అన్యుల గొంతులు కోసి తెచ్చు పు
ణ్యాత్ముడ! నీకు మోక్ష మెటు లబ్బును? నెత్తురు చేతి పూజ వి
శ్వాత్ముడు స్వీకరించునె? చరాచర_వర్తి ప్రభుండు మా పవి
త్రాత్మల నందుకోడె! నడమంత్రపు నీ తగులాట మేటికిన్?
ఊలు దారాలతో గొంతు కురి బిగించి
గుండెలో నుండి సూదులు గ్రుచ్చి కూర్చి
ముడుచు_కొందురు ముచ్చట ముడుల మమ్ము
అకట! దయలేని వారు మీ యాడువారు
గుండె తడి లేక నూనెలో వండి పిండి
అత్తరులు చేసి మా పేద నెత్తురులను
కంపు దేహాలపై గుమాయింపు కొరకు
పులుముకొందురు హంత! మీ కొలము వారు.
అక్కట! హాయి మేము మహిషాసురు లెందరొ నాల్గు ప్రక్కలన్
ప్రక్కల మీద చల్లుకొని మా పసిమేనులు పాడు కాళ్ళతో
ద్రొక్కుచు దొర్లి - దొర్లి - మరు రోజుదయాననె వాడి వత్తలై
రెక్కలు జారిపోఁ పరిహరింతురు మమ్ముల పెంటదిబ్బ పై.
మా వెలలేని ముగ్ధ సుకుమార సుగంధ మరంద మాధురీ
జీవిత మెల్ల మీకయి త్యజించి కృశించి నశించిపోయె; మా
యౌవన మెల్ల కొల్లగొని ఆ పయి చీపురుతోడ చిమ్మి మ
మ్మావల పారబోతురు గదా! నరజాతికి నీతి యున్నదా !
బుద్ధ దేవుని భూమిలో పుట్టినావు
సహజ మగు ప్రేమ నీలోన చచ్చెనేమి?
అందమును హత్య చేసెడి హంతకుండ!
మైలపడిపోయె నోయి! నీ మనుజ జన్మ.
పూజ లేకున్న బాబు నీ పున్నె మాయె!
కోయ బోకుము మా పేద కుత్తుకలను
అకట! చేసేత మమ్ముల హత్య చేసి
బాపుకొన బోవు ఆ మహా భాగ్య మేమి?
ఇట్లు పుష్పాలు నన్ను చీవాట్లు పెట్టి
నట్లుగాన్ - పూలు కోయ చేయాడలేదు;
ఏమి తోచక దేవర కెరుక సేయ
వట్టి చేతులతో ఇటు వచ్చినాను

మంగళవారం, ఫిబ్రవరి 14, 2012

శ్రీమన్నారాయణ శ్రీమన్నారాయణ

మంగళవారం, ఫిబ్రవరి 14, 2012

 శ్రీమన్నారాయణ శ్రీమన్నారాయణ |
శ్రీమన్నారాయణ నీ శ్రీపాదమే శరణు ||

 కమలాసతీ ముఖకమల కమలహిత |
 కమలప్రియ కమలేక్షణ |
 కమలాసనహిత గరుడగమన శ్రీ |
కమలనాభ నీపదకమలమే శరణు ||

పరమయోగిజన భాగధేయ శ్రీ |
 పరమపూరుష పరాత్పర
పరమాత్మ పరమాణురూప శ్రీ |
తిరువేంకటగిరి దేవ శరణు ||

గెలీలియో

టెలిస్కోప్ ఎవరు కనుక్కున్నారు అనగానే అస్సలు ఆలోచించకుండా చెప్పే ఆన్సర్  గెలీలియో అని. గెలీలియో జయంతి ఫిబ్రవరి 15, 1564లో జన్మించిన గెలీలియో ఇటలీలోని పీసా నగరంలో జన్మించాడు. చిన్న వయసులో తండ్రి వద్దనే విద్యాభ్యాసం చేశాడు. తరువాత పీసా విశ్వవిద్యాలయంలో వైద్య విద్యార్ధిగా చేరాడు. అయితే అక్కడి గణితశాస్త్ర ఉపన్యాసాలకు ప్రభావితుడై వైద్యవిద్యను విడిచి, గణిత శాస్త్రాన్ని అధ్యయనం చేశాడు. తరువాత అక్కడే  గణితశాస్త్రాచార్యుడిగా పనిచేశారుగడియారంలోని లోలకం ఈయన పరిశోధనల ద్వారానే తరువాత ఆవిష్కరించబడింది. మొదటిసారిగా చంద్ర మండలాన్ని పరిశీలించాడు. పాలపుంత అనేక నక్షత్రాల సముదాయమని మొదటగా చెప్పింది ఈయనే. ఈయన పరిశోధనలూ, అభిప్రాయాలూ నచ్చని మతాధిపతుల హింసలు భరించలేక వారికి లొంగి పోయాడు.
గెలీలియో కాలం అనగా 16 శతాబ్దం వరకు క్రీ..పూ. 4 శతాబ్దంలో గ్రీకు తత్వవేత్త అరిస్టాటిల్ ప్రతిపాదించిన సిద్ధాంతాలే ప్ర్రాచుర్యంలో ఉండేవి. సృష్టిలోని సత్యాలనన్నిటినీ స్వచ్ఛమైన ఆలోచనల ద్వారా మాత్రమే వివరించవచ్చును. ప్రయోగాల ప్రమేయం మాత్రం అవసరం లేదన్నది అరిస్టాటిల్ సిద్ధాంతాల్లోని పెద్ద లోపం. ఉదాహరణకు: అరిస్టాటిల్ సిద్ధాంతం ప్రకారం వేర్వేరు బరువులు గల రెండు వస్తువులను కొంత ఎత్తు నుంచి స్వేచ్ఛగా వదిలితే ఎక్కువ బరువు గల వస్తువు తక్కువ కాలంలో భూమిని చేరుకుంటుంది. దీనితో ఏకీభవించని గెలీలియో పీసా గోపురం పైనుంచి 100 పౌండ్లు, 1 పౌండు బరువు గల రెండు ఇనప గుండ్లను ఒకేసారి క్రిందికి వదలి, అవి రెండూ ఒకే కాలంలో భూమిని చేరుకుంటాయని ప్రయోగం ద్వారా నిరూపించాడు.
భౌతికశాస్త్ర పితామహునిగా పరిగణింపబడే గెలీలియో జనవరి 08, 1642లో మరణించాడు.
అన్నింటికన్నా దారుణం ఆయన పరిశోధనా వ్యాసాలను మతాధికారులు ఆయన మరణానంతరం తగలబెట్టారు. అయినా, విజ్ఞాన ప్రగతి ఆగిందా? ఆయన నిరూపించిన సిద్ధాంతం ఈనాటికీ అందరికీ ఆమోదయోగ్యమైంది. శాస్త్రీయ వాస్తవాలను తెలియజేసి, ప్రపంచంమంతటా వెలుగులు నింపాలని, ప్రయత్నించిన ఒక మహానుభావుడిని మతాధికారుల మూర్ఖత్వం బలిగొంది. ఆయన కీర్తిని సూర్యమండలం మనకు ఎల్లప్పుడూ గుర్తు చేస్తుంది.

సోమవారం, ఫిబ్రవరి 13, 2012

Want Volunteer

సోమవారం, ఫిబ్రవరి 13, 2012




Hello friends in Hyderabad, 

Sai Junior College for the Visually Challenged needs scribes for their prefinal exams for Inter IInd year students from the 15th of Feb from 10 am to 1 pm. Kindly volunteer and help these students if you have time. 
The schedule is as follows:
15th Feb: Civics
16th Feb: Economics
17th Feb: Commerce/ History

21st Feb: Sanskrit/Telugu
22nd Feb: English.
Kindly contact Sanjeev Chowdary Kosaraju (9885780693 or sanjeevkosaraju@gmail.com ) with the day you want to volunteer.

They need 75 people for every exam. so please share it within ur respective networks n help them. the address is Sai Junior College, Ranigunj (100 metres from Bible House on the road towards to Lower Tank Bund, opposite to "Home for the Disabled, Secunderabad").

Please Help Them.

Snake


జయహో నైటింగేల్ ఆఫ్ ఇండియా



సరోజినీ నాయుడు ఫిబ్రవరి 13, 1879  న హైదరాబాద్‌లో జన్మించారు. ఈమె తండ్రి పేరు అఘోరనాధ చటోపాధ్యాయ. తల్లి వరదసుందరీదేవీ. తల్లిదండ్రులిద్దరూ విద్యావేత్తలు కావటంవలన విద్యావ్యాప్తికి ఎంతో కృషి చేసేవారు. ఆ రోజుల్లో స్రీ విద్య గురించి అనేక ఆంక్షలుండేవి పెద్ద కుటుంబాల వారెవ్వరూ తమ ఆడపిల్లలను పదవ తరగతి మించి చదివించేవారు కాదు. అటువంటి సమయంలో వారిద్దరూ స్త్రీ విద్య గురించి ప్రజల్లో ఉన్న అపోహలను తొలగించి వారిని పై చదువులు చదివించడానికి ప్రోత్సహించారు.   సరోజినీ దేవిగారు 1891లో జరిగిన మెట్రిక్ పరీక్షలో మొత్తం రాష్ట్రంలో ప్రధమ స్థానం సంపాదించారు, అందరి మన్ననలు పొందారు. నిజాం నవాబు సంతోషించి, ఆమెను విదేశాలకు పంపి చదువు చెప్పించాలని నిర్ణయంచుకొని, ఆమె తండ్రికి ఆ విషయంచెప్పి, ఒప్పించి తాను అనుకున్నది సాధించాడు. సరోజినీదేవికి చిన్నతనం నుంచి కవిత్వమంటే ఎంతో ఇష్టం.  ఈమె భారత కోకిల (నైటింగేల్ ఆఫ్ ఇండియా) గా ప్రసిద్ధి చెందిన ఈమె స్వాతంత్ర సమరయోధురాలు మరియు కవయిత్రి. సరోజినీ దేవి భారత జాతీయ కాంగ్రేసు తొలి మహిళా అధ్యక్షురాలు మరియు స్వతంత్ర భారత దేశపు తొలి మహిళా గవర్నరు కూడా.
నిజాము పాలనలో అప్పటి హైదరాబాదులో స్త్రీల చదువుకు సరైన సౌకర్యాలు లేకపోవడం వలన ఆమె మద్రాసులో చదువుకున్నది. 15 సంవత్సరాల వయసులో ఈమె దక్షిణాదికి చెందిన డా. ముత్యాల గోవిందరాజులు నాయుడు ను కలిసి ప్రేమించింది. చదువు పూర్తయిన తర్వాత 19 సంవత్సరాల వయసులో ఆయనను కులాంతర వివాహము చేసుకున్నది. కులాంతర వివాహములకు సమాజము చాలా వ్యతిరేకముగా ఉన్న ఆ రోజుల్లో సరోజిని గోవిందరాజులు నాయుడును బ్రహ్మో వివాహ చట్టము (1872) ప్రకారము 1898 డిసెంబర్ 2న మద్రాసులోపెళ్ళి చేసుకున్నది. వీరి వివాహాన్ని ప్రముఖులు కందుకూరి వీరేశలింగం పంతులు దగ్గరుండి జరిపించాడు. 
గాంధీజీ ఉప్పుసత్యాగ్రహం ప్రకటించటంతోటే, ఈమె దానిలో పాల్గొనింది. సరోజిని నాయుడు 1925 లో భారతీయ కాంగ్రెస్‌కు అధ్యక్షురాలిగా ఎన్నికైన మొదటి భారతీయ మహిళ. ఈమె స్త్రీ విమోచన కోసమూ, అస్పృశ్యతా నివారణ కోసమూ, ఆసక్తితో కృషి చేశారు. ఈమె గొప్ప కవయిత్రి. ఈమె అనేక పద్యాలను, ఆంగ్లంలో 'గోల్డెన్ త్రెషోల్డు', 'బర్డ్సు ఆఫ్ టైం', 'ఫెదరర్ ఆఫ్ ది డాన్' అనే గ్రంథాలను రచించారు. ఈమెను 'భారతదేశపు కోకిల' అన్నారు. 1947 లో భారతదేశం స్వాతంత్ర్యం పొందిన తరువాత ఉత్తరప్రదేశ్ గవర్నరుగా నియమితులైనారు.
ఆమె ఇంగ్లీషులో కవిత్వం రాసింది. ది గోల్డెన్ త్రెషోల్డ్, ది బర్ద్ ఆఫ్ టైం, ది బ్రోకెన్ వింగ్, పాలంక్వైన్ బేరర్స్ ఆమె కవితల్లో కొన్ని.
హైదరాబాదు లోని  గోల్డెన్ త్రెషోల్డ్ అనేపేరుతో గల ఆమె ఇంటిలో హైదరాబాద్ యూనివర్సిటీని నెలకొల్పారు.
1912లో ఆమె గోపాలకృష్ణ గోఖలేని కలిసింది. వారితో మాట్లాడినప్పుడు ఎంతో ఉత్తేజం పొందింది. హిందూ ముస్లిం ల సఖ్యత గురించి ఆయన అభిప్రాయాలను తెలుసుకొని ఎంతో సంతోషించి, తన శేష జీవితాన్ని ఆ అద్భుత కార్యాన్ని నెరవేర్చటం కొరకు అంకితం చేయాలని ఆక్షణంలోనే నిర్ణయించుకుంది. అదే సంవత్సరం మార్చి నెల 22న లక్నోలోనే జరిగిన ముస్లింలీగ్ మహాసభలో పాల్గొనడానికి వెళ్ళింది. ఆనాటి సభలో సరోజినీ నాయుడు ప్రసంగిస్తూ "సోదర సోదరీ మణులారా! ఒక గడ్డపై పుట్టిన మన మధ్యలో మతం అనే అడ్డు గోడ మన ఐక్యమత్యానికి అడ్డువస్తుంది. మన ఆచారవ్యవహారాలు ఒకటే, మనందరి రక్తం ఒకటే, మనం మొదట భారతీయులం. అది అందరూ గుర్తించాలి, అలాగే భగవంతుడనేవాడూ ఒక్కడే ఉంటాడు. అది వారి విశ్వాసాలను బట్టి వుంటుంది. కొందరు "రామ" కొందరు "రహీం" కొందరు "జీసస్" అంటారు. ఇలా పలురకాలుగా ప్రార్ధిస్తుంటారు. ఎవరి విశ్వాసాలు వారివి, ఎవరి ఆచార వ్యవహారాలు వారివి. ఒక మతం వారు మరొక మతం వారిని విమర్శించడానికి ఏమాత్రమూ హక్కులేదు, అది అధర్మం మన మందరం ఒక కుటుంబ సభ్యులుగా ఉందాం, మనపై అధికారం చెలాయిస్తున్న ఆంగ్లేయ రాక్షసులను తిప్పికొడదాం. రండి ఏకం కండి హిందూ ముస్లిం భాయి భాయి" అంటూ అనర్గళంగా ప్రసంగించింది, ఆమె వాగ్ధాటికి ముగ్ఢులై ప్రేక్షకులు "హిందూ ముస్లిం భాయి భాయి" అనే నినాదం మిన్నంటేలా చేశారు. ఆ సమావేశంలో ఆ ప్రసంగం గొప్ప మార్పు తీసుకువచ్చింది. మహమ్మదీయులు ఆనాటి సభలో హిందువులతో కలసి జీవించడానికి, ఆంగ్లేయులను దేశమునుంచి పంపివేయడానికి గట్టినిర్ణయం తీసుకున్నారు. ఆ నాటి నుంచి స్వాతంత్ర్యం పొందే వరకు ఆమె నిర్విరామంగా కృషి చేసింది. 1949 మార్చి 2వ తేదీన అర్ధరాత్రి లక్నోలో కన్నుమూసింది ఆ నారీమణి.  ఈమె జీవితమూ పలువురు నారీమణులకు ఆధార్సాప్రాయము.  భారతీయులు గర్వించదగ్గ గొప్ప ఆదర్శ మహిళా సరోజనీ నాయుడు.
జయహో నైటింగేల్ ఆఫ్ ఇండియా

ఆదివారం, ఫిబ్రవరి 12, 2012

7 Must-Read Life Lessons from Abraham Lincoln

ఆదివారం, ఫిబ్రవరి 12, 2012


Today is Abraham Lincoln Birthday,  Abraham Lincoln was born in a log cabin in Hardin County, Kentucky, on February 12th, 1809. that's why we must remember him.
Abraham Lincoln was the 16th President of the United States. He served from March 1861 until his assassination in April 1865. Lincoln successfully led the United States through its darkest hour … the American Civil War. In the end, Lincoln was able to preserve the Union and end slavery.

Prior to his election in 1860, as the first U.S. Republican president, Lincoln was a country lawyer, an Illinois state legislator, a member of the United States House of Representatives, and an unsuccessful candidate for the U.S. Senate twice.

Concerning slavery, Lincoln was forthright and open in his opposition to the expansion of slavery. This attitude earned him the Republican nomination in 1860; later that year he was elected president.

During his time in office he introduced measures that resulted in the abolition of slavery, including the issuance of the Emancipation Proclamation in 1863 and the passing of the 13th Amendment to the U.S. Constitution.

Just six days after a large-scale surrender of the Confederate forces (under General Robert E. Lee), Lincoln became the first American president to be assassinated.

Lincoln is considered by scholars to be one of the greatest U.S. presidents to ever take office.
7 Must-Read Life Lessons from Abraham Lincoln:
  1. Prepare for Success

    “Give me six hours to chop down a tree, and I will spend the first four hours sharpening the axe.”

    Before you can succeed, you must prepare. When Lincoln was an unknown attorney in the backwoods of Illinois he was preparing for success, when Lincoln became an Illinois State Senator, he was preparing for success, and even when he lost the election for the U.S. senate twice, he was preparing for success. What are you doing in preparation for success? Lincoln said, “I will prepare and some day my chance will come.”

  2. Hustle

    “Things may come to those who wait, but only the things left by those who hustle.”


    You can’t stroll to a goal, you must hustle; you must move quickly in order to gain the momentum necessary to break free from the gravitational pull of the commonplace. The best things in life come to those who hustle. Are you hustling?

  3. Remember That Greatness is Possible 

    “That some achieve great success, is proof to all that others can achieve it as well.”


    If someone else can succeed in the business that you’re in, that is proof that you can succeed as well. If someone else can become rich in the state that you’re in, that is proof that you become rich as well. You have all that the greatest of men have had: a mind, and a will. Don’t make excuses, if someone else can do it, so can you… And who knows? You may be able to do it faster and better; never underestimate you abilities.

  4. Become Worthy of a Good Reputation

    “Reputation is like fine china, once broken it's very hard to repair.”


    Work to be, the way you want to be perceived. Don’t try to look good, be good. A good name is more valuable than fine gold and “choice” rubies.

    Practice becoming honorable.

    You can be just as honest, have just as much integrity, walk in just as much humility, and possess just as much discipline as the greatest men who have ever lived.

  5. Make the Years Count
    “And in the end, it's not the years in your life that count. It's the life in your years.”

    Lincoln didn’t live to a very old age, but the “life in his years” made a profound impact on the world. Are you making your years count? Are you changing the world? You’re capable of it; if you’re able to read and understand these words, then you have the ability to make a profound impact, and that’s not just meaningless rhetoric, it’s a very real reality, but will you grasp it, will you believe it and make it “your” reality.

  6. See the Brighter Side of Things

    “We can complain because rose bushes have thorns, or rejoice because thorn bushes have roses.”


    If you look for something to complain about, you will certainly find it! There’s “always” an opportunity to be “offended!” Don’t take these opportunities; they “never” lead to anything positive. Learn to see the roses in life; life is filled with roses, if you’ll take the time to see them.

  7. Constantly Improve

    “The way for a young man to rise is to improve himself in every way he can…”

    If you improve everyday, imagine the improvements you could make over the course of 20 years. You could become successful “in-just-about” any field in 20 years. You can make a significant impact on the world in 20 years! Remember, slow and steady wins the race; Rome was not built in a day. Work to get a little better everyday, and it time, you will accomplish your dreams.
Thank you for reading and be sure to pass this article along!

శనివారం, ఫిబ్రవరి 11, 2012

a Google a day

శనివారం, ఫిబ్రవరి 11, 2012


పానుగంటి వారు


పానుగంటి లక్ష్మీ నరసింహరావు ఫిబ్రవరి 11 ,1865 న జన్మించారు.  రాజమండ్రి తాలూకా సీతానగరంలో జన్మించాడు. వీరి తల్లిదండ్రులు రత్నమాంబ మరియు వేంకటరమణయ్య. తండ్రి రాజమండ్రిలో పేరుపొందిన ఆయుర్వేద వైద్యులు. లక్ష్మీ నరసింహరావు గొప్ప తెలుగు సాహితీవేత్త. సాక్షి ఉపన్యాసాలను రచించి తెలుగు సాహిత్యానికి ఎనలేని కీర్తిని సంపాదించారు. ఈయన రచయితగా మంచి పేరు సంపాదించుకున్నారు. లక్ష్మి నరసింహారావు గారిని జనులందరు  'కవిశేఖరుడ'నీ, 'అభినవ కాళిదాసు' అనీ, 'ఆంధ్ర ఎడిసన్' అనీ, 'ఆంధ్ర షేక్ స్పియర్' అనీ బిరుదులను ఇచ్చి సత్కరించారు.
మా అమ్మమ్మ వాళ్ళ ఊరు లక్ష్మీనరసాపురం జమిందారిణి రావు చెల్లయమ్మ గారి దివానుగా చేరారు. ఆరు సంవత్సరాల తర్వాత అభిప్రాయభేధాల మూలంగా ఉద్యోగం మానివేశారు. తరువాత ఉర్లాము సంస్థానం లోను, బళ్ళారి జిల్లాలోని ఆనెగొంది సంస్థానంలోను దివానుగా కొంతకాలం పనిచేశారు.
పిఠాపురం మహారాజా శ్రీ సూర్యారావు బహదూరు వారికి మైనారిటీ తీరగా రాజ్యాధికారం చేపట్టిన తర్వాత పంతులుగారిని 1915-16 మధ్య 'నాటక కవి'గా తమ ఆస్థానంలో నియమించారు. వీరి కోరికపై అనేక నాటకాలు వ్రాసారు. వాటి నన్నింటిని మహారాజుగారే అచ్చువేయించారు.
సుమారు ఇరవై సంవత్సరాలు వీరికి జీవితం సుఖంగా జరిగింది. ఆ రోజుల్లో దివాణం తరువాత వ్యయానికి వీరి గృహమే అనేవారు. ఆధునిక శ్రీనాధునిగా జీవించారు. వాణి సంఘములో చురుకైన సభ్యునిగా ఉండేవాడు.
ఉద్యోగాల వలన మరియు రచనల వలన వీరు విశేషంగా డబ్బు గడించినా దానిని నిలువచేయడంలో శ్రద్ధ కనపరచలేదు. ఆధునిక శ్రీనాధుని వలెనే అనుభవించినన్నాళ్ళూ బాగా అనుభవించి, తుది రోజులలో పేదరికానికి ఋణబాధకు లోనయ్యారు. మహారాజావారు బాగా పోషించినా, పంతులుగారికి తుదిదశలో వైషమ్యాలేర్పడి, తమదగ్గర ఏనాడో చేసిన ఋణం కొరకు వారికి ఇచ్చే నూటపదహారు రూపాయల గౌరవ వేతనం వేతనంలో కొంతభాగం తగ్గించడానికి ఉత్తర్వులు జారీచేశారు. వృద్ధాప్యంలో వీరు అటు ఇటు తిరిగి సంపాదించలేకపోయారు. చేతికి అందివచ్చిన కుమారులు ఉన్నా వారిని ఉద్యోగాలకు పంపలేకపోయారు. 
కవి శేఖరుని దుస్థితి గురించి పానుగంటి వ్రాసిన లేఖను ఆంధ్రపత్రికలో యర్రవల్లి లక్ష్మీనారాయణ ప్రచురించాడు - నాకెవరును దానధర్మము చేయనక్కరలేదు. తగ్గింపు ధరలకు నూటయాభై సెట్ల పుస్తకాలు యాభై మంది కొని, నా మానుషమును కాపాడినను, నాకు సివిలు ఖైదు తప్పును.  
1933 నుండి శారీరకంగా, మానసికంగా వీరి ఆరోగ్యం చెడిపోయింది. 1935 లో పిఠాపురంలో సప్తరిపూర్త్వుత్సవాలు పురజనులు సన్మానించారు. పరిస్థితులు మారి, తీవ్ర మనస్తాపంతో ఈయన అక్టోబరు 7న, 1940లో మరణించాడు. పానుగంటి వారు చివరి పరిస్తితిలో ఆయన పడిన మానసిక వేదన, పేదరికము చాలా బాధకలిగిస్తున్నది.  ఈ మహాకవికి మన తెలుగు ప్రజలు తరుపున నివాళ్ళు అందిస్తున్నాను.

అష్టావధానము 2

అవధానం :-అవధానము అనే సాహిత్య ప్రక్రియ తెలుగు వారి సొత్త.  ప్రంచంలో ఏ భాష లోను లేని ఈ అవధానంలో ముఖ్యమైన వ్యక్తి అవధాని. అంటే ఎంతో ఏకాగ్రత వున్న పండితుడు. విశేషమైన భాషా పాండిత్యం, సమయస్పూర్తి , కల్పనా చాతుర్యము , చమత్కారం సరి అయిన వాళ్ళలో ఉండాలి. అవధాని కలం కాగితం పట్టకూడదు. కేవలం తన ధారణ లేక జ్ఞాపక శక్తితో, మధ్య మధ్య ఏకాగ్రతను భంగపరస్తూ అప్రస్తుత ప్రసంగి వేసే వింత ప్రశ్నలకు సముచితంగా సమాధానం చెబుతూ, కవితా వ్యాసంగం కావించాలి. అలా చెప్పిన కవిత్వాన్ని , ధారణ చేసి అఖరి అంశంగా అన్ని ప్రశ్నల సమాధానాల్ని అప్పచెప్పవలెను.ఎనిమిది అంశాలపై జరిగే అవధానం అష్టావధానము.  అవధానములందు ఆశుకవితా ధార రసగంగా ప్రవాహమై పొంగుతుంది. అవధాని వూహలో... జార్జిబుష్, లాడెన్ చెట్టపట్టాలు వేసుకుని రామాయణ ఇతివృత్తంలోనో ఇంకేదో ఇతిహాసంలోనో ఇట్టే ఒదిగిపోతారు.
ఆంగ్ల పదాలు అచ్చ తెలుగు పవిట వేసుకుని కొత్త అర్థాలూ అందాలూ సంతరించుకుంటాయి.
నిషిద్ధాక్షరి పేరుతో పృచ్ఛకుల ఎత్తులూ,  నానార్థాల సాయంతో అవధాని పై ఎత్తులూ.
అది అత్యద్భుత సాహితీ సమరం . కమ్మటి కందపద్యాలూ,  సింగారాల సీసపద్యాలూ, చవులూరించే చంపకమాలలూ, ఉత్తేజమును కలిగించే ఉత్పలమాలలూ, అసందర్భ  ప్రసంగంలో నవ్వుల జల్లులూ,
ఇవీ ఆ యుద్ధ ఫలితాలు.
అవధాన ప్రక్రియ గురించి ఇంకాతెలుసుకోవటానికి ఇక్కడ క్లిక్ ఇవ్వండి. 

శుక్రవారం, ఫిబ్రవరి 10, 2012

థామస్ అల్వా ఎడిసన్

శుక్రవారం, ఫిబ్రవరి 10, 2012

సృజనాత్మకంగా ఆలోచించడం, శాస్త్ర విజ్ఞాన సహాయంతో మానవాళికి అవసరమైన వాటిని ఆవిష్కరించడం ఎంతో ఓపికతో కూడిన వ్యవహారం. నిరంతరం ప్రయోగాలతో మునిగితేలుతూ ప్రజలకు అవసరమైన సాంకేతిక ఉపకరణాలను సృష్టించి, కొన్ని వందల పేటెంట్లు  పొంది, నిత్య స్మరణీయుడైన వ్యక్తి 'సర్థామస్అల్వా ఎడిసన్‌'.

థామస్ అల్వా ఎడిసన్ ఫిబ్రవరి 11, 1847 అమెరికా లోని ఓహియో రాష్ట్రానికి చెందిన మిలన్ అనే ప్రాంతంలో జన్మించి మిషిగాన్ రాష్ట్రంలోని పోర్టుహ్యురాన్ అనే ప్రదేశంలో ఎదిగారు. తండ్రి శామ్యూల్ ఆగ్డెన్ ఎడిసన్ జూనియర్ 1804-1896 మరియు తల్లి నాన్సీ మాథ్యూస్ ఎడిసన్ 1810-1871 లకు ఏడవ మరియు చివరి సంతానం.ఇతని కుటుంబం లో జన్మించారు.
 పాఠశాలస్థాయి వయస్సులోనే సొంత ప్రయోగశాల ఏర్పరచుకొని, ప్రయోగాలు చేసేవాడు.అయితే తన ప్రయోగాలకు అవసరమైన డబ్బును స్వయం ఉపాధి ద్వారా పొందాలనుకున్నాడు. తాముండే గ్రామం మీదుగా వెళ్ళే రైలులో దినపత్రికలు, పండ్లు అమ్మి వచ్చిన డబ్బుతో ఏకంగా ఒక వారపత్రికను సొంతగా అచ్చువేసేవాడు. రైల్లోనే ఖాళీ సమయంలో చదువుకోవడం, ఏకంగా రైల్లోనే ఒక ప్రయోగశాలను ఏర్పరచుకోవడం మనం ఊహించలేని విషయాలు. నిరంతర పఠనం, పరిశీలన చేసి ప్రయోగాల ద్వారా నిర్ధారించుకోవడం ఎడిసన్నిత్యకృత్యం. అలాగే సమయాన్ని సద్వినియోగపరచుకున్న తీరు మనకందరికీ స్ఫూర్తిదాయకంతెలుసుకోవాలన్న ఆసక్తి, నిరంతర తపన, ప్రజలందరికీ ఉపకరించే ఫలితాన్ని వెలువరించాలన్న దృఢకాంక్ష, నిద్రాహారాలు మరచి తదేక దీక్షతో ప్రయోగాలు చేయడం, తన జ్ఞానాన్ని నిత్యం అభివృద్ధిపరచుకోవడం.. ఒక కార్యసాధకుడు, పరిశోధకుడైన ఎడిసన్మానవాళి పురోగతికి సూచించిన మార్గాలు. ఎడిసన్స్ఫూర్తితో మనం ఎంచుకున్న రంగంలో ఏకదీక్షతో, పట్టుదలతో కృషి చేయడమే ఆయన జీవితం నుండి మనం నేర్చుకోవాల్సింది.
 ఎడిసన్ మొదటగా న్యూజెర్సీ లోని నెవార్క్ లో పరిశోధకుడిగా తన ప్రస్థానాన్ని ఆరంభించాడు.ఆయన మొదట పని చేసినవి ఆటోమాటిక్ రిపీటర్ మరియు టెలిగ్రాఫిక్ పరికరాలు కానీ అతనికి పేరు తెచ్చి పెట్టినది మాత్రం 1877 లో కనిపెట్టబడిన ఫోనోగ్రాఫ్. పరికరాన్ని కనిపెట్టినపుడు ప్రజలు సంభ్రమాశ్చర్యాలకు గురయ్యారు. ఆయనకు మెన్లో పార్క్ మాంత్రికుడు అనే పేరు పెట్టారు.
 ఎడిసన్ అక్టోబర్ 18, 1931 వెస్ట్ ఆరెంజ్, న్యూ జెర్సీ, యునైటెడ్ స్టేట్స్ లో  మరణించారు.
Edison's great quotations .
  • “Genius is one percent inspiration and ninety-nine percent perspiration.”
  • “I haven't failed, I've found 10,000 ways that don't work”
  • “Good fortune is what happens when opportunity meets with planning.”
  • “The three great essentials to achieve anything worth while are, first, hard work; second, stick-to-itiveness; third, common sense.”
  • “Opportunity is missed by most people because it is dressed in overalls and looks like work.”
  • “I never failed once. It just happened to be a 2000-step process.”
  • “I never did a day's work in my life. It was all fun.”
  • “Restlessness is discontent and discontent is the first necessity of progress. Show me a thoroughly satisfied man and I will show you a failure.”
  • "There's a way to do it better - find it.”
  • "We now know a thousand ways not to build a light bulb”
  • “Be courageous! Have faith! Go Forward!”.

My Blog Lovers

నా యూట్యూబ్ చానల్స్ ప్లీజ్ సబ్స్క్రిబ్ చేయండీ

Diabetic Challenger

DIABETIC CHALLENGER YOUTUBE CHANNEL. PLASE SUBSCRIBE MY CHANNEL...... THANK YOU VERY MUCH.

Ammamma Tho Nenu (అమ్మమ్మ తో నేను

Please subscribe our channel Ammamma Tho Nenu (అమ్మమ్మ తో నేను)