Blogger Widgets

శనివారం, మార్చి 24, 2012

వాతాపి గణపతిం భజే

శనివారం, మార్చి 24, 2012

ముత్తుస్వామి దిక్షితార్, అందరికీ తెలుసోలేదో నాకు అంతగా తెలియదు కానీ,  అందరికీ వాతాపి గణపతిం భజే అన్న కీర్తన విననివారు వుండరు.  ఈ కీర్తనను ముత్తుస్వామి దీక్షితార్ రచించారు.  ఈయన తంజావూరు, తమిళనాడు నందు మార్చి 24, 1774 న రామస్వామి దీక్షితార్, సుబ్బలక్ష్మి ఆండాళ్ అను పుణ్యదంపతుల వారాల ఫలముగా జన్మించినాడు. ముత్తుస్వామి వారి కలం పేరు గురుగుహ. ముత్తు, చిన్నతనం లోనే తన తండ్రి గారి గురువు అయిన గొప్పవారు చిదంబరనాథ యోగి దగ్గర తన విద్యాభ్యాసము ప్రారంభించారు. ఆయనలో గొప్ప అంతర్గత శక్తీ వుంది.  అదీ మానవాతీతమైనది.  ముత్తుస్వామి కోసం గురువుగారు కాశి వెళ్లి జీవితసత్యాలు భోధించారు.  యోగి ఆరు సంవత్సరాలు కోసం అతనుఅక్కడే నివసించారు.  మాస్టరింగ్సంస్కృతం, సాహిత్యం మరియు వ్యాకరణం, తత్వశాస్త్రం మరియు తంత్ర యోగ తో నేర్చుకున్నాడు.వారు ఇద్దరు అనేక ఆలయాలు సందర్శించారు. అతను దీవించిన ప్రకారము  తద్వారా బయలుదేరడానికి ముందు చివరిగా తన నిష్క్రమణ సందర్భంగా, మాస్టర్, హోలీ గంగా లో స్నానము చేసి,  రమ్మని అతనికి చెప్పాడు. దీని ప్రకారం, దిక్షితార్ గురువు చెప్పినట్టే నది లోకి వెళ్లి  కొన్ని దశలను అవరోహణ, నీటి లోకిమునిగిన తరువాత ఒ అద్భుతం జరిగింది. పదాలు 'రామ' లిఖించబడిన ఒక వీణ జలాల నుండిఅతనికి దగ్గరకు వచ్చింది. అతని సంగీత శిక్షణ అంతా తన తండ్రి రామస్వామి దీక్షితార్ వద్ద  కింద ప్రధానంగామరియు అతను కూడా బాల్యంలో అది లో అత్యంత పెద్దగా తెలీదు మారింది. అతను 'బ్రిందవని సారంగ్', 'Hamiu కళ్యాణి' (ఉత్తర యొక్క కేదర్ కు సమానమైన) వంటి రాగంలో కృతి కూర్చారు . ముత్తుస్వామి దీక్షితర్ కర్ణాటక సంగీతత్రయంలో ఒకరైన వాగ్గేయకారుడు .ముత్తుస్వామి ఉత్తరదేశపు సంగీతమైన హిందూస్తానీ కూడా నేర్చుకున్నాడు. "శ్రీనాధాధి గరుగుహోజయతి" అనే మాటలతో ప్రారంభమయ్యే తొలి కీర్తనను ఇతడు రచించి రాగం కూర్చాడు. అతను 1835 లో మరణించాడు. 
ఈక్రింద ముత్తుస్వామి రచించిన వాతాపి గణపతిం భజే, ఈ కీర్తన అమరగాయకుడు ఘంటసాల వెంకటేశ్వరరావు గారి గాత్రముతో వినండి తరించండి.

గురువారం, మార్చి 22, 2012

శ్రీ నందన నామ సంవత్సర శుభాకాంక్షాలు.

గురువారం, మార్చి 22, 2012


యుగయుగాలు మారుతూ వచ్చింది యుగాది 
ఐదు వేల నూట పదమూడవ యుగాదిగా  
కలియుగమందు వచ్చింది.
కొత్త రోజుకు కొత్త కొత్తగా వచ్చేసింది.
కొత్తదనము మనసును కొత్తకొత్తగా 
సరికొత్తగా నింపుటకు వచ్చింది.
ఖరను విడిచి నందనములోన అడుగిడుతూ 
మంచినే మనచెంతకు చేర్చుటకు వచ్​చింది. 
కోటి ఆశలుతో వున్నమనకు 
నందన మన జీవితాన్ని నందనవనం చేయుటకు 
మన ముంగిట నిలిచి వున్నది 
సంతోషంతో ఆహ్లాదముతో, ఉత్సాహంగా ఉల్లాసము​గా ,
గతాలు మరచి, ఖరలోని ఓటమిని మరచి.
నందనంలోకి ఆనందగా ప్రవేసించి 
ఈ యుగాదికి స్వాగతము పలుకుదాం
అందరమూ సంతోషముగా 
నవనందనలో జీవిద్దాం
ఆనందాన్ని అనుభవించుదాం. 

బ్లాగ్ మిత్రులందరకు, నా కుటుంబ సభ్యులకు, బంధుమిత్రులకు ఈ ఉగాది సుఖసంతోషాలను పంచాలని కోరుకుంటూ..... శ్రీ నందన నామ సంవత్సర శుభాకాంక్షాలు.

2012 ప్రపంచ జలదినము

హాయ్ ఫ్రెండ్స్. నేడు 22 వ మార్చి 2012 ప్రపంచ జలదినము గా జరుపుకుంటున్నాం.  ఈనాటి జలదినోత్సవం జలము మరియు ఆహార భద్రాత అన్న థీమ్ తో జరుపుకుంటున్నాం.  ఆరోగ్యకరమైన ప్రపంచం కొరకు నీరు శుభ్రంగా వుంచుకోవాలి. అన్న ముఖ్య ఉద్దేశముతో జలదినము జరుపుకుంటున్నాం.

మనకు నీరు చాలా విలువైనది.  నీరు మనము బ్రతకటానికి ఎంతో ఉపయోగకరమైనది.  ఇది మనకు ప్రకృతి ఇచ్చిన వరప్రసాదంగా భావించాలి అని నా అభిప్రాయం.  నిత్యావసరాలు అన్నీ నీటితోనే నిండి వుంది.  మనము దాహం వేసినప్పుడు నీరు దొరకపోతే. మన ప్రాణాలు నీటికోసము కొట్టుకు పోతాయి.  ఆ క్షణములో గ్రుక్కెడు నీళ్ళు దొరికితే మన ప్రాణాలు నిలబడినట్టు వుంటుంది.  అటువంటి నీటిని మనము చాలా జాగ్రత్తగా వాడుకోవాలి కదండి.  

అంతర్జాతీయ ప్రపంచ జల దినోత్సవం మంచినీటి యొక్క ప్రాముఖ్యతపై దృష్టి సారించవచ్చు మరియు మంచినీటి వనరులకు  స్థిరమైన నిర్వహణ కోసం ఒక ఆలోచనకోసం మార్చి 22 న ప్రతి సంవత్సరం నిర్వహింస్తున్నారు. మంచినీటి జరుపుకునేందుకు ఒక అంతర్జాతీయ రోజు ఎన్విరాన్మెంట్ అండ్ డెవలప్మెంట్ (UNCED) 1992 వ సంవత్సరములో యునైటెడ్ నేషన్స్ సమావేశం వద్ద సిఫార్సు జరిగినది. యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ మొదటి ప్రపంచ జల దినోత్సవం గా మార్చి 1993 , 22  న  కేటాయించడం ద్వారా ప్రతిస్పందించారు. ప్రతి సంవత్సరం, ప్రపంచ జల దినోత్సవం మంచినీటి ఒక ప్రత్యేకముగా హైలెట్ చేసారు. 


ఈరోజు జలదినోత్సవ సందర్భముగా మనము నీటిని వృదా చేయద్దు అన్నవుద్దేసము తో ఇవిధంగా చెప్తున్నాను.  జనరల్ గా మనము నీటిని చాలా విదాలుగా వృదాచేస్తున్నాము.  ఉదాహరణకి మనలో చాలా మంది  దినచర్యలో  వారి దంతాలు బ్రష్ చేస్తూ tap విప్పి బ్రష్ కంప్లేట్ అయ్యేవరకు వదిలేస్తాము.   షవర్ ద్వారా బాత్రూమ్ లలో  ట్యాప్ ఉచితంగా నడుస్తున్న వదిలి యొక్క అలవాటు ఉంటుంది.ఇటువంటి imprudence అనవసరముగా నీరు వ్యర్థం అవటానికి కారణమవుతుంది.  

ఆరోగ్యకరమైన ప్రపంచము కోసము పరిశుద్ధ నీరును పొదుపుగా మనము వాడుకుందాం.  దీనికోసము మనము అనావసరముగా నీటిని వృదా చేయద్దు.  మరియు పరిశుద్ధ నీటిని కలుషితము చెయ్యద్దు అని ప్రామిస్ చేద్దాం.

సోమవారం, మార్చి 19, 2012

"అప్పని వరప్రసాది అన్నమయ్య"

సోమవారం, మార్చి 19, 2012

భగవంతుని చేరటానికి అనేక పద్ధతులున్నాయి. అందులో కీర్తనా పద్దతి ఒకటి.  ఆకీర్తనా పద్దతితో భగవంతుని  లోని లీనమైనమైయ్యారు అన్నమయ్య.  నేడు అన్నమయ్య ఆ ఏడుకొండల కోనేటి రాయుడును చేరిన పుణ్య తిది.  అన్నమయ్య తన జోలపాటలతో స్వామిని నిద్రపుచ్చాడు.  అన్నమయ్య రాసిన జోలపాటలు ప్రతీ ఇండ్లలో పసిపిల్లలు ఉన్న తల్లి ఖచ్చితంగా పాడుతుంటారు.  ఇది మనం మచ్చుకు చెప్పుకున్నాం.  అన్నమయ్య రచించిన ప్రతీ పాటలోని ఆద్యత్మకత ఒకటే కాకుండా ఆయన సంకీర్తన ద్వారా లోకనీతిని, జీవన నీతిని భోదిస్తున్నాయి. అప్పట్లోనే సమాజములోని కట్లుబాట్లను, కులమత బేధాలను నిరసించాడు.  అలసిన వారికి జాజర పాటలు రచించారు. ఇలా మంచి తెలుగు పదాలు ఉపయోగించి రచనలు చేసారు.  అనంతమైన భక్తి బావంతో, పదపుష్పాలతో భగవంతుని ఆరాధించిన మహాభక్తశిఖామణి మన అన్నమయ్య "అప్పని వరప్రసాది అన్నమయ్య".

అప్పని వరప్రసాది అన్నమయ్య
అప్పసము మాకే కలడన్నమయ్య ||

అంతటికి ఏలికైన ఆదినారాయణు తన
అంతరంగాన నిలిపిన(పెను) అన్నమయ్య
సంతసాన చెలువొందే సనకసనందనాదు-
లంతటివాడు తాళ్ళాపాక అన్నమయ్య ||

బిరుదు టెక్కెములుగా పెక్కుసంకీర్తనములు
హరిమీద విన్నవించె అన్నమయ్య
విరివిగలిగినట్టి వేదముల అర్ఠమెల్ల
అరసి తెలిపినాడు అన్నమయ్య ||

అందమైన రామానుజ ఆచార్యమతమును
అందుకొని నిలచినాడు అన్నమయ్య
విందువలె మాకును శ్రీవేంకటనాఠునినిచ్చె
అందరిలో తాళ్ళపాక అన్నమయ్య ||

My Blog Lovers

నా యూట్యూబ్ చానల్స్ ప్లీజ్ సబ్స్క్రిబ్ చేయండీ

Diabetic Challenger

DIABETIC CHALLENGER YOUTUBE CHANNEL. PLASE SUBSCRIBE MY CHANNEL...... THANK YOU VERY MUCH.

Ammamma Tho Nenu (అమ్మమ్మ తో నేను

Please subscribe our channel Ammamma Tho Nenu (అమ్మమ్మ తో నేను)