Blogger Widgets

శుక్రవారం, డిసెంబర్ 16, 2011

ప్రత్యేక పాశురము-ప్రత్యేక నివేదన

శుక్రవారం, డిసెంబర్ 16, 2011


ధనుర్మాసవ్రతము ప్రతీదినము పొంగలి నివేదన అర్పిస్తాము.  కానీ కొన్ని ప్రత్యేక పాశురము లకు ప్రత్యేక నివేదన గోదాసహిత రంగనాదునకు అర్పించాలి.  మరి ఆ ప్రత్యేక పాసురాలు వాటికి అర్పించవలసిన నివేదనలు ఏమిటంటే.....

రోజు  పాశురము ప్రసాదము
మూడవ పాశురము ఓంగి ఉలగళంద ఉత్తమన్ పేర్ పాడి చక్కరపొంగాలి
ఏడవ పాశురము కీశు కీశెన్ఱెంగుం  పులిహోర
పన్నెండవ పాశురము కనైత్త్-ఇళంకత్తెరుమై కన్ఱుక్కిరంగి చక్కరపొంగాలి
పదహారవ  పాశురము నాయగనాయ్ నిన్ఱ నందగోపనుడైయ పులిహోర, దద్యోజనము, చక్కెరపొంగలి 
పద్దెనిమిదవ పాశురము ఉందు మదకళిత్తన్-ఓడాద తోళ్  చక్కరపొంగాలి
ఇరవైరెండవ పాశురము అంగణ్ మా ఞాలత్తరశర్, అబిమాన చక్కరపొంగాలి
ఇరవైమూడవ పాశురము మారి మలై మురైంజిల్ మన్ని క్కిడందుఱంగుం పులిహోర, దద్యోజనము
ఇరవైనాల్గవ పాశురము అన్ఱివ్వులగమ్ అళందాయ్ అడి పోత్తి దద్యోజనము
ఇరవైఏడవ పాశురము కూడారై వెల్లుమ్ శీర్ గోవిందా, ఉన్ఱనై పాయసము, పులిహోర, దద్యోజనము
ఇరవైఎనిమిదవ పాశురము కఱవైగళ్ పిన్ శెన్ఱు కానం    దద్యోజనము
ఇరవైతొమ్మిదవ పాశురము శిత్తం శిఱుకాలే వందున్నై  పులిహోర, దద్యోజనము, చక్కెరపొంగలి
ముప్పైవ పాశురము వఙ్గక్కడల్ కడైంద అప్పము,పులిహోర,దద్యోజనము,చక్కెరపొంగల 

తిరుప్పావై ద్వితీయ పాశురము

దనుర్మాసవ్రతము ముప్పై రోజుల వ్రతము కదా అయితే గోపికలు మొదటిపాసురములో వారికి ఏమికావాలో ఎలాచేయాలో అల్లోచించారు.  వారు భగవత్ప్రాప్తి కావాలని వ్రతము ప్రారంభించారు అని తెలుస్తోంది.  మరి రెండవ పాసురములో వారు ఏమిచేస్తున్నారో తెలుసుకుందామా.
పాశురము 
  వైయత్తు వాళ్ వీర్గాళ్! నాముం నం పావైక్కు
వైయత్తు వాళ్ వీర్గాళ్! నాముం నం పావైక్కు
శెయ్యుం కిరిశైగళ్ కేళీరో పాఱ్కడలుళ్
పైయత్తుయిన్ఱ పరమనడి పాడి
నెయ్యుణ్ణోం పాలుణ్ణోం నాట్కాలే నీరాడి
మైయిట్టెళుదోం మలరిట్టు నాం ముడియోమ్
శెయ్యాదన శెయ్యోం తీక్కుఱళై చ్చెన్ఱోదోమ్
ఐయముం పిచ్చైయుం ఆందనైయుం కైకాట్టి
ఉయ్యుమాఱెణ్ణి ఉగందేలోర్ ఎమ్బావాయ్
 


తాత్పర్యము:  భగవంతుని దర్శించుటకు వెళ్ళేవారు భాగాత్ప్రాప్తి కోసం కొన్ని నియమాలు పాటించాలని.  శ్రీ కృష్ణుడు అవతరించిన ఈ లోకములో పుట్టి దు:ఖమైన ఈ లోకములో కూడా భగవదనుగ్రహముచే ఆనందము అనుభవించుచుతున్న వారలారా!  మేము మా వ్రతమునకు ఏర్పరచుకోనిన నియామాలు వినండి.  పాలసముద్రములో పడుకొని నిద్రించుతున్న పరమాత్మ యొక్క పాదపద్మాలకు మంగళము పాడతాము.  మేము ఈవ్రతము చేసినంతన కాలమున నీటిని కానీ పాలను కాని అనుభవించము.  తెల్లవారుజాముననే నిదురలేచి చల్లనినీటినే స్నానము చేసెదము.  కళ్ళకు కాటుకను అలంకరించము.  తలకు పరిమలబరితమగు పూలదండలను ధరించము.  మా పెద్దలు విడిచిపెట్టిన చేడుపనులు మేము ఆచరించము.  ఇతరులకు బాధ కలిగే మాటలు కానీ, అసత్యాలను కాని ఎప్పుడూమాటాడము.  ఇతరులకు హాని uకలిగించము.  ఇతరులకు హానిలాగే ఆలోచనలు చేయము.  ఙ్ఞానసంపన్నులైన మహాత్ములను ధనధాన్యాదులచే ఎక్కువ సత్కారిచుదుము.  బ్రహ్మచారులకు బిక్షుకలుకు బిక్షపెట్టేదము.  భగవంతుని కళ్యాణ గుణాలను కీర్తించేదము.  గురువు ను పరబ్రహ్మగా భావించాలని మన పెద్దలు చెప్పారు కదా అందుకే గురువులను పూజించి ఆచార్య కృపపోందేదము.  వ్రతనీయమాలు ఏ రీతిగా చెప్పబడినవో ఆవిధంగా పాటిద్దాం అనుకున్నారు. శ్రీ కృష్ణుని పొందుదాము.


విశేషార్ధము :
1 .  వైయత్తు వాళ్ వీర్గాళ్!  :-
ఈ లోకములో ఆనందము అనుభవించువారలారా!  అని సంబోధించుచున్నారు.
2 . నాముం నం పావైక్కు చ్చెయ్యుఙ్గిరిశైగళ్ కేళీరో!  :-
మేము మా వ్రాతములో చేయు క్రియలను వినుడు.
3 . పాఱ్కడలుళ్ పైయత్తుయిన్ఱ పరమనడి పాడి  :-
పాలసముద్రములో మెల్లగా పాడుకొనిన పరమపురుషుని పాదములకు మంగళము పాడి.
4 . నెయ్యుణ్ణోం పాలుణ్ణోం  :-
నేతులారగించము- పాలు తాగము.
5 .  నాట్కాలే నీరాడి  :-
తెల్లవారుజ్హాముననే స్నానము చేయవలెను.
6 . మైయిట్టెళుదోం  :-
కాటుకను మాకళ్ళకు అలంకరించము.
7 .   మలరిట్టు నాం ముడియోమ్  :-
మేము మాకోప్పులలో పూలు ధరించము.
8 . శెయ్యాదన శెయ్యోం  :-
"మా పెద్దలు చేయని పనులను మేమూ చేయము"
9 .  తీక్కుఱళై చ్చెన్ఱోదోమ్  :-
ఇతరులకు అనర్ధమును కల్గించు తప్పు మాటలను పలుకము.
10 .  ఐయముం పిచ్చైయుం ఆందనైయుం కైకాట్టి  :-
దానమును, భిక్షమును చాలు అన్నంతవరకు  ఇచ్చి  అయ్యో! ఏమియు చేయలేకపోతిమే అని విచారింతుము.
11 . ఉయ్యుమాఱెణ్ణి యుగందు :-
పైన విధంగా ఉజ్జీవించు విధములను పరిశీలించి సంతోషించి ఈ వ్రత నీయమాలను వినండి.




జై శ్రీమన్నారాయణ్

గురువారం, డిసెంబర్ 15, 2011

తిరుప్పావై ప్రధమ పాశురము

గురువారం, డిసెంబర్ 15, 2011

ఈ ధనుర్మాసం వ్రతం చాలా శ్రేష్టమైనది.  ఈ నెలరోజులు సూర్యోదయానికి మునుపే నిద్ర లేచి భగవంతుని ఆరాధించాలి.
ఈ వ్రతాన్ని త్రేతాయుగంలో భరతుడు ఆచరించాడు.  ద్వాపరయుగంలో గోపికలు శ్రీ కృష్ణుని భర్తగా కోరి ఈ నెలరోజులు కాత్యాయనీదేవి వ్రతం చేస్తారు.  ఈ వ్రతము మనము కూడా చేద్దాం.  అయితే మొదటి రోజు పాశురం గురించి మనం తెలుసుకుందాం   చుక్కలు పెట్టిన పాసురము నాకు విశేష నివేదన స్వామివారికి అర్పించాలి .

*మార్గళి త్తింగళ్ మది నిఱైంద నన్నాళాల్
  నీరాడ ప్పోదువీర్ పోదుమినో నేరిళైయీర్
  శీర్ మల్గుం ఆయ్ ప్పాడి చ్చెల్వ చ్చిఱుమీర్గాళ్
  కూర్వేల్ కొడుందోళిలన్ నందగోపన్ కుమరన్
  ఏరారంద కణ్ణి యశోదై ఇళమ్ శింగం
  కార్మేని చ్చెంగణ్ కదిర్మదియం పోల్ ముగత్తాన్
  నారాయణనే నమక్కే పఱైతరువాన్
  పారోర్ పుగళప్పడిందేలోర్ ఎమ్బావాయ్
 

తాత్పర్యము:   ఆహా మనము అవలంభించిన వ్రతమునకు మిక్కిలి అనుకూలమైన సమయము వచ్చింది కదా.
ఈ మార్గశిరమాసమును శ్రీ కృష్ణులు వారు  మాసములలో మార్గశిరమాసము తన స్వరూపముగా భగవద్గీతలో చెప్పారు.  మార్గశిరమాసము అనగా మనము అవలంభించిన మార్గమునకు శిరస్సు అని ( అతి ప్రదానమైన సమయము అని భావము)  " వాసుదేవతరుచ్చాయానాతిశీతానఘర్మదా" అంటే శ్రీ కృష్ణుడనే చెట్టు యొక్క నీడ ఎక్కువ చల్లనిదీ కాదు, ఎక్కువ వేడిదీ కాదు అని అర్ధము.  వాసుదేవస్వరూపమైన మార్గశిరమాసము కూడా సమశీతోష్ణముగా వుండు కాలము.  మనము మేలుకొనే సమయము బ్రాహ్మీముహూర్తము మరియు ఈ మార్గశిరమాసములో పైరులు పండి పెరిగి ఉండే కాలము.  అతి మనోహరముగా వుంది వెన్నెలను వెదజల్లు శుక్లపక్షము.  పవిత్రమైన దినము వ్రతము ప్రారంభించమని మనకు కాలమును ప్రకాసించుటలోని భావము.
భాగవత్సమాగమమును కోరి భగవంతుని సంతోషపెట్టుటకై పనులోనర్చునట్టి సమయము సంప్రాప్తించుటచే ఉత్తమోత్తమ సమయము అని ఆహ్లాదమును వెల్లిబుచ్చుట యందలి తాత్పర్యము.  చెలికత్తెలను మేల్కొని స్నానముచేసి, రండని పిలుచునపుడు "  ప్రకృతి మండలము అందనంత అనుభవించువారలారా! అని ఆండాళ్ళు సంబోధించింది.  ఈ పిలుపులో ఒక సుందరమైన భావము కలదు.  పమపదమున నివాసము కంటే గోకుమను ప్రకృతిమండలమున నివసించుటచే భగవంతునితో కలసి మెలసి మహానందము అనుభవించుట మహాభాగ్యముగా లభించును.  అందుచే పరమపదమును ఎవగించుకోనుట సంభోధనలోని సౌందర్యముగా గ్రహింపదగును.



ధనుర్మాస వ్రతం



రేపటి నుండి ధనుర్మాసం కదండి. సూర్యదేవుడు ధనుస్సురాశిలో ప్రవేశించడంతో మొదలై భోగిపండుగ రోజువరకూ, సూర్యుడు మకరరాశిలోకి ప్రవేశించేంతవరకూ ఉండే మాసం - "ధనుర్మాసం". వైష్ణవ సాంప్రదాయంలో అత్యంత పవిత్రమైన మాసం ఇది. మాసమంతా వైష్ణవాలయాల్లో ప్రత్యేక పూజలు చేస్తారు. గోదాదేవి రచించిన "తిరుప్పావై" ని ఈ మాసం రోజులు పఠిస్తారు.ముఖ్యంగా కలియుగ వైకుంఠమైన తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామి వారి ఆలయంలో ఈ నెల రోజులు సుప్రభాతానికి బదులుగా తిరుప్పావైని పఠిస్తారు. అటువంటి పవిత్రమైన ధనుర్మాసంలో శ్రీమహావిష్ణువును "మధుసూదనుడు" అనే పేరుతో పూజించాలి. ప్రతిదినం పూజించి మొదటి పదిహేను రోజులూ నైవేద్యంగా పులగం లేదా చెక్కరపొంగలిని, తర్వాతి పదిహేను రోజులు దద్యోదనమును సమర్పించాలి. ధనుర్మాసం మొత్తం ఇంటి ముందు ఆవుపేడను కలిపిన నీటిని చల్లి బియ్యపుపిండితో అందమైన ముగ్గులు పెట్టి, ముగ్గుల మధ్యలో ఆవు పేడతో చేసి, పసుపు, కుంకుమలు, వివిధ పూలను అలంకరించిన గొబ్బిళ్ళను ఉంచవలెను. ఈ విధంగా చేయడం వల్ల కన్యకు మంచి భర్త లభిస్తాడు. సౌభాగ్యం కలకాలం వర్థిల్లుతుంది.
ధనుర్మాస వ్రతంప్రత్యక్ష భగవానుడైన శ్రీసూర్యభగవానుడు మేషరశి మొదలు పన్నెండురాశులలో సంచరిస్తుంటాడు. ద్వాదశాత్మడైన ఆదిత్యుడు, తన దివ్యయాత్రలో ధనస్సు రాశిలోనికి ప్రవేశిస్తూనే "ధనుర్మాసం" ప్రారంభమై, సూర్యుడు మకర రాశిలోనికి ప్రవేశించేంతవరకూ, అంటే మకర సంక్రాంతి పర్వదినం ముందురోజు భోగి వరకు వుంటుంది. ఈ నెలరోజుల పాటూ "ధనుర్మాసవ్రతం" ఆచరించాలి.


 ప్రతిరోజు సూర్యోదయానికి కంటే ఐదుఘడియలు ముందుగా నిద్రలేచి కాలకృత్యాలను పూర్తిచేసుకుని, తలస్నానం్ చేసి నిత్యపూజలు, సంధ్యావందనాలను ముగించి, అనంతరం ధనుర్మాస వ్రతాన్ని ఆచరించాలి. మధుసూధనస్వామిని ఆవు పాలు, కొబ్బరి నీరు, పంచామృతాలతో అభిషేకించాలి.  తులసీ దళాలతోనూ, వివిధ రకాలైన పుష్పాలను ఉపయోగించి స్వామి వారిని అష్టోత్తర శతనామాలతోగానీ,సహస్రనామాలతోగానీ, పూజించాలి. నైవేద్యంగా మొదటి పదిహేనురోజులూ 'చెక్కర పొంగలి' ని గానీ, భియ్యం, పెసరపప్పు కలిపి వండిన 'పులగం'ను గానీ సమర్పించాలి. తర్వాత పదిహేను రోజులూ 'దద్యోదనం' నైవేద్యంగా సమర్పించాలి. తర్వాత ధూపదీప, దక్షిణతాంబూలాలను సమర్పించి నమస్కరించుకోవాలి. మధుసూధనస్వామివారిని పూజించడంతో పాటూ బృందావనంలో తులసిని పూజించడం చేయాలి. ఈ మాసమంతా విష్ణుపురాణాన్ని, విష్ణుగాథలను చదువుతూగానీ, వింటూగానీ గడపడం, వైష్ణవాలయాలను దర్శించడం చేయాలి. ఈ విధంగా ప్రతిరోజు ధనుర్మాసం మొత్తం ధనుర్మాస వ్రతాన్ని ఆచరించడం శ్రేష్ఠం. నెలరోజుల పాటూ చేయలేనివారు 15 రోజులుగానీ, 8 రోజులుగానీ, 6 రోజులుగానీ, 4 రోజులుగానీ, లేదంటే కనీసం ఒక్కరోజు అయిన ఆచరించాలని శాస్త్రవచనం.వ్రతాన్ని ఆచరించడం పూర్తయ్యాక శ్రీమధుసూధన స్వామివారి విగ్రహాన్ని


"మధుసూదన దేవేశ ధనుర్మాస ఫలప్రదతవ మూర్తి ప్రదానేన మమసంతు మనోరథాః||"


అనే శ్లోకాన్ని పఠిస్తూ పండితుడికి దానం ఇవ్వాలి. పండితుడు దానన్ని స్వీకరిస్తూ -"ఇందిరా ప్రతి గృహ్ణాతు" అని పండితుడు ఇచ్చే ఆశీర్వచనాన్ని స్వీకరించడం వల్ల సకల కోరికలు సిద్ధిస్తాయని చెప్పబడుతోంది. 
ఈవిధంగా ధనుర్మాసవ్రతాన్ని ఆచరించడం వలన కోరిన కోరికలు తీరడంతోపాటూ ఇహలోకంలో సౌఖ్యం, పరంలో మోక్షం సిద్ధిస్తుందనేది పురాణ కథనం. ధనుర్మాసవ్రతాన్ని ఒక్కరోజు ఆచరించడం వల్ల వేయిసంవత్సరాలపాటూ నిత్యం వివిధదేవతలను ఆరాధించినంత ఫలం లభిస్తుందనేది పండితాభిప్రయం.కాత్యాయనీవ్రతంఈ వ్రతాన్ని ధనుర్మాసంలో వివాహంకాని అమ్మాయిలు ఆచరించాలని చెప్పబడుతోంది. పూర్వం ఈ వ్రతాన్ని స్వయంగా శ్రీకృష్ణుడి సలహా మేరకు గోపికలు ఆచరించి శ్రీకృష్ణుడినే భర్తగా పొందినట్లు కథనం. శ్రీగోదాదేవి ఈ వ్రతాన్ని ఆచరించి శ్రీరంగనాథుడిని భర్తగా పొందినట్లు పురాణాలు వెల్లడిస్తున్నాయి.వ్రత విధానంధనుర్మాసంలో ప్రతిరోజూ తెల్లవారుజామునే నిద్రలేచి, కాలకృత్యాలు తీర్చుకుని తలస్నానం చేయాలి. ఇంటిముందు శుభ్రపరిచి పేడనీటితో కళ్ళాపి చల్లి, బియ్యపు పిండితో ముగ్గులను తీర్చిదిద్ది, ముగ్గుల మధ్యలో ఆవుపేడతో చేసిన గొబ్బిళ్ళను ఉంచి, వాటిని గుమ్మడి, బీర, చామంతి, బంటి వంటి పూలతో అలంకరించి నమస్కరించాలి. అనంతరం కాత్యాయనీదేవిని షోడశోపచారాలు , అష్టోత్తరాలతో పూజించి నైవేద్యంసమర్పించాలి. ఈ విధంగా ప్రతిరోజూ ధనుర్మాసమంతా ఆచరించాలి.

ధనుర్మాసం లో పాడవలసిన పాసురాలు ఇవి.  మా పిన్నిగారు రామ లక్ష్మిగారు పాడిన తిరుప్పావై పాసురాలు మీ ముందువుంచుతున్నాను. 





అనేక దీక్షలు, వ్రతాలుతో ఏదోఒక పద్దతిలో జీవితాన్ని మరింత సమర్దవంతముగా నడుపుకోవటానికి , జీవితాన్ని అర్ధవంతముగా తీర్చిదిద్దుకోవటానికి అందరు ప్రయత్నమూ చేస్తారు.
అందుకో ఒకటి వైదిక సాధనాలను సమన్వయము చేస్తూ గోదాదేవి నడచిన మార్గమే మార్గశిరం.  ఈ మార్గశిరమాసాన్ని తానుగా శ్రీ కృష్నులవారు చెప్పారు.  అతన్ని పొందేమార్గమే మార్గశిరవ్రతము.  


గోదాదేవి మనకందించిన ఈ ధనుర్మాసవ్రతము ప్రాపంచిక ఫలితాలైన వర్షాలను, పాడిని, పంటను,సంవృద్ది చేస్తుంది.  సంపదలను ఇస్తుంది.  సత్పరిపాలకులను ప్రవర్తింపచేస్తుంది.  దేసప్రగతికి, ప్రజాశ్రేయస్సుకు సోపానాలను దిద్దగలిగే పాలకులును తయారు చేస్తుంది.  వాతావరణాన్ని సానుకూల పరుస్తుంది.  శాంతియుతంగా పరస్పర ప్రేమానురాగాలు పెరిగి సోదరభావం వెల్లివిరిసేలా చేస్తుంది.  పిల్లలలోసత్ప్రవర్తన, క్రమశిక్షణ అలవారుస్తుంది. ఇదే దనుర్మాసవ్రతం.
  ఈ ధనుర్మాసం పూజ అందరు బాగా జరుపుకోవాలని అనుకుంటున్నాను.

సూక్తి:  నీవు ఎంత చిన్న ధర్మము ఆచరించినా అది ఎంత గొప్ప ఆపదనుండైనా రక్షిస్తుంది.
సర్వేజనాః సుఖినోభవంతు.  సమస్త సంమంగాళాని భవంతు.

జై శ్రీమన్నారాయణ్

My Blog Lovers

నా యూట్యూబ్ చానల్స్ ప్లీజ్ సబ్స్క్రిబ్ చేయండీ

Diabetic Challenger

DIABETIC CHALLENGER YOUTUBE CHANNEL. PLASE SUBSCRIBE MY CHANNEL...... THANK YOU VERY MUCH.

Ammamma Tho Nenu (అమ్మమ్మ తో నేను

Please subscribe our channel Ammamma Tho Nenu (అమ్మమ్మ తో నేను)