Blogger Widgets

శనివారం, జనవరి 14, 2012

భారత సైనిక దినోత్సవం

శనివారం, జనవరి 14, 2012



భారత సైనిక దినోత్సవం. 1949లో ఇదేరోజున మొదటిసారి ఓ భారతీయుడు కె.ఎం.కరియప్ప  ఇండియన్‌ ఆర్మీ చీఫ్‌గా ఎంపికయ్యారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని ఏటా జనవరి 15ను సైనికదినోత్సవంగా జరుపుకొంటున్నాం.   దేశవ్యాప్తంగా త్రివిధ దళాలు సైనిక దినోత్స వాన్ని జరుపుకోనున్నాయి.   భారత నావికాదళం, భారత వైమానిక దళం, దేశ రక్షణలో ప్రధాన భూమికను నిర్వహిస్తున్నాయి.
అసలు ఎన్నోరకాలు పోరాటాలు విప్లవాలు చేసి హింసాయుత, మరియు అహింసా పోరాటాలు కూడా చేసి  ఎంతోమంది స్వాతంత్ర్య సమరయోధులు పోరాటం చేసి భారతదేశానికి బ్రిటిషవారి నుండి స్వాతంత్ర్యాన్ని సంపాదించి పెడితే.  ఆ స్వాతంత్ర భారతదేశాన్ని మన దేశ సైనికదళం సరిహద్దుల దగ్గర మన దేశాన్ని వారి ప్రాణాన్ని అడ్డుపెట్టి మరి కాపాడుతున్నది. 
మడమ తిప్పని యోధుడి చేతిలో మంటలు విరజిమ్మే ఆయుధం తో మంచి వజ్రమువంటి  మనస్సుతో ఎటువంటి వృద్దాప్యము దగ్గరకురాని సంకల్పబలంతో, వారి గుండె దైర్యముతో  పోరాటపటిమను చివరవరకు పోరాటం చేయగలిగే శక్తి.  ముప్పూటలా  మోహరిస్తే దానిపేరే భారత సైన్యం. నిప్పులు చెరిగే ఎడారులు లోను , నెత్తురును  గడ్డకట్టించే మంచు ప్రాంతాలలోను, కల్లోల సాగరాలు,  గగనతలాలు, ఎక్కడైనా, ఎప్పుడైనా, ఎలాంటి శత్రువునైనా ఎదిరించి ఓడించే దే మన దేశ సైనికదళం.భారతదేశ ప్రాదేశిక సమగ్రతనూ, సార్వభౌమాధికారాన్ని, కంటికి రెప్పలా కాపాడు తున్న సైనిక శక్తుల త్యాగాలు, విజయాలు. నిరుపమానాలు. వారిని ఎంత పొగిడినా చాలా తక్కువే అనిపిస్తోంది. జనవరి 15న ఆర్మీడే సందర్భంగా మన భారతదేశ త్రివిధ దళాలతో పాటు మనమందరం గొంతు కలుపుదాం. మన భారత జనానికి మోకరిల్లి ప్రణామం తెలుపుదాం.  మన భారతమాత మనలను చూసి గర్వపడేలా చేద్దాం. మన భారతదేశ ఉనికిని, మన సైనికదలాల పోరాటపటిమను ప్రపంచానికి చాటిచేప్పుదాం.  ఇంకెవ్వడు మనదేశము వంకచూడాలంటే భయపడేటట్టు చేద్దాం.
భారతదేశానికి స్వాతంత్య్రం లభించి పట్టుమని పదివారాలు కాకముందే 1947 అక్టోబర్‌ 27న విభజనకు గురైన పాకిస్తాన్‌ దళాలు మన దేశనికి మకుటమయిన కాశ్మీర్‌ను  కబళించడానికి దండెత్తి రాగా మన భారత దళాలు శతృవులను తరిమి తరిమికొట్టి స్వాతంత్య్ర దేశ చరిత్రలో తొలివిజయాన్ని నమోదు చేసుకొంది. ఇది స్వాతంత్ర భారతావనికి తొలివిజయం.  తరువాత  1962లో చైనా దురాక్రమణ దారులకు, 1965, 1971లో పాకిస్తాన్‌ మూకలను, 1999లో కార్గిల్‌ సైనిక చర్యలతో పాటు వివిధ ఆపరేషన్లలో శతృవులను వెనుతిరిగి చూడకుండా తరిమి వేసింది మన భారతసైన్యం. అలాగే ప్రపంచ యుద్ధాలలో సువర్ణాక్షరాలతో లిఖించబడే విధంగా బంగ్లాడేశ్‌ అవతరణ సమయంలో దాదాపు 98 వేలమంది శతృ సైనికులు భారతదేశ సైన్యం ముందు మోకరిల్లినది.  ఇది మనం గర్వపడవలసిన విషయమే కదా.  
ఎందరో మహానుబావుల త్యాగాలకు మనకు స్వాతంత్ర భారతదేశం లబించింది. మన దేశసైనికులు సరిహద్దును ప్రాణాలను అడ్డుగా పెట్టి మనదేశాన్ని కాపాడుతుంటే మనం ఏమి చేస్తున్నాము? లోపల politics  చేస్తున్నాము.  లోపలలోపల తన్నుకుంటున్నాం. అవినీతి అన్నదానికి దారి తీసి దేశబద్రతకు, దేశఖజానాకు చిల్లులు పెడుతున్నాం.  ప్రజాస్వామ్యాన్ని దేబ్బతీస్తున్నాం.  దయచేసి అందరు దేశ భవిష్యత్తును కాపాడుకుందాం.  స్వాతంత్ర భారతదేశాన్ని కాపాడుకుందాం.  అలాంటప్పుడే మనదేశ సైనికులు చేసే ప్రయత్నంనాకు అర్ధం పరమార్ధం వుంటుంది.
మంచి ఆలోచన తో నూతన సాంకేతిక పరిజ్ఞానము తో వ్యక్తిగత జీవితాలు అడ్డుగా  పెడుతూ దేశాన్ని అన్నివిధాలా కాపాడుతూ మనకు ఆపద కలిగే సమయంలో వెనువెంటనే మేమున్నాము అని ఆదుకునే బారత సైన్యానికి ప్రతి ఒక్కరూ కృతజ్ఞత కలిగివుండాలి. సైనికులను గౌరవిస్తూ నేడు దేశవ్యాప్తం భారత సైనిక దినోత్సవం జరుపుకోవాలి . 
Heads  off to  the Indian  Army .
I  wish  you  happy  Indian  Army  Day .
జై హింద్

సంక్రాంతి లక్ష్మికి స్వాగతం సుస్వాగతము

సంక్రాంతి లక్ష్మికి స్వాగతం సుస్వాగతము 
 బోగి తరువాత రోజయిన సంక్రాంతి రోజున పాలు పొంగించి, దానితో చక్కర పొంగలి తయారు చేస్తారు. దాదాపుగా అందరి ఇళ్ళలో అరిసెలు, బొబ్బట్లు, జంతికలు,చక్కినాలు, సేమియాపాయసం, పరమాన్నం, పులిహోర, గారెలు మొదలయిన వంటకాలు చేసి, కొత్తబట్టలు ధరించి ఈ పండుగను ఆస్వాదిస్తారు.ఈ రోజున పితృదేవతలకు తర్పణాలు వదులుతారు.ప్రతీ సంక్రమణానికీ పితృతర్పణాలు ఇవ్వాలి. కాని మిగిలిన పదకొండు సంక్రమణాలకు ఇవ్వక పోయినా, ఈ మకర సంక్రమణానికి మాత్రం తప్పకుండా పితృ తర్పణాలు ఇస్తారు. సంక్రాంతి రోజులలో మనము చూసే ఇంకో సుందర దృశ్యం.


రంగు రంగులు ముగ్గులతో, ముంగిట్లో గొబ్బెమ్మలు, హరినామ సంకీర్తనలు హరిలో రంగ హరీ అంటూ నడినెత్తిపై నుంచి నాసిక దాకా తిరుమణి పట్టెలతో, కంచు గజ్జెలు ఘల్లుఘల్లుమనగా చిందులు త్రొక్కుతూ, చేతుల్లో చిడతలు కొడుతూ తలపై రాగి అక్షయపాత్ర కదలకుండా హరిదాసు ప్రత్యక్షమవుతాడు. డూడూ బసవయ్య విన్యాసాలతో గంగిరెద్దులను ఆడించే గంగిరెద్దులవారు. చక్కగా అలంకరించిన గంగిరెద్దులను ఇంటింటికీ తిప్పుతూ, డోలు, సన్నాయి రాగాలకు అనుగుణంగా వాటిచేత చేయించే నృత్యాలు చూడటానికి చాలా రమణీయంగా ఉంటాయి. ఆ గంగిరెద్దులు మనము ఇచ్చే కానుకలను స్వీకరిస్తున్నట్లుగా తలలు ఊపుతూ ధన్యవాదాలు తెలుపుతున్నట్లు మోకాళ్ళ మీద వంగటం వంటి విద్యలు వాటికి నేర్పిస్తారు.,ఆకాశాన గాలిపటాలు, ఇవన్నీ సంక్రాతి మహాలక్ష్మికి, ఉత్తరాయణ పుణ్యపురుషునికి మనం స్వాగతినిస్తున్నాయి.ఈ సంక్రాంతికి మనమందరమూ స్వాగతం చెప్పుదాం.  ఈ పండుగను సంతోషముగా జరుపుకుందాము.  
  


ఈపండుగ తో ప్రారంబమయిన సుఖసంతోషాలు  జీవితాంతము ఆనందంగా గడిపాలని.  పాడిపంటలతో, సిరి సంపదలతో మనదేశము అభివృద్దిచెందుతూ సంక్రాంతి లక్ష్మి  సంతోషంగా అడుగుపెట్టాలని కోరుకుంటున్నాను.

అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు.

శుక్రవారం, జనవరి 13, 2012

బోగి పండగ శుభాకాంక్షలు

శుక్రవారం, జనవరి 13, 2012


గోదాదేవి గోపిక నాడు ఆచరించిన వ్రతమును తానూ అనుకరించి వ్రత సమాప్తి చేసి వ్రతఫలమును తానుకూడా పొందినది. శ్రీ కృష్ణ సమాగామంమును ఆనాడు గోపికలు పొందినట్లే మన గోదాదేవి తన ప్రియతముడగు శ్రీ రంగానాధుని భర్తగా పొందినది . శ్రీ రంగమునుండి రంగనాధుడు వ్రత సమాప్తి సమయమునకు తమ అంతరంగా భక్తులను ఆండాలమ్మ యుండిన శ్రీ విల్లిపుత్తురునకు పంపి ఆమెను శ్రీ రంగమునకు తోడి తెమ్మని ఆజ్ఞాపించెను .అంత భట్తనాదులు వారి శి ష్యులు వల్లభారాయులుతో సహా శ్రీ రంగమునకు ఆండాల్లమ్మను తోట్కుని వెళ్ళెను .అచట శ్రీ రంగనాధ స్వామీ అందరి సమక్షములో శ్రీ గోదాదేవిని తనలోచేర్చుకున్నారు. అందుచే గోదారంగానాయకుల కళ్యాణ దినమునకు భోగి ఆని పేరు .
భోగము = పరమాత్మ అను భావము                     అది పోందినరోజును భోగి పండుగగా సార్ధకమైనది .
మూడురోజులు పండుగ చాలా బాగాజరుపుకుంటారు. అసలైతే నెలరోజులు పండుగ వాతావరణమే వుంటుంది .  చలి ఎక్కువుగా ఉంటుంది. నెలరోజులు తెలుగువారి లోగిలి చాలా అందముగా ముస్తాబవుతుంది . ప్రతీ ఇంట రంగురంగుల ముగ్గులతో చక్కని వాతావరనముతో ముచ్చట గొల్పుతూ వుంటాయి. రంగుల ముగ్గు మద్యలో గొబ్బెమ్మలు ను అలంకరించుతారు. సాయంత్రము సమయాలలో పోలాల్లోనుమ్డి బళ్ళు ధాన్యపు బస్తాలతో నిండి వస్తాయి. చాలా ఆనందముగా సందడిగా ఉంటుంది . నెల రోజులు. నెల రోజులు, పగటి వేషగాళ్ళు, హరిదాసులు ,గంగిరేద్దులువాళ్ళు వస్తూవుంటారు .

 భోగి రోజు తెల్లవారుజాముననే లేచి నలుగు పెట్టుకొని స్నానాలుచేసి భోగి మంటను వెలిగిస్తారు . భోగి మంట లో పాత కర్ర సమానులు వంటివి పనికిరాని వన్ని వేసి చలిని పారగోలుపుతారు. పెద్ద పండగకి కొత్త అల్లుళ్ళు అత్తగారింటికి తప్పకుండా వస్తారు. బావా మరదళ్ల ఆటలు అల్లర్లుతో పండుగ చాలా సంతోషకరమైన శోభ తో ఉంటుంది. పండుగని రైతుల పండుగ అని కుడా అంటారు.




 పండుగకి ముగ్గులులో గొబ్బెమ్మలు పెడతారు వాటి చుట్టూ పిల్లలు అన్నమాచార్య రచించిన గొబ్బెమ్మల పాటలు పాడతారు.                   

కొలని దోపరికి గొబ్బిళ్ళో యదు కుల స్వామికిని గొబ్బిళ్ళో

కొండ గొడుగుగా గోవుల గాచిన కొండొక శిశువునకు గొబ్బిళ్ళో

దండగంపు దైత్యుల కెల్లను తల గుండు గండనికి గొబ్బిళ్ళో

పాప విధుల శిశుపాలుని తిట్టుల కోపగానికిని గొబ్బిళ్ళో
యేపున కంసుని యిడుమల బెట్టిన గోప బాలునికి గొబ్బిళ్ళో

దండి వైరులను తరిమిన దనుజుల గుండె దిగులునకు గొబ్బిళ్ళో
వెండిపైడి యగు వేంకట గిరిపై కొండలయ్యకును గొబ్బిళ్ళో


అనే పాటలు పాడుతూ వాటి చుట్టూ తిరుగుతారు. సాయంత్రము సమయములో చిన్నపిల్లలకు బోగిపల్లును దిస్తితీసి వారి తలమీద పోస్తారు. దీనికి పెరంటాల్లను పిలిచి బోగిపళ్ళు పోస్తారు. బోగిపల్లలోకి శనగలు , పువ్వులు , అక్షింతలు, డబ్బులు, చెరుకుగడలు, రేగుపళ్ళు వేసి పిల్లలకు దిష్టితీసి తలమీదవేసి ఆసిర్వాదిస్తారు. బొమ్మల కొలువు పెట్టి పేరంటాలకి పసుపుకుంకుమలు ఇచ్చి దీవెనలు తీసుకుంటారు.


బోగి రోజు నెలరోజులు ధనుర్మాసము వ్రతము చేసిన గోదాదేవి రంగానాధునిని వివాహము చేసుకొని స్వామీ వారిలో ఐక్యము అయిపోతుంది. అందువలన అప్పటినుండి భోగి రోజు గోదా రంగానాయకులవివాహాలు ఆలయాలలోజరుపుతారు. వివాహము చూడటానికి రెండుకళ్ళు చాలని విధముగా చేస్తారు. ఇలా భోగి పండుగ ముగుస్తుంది

My Blog Lovers

నా యూట్యూబ్ చానల్స్ ప్లీజ్ సబ్స్క్రిబ్ చేయండీ

Diabetic Challenger

DIABETIC CHALLENGER YOUTUBE CHANNEL. PLASE SUBSCRIBE MY CHANNEL...... THANK YOU VERY MUCH.

Ammamma Tho Nenu (అమ్మమ్మ తో నేను

Please subscribe our channel Ammamma Tho Nenu (అమ్మమ్మ తో నేను)