Blogger Widgets

సోమవారం, ఫిబ్రవరి 09, 2009

COUNT THE SQUARES

సోమవారం, ఫిబ్రవరి 09, 2009


Taka a good look at the figure:  How many square are there in this figure?

ఆదివారం, ఫిబ్రవరి 08, 2009

హితోక్తులు నాకు వచ్చాయి .

ఆదివారం, ఫిబ్రవరి 08, 2009

హలో ! నిన్న మా తాత నాకు కొన్ని హితోక్తులు చెప్పారు. ఇవి జీవికాలం పనికి వస్తాయని నాకు నేర్పించారు. అవి ఇవే .
చిన్న చిన్న పనులు సక్రమంగా చేయగలిగితే పెద్ద పెద్ద పనులు సమర్దవంతముగా చేయగలము .
నీ మాటలను నువ్వు గౌరవించు కుంటే ప్రపంచము నీ మాటలను గౌరవించుతుంది.
ఒక అబద్ధము కప్పిపుచ్చుకుంటే వంద అబద్ధాలు ఆడాలి, అందుకే అసలు అబద్ధము ఆడకూడదు.
శరీరములో రక్తము ప్రవహిస్తున్నట్లే సమాజంలో ధనం ప్రవహించాలి దానం . ధనము ఏ ఒక్కరి వద్ద పెద్ద మొత్తములో నిలువ ఉన్నా , అది దేశాభివృద్ధి కి తోడ్పడదు.
శరీరంలో రక్తం కొన్ని చోట్ల ఆగితే శరీరానికే ప్రమాదం. ధనం సమాజంలో కొద్ది మంది దగ్గరే దాగితే అది సమాజానికే ముప్పు దేశానికే ప్రమాదము.
కృషితో నాస్తి దుర్భిక్షం .( కృషి వల్ల దుర్భిక్షం ఉండదు.)
సర్వేజనా సుఖినో భవంతు ! (అందరు సుఖముగా ఉందురు గాక.)
యతో ధర్మస్తతో జయం . ( ఎక్కడ ధర్మం ఉంటుందో అక్కడ విజయం వుంటుంది.)
సత్యం వద ! ధర్మం చర! ( సత్యం పలకండి - ధర్మం ఆచరించండి )

babaiమరి నేను వుంటాను bye .babai

గురువారం, ఫిబ్రవరి 05, 2009

మహాత్ముల సూక్తి రత్నావళి

గురువారం, ఫిబ్రవరి 05, 2009

హాయ్ అందరు బాగున్నారా. చాలా రోజులయింది కదండి .అందుకే అడుగుతున్నాను .pokpok
సరే ఈ రోజు కొందరు మహాత్ములు సూక్తులు తెలుసుకుమ్దామంది. ఒకే
తల్లిదండ్రులు తమ సంతానానికి అందించిన దానికి ప్రతిఫలము యి సృష్టిలో లేనే లేదు . అని వాల్మీకి అన్నారు.
మనుషుల్లో గొడవలు రాటానికి ఐదు కారణాలు ఉంటాయి. స్త్రీలు, ఆస్తిపాస్తులు, కటోరమైన వాక్కులు, కులమత ద్వేషాలు, ఎప్పుడో తెలిసో తెలియకో చేసిన అపరాధాలు . అని మహా భారతం లో వ్యాసులు వారు అన్నారు.
మంచి మనషుల మనసు వెన్నలా వుంటుంది .అని తులసి దాసు అన్నారు.
ఈరోజుకి ఇవి చాలు మరో రోజు కొన్ని.
bye

శనివారం, జనవరి 31, 2009

నమస్కారిస్తే ఆయురారోగ్యాలు, అర్ఘ్యమిస్తే అష్టైశ్వర్యాలు

శనివారం, జనవరి 31, 2009

నమస్కారిస్తే ఆయురారోగ్యాలు, అర్గ్యమిస్తే అష్టైశ్వర్యాలు ప్రసాదించే ప్రత్యక్ష భగవానుడు సూర్యడు.
ఆదిదేవ నమస్తుభ్యం ప్రసీదమమ భాస్కర
దివార నమస్తుభ్యం ప్రభాకర నమోస్తుతే ll
ఓ ఆది దేవా ! నీకు నమస్కారము. భాస్కరా! నన్ను కరిణిమ్చు. ప్రభాకరా నీకు ప్రణామములు అంటు సూర్యునికి ప్రతినిత్యము నమస్కారములు చేస్తే ఆయురారోగ్యాలు, అర్ఘ్యమిసే చాలు అష్టైశ్వర్యాలు ప్రసాదించే ప్రత్యక్షభగావానుడు సూర్యుడు.
మాఘమాసములో వచ్చే శుద్ధ సప్తమి తిధి కి రధసప్తమి అను పేరు. ఇది సూర్యునికి సంబందించిన రోజు . ఇది ముఖ్యముగా సూర్యభగవానుని ఆరాధించు పండుగ. ఈ రోజు సూర్యడు తన రధమును ఉత్తరం దిక్కునకు మళ్ళించే రోజు.
ఈ పర్వదినము రోజు కుటుంబములోని వారందరూ తెల్లవారుజామున నిద్రలేచి, కాలకృత్యాలు తీర్చుకొని జిల్లేడు ఆకుల్ని భుజాలమీద , తలమీద పెట్టుకొని
"జనని త్వంహి లోకానాం సప్తమీ సప్తసప్తికే, సప్తమ్యా హ్యదితే దేవి నమస్తే సుర్యమాతృకే "
అనే మంత్రముతో స్నానము చేయాలి, సూర్యునికి అర్ఘ్యమివ్వాలి. సూర్యుడికి అర్గ్యమిస్తే అస్తిస్వర్యములిస్తాడు.
జిల్లేడు పత్రమునే అర్కపత్రమంటారు. ఈ పత్రము సూర్యునికి ఇష్టము.
తులసి కోటని పసుపు, కుంకుమ లతో అలంకరించి, తులసికోట ముందు ముగ్గులు పెట్టాలి. సూర్యబింబం, ఏడు గుర్రాలు, ఏకచక్రము తో బొమ్మ ముగ్గు పెట్టాలి . ముగ్గుమీద ఆవు పిడకలతో కుంపటి ఏర్పరచి దానిమీద గిన్నెలో అన్నం పాయసము వండాలి. కొత్త గిన్నెకి పసుపురాసి, కుంకుమ బొట్టు పెట్టి, ఆవుపాలను మూడుసార్లు పొంగించి , కొత్త బియ్యము, పటికబెల్లము, యాలకులపొడి చేర్చి , నెయ్యి వేసి చక్కగా వుడికించి పాయసముచేయ్యాలి.
పాలు మూడు సార్లు పొంగటమువల్ల ఇంట్లో సిరిసంపదలు పోంగిపోర్లుతాయని నమ్మకము వుంది.
చిక్కుడు కాయలకి చీపురుపుల్లలు గుచ్చి చేసిన రధమును ముగ్గులో పెట్టి, పదిహేను చిక్కుడు ఆకులు పరచి అందులో ఉడికించిన పాయసమును వడ్డించాలి. వాటిలో అగ్నిహోత్రునికి ఐదు ఆకులు అర్పించాలి. తులసి అమ్మవారికి ఐదు , మిగతా ఐదు సుర్యభాగావానునికి నివేదించాలి. సూర్యునికి గంధ , పుష్ప, అక్షతల, షోడపోచార అష్టోత్తర శతనామాలతో పూజించాలి. ఆయనికి ప్రదక్షణాలు చేసి నమస్కారము చేస్తే ఎంతో పుణ్యము వస్తుంది.
సాయమ్త్రము సూర్యుని గుడికి వెళ్లి నమస్కరించాలి.
రధ సప్తమి రోజునుండి వేసవి కాలము ప్రారంబమవుతుంది . అందుకే రధసప్తమిరోజు తప్పకుండా సూర్య నమస్కారములు చేయాలి. మనకు ప్రతినిత్యము ప్రత్యక్షముగా కనిపించే దైవం సూర్యభగవానుడు. ప్రపంచములో అన్ని జీవరాసులకు వేడి, వెచ్చదనము, పాడిపంటలను, వెలుగును ఇచ్చేవాడు భాస్కరుడు. సుర్యారాధన మనకు వేద కాలమునుండి ఉంది. సూర్యుని పేరు సప్తిమ. ఏడు గుర్రాలను, పంచిన రధము కలిగినవాడు. సప్తలోకములకు తన శక్తిని ప్రసాదించువాడు సూర్య కిరణాలు ఏ డురంగులకు నిదర్శనమని, రధసప్తమినాడు ఆకాసములో గ్రహ నక్షిత్ర సన్నివేసం రధమును పోలి ఉంటుంది కనుకనే ఈ తిధిని రధసప్తమి అని పేరు వచ్చింది.
అనంతసక్తితో కూడుకొన్న కిరణాలు, తేజస్సు, శుద్ధమైన వాడు , భక్తులకు అభయము ఇచ్చేవాడు. జగతికి వెలుగుకారకుడు, జ్యోతిర్మయుడు, శుభానిచ్చే ఆదిత్యుడు, చీకటి పారద్రోలేవాడు, భక్తుల కోరికలు తీర్చేవాడు ఆదిత్యుడు , మార్తాండుడు,శుభంకరుడు, భాస్కరుడు అయిన సూర్యనారాయణమూర్తికి నమస్కారములు అంటూ ధ్యానించాలి.
సుర్యుడు ఆరోగ్య ప్రదాత. అది సైన్స్ ద్వారా కూడానిరూపించబడినది. సూర్య కిరణాలలో డి విటమిన్ కలదు.
అన్నట్టు రధసప్తమి రొజు స్త్రీలు ఎన్నో నోములు చెయటానికి ప్రారంబధినముగా చెయుదురు. అక్షింతలు వేసుకొని నోములకు నాంది పలుకుదురు.

My Blog Lovers

నా యూట్యూబ్ చానల్స్ ప్లీజ్ సబ్స్క్రిబ్ చేయండీ

Diabetic Challenger

DIABETIC CHALLENGER YOUTUBE CHANNEL. PLASE SUBSCRIBE MY CHANNEL...... THANK YOU VERY MUCH.

Ammamma Tho Nenu (అమ్మమ్మ తో నేను

Please subscribe our channel Ammamma Tho Nenu (అమ్మమ్మ తో నేను)