హాయ్ బాగున్నారా! నేనొక కధ చెపుతాను వింటారా . జాగ్రత్తగా వినాలి మరి ఒకే నా ..........
సరే మరి వినండి. అనగనగా ................. అనగనగా...........అనగనగా................
అనగనగా............ జలజలా పారే ఏరు. ఏటి ఒడ్డున ఒక చెట్టు .చెట్టు పై ఒక గూడు . గూడులో ఒక పిట్ట
. పిట్టకి మూడు చిన్న చిన్న పిట్టలు కలవు . అమ్మా , పిల్లలు చాలా సంతోషముగా వుండేవి .
అవి ఆడుకొంటూ, పాడుకొంటూ సరదాగా వుండేవి. .
ఒకనాడు పిట్ట తన పిల్లలకు మేత కోసము వెళ్లి తిరిగి వచ్చు సమయమునకు తన పిల్లలు లో ఒక పిల్ల
గూటి నుండి తల బయటికి పెట్టి బయటి ప్రపంచం చూచుచున్నది .
అంతలో అమ్మ వచ్చి ఆ పిల్లల్నికోపగించుకోని అలా ఇంకెప్పుడు చూడవద్దని చెప్పింది . పొరపాటున క్రిందపడిపోవచ్చు . లేక మన శత్రువులు వచ్చి ఎత్తుకొని వెళ్ళగలరు. మీరు పెద్ద అయిన తరువాత నాలాగే బయటికి వెళ్ళవచ్చు,అని ముద్దు గా మందలించింది అమ్మ .
మరునాడు ఉదయము పిట్ట మేతకు వెళ్ళింది అమ్మ మాట లెక్క చేయక ఆ పిల్ల మరలా బయటికి చూచింది గూటిలో నుండి బయటికి వింతలను . చూచుచున్నది .ఆ సమయమున గూటి అంచు వరకు వచ్చి పట్టు తప్పి కాలుజారి నదిలో పది కొట్టుకు పోయినది.
ఈ కధలో నీతి పెద్దల మాట విననిచో ఆపదలు తప్పవు. అందుకే అలా ఈ కధలో అమ్మ మాట వినకుండా వుండటం వల్ల పిల్ల పడిపోయింది . అమ్మ మాట విని వుంటే ఆ పిట్ట కి బాగుండేది వినలేదు. ఆపదలో పడింది.
ఇది మాతాత చెప్పిన కధ. బాగుంది కాదా.
మరి నేను ఉంటా
గురువారం, జనవరి 29, 2009
సోమవారం, జనవరి 26, 2009
సూర్య గ్రహణము - అమృత దర్బ
ఈ రోజు సూర్య గ్రహణము ట మా అమ్మమ్మ సూర్య గ్రహణమని ఇంట్లో ఉండే ఊరగాయలలొ దర్బ అనే పత్రము వేసింది. ఎందుకు అంటే. ................. సూర్య గ్రహణము రోజు కొన్ని హాని కలిగించే కిరణాలు ప్రవేసిస్తాయని. ఈ దర్బ ఆ చెడు రాకుండా చేస్తుందని చెప్పింది. ఆ దర్బకి అంత పవర్ ఎలా వచ్చింది అని అడిగితె పెద్ద కాదే చెప్పింది .కశ్యపుని కద చెప్పింది . కస్యపునికి ఇద్దరు బార్యలు వారికి వారి పేర్లు వినత ,కద్రువ వారికి పిల్లలు లేరు అందుకు కశ్యపుడు పుత్ర కామేష్టి యాగము యాగుచేసి. వారివారి కోరికలు ప్రకారమూ ................ కద్రువకు వెయ్యి మంది సర్పాలుగా ముందుగా పుట్టారు. వినత తొందరతో ఆమె బిడ్డలు పెరుగుతున్న అందాలలో ఒకదానిని పగులగోట్టినది. అందుకు గాను అనురువుడు తొడలు లేకుండా పుడతాడు. అతను వినత తొందర కు తన సవతికి దాసివి కా అని శపించాదుట . రెండో అండమునుండి పుట్టినవాడు శాపవిమోచానము కలిగించునని చెప్పినాడు. వినత రెండవ పుత్రుడే గరుత్మంతుడు.
కద్రువకు దుర్భుద్ధి పుట్టి వినతను దాసిగా చేసుకోవాలన్న ఆలోచనతో కద్రువ వినతి ఒక పందెములో ఎవరు ఓడి పొతే వారు గెలిచినవారికి దాసీ గా వుండాలని అనుకున్నారు. అయితే క్షీర సాగర మదనములో లభించిన గుర్రము పరుగు పెడుతోంది. అది తెల్లగా వున్నా తోక నల్లగా వుందని కద్రువ ,కాదు తెల్లగావున్నదని వినత పందెము కాచుకున్నారు.
అయితే కద్రువ తనపిల్లలతో గుర్రము తోక చుట్టుకొని నల్లగా మార్చమని చెప్పినది. వారు అలాచేయ్యమనగానే మీరు సర్పయాగాములో పది మరణిస్తారని శపించినది. అది విన్న కర్కోటకుడు మాత్రము గుర్రముతోకకు చుట్టుకొని కద్రువను పందేమునుంది గెలిచేటట్టు చేసాడు. అన్నట్టుగానే వినత కద్రువకు దాసిగా మారినది. కొన్నాళ్ళకు గరుత్మంతుడు పెరిగి వాళ అమ్మ ను దాసీ విముక్తి చేయుటకు ఏమిచేయ్యాలని పెద్దమ్మను అడిగాడు . అప్పుడు అమృతము తెచ్చి ఇస్తే వినత దాసితత్వము పోతుంది అని చెప్పింది.గరుత్మంతుడు అమృతం తీసుకొని వెళ్ళుతుంటే మార్గమధ్యములో ఇంద్రుడు కనిపించి "నాయనా గరుత్మంతా! అమృతం నువ్వు తీసుకొని వెళ్ళడం తగదు. అందరికి అమరత్వం సిద్దించరాదు" అని అంటాడు. అప్పుడు గరుత్మంతుడు - ఇంద్రుడు ఒడంబడిక చేసుకొంటారు. గరుత్మంతుడు అమృతకలశం తీసుకొని వెళ్ళి తన సవతి కుమారులకు ఇచ్చేటట్లు, అలా ఇవ్వగానే ఇంద్రుడు వచ్చి ఆ కలశాన్ని తీసుకొని పారిపోయేటట్లు. గరుత్మంతుడు వెళ్ళి ఆ కలశాన్ని తన సవతి సోదరులకు ఇచ్చి దర్బ ల పై ఉంచుతాడు. అమృతం ఇచ్చిన వెంటనే గరుత్మంతుడి దాసీత్వము, అతడి తల్లి దాసీత్వము పోతుంది. ఆ దర్బలమీద అమృతము సేవించుటకు వారు వచ్చే సరికి ఇంద్రుడు కలశాన్ని తీసుకుంటాడు. కద్రువ పిల్లలు దర్బమీద అమృతము ఉందని నాకేసరికి వారి నాలుకలు రెండుగా చీలి పోతాయి. ఇది కదా .
అయితే ఆ దర్బలమీద అమృతము వుంటుంది అని ఆ దర్బలను గ్రహణము రోజు అన్నిటి మీద వేస్తె . దానిలో వుండే అమృత గుణమువల్ల దోషాలు పోతాయిట. ఈ దర్బని సూర్య గ్రహణమునకు, చంద్ర గ్రహణమునకు అందుకే వుపయోగిస్తారుట.
ఈ రోజు సూర్య గ్రహణము ఇండియన్ టైం ప్రకారమూ మద్యాన్నాము 2-44 నుండి సాయంత్రము 4-2 కు వుంటుంది. ఈ గ్రహణాన్ని మకర రాశి వారు చూడకుడదట. అసలు ఎవరు డైరక్టుగా చుడదనుకోండి. కళ్ళకు సమస్యగా అవుతుందిట. అమ్మ కాబోతున్నవారైతే అస్సలు కదలకుడదట. కాబట్టి జాగ్రత్తగా వుండండి. ఆ చెడు కిరణాలకు దూరంగా వుండండి. ఇదే మా అమ్మమ్మ నాకు చెప్పింది . నేను మీకు చెప్పుతున్నాను .
ఆదివారం, జనవరి 25, 2009
గణతంత్రదినోత్సవ శుభాకాంక్షలు
జనవరి 26 వ తేదిన మనము గణ తంత్ర దినోత్సవమును జరుపుకున్తునాము ఈ సందర్బముగా స్కూల్ దగ్గర పెరేడ్ గ్రౌండ్స్ లలో జండా ఆవిష్కరించి వందనము సమర్పిస్తారు . ఇండిపెండేన్స్ డే , రిపబ్లిక్ డే రోజులలో ప్రతి భారతీయుడు తప్పనిసరిగా , విధిగా పతాకావిష్కరణకు హాజరై , ఇతరులతో మాతలాదకుండా, కదలకుండా క్రమశిక్షణ గా వుండాలి. ఎవరి వాహనాలమీద పడితే వారి వాహనాలమీద జాతీయ జండాలు ఎగరవేయరాడు . ఆ గౌరవం కొందరు దేశనాయకులకు ప్రభుత్వ అధినాయకులకు మాత్రమె పరిమితము చేయబడినది.
భారత రిపబ్లిక్ డే --మొట్ట మొదట మంత్రిత్రియ రాయబారము ప్రతిపాదనల ప్రకారము క్రీ. శ 1946 డిసంబరు 9 న భారత రాజ్యామ్గ పరిషత్తు ఏర్పడినది. దానికి రాజేంద్రప్రసాదు ను అద్యక్షునిగా ఎన్నుకొన్నది. ఈ సభ రాజ్యంగా ముసాయిదాను తయారు చేయటానికి డా . బి. ఆర్. అంబేద్కర్ అధ్యక్షణ ఒక కమిటి ఏర్పాటుచేసింది . రాజ్యాంగ సలహాదారుడైన బి. ఎస్. రావ్ సహకారముతో ఈ కమిటీ ఒక ముసాయిదా రాజ్యాగాన్ని తయారు చేసింది. ఈ ముసాయిదా రాజ్యామ్గాన్ని క్రీ. శ . 1948 ఫిబ్రవరి లో ప్రజాభిప్రాయ సేకరణకు ప్రకటించబడినది. రాజ్యామ్గ పరిషత్తు చె ఏడాదిన్నర పాటు జరిగిన సుదీర్గ చర్చల అనంతరము క్రీ. శ . 1949 నవంబరు 26 వ తేదీన రాజ్యాంగ పరిస్త్తుచే ఆమోదించబడినది . ఈ రాజ్యాంగం క్రీ . శ . 1950 జనవరి 26 వ తేదీనుండి అమలులోకి వచ్చింది. కాబట్టి జనవరి 26 న ప్రతీ సంవత్సరము మనము గణతంత్ర దినోత్సవముగా జరుపుకుంటున్నాము.
నాటి నుండి భారత దేశం సర్వసత్తాక ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యం (Sovereign Democratic Republic )
గా మారినది. రాజ్యాంగ పరిషత్తు చివరి సమావేశంలో భారత రిపబ్లిక్ మొదటి అధ్యక్షుడుగా బాబు రాజేంద్ర ప్రసాద్ ను ఎన్నుకున్నారు. పండిట్ జవహర్లాల్ నెహ్రూ ను భారతదేశ ప్రప్రధమ ప్రదానిమంత్రిగా ఎన్నుకున్నారు.
ఇంకా చరిత్ర వుందిట. మా అమ్మమ్మ ఈ గణతంత్ర దినోత్సవముగురించి నాకు చెప్పినవిషయాలు ఇవే మరి.
మీ అందరికి మా హృదయపురక గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు.
నాద బ్రహ్మ త్యాగరాజు
త్యాగరాజు కర్ణాటకా సంగీత అపర నాద బ్రహ్మ . ఈయనకి త్యాగ బ్రహ్మ అని అందరు అంటారు. పాటలు పాడి భగవంతుని పొందవచ్చని నిరూపించి గొప్ప వాగ్గేయకారుడు. ఈ త్యాగరాజ స్వామీ.
తమిళనాడులోని అగ్రహారము అనే గ్రామములో వైదిక తెలుగు బ్రాహ్మణ కుటుంబములో కాకర్ల వంశమున జన్మించినాడు. కాకర్ల రామబ్రహ్మం, కాకర్ల సీతమ్మల పుణ్యఫలముగా జన్మిచినాడు. త్యాగరాజుకు పద్దేమిది సంవత్సరములకు పార్వతి అను యువతితో వివాహమైనది కొన్ని రోజులకు ఆమె మరణించింది. తరువాత ఆమె చెల్లెలు కమలాబను వివాహముచేసుకొని ఒక పుత్రికను కలిగినారు.
ఈయన గొప్ప రామ భక్తుడు రామునిమీద చాలా పాటలు ఆయన రాసిన పాటలు దాదాపు 800 వరకు రాచి ఉంటారని అంచనా .దాదాపు తెలుగులోని రచనలు సాగాయి. కొన్ని సంస్క్రుతములోను వున్నాయి.
త్యాగరాజు సంస్కృతములో రాసిన జగదానందకారక అనే కీర్తనలో రాముని 108 పేరులు చెప్పారు. ఆయన చాలామంచి కీర్తనలు ప్రజల గుండెల్లో నిలచిపోయి ఉండేటట్లు రచించినారు. ఆయన పాటలలో రాగ, తాళ, శ్రుతి, మొదలగున్నవి వుండేటట్లు చూచుకొని ఒక ఇక సెలవా ప్రకారము శ్రీ రాముని కీర్తిమ్చుతూ రచనలు చేసారు. కీర్తించుతూ పాటల రచనలు చేసారు . ఈయన పాటలలో విశేషముగా పంచరత్నాలు రచించినవి చాలా ప్రజారంజకముగా వుంటాయి.
మనము కొన్ని పాటలు చూద్దాము.
ఘనరాగ పంచరత్నములు లో పేరు తెచ్చుకున్నవి
1) జగదానంద కారక! జయ జానకీ ప్రాణ నాయక!
గగనాధిప! సత్కులజ ! రాజరాజేశ్వర!
సుగుణాకర! సుజన (సేవ్య)
సేవ్య! భవ్య దాయక! సదా సకల 11 జగదానంద 11
ఇంకొ పాట :
దుడుకు గల నన్నే దొర
కొడుకు బ్రోచురా? ఎంతో
కడు దుర్విషయాకృష్ణూండై
మరొకటి
సాధించేనే ఓ మనసా!
భోధించిన సన్మార్గ వచనముల
బొంకు జేసి తా బట్టినపట్టు
సమయానికి తగు మాటలాడెనె
ఇంకొటేమో
కన కన రుచిరా కనకవసన !నిన్ను
దిన దినమును మనసున చనువున నిన్ను
పాలుగారు మోమున శ్రీయపార
మహిమ దనరు నున్ను
ఎంతో పేరు గల పాట
ఎందరో మహానుభావులు - లందరికి వందనము 11 ఎం11
దందురు వర్ణుని యంద-చందమును హృదయార
విందమున జూచి బ్రహ్మానంద మనౌభవించులెవా 11ఎం11
ఇంకొకటి
నను పాలింప నడచి వచ్చితిఓ? నా ప్రాణనాధ 11 నను11
వనజనయన మోమునుజూచుట జీవనమనినెనరున మనసుమర్మము దెలిసి 11నను11
సురపతి నీలమణినిభతనువుతో నురమున ముత్యపు
సరులచయముతో కరమున శర కోదండ కాంతితో ధరణి
తనయుతో, త్యాగరార్చిత ! 11నను11
మరొకటి
నగుమోము గనలేని నా జాలి దెలిసి ,, సామజ వరగమన ,, మరుగేలరా,, పట్టి విడువరాదు , వివిధ తత్వాలు వంటివి ఎన్నొ రచించి కీర్తిచినారు త్యాగరాజులవారు. ఇలా చెప్పుకు పోతే చాల్లా వున్నాయి.
ఈయన భారతదెశమంతా ప్రాయణించి అన్ని ప్రదేశాలవారికి రాముని గుణ కీర్థించి చివరికి స్రీ రామునిలో లీనమైనారు.
మనవారు త్యాగరాజు కీర్తనలును గుర్తించి . త్యాగరాజ అరాధనోత్సవాలు జరుపుతున్నారు.