Blogger Widgets

బుధవారం, మార్చి 14, 2012

ఆల్బెర్ట్ ఐన్‌స్టీన్ చెప్పుకోదగ్గ మేధావి.

బుధవారం, మార్చి 14, 2012


ఐన్స్టీన్
ఆల్బెర్ట్ ఐన్స్టీన్ (Albert Einstein) జర్మనీ దేశానికి చెందిన శాస్త్రవేత్త. ఇతడు 1879 మార్చి 14 జన్మించాడు. నేడు ఐన్స్టీన్ జయంతి సందర్భంగా ఆయన గురించి చెప్పుకుందాం.
ఐన్స్టీన్, 300కు పైగా శాస్త్రీయ విషయాలు ఇంకా 150 పైగా శాస్త్రీయం-కాని విషయాలు ముద్రించారు. 1999 లో "టైం" పత్రికలో శతాబ్దపు మనిషి గా ఈయన పేరును పేర్కొన్నారు, జీవిత చరిత్ర కారుడి ప్రకారం, "సాంకేతిక పరిజ్ఞానం ఉన్న ప్రజా సమూహంలో, ఐన్స్టీన్ ఒక చెప్పుకోదగ్గ మేధావి." ఒకే ఏడాదిలో (1905 లో) ఐదు పరిశోధన పత్రాలను వరుసగా ప్రచురించి ఆల్బర్ట్ ఐన్స్టీన్ (మార్చి 14, 1879 - ఏప్రిల్ 18, 1955) సైన్స్ చరిత్రలో తన శకాన్ని ప్రారంభించారు. అవి ఒక్కోటి ఒక నోబెల్ బహామతిని సాధించి పెట్టే స్ధాయి ఉన్నావని శాస్త్రవేత్తలు అభిప్రాయపడ్డారు. ప్రఖ్యాతి గాంచిన ప్రత్యేక సాపేక్ష సిద్ధాంతం ఐదింటిలోనిదే.  అతని మొత్తం జీవితంలో భౌతికశాస్త్రం మీద ఐన్స్టీన్ వందల కొద్దీ పుస్తకాలను ఇంకా ఆర్టికల్స్ను రాశారు.
ఆల్బర్ట్ ఐన్స్టీన్ ఆవిష్కరణలు జాబిత:   ఐన్స్టీన్  ఆవిష్కరణలు క్రింద చర్చించబడ్డాయి విషయాలు / అంశాలు చాలా సంప్రదాయ పరంగా ఆవిష్కరణలు పరిగణించరాదు. 'ఐన్స్టీన్ రిఫ్రిజిరేటర్' నిజమైన అర్ధంలో అది ఒక 'ఊహ' గా భావించే విషయం. ఆల్బర్ట్ ఐన్స్టీన్ యొక్క ఆవిష్కరణలు మరింత పరిశోధనకు పునాది వేశారు. అని ఈ  సిద్ధాంతలు మనకి చూపిస్తున్నాయి.  మనం వాటి మీద కొంచెం ద్రుష్టి పెట్టి చూద్దామా. సరే అయితే అయిన ఆవిష్కరణలో ముఖ్యమైనవి కొన్ని చూద్దాం రండి.

అటామిక్ బాంబ్:
ఇది ఐన్ స్టీన్ ప్రసిద్ధ ఆవిష్కరణలలో చాలా ముఖ్యమైనది అనటంలో ఈమాత్రం సందేహము అక్కరలేదు. ఐన్స్టీన్  తాను అణు బాంబు కనుగొన్నారు లేదో ప్రశ్నకు సమాధానంకు ఇదే ఆయన సమీకరణం E = MC ².  ఈ సమీకరణమే అణు ఆయుధం అభివృద్ధిలో ఒక ముఖ్యమైన పాత్ర పోషించింది.  అటామిక్ బాంబ్ E = MC ² ద్వారా రూపొందించారు. ఈ సమీకరణం ప్రకారం E = ², ద్రవ్యరాశి మరియు శక్తి ఒక నిర్దిష్ట మేరకు పర్యాయపదాలు MC. ద్వారా హానికర జర్మన్లు ​​అలా ప్రయత్నించారు. ముందు అణు బాంబు నిర్మించడానికి  సంయుక్త అధ్యక్షుడు రూజ్వెల్ట్ విన్నపముతో ఒక లేఖ రాసారూ. ఈ అటామిక్ బాంబ్ హిరోషిమా లో విధ్వంసం దారి తీసింది - అయితే, అతను, అమెరికా సంయుక్త ద్వారా అణు బాంబు ఉపయోగం ఖండించారు. 
ఐన్స్టీన్ రిఫ్రిజిరేటర్: 
మనం వాడుకుంటున్నరిఫ్రిజిరేటర్.   శీతలీకరణ వ్యవస్థ ఆజ్యంపోస్తూ కోసం వేడి ఉపయోగం ఒక శోషణ రిఫ్రిజిరేటర్ ఉంది. ఆల్బర్ట్ ఐన్స్టీన్ లియో స్జిలార్డ్, ఒక మాజీ విద్యార్థి తో సంయుక్తంగా రిఫ్రిజిరేటర్ కనుగొన్నాడు. ఐన్స్టీన్ రిఫ్రిజిరేటర్ 11 నవంబర్, 1930 పేటెంట్ చేయబడింది. రిఫ్రిజిరేటర్ అభివృద్ధి ఐన్స్టీన్ మరియు స్జిలార్డ్ ఉద్దేశం home శీతలీకరణ సాంకేతిక మెరుగుదల ఉండేది.  దీని వాళ్ళ వచ్చే ప్రమాదాలు కూడా గుర్తించి వాటికి  ఐన్స్టీన్ మరియు స్జిలార్డ్ ఒక సురక్షిత ప్రత్యామ్నాయ కనుగొనేందుకు ప్రయత్నించారు 
విద్యుత్ కాంతి ప్రభావం:
విద్యుత్ కాంతి ప్రభావం విషయం లో ఒక కాగితంపై లో, ఐన్స్టీన్ కాంతి కణాల రూపొందించబడింది పేర్కొంది. ఇది కూడా కాంతి కణాల (ఫోటాన్లు) శక్తి కలిగి తెలిపారు. ఫోటాన్లు లో ఎనర్జీ ప్రస్తుతం వికిరణం ఫ్రీక్వెన్సీ యొక్క అనులోమంగా ఉంటుంది. శక్తి మరియు రేడియేషన్ ఫ్రీక్వెన్సీ మధ్య సంబంధం ఒక సూత్రం, E = హు సహాయంతో ప్రదర్శించబడుతుంది. 'U' రేడియేషన్ ఫ్రీక్వెన్సీ సూచిస్తుంది, అయితే సూత్రంలో, 'E' శక్తి ఉన్నచో. చిహ్నం 'h' ప్లాంక్ యొక్క స్థిరంగా సూచిస్తుంది. ముందు, అది కాంతి తరంగాల రూపంలో ప్రయాణించినట్లు పరిగణించబడింది. ఐన్స్టీన్ చేసిన ఆవిష్కరణ మరియు అధ్యయనాలు భౌతిక ప్రాధమిక విధానాలలో కొన్ని అర్థం చేసుకోవడంలో సహాయపడింది. క్వాంటమ్ అంశాన్ని భౌతిక అధ్యయనం విప్లవాత్మక. ఆల్బర్ట్ ఐన్స్టీన్ విద్యుత్ కాంతి ప్రభావం విషయం పై తన పరిశోధన కోసం సంవత్సరం 1921 లో నోబెల్ బహుమతి లభించింది.
ప్రత్యేక సాపేక్షత సిద్ధాంతం:
సిద్ధాంతం సంగీతం యాంత్రిక శాస్త్రం యొక్క తో విద్యుదయస్కాంత క్షేత్రం యొక్క చట్టాలు పునరుద్దరించటానికి తన ప్రయత్నంలో ఆల్బర్ట్ ఐన్స్టీన్ చే అభివృద్ధి చేయబడింది. సిద్ధాంతం యొక్క సారాంశం లేదా కోర్ రెండు ప్రాథమిక భావనలను జోడిస్తారు. మొదటి భావన ఏకరీతి మోషన్ ఎల్లప్పుడూ సంబంధిత ఉంటుంది. రెండవ భావన అది సంపూర్ణ కాదు అంటే 'మిగిలిన రాష్ట్ర నిర్వచించారు సాధ్యం కాదని ఉంది. ప్రత్యేక సాపేక్షత సిద్ధాంతం 1905 లో 'సంఘాలు మూవింగ్ యొక్క ఎలేక్త్రోడైనమిక్స్ ' అనే శీర్షికతో ఒక కాగితం లో ఐన్స్టీన్ సమర్పించేవారు.
 సాధారణ సాపేక్ష సిద్దాంతం:
'సాధారణ సాపేక్ష సిద్దాంతం' గురించి వివరణలు అన్ని ఒక ఐన్ స్టీన్ సమర్పించబడిన ఆధారంలేని తో ప్రారంభించారు. సాపేక్ష సిద్ధాంతము గురించి పరిశోధన ఆల్బర్ట్ ఐన్స్టీన్ యొక్క ముఖ్యమైన విజయాల ఇది కూడా ఒకటి. ఐన్స్టీన్ యొక్క ఆధారంలేని ముఖ్యమైన "గురుత్వాకర్షణ ఖాళీలను సూచన యొక్క ఫ్రేమ్ యొక్క త్వరణాలను సమానంగా ఉంటాయి", క్రింది విధంగా ఉల్లేఖించిన చేయవచ్చు. ఆధారంలేని సహాయం కింది ఉదాహరణ తో విశదీకరించబడ్డాయి చేయవచ్చు. ఒక ఎలివేటర్ లో ప్రజలు (అవరోహణ ఇది) ఇది ఫోర్స్ (ఎలివేటర్ యొక్క గురుత్వాకర్షణ లేదా త్వరణం) నిజానికి వారి స్వంత మోషన్ నిర్దేశిస్తుంది అర్థం పోతున్నాము.
ఆల్బర్ట్ ఐన్స్టీన్ ఆవిష్కరణలు మరియు అతని సిద్ధాంతాల ఆవిష్కరణలు 20 శతాబ్దం శాస్త్రవేత్తలకు గొప్ప సహాయం ఉన్నాయి. ప్రసిద్ధ శాస్త్రవేత్త ప్రతిపాదించిన గా సాపేక్ష సిద్ధాంతం శాస్త్రీయ అభివృద్ధి చరిత్రలో ఒక మైలురాయి పరిగణించవచ్చు. ఆవిష్కరణలు మరియు సిద్ధాంతాలు గురించి సమాచారం పాఠకులకు ఆల్బర్ట్ ఐన్స్టీన్ యొక్క ముఖ్యమైన రచనలు లోకి ఒక అంతర్దృష్టి పెట్టి కొన్ని ఆవిష్కరణలు చెప్పాట్టారు.

ఆల్బర్ట్ ఐన్ స్టైన్ భగవద్గీత గురించి ఇలా చెప్పారు.  కొన్ని వేల సంవత్సరాల పూర్వం భగవద్గీత లక్షలాది పాఠకులుకు స్పూర్తినిచ్చింది. దీనిబట్టి గీత చాలా గొప్పది అని చెప్పకనే చెప్తోంది.  ఇది మెచ్చుకోదగ్గ గ్రంధం అన్నారు.  ఇలా అన్నారు గీత గురంచి.

"When I read the Bhagavad-Gita and reflect about how God created this universe everything else seems so superfluous." ~Albert Einstein .

ఈయన గురించి మనం చెప్పుకుంటూ పోతూవుంటే ఎంతకీ అవదు అనుకుంటా. సరే వీలున్నప్పుడు చెప్పుకుందాం.

మంగళవారం, మార్చి 13, 2012

చిన్న విన్నపము

మంగళవారం, మార్చి 13, 2012

ఈ రోజు మీదగ్గరకు రెండు విన్నపాలతో వచ్చానండి అవేమిటి అనుకుంటున్నారా చెప్తాను ఆగండి తొందరఎందుకు. చిన్న విన్నపము : మొబైల్  టవర్  రేడియేషన్కి  చిన్న  చిన్న  పిట్టలు  క్రమక్రమముగా  అంతరించి  పోతున్నాయి . ఇలా  ఒక  పెట్  బాటిల్ కి  రెండు  చెక్క  చెంచాలు  పెట్టి , అందులోకి  కాసిన్ని  గింజలు  వచ్చేలా  ఏర్పాటు  చేసి , మీ  ఇంటిముందు  ఇలా  వ్రేలాదేలా  చెయ్యండి . అక్కడికి  ఆ పిట్టలు  వచ్చేసి , ఆ  చేమ్చాల్  మీద  వాలి , గింజలని  తిన్తుంటాయి . మరచిపోరని  ఆశిస్తున్నాను .  ఇది నా ఆలోచన కాదండి పేస్ బుక్ లోని  అచ్చంపేట  రాజు గారి ఆలోచన.  ఈ ఆలోచన నాకు బాగా నచ్చేసింది. నేను ఇలా చేసాను.  నాలాగే మీకు కూడా పక్షులు మీద ప్రేమ వుంటుంది కదా మీరు మరి ఇలా చేయండి.   ఈ సంధర్బములో అచ్చంపేట  రాజు గారికి ధన్యవాదములు తెలుపుకుంటున్నాను.  ఇలాంటి మంచి ఐడియా ఇచ్చినందుకు.
 
ఇప్పుడు వేసవికాలం వచ్చేసింది కదండి.  నీళ్ళు దొరకక అప్పుడే పక్షులు వెతుక్కుంటున్నాయి.  వాటి కోసం దయచేసి మీరు ఒక పని చేయాలి.  అదేమిటనుకుంటున్నారా.  చాలా సింపుల్ అండి.  ఒక చిన్న కుండ లేక బెసెన్ లో నిండా నీరు పోసి మీ ఇంటిముందు బాల్కనిలో వుంచండి. అక్కడికి దాహంగా వున్నా పక్షులు వచ్చి వాటి దప్పికను తీర్చుకుమ్టాయి.   మీ ఇల్లు ఆపర్ట్మెంట్ కాకపొతే వీలు అయితే జంతువులు కూడా దాహం తీర్చుకోనేటట్టు చేయండి.
మనము మన చుట్టూవున్న పక్షులును జంతువులును కాపాడాలి.  ఎందుకు అంటే అవి వాటి సమస్యను మాట్లాడి  మనకు చెప్పలేవు కదా. దయచేసి నోరు లేని జంతువులను కాపాడండి. 

నాటి రక్త చరిత్ర కు ప్రతీకారం చర్య.

జలియన్ వాలాబాగ్
భారతదేశ స్వాతంత్ర సంగ్రామ చరిత్రలో ఎవరు మరిచిపోని భాధాకరమైన సంఘటన రక్తపు ఏరు ప్రవహించిన విషయం జలయన్ వాలాబాగ్ దురంతము.  నాకు ఈ విషయం గురించి చదువుతుంటే.  నాకళ్లలో నీరు ఉబికి వస్తోంది అంటే నమ్మండి.   
జలియన్ వాలాబాగ్ అనేది ఉత్తర భారత దేశంలోని అమృత్‌సర్పట్టణంలో ఒక పార్క్ .ఏప్రిల్ 131919 న బ్రిటీష్ సైనికులు జనరల్ డయ్యర్ సారథ్యంలో ఈ పార్క్ లో సమావేశమైన నిరాయుధులైన స్త్రీ, పురుషులు మరియు పిల్లలపైన విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. ఈ కాల్పులు పది నిమిషాలపాటు కొనసాగాయి. 1650 రౌండ్లు కాల్పులు జరిగాయి. అప్పటి ఆంగ్ల ప్రభుత్వ లెక్కల ప్రకారం 379 మంది మరణించారు. కానీ ఇతర గణాంకాల ప్రకారం అక్కడ 1000 కి పైగా మరణించారు. 2000 మందికి పైగా గాయపడ్డారు.   చనిపోయిన వారిలో ఆరు వారాల చిన్న పిల్ల కూడా వుంది.  చనిపోయిన వారిని తీసుకువెళ్ళటానికి కూడా వీలు లేకుండా కర్ఫ్యూ వుంది.  అప్పుడు గాయపడినవారు, చనిపోయిన వారి కుటుంబ సభ్యులు యొక్క మానసిక పరిస్థితి ని తలుచుకుంటే హృదయవిదారకంగా వుంది.  అప్పుడు జరిగిన సంఘటనకి తన ఆఫీసులో బ్రిగేడియర్ జనరల్ రెజినాల్డ్ డయ్యర్ ఇచ్చిన రిపోర్టు ప్రకారం అతనికి తిరుగుబాటు విప్లవకారుల సేన ఎదురైనందున కాల్పులు జరుపవలసి వచ్చింది. డయ్యర్‌కు పంజాబ్ లెఫ్టినెంట్ గవర్నర్ మైకేల్ ఓ డ్వయర్ ఇచ్చిన టెలిగ్రాములో "నీ చర్య సరైనదే. దానిని లెఫ్టినెంట్ గవర్నర్ సమర్ధిస్తున్నాడు" అని వ్రాసి ఉంది.  ఇది మరీ ఘోరంగా వారి చర్యను సమర్ధించుకున్నారు కదా.
ఈ ఉదంతంపై విచారణ జరపడానికి 1919లో "హంటర్ కమిషన్" ఏర్పరచారు. ఆ కమిషన్ సమక్షంలో డయ్యర్ - తనకు ఆ మీటింగ్ గురించి 12:40కి తెలిసిందనీ, దానిని నిలపడానికి తానేవిధమైన ప్రయత్నమూ చేయలేదనీ, అక్కడ సమావేశమైన గుంపు గనుక కనిపిస్తే కాల్పులు జరపాలనే ఉద్దేశంతోనే తాను అక్కడికి వెళ్ళాననీ - చెప్పాడు.
"బహుశా కాల్పులు జరుపకుండా గుంపును చెదరగొట్టడం సాధ్యం అయ్యుండవచ్చునని నేను భావిస్తున్నాను. కాని వాళ్ళంతా మళ్ళీ తిరిగివచ్చి నన్ను అవహేళన చేసేవారు. నేను చేతగానివాడినయ్యుండేవాడిని."హంటర్ కమిషన్ సమక్షంలో డయ్యర్ స్పందన తెలియచేసారు.  వారి చర్యను పూర్తిగా సమర్ధించు కున్నాడు డయ్యర్.  గాయపడిన వారిని ఆసుపత్రికి తీసుకువెళ్ళటానికి ఎటువంటి సహాయము చేయలేదు వారు.
అమృత్‌సర్ నుండి ఢిల్లీకి రైలులో ప్రయాణిస్తున్న జవహర్‌లాల్ నెహ్రూ పరదాల అవతల నుండి ఒక మిలిటరీ ఆఫీసర్ గట్టిగా ఇలా మాట్లాడడం విన్నానని తన ఆత్మకథలో వ్రాశాడు - "పట్టణం అంతా నా దయమీద ఆధారపడి ఉంది. దానిని బూడిద చేసేద్దామనుకొన్నాను గాని దయతలచి వదిలేశాను" - ఈ మాటలు అన్న వ్యక్తి స్వయంగ అ డయ్యరే. అదే రైలులో ప్రయాణం చేస్తున్నాడు.
డయ్యర్ 
    లండన్‌లో హౌస్‌ ఆఫ్‌ లార్డ్స్‌ లో జరిగిన చర్చలో జనరల్‌ డయ్యర్‌ను హీరోగా ప్రస్తుతిస్తూ ప్రశంసల వర్షం కురిపించారు. కొందరు ఆంగ్లేయులు విమర్శించినా, భారతదేశంలో బ్రిటిష్‌ అధికారాన్ని కాపాడిన వీరుడు డయ్యరేనని బ్రిటన్‌లో అత్యధికులు అతడిని గౌరవించారు. సన్మాన సభలో అతడికి 'పంజాబ్‌ రక్షకుడు' అని అక్షరాలు చెక్కిన వజ్రాలు పొదిగిన ఒక కత్తిని, 28,000 పౌండ్ల సొమ్ముని బహూకరించారు. ఆంగ్ల పత్రికలు, ఆంగ్లో ఇండియన్‌ పత్రికలు డయ్యర్‌ని పొగిడాయి. 
ఈ చర్య  మన భారతీయులకు పుండుమీద కారం జల్లినట్టు అనిపించింది.  
జలియన్‌ వాలాబాగ్‌ మారణకాండ, అనంతర కాలంలో పంజాబ్‌లో జరిగిన అకృత్యాలు యావత్తు జాతినీ చలింపచేశాయి. ఈ ఘటనలు మన జాతీయోద్యమాన్ని బలంగా ప్రభావితం చేశాయి. బ్రిటిష్‌ పాలన పైన భ్రమలున్న మితవాద వర్గంలో అధికులు తమ అభిప్రాయాల్ని మార్చుకున్నారు. 
    పరాయిపాలన నుంచి దేశాన్ని విముక్తి చేయడమొక్కటే పరిష్కారమని భారతీయ నాయకులు నిర్ధారణకి వచ్చారు. విశ్వకవి రవీంద్ర నాధ టాగోర్‌ ఈ దురంతాలకి నిరసనగా 'నైట్‌ హుడ్‌' బిరుదును తిరిగి ఇచ్చేశారు.                     
    జలియన్‌ వాలా బాగ్‌లో చిందిన రక్తం తదనంతరం ఎందరో దేశభక్తులకు స్ఫూర్తిని ప్రేరణని ఇచ్చింది. బాల భగత్‌ సింగ్‌ జలియన్‌వాలా బాగ్‌ను దర్శించి, రక్తంతో తడిసిన గుప్పెడు మట్టిని తెచ్చుకున్నాడు.
 స్వరాజ్య కాంక్ష ఎక్కువైంది.  దానికి ప్రతీకార చర్య చెయ్యాలి అని తిరుగుబాటు దారులు చాలా కృషి చేసారు.  ఆ కృషికి  ప్రతిఫలం గా  21 సంవత్సరాల తర్వాత   మార్చి 13, 1940. సా. 4గం. 30ని.ల సమయం.   లండన్‌ లోని కాక్స్‌టన్‌ హాలులో రాయల్‌ సెంట్రల్‌ ఏసియన్‌ సొసైటీ, ఈస్టిండియా అసోసియేషన్‌ ఏర్పాటు చేసిన సభ జరుగుతోంది. అప్పుడు ఆ హాలు జనాలు తో పూర్తిగా కిక్కిరిసిపోయి వుంది. ఆనాటి సభకి ముఖ్య అతిధి జిలియన్ వాలాబాగ్ దురంత కారకుడు అత్యంత ప్రముఖుడు  మైకేల్‌ ఓ. డయ్యర్‌   మైకేల్‌ ఓ. డయ్యర్‌ ప్రసంగం ముగిశాక, సభ మధ్యలో కొన్ని నిముషాలు తరువాత. అప్పటి వరకూ సభలో ముందు వరుసలో కూర్చున్న ఒక భారతీయ యువకుడు నెమ్మదిగా తన సీట్లోంచి లేచి నిలబడ్డాడు. తిన్నగా డయ్యర్‌ వున్న  వైపు నడుచుకుంటూ వెళ్లాడు. హటాత్తుగా తనముందు వచ్చి నిలబడిన యువకుడిని చూసి  డయ్యర్‌ ఒక్క సారిగా షాక్ అయ్యాడు.  దృఢంగా ఎత్తుగా ఉన్న ఆ యువకుడి ఆహార్యం, గడ్డం చూడగానే పంజాబీ అని అర్ధం అవుతోంది. అతడి ముఖం నిశ్చలంగా, భావరహితంగా ఉంది. అతడి కళ్లు కనిపించీ కనిపించని తడితో మెరుస్తున్నాయి.  డయ్యర్‌కి అతడెవరో ఎందుకు వచ్చాడో ఎందుకు నిలబడ్డాడోఅస్సలు అర్ధం కాలేదు. ఆలోచించే టైం కూడా డయ్యర్ కు ఆ యువకుడు ఇవ్వలేదు. చేతిలో నల్లని పిస్తోలు ఉంది డయ్యర్‌కి అర్ధమైనట్టు అనిపించింది. అతడి గొంతు తడారి పోయింది. పిస్తోలు నిప్పులు కురిసింది. మైకేల్‌ ఒ. డయ్యర్‌ రక్తం మడుగులో కుప్పకూలాడు.  ఆ యువకుడు పెద్ద పెట్టున నినదించాడు... 
    ''భారత్‌ మాతాకీ జై''
    ''ఇంక్విలాబ్‌ జిందాబాద్‌'' 
  ''భారత్‌ మాతాకీ జై''
    యువకుడి చేతిలో పిస్తోలు నిప్పులు కక్కుతూనే ఉంది. 
    అతడి గుండె పట్టరాని ఉద్వేగంతో ఎగసిపడుతోంది ......అతడి కళ్లు అశ్రువులు వర్షిస్తున్నాయి.... తాను విద్యార్ధిగా ఉన్నపుడు చూసిన దృశ్యం...... విశాలమైన మృత్యు మైదానం.... తన వాళ్లని జంతువుల మాదిరిగా వేటాడుతున్న ఆంగ్లేయ అహంకారం.... నేలని అలికిన నెత్తురు ..... కాళ్ల కింద నలిగిన శిశువులు..... ఛిద్రమైన సజీవ మాంస శకలాలను కుక్కలు పీకుతున్న దృశ్యం... నేలమీద పొట్టని ఆనించి... తలమీద... రైఫిల్‌ మడమ దెబ్బలు తింటూ... దుమ్ములో.... దేకిన అవమానంతో కార్చిన కన్నీరు.... 
    21సంవత్సరాలుగా అతడు ఏడ్వలేదు.  ఈ సంఘటన జరిగిన తరువాత మనసున ఆనందము దుఖము కలసి కంటి నీరు ప్రవహించింది.  21 సంవత్సారులుగా అఆపిన నీరు ప్రవహించింది అన్నట్టు అనిపిస్తోంది. 
ఇంతకీ ఆయువకుడు పేరు తెలుసుకోవాలని మీకు అనిపిస్తోంది కదా అతని పేరు ఉద్ధం సింగ్.

ఉద్ధం సింగ్
    21 సంవత్సరాలు ఉద్ధం సింగ్ మనసు ఎంత భాధపడినదో అర్ధం అవుతోంది మనకు. అతనిలో ప్రతీకారం తీర్చుకోవాలనే కాంక్ష అర్ధం అవుతోంది.  దీని కోసం ఎన్ని రాత్రులు నిద్రపోయాడో, లేదో, తిన్నాడో లేదో కదా.నరాల్లో పంజాబ్‌ దురంతాలకి ప్రతీకారం చేసి తీరవలసిందేనని  నిశ్చయించుకున్నాక , డయ్యర్ల రక్తం కళ్ల చూస్తానని ప్రతిఙ్ఞ చేశాక.పగబట్టిన తాచులా వెదికాడు డయ్యర్లని. వాళ్లు భారత్‌ వదిలి ఇంగ్లడు వచ్చేశారని తెలిసి, ఉన్నత విద్య నెపంతో కుటుంబాన్ని ఒప్పించి, 'ఆశయ సాధన' కోసం తానూ ఇంగ్లండు చేరుకున్నాడు. ఇంగ్లండు చేరినప్పటి నుంచి 3సంవత్సరాలుగా వెయ్యి కళ్లతో వెదికాడు .డయ్యర్ల ఆచూకీ కోసం.  ఆశయ సాధనకి అవసరమైన సాధనాలను సమకూర్చుకున్నాడు.డయ్యర్‌ సభ విషయం తెలియగానే తన ఆశయం తీరే అవకాశం వచ్చిందని పొంగిపోయాడు. రక్తపు మడుగులో కూలిపోయిన డయ్యర్‌ని చూస్తుంటే ఉద్ధం సింగ్‌ మనసులో కట్టలు తెంచుకున్న ఆలోచనలు ఉద్వేగాలు ఎన్నెన్నో ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి.వేల మంది మరణాలకి, మరణ వేదనలకి, .అవమానాలకి ప్రతీకారం తీర్చుకోగలిగాడు తను ఇంక తానేమైపోయినా పరవాలేదని అనిపించింది అప్పుడు ఉద్ధంసింగ్‌కి. డయ్యర్‌ నెత్తుటి మడుగులో కూలిపోగానే సభ అంతా పెద్దపెట్టున కలకలం రేగింది.
    పట్టుబడిన ఉద్ధం సింగ్‌ని పేరేమిటని అడిగినపుడు, తన పేరు 'రాం మహమ్మద్‌సింగ్‌ అజాద్‌' అని చెప్పి ఆంగ్ల పోలీసుల్ని ఆశ్యర్యపరిచాడు. తన దేశంలోని మూడు మతాలను, వారి మధ్య సమైక్యతతో తాను సాధించ దలచిన ఆశయాన్ని ప్రతిబింబించేలా ఉద్ధం సింగ్‌ తనకు తానే ఆ పేరు పెట్టుకున్నాడు.  ఈ విషయం చదువుతుంటే నాలో ఏదో తెలియని గగుర్పాటు గా అనిపిస్తోంది. సంతోషంగా వుంది.   ప్రతీకారం తీర్చుకున్న ఉద్దం సింగ్ గొప్ప దేసభక్తుడు కదా.   
జై హింద్ 

సోమవారం, మార్చి 12, 2012

సీతా సమేత రామ శ్రీరామ

సోమవారం, మార్చి 12, 2012

నాకు నచ్చే అన్నమయ్య రచించిన పాటలలో శ్రీ రాముని పాటలలో ఇది ఒక పాట. నాకు నచ్చినది మరి మీరు కూడా వినండి సరేనా.
సీతా సమేత రామ శ్రీరామ - రాతి నాతి జేసిన శ్రీరామ రామ
ఆదిత్యకులమునందు నవతరించినరామ - కోదండభంజన రఘుకులరామ
ఆదరించి విశ్వామిత్రు యాగముగాచిన రామ - వేదవేదంతములలో వెలసిన రామ


బలిమి సుగ్రీవుని పాలినిధానమ రామ - యిల మునులకభయమిచ్చిన రామ
జలధి నమ్ము మొనను సాధించిన రామ - అలరు రావణదర్పహరణ రామ

లాలించి విభీషణుని లంకనేలించిన రామ - చాలి శరణాగత రక్షక రామ
మేలిమి శ్రీవేంకటాద్రి మీద వెలసిన రామ - తాలిమితో వెలయు ప్రతాపపు రామ

శనివారం, మార్చి 10, 2012

తాటి ఆకు బొమ్మలు

శనివారం, మార్చి 10, 2012

 
                                      

శుక్రవారం, మార్చి 09, 2012

బార్బీ బొమ్మ

శుక్రవారం, మార్చి 09, 2012

హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు నా ప్రియమైన బార్బీ బొమ్మ యొక్క పుట్టినరోజు.
మొట్ట మొదట నా బార్బీ బొమ్మకి పుట్టిన రోజు శుభాకాంక్షలు.  ఈ రోజు బార్బీ బొమ్మ యొక్క కదా నేను మీకు చెప్పేస్తాను. 

రూథ్ హాండ్లర్.
ఈ బొమ్మ యొక్క సృష్టి కర్త రూథ్ హాండ్లర్. రూత్ తన కూతురు బార్బారా చిన్న చిన్న పేపర్ బొమ్మలతో ఆడుకోవడాన్ని గమనించింది. ఆవిడ కూతురు ఆ బొమ్మలకు పెద్దవారి పాత్రలు కల్పించి ఆడుకుంటూ ఉండేది. అప్పటివరకు చిన్న పిల్లల బొమ్మలన్నీ చిన్న పిల్లల పాత్రల్లోనే ఉండేవి.   రూథ్ హాండ్లర్ నిర్వహణి మాటెల్ యొక్కసహ-స్థాపకుడు, ద్వారా 1959 లో కనుగొన్నారు. 
బార్బీ న్యూయార్క్ నగరంలో అమెరికన్ టాయ్ఫెయిర్ వద్ద ప్రపంచానికి పరిచయం చేశారు. బొమ్మ ఒక యువ ఫ్యాషన్ బొమ్మ ఉద్దేశించబడింది.అది బార్బీ యొక్క ఫిగర్ కొంత వివాదం ఉంది. కెన్ బొమ్మ రూత్ కొడుకు పేరు పెట్టారు. బార్బీ మొదటి 1965 లో bendable కాళ్లు వచ్చింది.
రొమ్ము క్యాన్సర్ తో బాధపడ్డారు  మరియు 1970 రూత్ ఒక శస్త్ర చికిత్స ద్వారా స్తనమును తొలగించుట జరిగింది.  ఆ తరువాత రూత్ బార్బీ డాల్ ను తయారు చేయటము లో తన కృషి పూర్తిగా సాగించారు.  ఆ బొమ్మకు తన కూతురు పేరు బార్బీ పేరు పెట్టారు. 1975 లో నిర్వహణ కోసం ఒక పేటెంట్ సంపాదించారు.  ఆమె ఒక గొప్ప businesswoman గా మారారు.   అప్పట్లో ఈ బిలియన్ బార్బీ బొమ్మలు ప్రపంచవ్యాప్తంగా అమ్మాబడ్డాయి.

నారాయణుడీతడు నరులాల

నారాయణుడీతడు నరులాల
నారాయణుడీతడు నరులాల
మీరు శరణనరో మిమ్ము గాచీని

తలచిన చోటను తానే ఉన్నాడు
వలెనను వారికి కైవసమెపుడు
కొలచెను మూడడుగుల జగమెల్లాను
కొలిచినవారిని చేకొనకుండునా

యెక్కడ పిలిచినా ఏమని పలికీ
మొక్కిన మన్నించు మునుముగను
రక్కసుల నణచి రక్షించు జగములు
దిక్కని నమ్మిన తిరముగా నేలడా

చూచిన యందెల్ల చూపును రూపము
వోచిక పొగడిన వుండు నోటను
యేచిన శ్రీవేంకటేశుడే యితడట
చేచేత పూజింప సేవలుగొనడా

గురువారం, మార్చి 08, 2012

చింతా. రామకృష్ణా రావుగారి సన్మాన చాయా చిత్రాలు.

గురువారం, మార్చి 08, 2012

ప్రజా పత్రిక వీక్లీ 85 వ వార్షికోత్సవంలో మా తాత గారు చింతా  రామకృష్ణా రావు గారి కి సన్మానం చేసారు.  దానికి గాను తాత గారు వారికి కృతజ్ఞతలు తెలుపుకున్నారు. వారి మాటలతో పాటు సన్మాన ఛాయాచిత్రాలు ఇక్కడుంచాను.


ప్రజా పత్రిక వీక్లీ 85 వ వార్షికోత్సవంలో అవ్యాజానురాగంతో నన్ను సత్కరించిన గౌరవ పార్లమెంట్ సభ్యులు ఉండవిల్లి అరుణ కుమార్ గారు, నెల్లూరుకు చెందిన జమీన్ రైతు పత్రికా సంపాదకులు గౌరవనీయులు శ్రీ యన్. డోలేంద్ర ప్రసాద్ గారు, మహామహోపాధ్యాయ శ్రీ విశ్వనాధ గోపాల కృష్ణగారు, జాతీయ బహుమతి గ్రహీత శ్రీ దివాన్ చెరువు శర్మగారు, డా. జాంపండు మాష్టారు, ప్రజా పత్రిక నిర్వాహకులు శ్రీమతి రమాదేవి గారు, గౌరవ నిర్వాహకులు యస్.సుదర్శన్ గారు, ప్రజాపత్రిక కుటుంబ సభ్యులు, మున్నగు  యావన్మందికీ నా హృదయ పూర్వక ధన్యవాదములు తెలియజేసుకొంటున్నాను.

మరి సన్మానానికి సంభందించిన కొన్ని చాయా చిత్రాలు ఇవిగో.



తాతగారి  " ఆంధ్రామృతం "  అంతర్జాల పత్రికలో గల రచనలను చూచి, " శ్రీ వేణుగోప కంద గీత గర్భ చంపకోత్పల శతకము మున్నగు వానిని పఠించి, మీ రచనా పటిమను గుర్తించి జరిపిన సాన్మానమునకు తాతగారు  నా హృదయపూర్వక శుభాకాంక్షలు.

బుధవారం, మార్చి 07, 2012

Women's Day.

బుధవారం, మార్చి 07, 2012


2012 THEME: CONNECTING GIRLS, INSPIRING FUTURES

If every International Women's Day event held in 2012 includes girls in some way, then thousands of minds will be inspired globally.
Each year around the world, International Women's Day (IWD) is celebrated on March 8. Thousands of events occur not just on this day but throughout March to mark the economic, political and social achievements of women.
Organisations, governments, charities and women's groups around the world choose different themes each year that reflect global and local gender issues.
"Connecting Girls, Inspiring Futures" is the 2012 theme of the internationalwomensday.com website and this has been widely used by hundreds of organisations including schools, universities, governments, women’s groups and the private sector. Each year the United Nations declares an overall International Women's Day theme. Their 2012 theme is “Empower Rural Women – End Hunger and Poverty”. Many organisations develop their own themes that are more relevant to their local contexts. For example, the European Parliament's 2012 theme is "Equal pay for work of equal value".
United Nation International Women's Day themes:
  • 2012: Empower Rural Women – End Hunger and Poverty.
  • 2011: Equal access to education, training and science and technology.
  • 2010: Equal rights, equal opportunities: Progress for All.
  • 2009: Women and men united to end violence against women and girls
  • 2008: Investing in Women and Girls
  • 2007: Ending Impunity for Violence against Women and Girls
  • 2006: Women in decision-making
  • 2005: Gender Equality Beyond 2005: Building a More Secure Future
  • 2004: Women and HIV/AIDS
  • 2003: Gender Equality and the Millennium Development Goals
  • 2002: Afghan Women Today: Realities and Opportunities
  • 2001: Women and Peace: Women Managing Conflicts
  • 2000: Women Uniting for Peace
  • 1999: World Free of Violence against Women
  • 1998: Women and Human Rights
  • 1997: Women at the Peace Table
  • 1996: Celebrating the Past, Planning for the Future
  • 1975: First IWD celebrated by the United Nations.
Happy International Women's Day.

My Blog Lovers

నా యూట్యూబ్ చానల్స్ ప్లీజ్ సబ్స్క్రిబ్ చేయండీ

Diabetic Challenger

DIABETIC CHALLENGER YOUTUBE CHANNEL. PLASE SUBSCRIBE MY CHANNEL...... THANK YOU VERY MUCH.

Ammamma Tho Nenu (అమ్మమ్మ తో నేను

Please subscribe our channel Ammamma Tho Nenu (అమ్మమ్మ తో నేను)