Blogger Widgets

శుక్రవారం, మే 10, 2024

అక్షయ తృతీయ

శుక్రవారం, మే 10, 2024














 ఈ రోజు హిందువులకు మరియు జైనులకు ప్రత్యకమైన రోజు,  అదే అక్షయ తృతీయ .  వైశాఖ శుద్ధ తదియనే అక్షయ తృతీయ గా పిలుస్తారు. సంస్కృతం లో ' అక్షయ ' అనగా క్షయం కానిది , తరిగి పోనిది అని అర్థం. హిందూ పంచాంగం ప్రకారం అక్షయ తృతీయ రోజంతా అత్యంత శుభ కరమైన ముహూర్త కాలంగా భావిస్తారు. అక్షయ తృతీయ నాడు బంగారం కొంటే సంపద అక్షయమవుతుందని భారతీయుల నమ్మకము.  ఈ రోజు నాడే రైతులు విత్తనాలుకు పూజ చేసి నాటుతారు.  ఎందుకంటే విత్తులు మంచిగా వ్యవసాయం వృద్ది చెందుతుంది.  ఇంకా "అక్షయ తృతీయ" నాడే మహావిష్ణువు ఆరో అవతారమైన పరుశురాముడు జన్మించాడని పురాణాలు చెబుతున్నారు. భగీరధుడు తపస్సు ఫలితంగా గంగానది భూమి తరలి వచ్చిన రోజు. యజ్ఞ యాగాదులు చేయటానికి మంచి కాలం. శ్రీ కృష్ణులవారి బాల్య స్నేహితుడు కటిక దరిద్రుడైన సుదాముడు కృష్ణుని దగ్గరకు వెళ్లి అటుకులు సమర్పించి అత్యంత దనవంతుడైనాడు. ధర్మరాజు సూర్యనారాయణ మూర్తి నుండి అక్షయ పాత్రను పొందినాడు. వ్యాసుడు మహాభారతాన్ని చెప్తున్నప్పుడు విఘ్ననాయకుడు అయిన గణపతి భారతాన్ని రాయటం మొదలు పెట్టినరోజు.  శంకరాచార్యులు వారు కనకదరా స్తోత్రాన్ని పాడితే కనకం వర్షంలాగ పడిన రోజు. దుర్యోధనుడు, దుశ్శాసనుడు నిండు సభలో ద్రౌపది కి వస్త్రాపహరణ చేసి అవమానించదలిచారు , అప్పుడు  ఆమెకి శ్రీ కృష్ణులు వస్త్రాలు ఇచ్చి ద్రౌపదిని కాపాడిన రోజు.  అక్షయ తృతీయ నాడు శ్రీ నరసింహస్వామి ప్రహ్లాదుడిని అనుగ్రహించిన రోజేనని పురాణాలు చెబుతున్నాయి.  కుబేరుడు, దేవతల కోశాధికారి, ధనానికి దేవత అనీ. లక్ష్మీ దేవి మరియు కుబేరుడు అక్షయ్ తృతీయ నాడు పూజిస్తే, సంపద కలగ చేస్తుంది.  అంతే కాదు ఈరోజు నాడే  అన్నపూర్ణాదేవి జన్మించినది.  ఈరోజు కి ఇన్ని విశేషాలు వున్నాయి కాబట్టే అందుకే ఈ పర్వదినాన పుష్పమో, ఫలమో భగవంతుడికి సమర్పించినా, దైవనామస్మరణ చేసినా, చివరికి నమస్కారం చేసిన సంపద, పుణ్యఫలం ప్రాప్తిస్తుందని ప్రతీతి.   ఈ క్రమంలో అక్షయ తృతీయ నాడు బంగారం కొనడంతో పాటు అనేక శుభకార్యాలను చేపట్టవచ్చును. ఇందులో పిల్లలను పాఠశాలలో చేర్చడం, పుస్తకావిష్కరణ, పుణ్యస్థలాలను సందర్శించడం వంటి మంచి కార్యాలను చేయవచ్చునని పురోహితులు సూచిస్తున్నారు. 

ఆదివారం, ఏప్రిల్ 21, 2024

కలియుగంలో కోరికలు తీర్చేదేముడయ్యా ఈ హనుమయ్య .........హనుమాన్ చాలీసా ఎలా పుట్టింది?

ఆదివారం, ఏప్రిల్ 21, 2024

 




హనుమాన్ చాలీసా పుట్టుక గురించి చాలా ఆసక్తికరమైన చరిత్ర ఉంది. ఇది 16వ శతాబ్దంలో మహాకవి తులసీదాసు చేత రచించబడింది. తులసీదాసు రామభక్తికి ప్రసిద్ధి చెందిన కవి-సన్యాసి మరియు రామచరితమానస అనే ఇతిహాసం రచయిత. హనుమాన్ చాలీసాలో నలభై శ్లోకాలు ఉంటాయి, అందుకే దీనిని ‘చాలీసా’ అని అంటారు, ఇందులో ‘చాలీస్’ అనే పదం నుండి వచ్చింది, దీని అర్థం హిందీ భాషలో ‘నలభై’.

హనుమాన్ చాలీసా వెనుక కథ?

వారణాసి లో ఒక సదాచార సంపన్నుడు తన ఏకైక కుమారుడు కి ఒక అమ్మాయి ని ఇచ్చి వివాహం చేస్తాడు.వారిద్దరూ చిక్కగా జీవనం సాగిపోతుండగా విధి ప్రభావంగా ఆ వక్తి మరణించాడు.దానిని చూసి అతని భార్య తట్టుకోలేకపోయింది ఎంతో బాధపడింది.తన భర్త శవ యాత్రకు అడ్డు పడింది.అది చూసి చుట్టూ పక్కల వాళ్ళు తనని పట్టుకున్నారు యాత్ర సాగుతుంది.ఈ యాత్ర తులసి దాస్ ఆశ్రమం మీదుగా జరుగుతుంది.ఆ అమ్మాయి అందరిని విడుచుకుని వెళ్లి తులసి దాస్ కాళ్ళ మీద పడుతుంది ఎంతో విలపిస్తోంది.ధ్యన్యమ్ లో నిమగ్యమై ఉన్న తులసీదాస్ 'దీర్ఘసుమంగళీభవ' అన్ని దీవించాడు దానితో ఆమె దీనంగా జరిగింది అంత తులసీదాస్ కు వివరించింది.అది విన్న తులసి దాస్ తల్లి నా నోట రాముడు ఎప్పుడు  అసత్యం పలికించాడు అని శవయాత్ర దక్కరకు వెళ్లి శవానికి కట్లు విప్పి రామనామాన్ని జపించి తన కమండలం లో నీళ్లను శవం మీద జల్లుతాడు వెంటనే ఆ యువకుడు పునర్జీవితుడు అయ్యాడు.ఆ మహాత్యమును చుసిన జనులు అందరు రామ భక్తులు అయ్యారు.అది చూసి మరియు చెప్పుడు మాటలు విన్న అక్బర్ తులసి దాస్ ను పిలిపించి అదే రామ నమ మహిమ తో సభ అందరి ముందు ఒక శవాన్ని తెప్పించి బ్రతికించమని చెప్పాడు.జనన మరణాలు నా చేతిలో ఉండవు అని శవాన్ని బ్రతికించలేను అని రాజు చెప్పిన దానిని దిక్కరించాడు తులసి దాస్ అందుకు రాజు జైలు లో పెట్టించి చిత్రహింసలు పెట్టారు 

మహా రామ భక్తుడు అయినా తులసి దాస్ ను అలా హింసలు పెడుతుంటే రామ భక్తుడు అయినా హనుమాన్ తన వానర సైనం తో అక్బర్ మహల్ పై దాడి చేసారు.వందల సంఖ్యలో వానరులని చూసి రాజ్యం లోని వారు అందరు హడిలిపోయారు.కారాగారం లో ఉన్న తులసి దాస్ ను విడిపించకపోతే విధ్వంసం తప్పుడు అని చెప్పారు అక్కడి పండితులు అక్బర్ కి.వెంటనే తులసి దాస్ ను విడిపించారు.తనని కాపాడానికి మహా బాల శాలి అయినా హనుమంతుడు వచ్చాడని గ్రహించాడు తులసీదాస్.అప్పుడు హనుమంతుడు మహాకాయుడు అయ్యి దర్శనం ఇచ్చాడు.

హనుమంతుడిని చుసిన ఆనందం లో తులసీదాస్ నలభై దోహాలు ఆశువుగా స్వామిని స్తుతించాడు .తులసీదాస్ చేసిన స్తోత్రం కి హనుమంతుడు ప్రసన్నం అయ్యి ఈ స్తోత్రం చదివిన వారికీ తాను రక్షగా ఉంటాను అన్ని చెప్పాడు. 

హనుమాన్ చాలీసాలో సూర్యుడు మరియు భూమి దూరం వెల్లడి చేయబడింది

హనుమాన్ చాలీసా వాస్తవంగా సూర్యుడు మరియు భూమి మధ్యలో ఉన్న దూరంను సమర్థంగా చెప్పుతుంది. కానీ అసలు శాస్త్రిక సూత్రం వేరే. వేగం (S) = దూరం (D) ÷ సమయం (T) అనే సామాన్య శాస్త్రిక సూత్రం ఉంది. రికార్డ్ల ప్రకార, 1672లో జాన్ రిచర్ మరియు జోవాన్నికో కాసిని భూమి మరియు సూర్యుడు ఉన్న దూరంను భూమి వ్యాసాల ప్రమాణంగా 22,000 

పన్నెండు వేల దివ్య మైళ్ల దూరంలో ఉన్న సూర్యుడు, మీరు దానిని (సూర్యుడిని) మింగడానికి ప్రయత్నించారు, ఇది ఒక తీపి ఫలంగా భావించి, ఇక్కడ, యుగం అంటే నాలుగు యుగాల (1 పూర్తి మహాయుగం) దైవిక సంవత్సరాలలో ఏకం అవుతుంది. .

సత్యయుగం = 4800 దివ్య సంవత్సరాలు

త్రేతాయుగం = 3600 దివ్య సంవత్సరాలు

ద్వాపరయుగం = 2400 దివ్య సంవత్సరాలు

కలియుగం = 1200 దివ్య సంవత్సరాలు

కాబట్టి, 1 దివ్య యుగం అంటే 12,000 దివ్య సంవత్సరాలు.

సంస్కృతంలో,  సహస్ర  అంటే 1000 మరియు 1  యోజన  అంటే దాదాపు 8 మైళ్లకు సమానం.

కాబట్టి, 12,000 x 1000 x 8 = 96,000,000 మైళ్లు.

శాస్త్రవేత్తల ఇటీవలి లెక్కల ప్రకారం సూర్యుడు మరియు భూమి మధ్య దూరం 92,960,000 మైళ్లు.

భూమి సూర్యుని చుట్టూ ఎలిప్టికల్ కక్ష్యలో తిరుగుతుంది కాబట్టి, ఈ దూరం రుతువులను బట్టి మారుతుంది. ఉత్తర అర్ధగోళంలో వేసవిలో, శీతాకాలంలో కంటే భూమి సూర్యుడికి దగ్గరగా ఉంటుంది.

హనుమాన్ చాలీసా లేదా ఏదైనా మహామంత్ర జపం అనేది ఉత్పాదక మనస్తత్వానికి సానుకూల ధృవీకరణ. మనందరికీ తెలిసినట్లుగా, వాంఛనీయ ఫలితాన్ని సాధించడానికి సానుకూల మనస్తత్వాన్ని సృష్టించేందుకు ధృవీకరణలు సహాయపడతాయి. 

కలియుగంలో  కోరికలు  తీర్చేదేముడయ్యా  ఈ  హనుమయ్య .....ఈ హనుమాన్ జయంతికి అందరు తప్పకుండ పదకొండు సార్లు కనీసం హనుమాన్ చాలీసా పాటించడానికి ప్రయత్నిచండి .అన్ని రకాల బాధలు,ఆరోగ్య సమస్యలు అన్ని తొలిగిపోతాయి 



బుధవారం, ఏప్రిల్ 03, 2024

పియర్ జాన్సన్ @ హీలియం (chemistry helium gas)

బుధవారం, ఏప్రిల్ 03, 2024

1868లో పియర్ జాన్సన్ అనే ఫ్రెంచి ఖగోళ శాస్త్రజ్ఞుడు ఒక సూర్య గ్రహణం పరిశోధన సమయంలో ఒక క్రొత్త పసుపు రంగు స్పెక్ట్రల్ లైన్ కనుగొన్నాడు. ఇది హీలియం మూలకం సూచించే స్పెక్ట్రల్ లైను. నార్మన్ లాక్యర్ అనే మరో శాస్త్రవేత్త ఇదే గ్రహణాన్ని పరిశీలిస్తూ "హీలియం" అనే క్రొత్త మూలకం పేరు ప్రతిపాదించాడు. వీరిద్దరూ హీలియంను కనుగొన్నవారిగా గుర్తింపు పొందారు.
హీలియం (Helium) ( సంకేతం He) , ఒక రంగు, రుచి, వాసన లేని, హానికరం గాని (non-toxic), తటస్థమైన  ఒకే అణువు కలిగిన (monatomic రసాయనమూలకము. ఇది ఆవర్తన పట్టికలో ఉత్కృష్ట వాయువుల జాబితాలో ప్రధమంగా వస్తుంది. దీని పరమాణు సంఖ్య 2. దీని మరిగే ఉష్ణోగ్రత మరియు ద్రవీకరణ ఉష్ణోగ్రతఅన్ని మూలకాలలో అతి తక్కువ. ఇది దాదాపు అన్ని పరిస్థితులలోను వాయువుగానేఉంటుంది.
1903లో అమెరికా సహజ వాయువు నిల్వలలో పెద్ద మోతాదులో హీలియం కూడా ఉన్నట్లు గుర్తించారు. హీలియంను అధికంగా క్రయోజెనిక్స్ (cryogenics) సాంకేతికతలోను, సముద్రపు లోతులలో శ్వాసపీల్చడానికి వినియోగించే పరికరాలలోను (deep-sea breathing systems), అతివాహక అయస్కాంతాలను కూలింగ్ చేయడానికి, హీలియం డేటింగ్ ప్రక్రియలోను, బెలూన్లను ఉబ్బించడానికి, ఎయిర్ షిప్ (airships)లను తేలికగా చేయడానికి వాడుతారు. ఇంకా అనేక పారిశ్రామిక వినియోగాలున్నాయి. ఉదా: arc welding సిలికాన్ వేఫర్స్(silicon wafers) తయారీ వంటివి.  కొద్ది మోతాదులో హీలియం నాయువును పీల్చినట్లయితే మనిషి మాటలోని గరుకుదనంలో (timbre and quality) కొంత తాత్కాలికమైన మార్పు వస్తుంది.క్వాంటమ్ మెకానిక్స్ అధ్యయనం చేసే శాస్త్రవేత్తలకు హీలియం ద్రవరూపపు (liquid helium-4's two fluid phases, helium I and helium II) లక్షణాలు చాలా ఉపయోగకరమైనవి. ముఖ్యంగా super fluidity అధ్యయనంలోను, absolute zero వద్ద పదార్ధపు లక్షణాలను అధ్యయనం చేసే అతివాహకత (superconductivity) పరిశోధనలలోను.

అన్ని మూలకాలలోను హీలియం రెండ అతి తేలికైన మూలకం. మరియు విశ్వంలోఅత్యధికంగా లభించే రెండవ పదార్ధం. నిశ్వంలో హీలియం అధికంగా మహా విస్ఫోటనం(Big Bang) సమయంలో ఏర్పడింది. అంతే గాకుండా నక్షత్రాలలో హైడ్రోజెన్మూలకం న్యూక్లియర్ ఫ్యూషన్ (en:nuclear fusion) కారణంగా హీలియంగా మారుతుంటుంది. భూమిమీద మాత్రం హీలియం పరిమాణం చాలా తక్కువ. భూమి మీది హీలియం కొన్ని మూలకాల రేడియో యాక్టివ్ డికే (radioactive decay) కారణంగా తయారౌతున్నది. ఇలా తయారైన హీలియం సహజ వాయువులో కలిసి ఉంటుంది. దానిని ఫ్రాక్షనల్ డిస్టిలేషన్ (fractional distillation) ప్రక్రియ ద్వారా వేరు చేస్తారు..
పేరుసంకేతముపరమాణు సంఖ్య : హీలియం, He, 2
ఎలక్ట్రాన్ విన్యాసం : 1s2
ప్రామాణిక పరమాణు భారం :4.002602(2) g·mol−1
రసాయన సిరీస్ : జడ వాయువులు
గ్రూపుపీరియడ్బ్లాక్ : 181s

గురువారం, ఫిబ్రవరి 15, 2024

అర్గ్యమిస్తే అష్టైశ్వర్యాలు ప్రసాదించే ఆదిదేవుడు సూర్యనారాయణ మూర్తి

గురువారం, ఫిబ్రవరి 15, 2024

 నమస్కారిస్తే ఆయురారోగ్యాలుఅర్గ్యమిస్తే అష్టైశ్వర్యాలు ప్రసాదించే ప్రత్యక్ష భగవానుడు సూర్యడు.  


ఆదిదేవ ! నమస్తుభ్యం – ప్రసీద మమ భాస్కర |

దివాకర ! నమస్తుభ్యం – ప్రభాకర నమోస్తుతే

2. సప్తాశ్వరథ మారూఢం – ప్రచండం కశ్యపాత్మజం |

శ్వేతపద్మధరం దేవం – తం సూర్యం ప్రణమామ్యహమ్‌

3. లోహితం రథమారూఢం – సర్వలోకపితామహం |

మహాపాపహరం దేవం – తం సూర్యం ప్రణమామ్యహమ్‌.

4. త్రైగుణ్యం చ మహాశూరం – బ్రహ్మ విష్ణుమహేశ్వరమ్‌ |

మహాపాపహరం దేవం – తం సూర్యం ప్రణమామ్యహమ్‌

5. బృంహితం తేజసాంపుంజం – వాయు రాకాశ మేవ చ |

ప్రియంచ సర్వలోకానాం – తం సూర్యం ప్రణమామ్యహమ్‌.

6. బంధూకపుష్పసంకాశం – హారకుండభూషితం |

ఏకచక్ర దరం దేవం – తం సూర్యం ప్రణమామ్యహమ్‌.

7. తం సూర్యం లోకకర్తారం – మహాతేజ: ప్రదీపనమ్‌|

మహాపాపహరం దేవం- తం సూర్యం ప్రణమామ్యహమ్‌.

8. తం సూర్యం జగతాం నాథం – జ్ఞానప్రకాశ్యమోక్షదమ్‌ |

మహాపాపహారం దేవం – తం సూర్యం ప్రణ మామ్యహమ్‌.

9. సూర్యాష్టకం పఠేన్నిత్యం – గ్రహపీడా ప్రణాశనం |

అపుత్రో లభతే పుత్రం – దరిద్రో ధనవా న్భవేత్‌ |

10. ఆమిషం మధుపానం చ య: కరోతి రవేర్ధినే|

సప్త జన్మ భవేద్రోగి – జన్మ జన్మ దరిద్రతా |

స్త్రీ తైలమధుమాంసాని – యే త్యజంతిరవేర్దినే |

న వ్యాధి: శోకదారిద్య్రం – సూర్యలోకనం చ గచ్ఛతి.

ఆదిదేవ ! నమస్తుభ్యం – ప్రసీద మమ భాస్కర |

దివాకర ! నమస్తుభ్యం – ప్రభాకర నమోస్తుతే

ఓ ఆది దేవా ! నీకు నమస్కారము. భాస్కరా! నన్ను కరుణించు  . ప్రభాకరా నీకు ప్రణామములు అంటు సూర్యునికి ప్రతినిత్యము నమస్కారములు చేస్తే ఆయురారోగ్యాలు, అర్ఘ్యమిసే చాలు అష్టైశ్వర్యాలు ప్రసాదించే ప్రత్యక్షభగావానుడు సూర్యుడు.

మాఘమాసములో వచ్చే శుద్ధ సప్తమి తిధి కి రధసప్తమి అను పేరు. ఇది సూర్యునికి సంబందించిన రోజు . ఇది ముఖ్యముగా సూర్యభగవానుని ఆరాధించు పండుగ. ఈ రోజు సూర్యడు తన రధమును ఉత్తరం దిక్కునకు మళ్ళించే రోజు.
ఈ పర్వదినము రోజు కుటుంబములోని వారందరూ తెల్లవారుజామున నిద్రలేచి, కాలకృత్యాలు తీర్చుకొని జిల్లేడు ఆకుల్ని భుజాలమీద , తలమీద పెట్టుకొని

"జనని త్వంహి లోకానాం సప్తమీ సప్తసప్తికే, సప్తమ్యా హ్యదితే దేవి నమస్తే సుర్యమాతృకే "
అనే మంత్రముతో స్నానము చేయాలి, సూర్యునికి అర్ఘ్యమివ్వాలి. సూర్యుడికి  అర్గ్యమిస్తే అష్టైశ్వర్యాలు ఇస్తాడు . 
జిల్లేడు పత్రమునే అర్కపత్రమంటారు. ఈ పత్రము సూర్యునికి ఇష్టము.
తులసి కోటని పసుపు, కుంకుమ లతో అలంకరించి, తులసికోట ముందు ముగ్గులు పెట్టాలి. సూర్యబింబం, ఏడు గుర్రాలు, ఏకచక్రము తో బొమ్మ ముగ్గు పెట్టాలి . ముగ్గుమీద ఆవు పిడకలతో కుంపటి ఏర్పరచి దానిమీద గిన్నెలో అన్నం పాయసము వండాలి. కొత్త గిన్నెకి పసుపురాసి, కుంకుమ బొట్టు పెట్టి, ఆవుపాలను మూడుసార్లు పొంగించి , కొత్త బియ్యము, పటికబెల్లము, యాలకులపొడి చేర్చి , నెయ్యి వేసి చక్కగా వుడికించి పాయసముచేయ్యాలి.
పాలు మూడు సార్లు పొంగటమువల్ల ఇంట్లో సిరిసంపదలు పోంగిపోర్లుతాయని నమ్మకము వుంది.
చిక్కుడు కాయలకి చీపురుపుల్లలు గుచ్చి చేసిన రధమును ముగ్గులో పెట్టి, పదిహేను చిక్కుడు ఆకులు పరచి అందులో ఉడికించిన పాయసమును వడ్డించాలి. వాటిలో అగ్నిహోత్రునికి ఐదు ఆకులు అర్పించాలి. తులసి అమ్మవారికి ఐదు , మిగతా ఐదు సుర్యభాగావానునికి నివేదించాలి. సూర్యునికి గంధ , పుష్ప, అక్షతల, షోడపోచార అష్టోత్తర శతనామాలతో పూజించాలి. ఆయనికి ప్రదక్షణాలు చేసి నమస్కారము చేస్తే ఎంతో పుణ్యము వస్తుంది.
సాయమ్త్రము సూర్యుని గుడికి వెళ్లి నమస్కరించాలి.
రధ సప్తమి రోజునుండి వేసవి కాలము ప్రారంబమవుతుంది . అందుకే రధసప్తమిరోజు తప్పకుండా సూర్య నమస్కారములు చేయాలి. మనకు ప్రతినిత్యము ప్రత్యక్షముగా కనిపించే దైవం సూర్యభగవానుడు. ప్రపంచములో అన్ని జీవరాసులకు వేడి, వెచ్చదనము, పాడిపంటలను, వెలుగును ఇచ్చేవాడు భాస్కరుడు. సుర్యారాధన మనకు వేద కాలమునుండి ఉంది. సూర్యుని పేరు సప్తిమ. ఏడు గుర్రాలను, పంచిన రధము కలిగినవాడు. సప్తలోకములకు తన శక్తిని ప్రసాదించువాడు సూర్య కిరణాలు ఏ డురంగులకు నిదర్శనమని, రధసప్తమినాడు ఆకాసములో గ్రహ నక్షిత్ర సన్నివేసం రధమును పోలి ఉంటుంది కనుకనే ఈ తిధిని రధసప్తమి అని పేరు వచ్చింది.
అనంతసక్తితో కూడుకొన్న కిరణాలు, తేజస్సు, శుద్ధమైన వాడు , భక్తులకు అభయము ఇచ్చేవాడు. జగతికి వెలుగుకారకుడు, జ్యోతిర్మయుడు, శుభానిచ్చే ఆదిత్యుడు, చీకటి పారద్రోలేవాడు, భక్తుల కోరికలు తీర్చేవాడు ఆదిత్యుడు , మార్తాండుడు,శుభంకరుడు, భాస్కరుడు అయిన సూర్యనారాయణమూర్తికి నమస్కారములు అంటూ ధ్యానించాలి.
సుర్యుడు ఆరోగ్య ప్రదాత. అది సైన్స్ ద్వారా కూడానిరూపించబడినది. సూర్య కిరణాలలో డి విటమిన్ కలదు.
అన్నట్టు రధసప్తమి రొజు స్త్రీలు ఎన్నో నోములు చెయటానికి ప్రారంబధినముగా చెయుదురు. అక్షింతలు వేసుకొని నోములకు నాంది పలుకుదురు.

శనివారం, ఫిబ్రవరి 03, 2024

నేను ఏమీ చేయలేను అనుకునేవారికి భగవద్గీత నుండి సమాధానం

శనివారం, ఫిబ్రవరి 03, 2024

 మనం జీవితంలో ఎన్నో అనుకుంటూ వుంటాం.  కొన్ని పనులు అనుకోగానే అవుతాయి కొన్ని పనులైతే ఎన్నిసార్లు చేపట్టినా అవ్వదు.  అలాంటప్పుడు మనకి నిరాశా నిస్పృహ వస్తాయి.  కొంతమంది అయితే డిప్రషన్లోకి వెళ్ళిపోతారు.  అంతలా చేస్తాయి  నిరాశా నిస్పృహ .   మనం వింటు వుంటాం ప్రతీ సమస్యకి ఒక పరిష్కారం వుంటుంది అని.  మనం ప్రయత్నిస్తూ వుండాలి అంతే. 

కృష్ణుడు భగవద్గీతను అర్జునికి ఒకనికే చెప్పలేదు.  మనకోసం చెప్పివుంటాడేమో .  ఇప్పుడు అందరు ఏదన్న సమస్య వస్తే మానసిక వైద్యునిదగ్గరికి వెల్తూన్నారు. వాళ్లు కౌన్సిలింగ్స్ ఇస్తారు.  అలాగే యుద్దభూమిలో అర్జునుడు తనవారిని చూసి యుద్దం చేయను, చేయలేను అంటూ అర్జుని విషాధం దానితరువాత శ్రీ కృష్ణులువారు భగవద్గీత చెప్పారు.  అయితే మనజీవితంలో అన్వయించుకుంటే    ప్రతీ సమస్యకి భగవత్గీతలో సమాధానం దొరుకుతుంది.  చూసే దృక్కోణం బట్టి సమాధానం వుంటుంది. 

ఈరోజు ఒకసమస్యని చూసి గీతలో కృష్ణుడు ఏమి చెప్పారో చూద్దాంరండి. 

సమస్య ఏమిటంటే :  

ఒకపని తలపెట్టాను. ఆపని ఎన్నిసార్లు చేసినా పూర్తీ అవ్వటంలేదు.. ఏ పని చేసినా మంచి ఫలితాలు రావటంలేదు. కష్టం వృధా అవుతొంది తప్పా మంచి ఫలితం రావటంలేదు.  మనస్సులో ధైర్యంలేదు. నేను ఏమి చేసినా ఇంతే .  ఎప్పుడు ఫెయిల్ అవుతూనే ఉంటుంది . ఏమి చేయాలన్నా భయం నేను చేయగలనా లేదా. ఒకవేళ చేస్తే పర్ఫెక్ట్ అవుతుందో లేదో .  మనసునిండా tension .  మనసు కృంగిపోతుంది.  

ఈ సమస్య సర్వసాధారణంగా మనలో చాలామంది అంటూ ఉంటారు. మనం వింటూనే వున్నాం కదా మరి ఈ సమస్యకి గీత ఏమి చెప్తోందో చుద్దాం.  

నేను ఏమీ చేయలేను అనుకునేవారికి భగవద్గీత నుండి సమాధానం. 


 గీతలో సాంఖ్య యోగము, భగవద్గీతలో రెండవ అధ్యాయంలో మూడవ శ్లోకం చూడండి. 

||శ్లోకము 2-3||

క్లైబ్యం మాస్మగమః పార్థ నైతత్త్వయ్యుపపద్యతే |
క్షుద్రం హృదయ దౌర్బల్యం త్వక్యోత్తిష్ట పరన్తప ||3||

చూడండి. దీని అర్ధం ఏమిటంటే 

“  పార్థా ! పిరికితనాన్ని తెచ్చుకోవద్దు ; అది నీకు ఎంత మాత్రమూ తగదు ; తుచ్ఛమైన హృదయదౌర్బల్యాన్ని విడిచిపెట్టి యుద్ధానికి సంసిద్ధుడవు కా ! ”

హృదయ దౌర్భల్యం, పిరికితనం, అధైర్యం వంటివి మన మనసున చేరిన బుద్ది నశిస్తుంది. విచక్షణ జ్ఞానము ఉండదు. 

అందువల్లే ఎంతో గొప్ప సాటిలేని వీరుడు అయిన అర్జునుడు కూడా తనలోని అంతఃశత్రువులైన హృదయ దౌర్బల్యానికి పిరికితనానికి లోనై యుద్ధం చేయకూడదు అనుకున్నాడు. ఒకానొక బుద్ధిశాలి ఎప్పుడూ వర్తమాన పరిస్థితుల వైపు కాక,అంతిమలక్ష్యం వైపు దృష్టిపెట్టాలి.  విజ్ఞతయే ధర్మయుద్ధానికి మూలం . ధర్మయుద్ధమే అంతిమ విజయానికి మార్గం.జీవన సమరంలో వెనుకడుగు వేసే ప్రతి సందర్భంలోనూ మన అడుగులు ముందుకు వేస్తూంటేగమ్యం చేరువ అవుతూ ఉంటుందిచివరికి లక్ష్యాన్ని చేరుతాం . 

పరిష్కారం : ఎప్పుడు నిరుత్సాహ పడకూడదు. నీశక్తి నీలోనే ఉంది . అది నువ్వు గ్రహించాలి. నువ్వు ఇప్పటికే చాలా విజయాలు సాధించావు అలాంటి నువ్వా ఇలా క్రుంగిపోతున్నావా ? లే  దైర్యం తెచ్చుకో .  నీచమైన పిరికితనం వదిలిపెట్టు . ఉత్సాహంతో దైవంమీద భారం వేసి పని మొదలు పెట్టు. తప్పకుండా విజయం సాధిస్తావు. 

ఇదండీ భగవద్గీతలో మన సమస్యకి సాంఖ్యా శాస్త్రంలో సమాధానం దొరికింది.  మీకు నచ్చి ఉంటుందని ఆశిస్తున్నాను. ధన్యవాదములు. 

My Blog Lovers

నా యూట్యూబ్ చానల్స్ ప్లీజ్ సబ్స్క్రిబ్ చేయండీ

Diabetic Challenger

DIABETIC CHALLENGER YOUTUBE CHANNEL. PLASE SUBSCRIBE MY CHANNEL...... THANK YOU VERY MUCH.

Ammamma Tho Nenu (అమ్మమ్మ తో నేను

Please subscribe our channel Ammamma Tho Nenu (అమ్మమ్మ తో నేను)