Blogger Widgets

బుధవారం, ఆగస్టు 28, 2013

శ్రీ కృష్ణాయ ఇదం నామమ! శ్రీ కృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు.

బుధవారం, ఆగస్టు 28, 2013


శ్రీ కృష్ణాయ ఇదం నామమ !శ్రీ కృష్ణాయ ఇదం నామమ !శ్రీ కృష్ణాయ ఇదం నామమ !శ్రీ కృష్ణాయ ఇదం నామమ !శ్రీ కృష్ణాయ ఇదం నామమ !
ఈ  భారతావనిలో శ్రీకృష్ణుడు అంటే తెలియని వారుండరు. ఆయనే ఈ నవభారత నిర్మాణానికి సూత్రధారుడు. శ్రీకృష్ణుని భగవంతుని అవతారంగా, మానవ రూపంలో, జన్మించిన దేవునిగా ఆరాధించామేగాని మానవుడిగా పుట్టిన ఆ దేవదేవుని మానవునిగాక; వారి లీలలను మానవ మనుగడతో సరిపోల్చుకుంటూ అర్థం చేసుకోవడం కూడా అంతే ముఖ్యంగా తెలుసుకోవాలి. అట్టి "శ్రీకృష్ణావతార జన్మదినం" మనకు చాలా పవిత్రమైన పుణ్యదినం.  శ్రీముఖనామ సంవత్సర దక్షిణాయన
వర్షఋతువు శ్రావణ బహుళ అష్టమి రోహిణి నక్షత్రం నాల్గవపాదం బుధవారం నాడు అర్థరాత్రి యదువంశంలో దేవకీదేవి, వసుదేవుల పుత్రునిగా "శ్రీకృష్ణుడు" జన్మించాడు. అంటే! (క్రీస్తు పూర్వం 3228 సం||)
కృష్ణజన్మాష్టమి అనగానే మనకు చిన్ని చిన్ని ముద్దుల మొహము కల నల్ల బాలుడు చేతిలో వెన్న పట్టుకుని వున్న యశోదనందనుడు చిన్ని కృష్ణుడు  గుర్తు వచ్చేస్తాడు.  శ్రీ మహావిష్ణువు మన లోకాన్ని కాపాడటానికి ఎన్నో జన్మలు ఎత్తారు.అందులో  ఎనిమిదవ అవతారము శ్రీకృష్ణుడుగా జన్మించారు. కృష్ణ జన్మాష్టమిని కృష్ణాష్టమి అని లేదా జన్మాష్టమి లేదా గోకులాష్టమి లేదా అష్టమి రోహిణి అని అంటారు .
శ్రీకృష్ణుడు దేవకి వసుదేవులకు దేవకి ఎనిమిదో గర్భంగా శ్రావణమాసము కృష్ణ పక్షం అష్టమి తిధి రోజు కంసుడు వారిని బంధించిన  చెరసాలలో జన్మించాడు. 
కృష్ణాష్టమి నాడు భక్తులు పగలంతా ఉపవాసం ఉండి, సాయంకాలం శ్రీకృష్ణుని పూజిస్తారు. శ్రావణ మాసంలో లభించే పళ్ళు, శొంఠి, బెల్లం కలిపిన వెన్న, పెరుగు, మీగడ స్వామికి నైవేద్యం పెడతారు. ఊయలలు కట్టి అందులో శ్రీకృష్ణ విగ్రహాల్ని పడుకోబెట్టి ఊపుతూ జోల పాటలు
,
 కీర్తనలు పాడతారు.   వీధుల్లో ఎత్తుగా ఉట్లు కట్టి పోటీపడి వాటిని కొడతారు.
భక్తిశ్రద్ధలతో శ్రీకృష్ణ జయంతి వ్రతంగా ఆచరిస్తే గోదానం చేసిన ఫలితం, కురుక్షేత్రంలో సువర్ణదానం చేసిన ఫలం దక్కుతుందని బ్రహ్మాండ పురాణం చెప్పింది. కలియుగంలో కల్మషాల్ని హరించి, పుణ్యాల్ని ప్రసాదించే పర్వదినం ఇదని కూడా వివరించింది.
  దేవకీ వసుదేవుల అష్టమ సంతానంగా శ్రీ కృష్ణుడు జన్మించినాడు.  అప్పుడు శ్రీ మహా విష్ణు ఆవిర్భావంతో భూమాత పులకించింది. ప్రకృతి ఆనందానికి తిరుగులేదు.శ్రీ కృష్ణుని జన్మించిన విషయం ఎవరికీ తెలియకుండా వుంది. వాసుదేవుడు ఆ చిన్ని శ్రీ కృష్ణుని దేవకీ నుండి తీసుకుని యమునా నదిని దాటి మరి యశోదమ్మ దరికి చేరి ఆమె పక్కలో పడుకోబెట్టి.  యశోదకు జన్మించిన మాయను తీసుకుని వెళ్లి పోయాడు.  యశోదమ్మ దగ్గర బిడ్డను చూసి అక్కడ జనులు ఈ విధంగా అనుకుంటున్నారు. శ్రీకృష్ణ జన్మాష్టమిని గురించి తొలి తెలుగు వాగ్గేయకారుడు తాళ్ళపాక అన్నమాచార్యుడు ఒక కీర్తనలో ఇలా చెప్పారు. 
 
ఆ బాలకృష్ణుడు దినదిన ప్రవర్థమాన మగుచూ తన లీలావినోదాదులచే బాల్యమునుండే, అడుగడుగునా భక్తులకు జ్ఞానోపదేశం చేస్తూ వచ్చినాడు. ఈ బాలకృష్ణుడు ఇంటింటా తన స్నేహితులతో వెన్నముద్దలు దొంగలిస్తూ వెన్నదొంగగా ముద్రవేసుకున్నాడు. అలా వెన్నముద్దల దొంగతనంలో కూడా మానవులకు అందని దేవరహస్యం ఉందిట. వెన్న జ్ఞానానికి సంకేతంగా చెప్తారు. పెరుగును మధించగా మధించగా కాని వెన్న లభ్యంకాదు కదా! అట్టి తెల్లని వెన్నను తాను తింటూ, ఆ అజ్ఞానమనే నల్లని కుండను బద్దలుకొట్టి మానవులలో జ్ఞాన  జ్యోతిని వెలిగించడమే కృష్ణ సందేశంగా భావించాలి అని చెప్తూ వుంటారు.  
అలాగునే మరోచిన్నారి చేష్టలో మరో సందేశాన్ని చెప్తారు. గోపికలు కుండలలో ఇండ్లకు నీళ్లను యమునానదిలో నుండి తీసుకుని వెళుతూవుంటే, రాళ్లను విసిరిచిల్లు పెట్టేవాడట. అలా ఆకుండ మానవశరీరము అనుకుంటే ఆకుండలోని నీరు 'అహంకారం' ఆ అహంకారం కారిపోతేనేగాని జీవికి ముక్తి లభించదని ఇలా వారి లీలలోని అంతర్యాన్ని భాగవతోత్తములు వివరిస్తూ ఉంటారు.  కానీ ఇక్కడ గోపికలుకు మాయ ఆవహించి వుండటం వాళ్ళ ఆ నల్లవాడు చేసే అల్లరిని తట్టుకోలేక యశోదమ్మకు పిరియాదులు చేస్తున్నారు.  ఆ అల్లరిని వారు ఎంతో ఆనందంగా అనుభవించేవారు.  మరి ఈ పిరియాదులు చూడండి మరి. 
ఇక చిన్న తనమునుండే అనేకమంది రాక్షసులను సంహరిస్తూ దుష్టశిక్షణ శిష్టరక్షణ కావిస్తూ కురుపాండవ సంగ్రామములో అర్జునునకు రథసారధియై అర్జునిలో ఏర్పడిన అజ్ఞానందకారాన్ని తొలగించుటకు "విశ్వరూపాన్ని" చూపించి గీతను బోధించి, తద్వారా మానవాళికి నామృతాన్ని ప్రసాదించాడు.

శ్రీ కృష్ణుని జననం :
సత్యసంకల్పుడైన పరమాత్మ స్వాయంభువమనువు కోరికెను తీర్చెందుకు, తొలి జన్మ లో పృశ్నిగర్భునిగా, రెండవ జన్మలో అదితి కస్యపులకు వామనునిగా, మూడవజన్మలో దేవకి వసుదేవులకు గొవిందునిగా జన్మించాడు.
తండ్రి వసుదేవుదు జాతకర్మ నిర్వహించలేని నిస్సహాయ స్థిథి లో ఉన్నాడు, స్వామి జననము కారాగౄహములో కాబట్టి !
పాడిరి గంధర్వోత్తము లాడిరి రంభాది కాంతలానందమునన్ గూడిరి సిద్ధులు, భయములు వీడిరి చారణులు మొరసె వేల్పుల భేరుల్!! అతి ప్రసన్నుడైన వెన్నుని కన్న దేవకి, పున్నమినాడు షోడశ కళాప్రపూర్ణుడైన చంద్రుని కన్న ప్రాగ్దిశవలె చెలువొందినదంటారు పోతన్నగారు. పదహారు కళల పూర్ణావతారంగా శ్రీ మహావిష్ణువు భూమిపై అవతరించినది అర్ధరాత్రి వేళ.



దేవతలకు కూడా దొరకని ఆ పరమ పురుషుడు గోపబాలురతో ఆడి పాడాడు. స్వయంగా అమృతాన్ని పంచిన మోహినీవేషుడు వ్రజవాడలో వెన్న దొంగిలించాడు. ఆకపటనాటక సూత్రధారి రాబోయే యుగాసందికి సంకేతంగా తల్లి చేతి తాళ్ళకు కట్టుబడ్డాడు. ఆ గోవిందుడు గోకులంలోని క్షీరాన్నే కాదు, జలాన్ని కూడా అమృతమయం చెయ్యాలని భావించాడు. అందుకే ప్రతి పసిప్రాణిలోనూ వసివాడని కన్నయ్య పసితనాన్నిభావించగలిగితే అదే జన్మ సాఫల్యం. జీవన మాధుర్యపు ఊటగా మారి ఆ దివ్య నర్తకుని చరణాలమీద అశ్రు అభిషేకం చేయదా!

లోకాలన్నిటినీ కడుపున దాచిన విశ్వంభరుడు గోపాల బాలుడై యశోదానందుల కొడుకైనాడు.

చతుర్భుజాలతో, శంఖు, చక్రాలతో శ్రీవత్సలాంచనాలతో ఉద్భవించిన శ్రీ మహా విష్ణువు దేవకి వసుదేవులకు కన్నులపండువ చెసాడు .

అటువంటి శ్రీ కృష్ణ పరమాత్మ అవతరించిన శ్రావణ బహుళాష్టమి పర్వదినము నేడే. కృష్ణుడు భూమి పై పుట్టింది మొదలు ఎనిమిది సంఖ్యతో ఆయన జీవితం ముడిపడింది. దశవతారాలలో కృష్ణవతారం ఎనిమదవది.  స్వామి జన్మించింది ఎనిమిదవ నెలలోనే...అష్టమి తిధి నాడు. కృష్ణసావర్ణ మన్వంతరం ఎనిమదవిది.

దేవతల విశిష్ట గుణాలను అభివర్ణిస్తు , సహస్రనామస్తోత్రాలను మహర్షులు మానవ జాతికి అందించారు.
అయితే , ఒక్క విష్ణు సహస్రనామం మాత్రం శ్రీ కృష్ణుని ఎదుట ఉంచుకుని చెప్పబడింది.
ఫ్రతి విశేషాణాన్ని స్వామి ఆమోదిస్తునట్లు భావిస్తు, భీష్ముడు సహస్ర నామాలను అభివర్ణించాడు.
ఈ చెప్పిన భీష్మపితామహుడు అష్టమి వసువైన ప్రభాసుడు.
స్వామి మతౄగర్భం నుండి ఎనిమదవ నెలలోనే ఆవిర్భవించాడని, అందుకే ఆయనను పద్మపత్రాలలో ఉంచారని ఒక నమ్మకం ఉంది. వటపత్రశాయి ఈ అవతారములో అంబుజపత్రశాయి అయ్యాడు.

నిర్గుణ పరబ్రహ్మం ధర్మ సమ్రక్షణార్ధం అవతరించిన శుభసమయములోనే యోగమాయ చెల్లెలుగా ఆవిర్భవించింది. అందుకే ఆమె కృష్ణ సహోదరి . అన్న చెల్లెలకి అండగా ఉండాలని ,ఆడబిడ్డకు పుట్టింటి అండ ఎప్పటికి అవసరమే అని , ఈ సత్సంప్రదాయాన్ని మనకి నేర్పినవాడు శ్రీ కృష్ణుడు ! మేనత్త కుంతిని గౌరవించాడు. చెల్లెలు వరుసైన ద్రౌపదిని కాపాడాడు. ఇలాగ ఆయన లోక కల్యాణము కోసము ఎన్నో చేసాడు.
భారతయుద్ధం ప్రారంభములో విజయదాయినీ అయిన దుర్గను ధ్యానించమని కృష్ణుడు అర్జునునితో చెప్తాడు.
చాలామంది ముగ్గులతో కృష్ణ పాదాలను ఇంటి ముందు చిత్రిస్తారు. స్వామికి ఆహ్వానంగా. బాలకృష్ణ రూపంనుండి అన్ని కృష్ణ రూపాలూ ఆరాధనీయాలే. అందుకే కన్నయ్యా తవ చరణం మమ శరణం!!
పెను చీకటికి ఆవల ఎకాకృతితో వెలుగు దివ్యజ్యోతి శ్రీ కృష్ణ పరమాత్మ !
శ్రీ కృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు.
శ్రీ కృష్ణాయ ఇదం నామమ !శ్రీ కృష్ణాయ ఇదం నామమ !శ్రీ కృష్ణాయ ఇదం నామమ !శ్రీ కృష్ణాయ ఇదం నామమ !శ్రీ కృష్ణాయ ఇదం నామమ !
శ్రీ

బుధవారం, ఆగస్టు 21, 2013

సంస్కృత (संस्कृत) భాషా ఉత్సవ శుభాకాంక్షలు.

బుధవారం, ఆగస్టు 21, 2013


కొన్ని దశాభ్దాల క్రితం భారత ప్రభుత్వం  ప్రోత్సాహంతో శ్రావణ పౌర్ణిమ నాడు సంస్కృతము (संस्कृतम्) భాషా ఉత్సవంగా పరిగణించే విదానం ఆచరణలోనికి వచ్చింది.  ఈ రోజు సమస్త భారతీయభాషలకు మూలమైన సంస్కృత (संस्कृत) భాషను స్మరించుకొనే పవిత్ర సాంప్రదాయము అవుతుంది . ప్రభుత్వపరంగా సంస్కృత దివస్ గా వేడుకలు నిర్వహిస్థారు.  ప్రభుత్వ పక్షాన ఈ రోజు భాషా పండితులకు సన్మానిస్తారు .  ఈరోజు ఈ వేడుకను జరుపుకోవటం వాళ్ళ సంస్కృతము (संस्कृतम्) భాష వైపు ఆకర్షించటానికి ఉత్తమమైన మార్గం ఎర్పడింది.  మనం ఈ భాషగురించి కొంచెం తెలుసుకుందాం.  
సంస్కృతము (संस्कृतम्)  ఏప్రాంతములోను నిత్యవ్యవహారభాష కానంత మాత్రముచేత కొందరు దీనిని మృతభాషయనుట అసమంజసము. భారతదేశములో సంస్కృతము జీవద్భాషయే యనునది స్పష్టమైన సత్యము. 
సంస్కృతము (संस्कृतम्) భారతదేశానికి చెందిన ప్రాచీన భాష మరియు భారతదేశ 23 ఆధికారిక భాషలలో ఒకటి. పరమేశ్వరుని ఢమరుక నాదము నుండి వెలువడిన శబ్ద బ్రహ్మమే సంస్కృత భాష అని విజ్ఞులందురు. అట్లు వెలువడిన పదునాలుగు రకములైన సూత్రములను మాహేశ్వర సూత్రములందురు. సంస్కృతం హిందూ, బౌద్ధ మరియు జైన మతాలకు ప్రధాన భాష. నేపాలు లో కూడా సంస్కృతానికి భారతదేశములో ఉన్నటువంటి స్థాయియే కలదు. 
జనాభాలెక్కల ప్రకారం సంస్కృతం మాట్లాడేవారి జనాభా: 
* 1971-->2212 * 1981-->6106 * 1991-->10000 * 2001-->14135.
అని ఉన్నా కనీసం పది లక్షల కంటే ఎక్కువ మందే సంస్కృతాన్ని అనర్గళంగా మాట్లాడగలరు. కర్ణాటకలోని అనే గ్రామములో పూర్తిగా సంస్కృతమే వ్యవహారభాష. మత్తూరులో 95 శాతం మంది, జిహ్రీలో 100 శాతం మంది సంస్కృతంలో సంభాషించడం విశేషం. 
సంస్కృతం అంటే 'సంస్కరించబడిన', 'ఎటువంటి లోపాలు లేకుండా ఏర్పడిన' అని అర్థం .ప్రపంచంలోని 876 భాషలకు సంస్కృతం ఉపజీవ్యం. సంస్కృతమునకు అమరవాణి, దేవభాష, సురభాష, గీర్వాణి మొదలగు పేర్లు కలవు. శౌరసేని, పైశాచి, మాగధి మొదలగు ప్రాకృత భాషలు కూడా సంస్కృతము నుండియే పుట్టినవి. సంస్కృతమునందు ఏకవచనము, ద్వివచనము, బహువచనము అను మూడు వచనములు కలవు. సంస్కృతమునందు నామవాచకములను విశేష్యములనియు, శబ్దములనియును, క్రియాపదముల యొక్క మూలరూపములను ధాతువులనియును వ్యవహరింతురు. సంస్కృతాన్ని మొదట సరస్వతీ లిపిలో వ్రాసేవారు. కాలక్రమేణ ఇది బ్రాహ్మీ లిపి గా రూపాంతరం చెందింది. ఆ తర్వాత దేవనాగరి లిపిగా పరివర్తనం చెందింది. ఇదే విధంగా తెలుగు లిపితమిళ లిపిబెంగాలీ లిపిగుజరాతీ లిపిశారదా లిపి మరియు అనేక ఇతర లిపులు ఉద్భవించాయి. క్రియా పదముల యొక్క లింగ, వచన, విభక్తులు నామవాచకమును అనుసరించి ఉండును.

ఏదృష్టితో చూచినను సంస్కృతభాష ప్రపంచ భాషలలో విశిష్టస్ధానము నలంకరించుచున్నది. అయ్యది సకల భాషలలోను ప్రాచీనతమమై, సర్వలోక సమ్మానితమై, వివిధ భాషామాతయైయలరారు చున్నది; మరియు భారత జాతీయతకు జీవగఱ్ఱయై, భారతీయభాషలకు ఉచ్ఛ్వాసప్రాయమై, సరససాహిత్యజ్ఞానవిజ్ఞానరత్నమంజూషయై యొప్పారుచున్నది. పురాతనమైన యీభాష అధునాతన నాగరికతలో కూడ ప్రధానభూమికను నిర్వహింపగల్గియుండుట పరమ విశేషము. 
సంస్కృత దివస్ శుభాకాంక్షలు . 

విద్యాప్రదాత హయగ్రీవ జయంతి శుభాకాంక్షలు.

హయగ్రీవ జయంతి శ్రావణ పౌర్ణమి రోజున  జరుపుకుంటారు. 
జ్ఞానానందమయం దేవం నిర్మలస్పటికాకృతిం  |
ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవముపాస్మహే ||       
వ్యాఖ్యా ముద్రాం కరసరసిజైః పుస్తకం శంఖచక్రే
బిభ్రద్భిన్నస్పటికరుచిరే పుండరీకే నిషణ్ణః |
అమ్లానశ్రీరమృతవిశదైరంశుభిః ప్లావయన్ మాం
ఆవిర్భూయాదనఘ మహిమా మానసే వాగధీశః ||

అది లక్ష్మీమయమైన మాసంలో వచ్చినది కనుక సంపదలు ఇచ్చే శక్తి ఉంది. దానితో పాటు సర్వ విద్యా స్వరూపుడైన భగవంతుని విద్యాప్రదమైన అవతారం హయగ్రీవ అనే అవతారం జరిగింది ఈ శ్రావణ పూర్ణిమ రోజే. అందుకే ఈ రోజుకి అంత ప్రాధాన్యం. మనిషికి ప్రధానమైనది జ్ఞానం, జ్ఞానానికి ఆధారం శాస్త్రాలు, శాస్త్రాలకు మూలం వేదం. ఆవేదాన్ని లోకానికి అందించిన అవతారం హయగ్రీవ అవతారం. విద్య చదువుకున్న వారికందరికి కంకణం కడుతారు, వారు రక్షకులు అవుతారు అని. జ్ఞానికి రక్షగా ఉంటారని. ఆ జ్ఞానం చెప్పే భగవంతునికి చెందిన వాటంతటికి రక్ష. ఆ కంకణ ధారణ అనేదే రక్షబంధనం అయ్యింది. వేదం చదువుకునే వారందరూ శ్రావణ పూర్ణిమ నాడు ఆరంభంచేసి నాలుగు నెలలు వేదాధ్యయనం చేస్తారు. ఆతరువాత వేద అంగములైన శిక్షా, వ్యాకరణం, నిరుక్తం, కల్పకం, చందస్సు మరియూ జ్యోతిష్యం అనే షడంగములను అధ్యయనం చేస్తారు. విద్యారక్షకుడైన భగవంతుడిని ఉపాసన చేసుకొని మొదలు పెడుతారు. వేదాన్ని కొత్తగా నేర్చే వారే కాక, వేదాన్ని నేర్చినవారు తిరిగి ఇదే రోజునుండి మరచిపోకుండా నవీకరణం చేసుకుంటూ అధ్యయణం మొదలు పెడుతారు. హయగ్రీవుడిగా అవతరించి లోకాన్ని ఉద్దరించిన రోజు.
ఇక శ్రీ మహావిష్ణువు విజయగాధా పరంపరలలో హయగ్రీవావతారంలో జరిగిన విజయం కూడా విశేషంగా చెబుతారు. పూర్వం ఓసారి హయగ్రీవుడు అనే ఓ రాక్షసుడు దేవిని గురించి తీవ్రంగా తపస్సు చేశాడు. ఆ తపస్సుకు మెచ్చిన దేవి వరం కోరుకొమ్మన్నప్పుడు తనకు మరణం లేకుండా చూడమన్నాడు. అయితే అది ఆమె సాధ్యపడదని చెప్పినప్పుడు హయగ్రీవం (గుర్రపు తల) ఉన్నవాడి చేతిలో మాత్రమే తనకు మరణం వచ్చేలా అనుగ్రహించమన్నాడు. ఆమె ఆ రాక్షసుడిని అనుగ్రహించి అంతర్థానమైంది. ఆ వరంతో ఆ రాక్షసుడు దేవతలను ముప్పతిప్పలు పెడుతుండేవాడు. విష్ణుమూర్తి ఆ రాక్షసుడిని యుద్ధంలో నిరంతరం ఎదిరిస్తున్నా ఫలితం లేకపోయింది. చివరకు శివుడు ఓ ఉపాయాన్ని పన్నాడు. శ్రీ మహావిష్ణువు ధనుస్సుకు బాణాన్ని సంధించి ఉంచి విపరీతమైన అలసట కలిగి అగ్రభాగాన వాలి నిద్రపోయాడు. ఆయనను నిద్రలేపటానికి దేవతలెవరికీ ధైర్యం చాలలేదు. అయితే ఆ దేవతలంతా ఓ ఆలోచనకు వచ్చి వమ్రి అనే ఓ కీటకాన్ని పంపి ధనుస్సుకున్న అల్లెతాడును కొరకమని చెప్పారు. అలా చేస్తే తాడు వదులై విల్లు కదలి విష్ణువుకు మెలకువ వస్తుందన్నది వారి ఆలోచన. అయితే ఆ పురుగు తాడును కొరకగానే దేవతలు ఊహించని విధంగా వింటికి ఉన్న బాణం విష్ణువు మెడకు తగిలి ఆ దెబ్బకు విష్ణువు తల ఎటో ఎగిరి వెళ్ళింది. దేవతలు అంతటా వెదికారు కానీ ఆ తల కనిపించలేదు. బ్రహ్మదేవుడు వెంటనే దేవిని గురించి తపస్సు చేశాడు. అప్పుడామె ప్రత్యక్షమై ఒక గుర్రపు తలను తెచ్చి విష్ణుమూర్తి శరీరానికి అతికించమని చెప్పింది. దేవతలు అలాగే చేశారు. ఆ హయగ్రీవం అతికిన విష్ణుమూర్తిలో మళ్ళీ జీవం వచ్చి లేచాడు. ఆ లేచిన రోజే శ్రావణ పూర్ణిమ. ఆ తర్వాత హయగ్రీవుడుగా మారిన విష్ణుమూర్తి రాక్షసుడిని సులభంగా జయించాడు. దేవీ శక్తి మహిమను, శ్రీ మహావిష్ణు తత్వాన్ని ఈ కథ తెలియచెప్తుంది. అందుకే శ్రావణ పూర్ణిమ నాడు హయగ్రీవ జయంతి కూడా జరపడం కనిపిస్తుంది. ఇలా శ్రావణ పూర్ణిమను ఎన్నెన్నో రకాలుగా పండుగగా, ఉత్సవంగా జరుపుకోవడం తరతరాలుగా వస్తోంది.

మంగళవారం, ఆగస్టు 20, 2013

రక్షాబంధన శుభాకాంక్షలు.

మంగళవారం, ఆగస్టు 20, 2013

భారతీయ సంప్రదాయములో రాఖి పౌర్ణమి విశిష్టమైన స్థానం కలిగివుంది.  ఈ పండుగను రక్షాబంధనం (రాఖీ) పండుగ గానూ, జంద్యాల పూర్ణిమ, వైఖానస మహర్షి జయంతి గాను, హయగ్రీవ జయంతి గాను , వరుణ పూజల రూపంలో ఈ పూర్ణిమను ఉత్సవంగా అందరూ జరుపుకుంటుంటారు. 
మహాభారత కథలోనూ రక్షాబంధన ప్రసక్తి మనకు కనిపిస్తుంది. ధర్మరాజు కృష్ణుడిని రక్షాబంధన విశేషాలను గురించి అడిగినప్పుడు కృష్ణుడు దీనివల్ల కలిగే మేలును ఆయనకు వివరించాడు. రక్షాబంధనాన్ని ఒకసారి కట్టించుకుంటే ఇక ఆ సంవత్సరమంతా దుష్ట, ప్రేత, పిశాచ బాధ ఉండదని, అనారోగ్యాన్ని, అశుభాన్ని పోగొడుతుందని కృష్ణుడు చెప్పాడు. ఈ సందర్భంగా పూర్వం జరిగిన ఓ సంఘటనను కూడా ఆయన వివరించాడు. పూర్వకాలంలో దేవతలకు, రాక్షసులకు విపరీతంగా యుద్ధం జరుగుతుండేది. ఆ యుద్ధంలో రాక్షసుల ధాటికి దేవతలు తట్టుకోలేక బాధపడుతుండేవారు. ఆ పరిస్థితి చూసి ఎలాగైనా దేవేంద్రుడికి విజయం కలగాలని ఇంద్రుడి భార్య శచీదేవి అతడికి రక్ష కట్టింది. ఆ తర్వాత యుద్ధానికి వెళ్ళిన ఇంద్రుడు రాక్షసులను చీల్చి చెండాడాడు. రక్షాబంధనానికి అంత గొప్ప శక్తి ఉంది. ఈ రక్షాబంధనం సందర్భంలో చదివే శ్లోకం.
'యేన బద్ధో బలీ రాజా దానవేంద్రో మహాబలః, 

తేనత్వామభిబధ్నామి రక్షే మా చల మా చల'

దీనిలో రక్షాబంధనం అంటే సాక్షాత్తూ శ్రీ మహావిష్ణు శక్తేనని తెలియచెప్పే భావం ఇమిడి ఉంది.  బలిచక్రవర్తి రక్షకోరిన సోదరిని రక్షిస్తూ ఎలాంటి ఆటంకాలెదురైనా తడబడక ధైర్యంతో ఎదురొడ్డి నిలిచినవాడు. అటువంటి మహావీరునితో తన అన్నని పోలుస్తూ తనకి రక్షణ నివ్వమని కోరుతుంది. ఈ రాఖీ కట్టిన సోదరికి తగిన బహుమానం ఇస్తూ ఆశీర్వధిస్తాడు అన్న. రాఖీ పౌర్ణమి, శ్రావణ పున్నమిరోజును యిలా ఎన్నోరకాలుగా దేశమంతా ప్రజలు ఆనందోత్సాహాలతో జరుపుకుంటారు. దేవతారాధనలు, ప్రకృతి దేవతారాధనలు, ఆత్మీయతానురాగబంధాలు... సకల పూజారాధనలు అందుకునే రోజు ఈ శ్రావణ పౌర్ణమి.  చరిత్రలో మొగలాయి చక్రవర్తుల ఏలుబడిలో ఈ రక్షాబంధనానికి మరికొంత కొత్త విశిష్టత సమకూరింది. రాఖీ కట్టే ఆచారం తమ స్త్రీల రక్షణ కోసం రాజపుత్రులు చేసిన ఏర్పాటని పండితులు పేర్కొంటున్నారు. చిత్తూరు మహారాణి కర్ణావతి గుజరాత్‌ నవాబైన బహదూర్‌షా తమ కోటను ముట్టడించబోతున్నప్పుడు తనను రక్షించమని ఢిల్లీ చక్రవర్తిగా ఉన్న హుమయూన్‌కు రక్షాబంధనాన్ని పంపి ప్రార్థించిందట. ఆ రక్షాబంధనాన్ని స్వీకరించిన హుమయూన్‌ ఆ రాణిని తన సోదరిగా భావించి బహదూర్‌షాను తరిమి వేశాడని ఆనాటి నుంచి సోదరీసోదర బంధానికి గుర్తుగా ఈ రక్షాబంధనం ప్రచారంలోకి వచ్చిందని అంటారు.  శ్రావణ పూర్ణిమ నాడు నూతన యజ్ఞోపవీతాలను ధరించే ఆచారాన్ననుసరించి ఇలా ఈ పండుగ పేరు వ్యవహారంలోకి వచ్చింది దీనినే జంద్యాల పౌర్ణమి గా అంటారు.శ్రావణ పూర్ణిమను ఎన్నెన్నో రకాలుగా పండుగగా, ఉత్సవంగా జరుపుకోవడం తరతరాలుగా వస్తోంది. మరి 
 బ్లాగ్ మిత్రులుకు రక్షాబంధన శుభాకాంక్షలు. 

సోమవారం, ఆగస్టు 19, 2013

Indian Constitution Quiz.

సోమవారం, ఆగస్టు 19, 2013

Indian Constitution Quiz. Plz try this




ఆదివారం, ఆగస్టు 18, 2013

Catch me Live @ 5:00 PM

ఆదివారం, ఆగస్టు 18, 2013



గురువారం, ఆగస్టు 15, 2013

స్వాతంత్ర్యదినోత్సవ శుభాకాంక్షలు . బంగారు పువ్వులు పూచే తల్లికి భారత దాత్రికి వందనం.

గురువారం, ఆగస్టు 15, 2013

100 సంవత్సరముల విదేశీయుల పాలన నుండి శాశ్వితాముగా  సంకెళ్ళ నుండి     విముక్తి పొందిన దినమును మనము స్వాతంత్ర్య 
దినోత్సవముగా జరుపుకుంటున్నాము.  ఈ సంవత్సరము మనము 67వ స్వాతంత్రయదినోత్సవముగా జరుపుకుంటున్నాము.
ఎందరో మహానుబావులు ఎన్నో త్యాగాలు చేసి స్వాతంత్ర్య భారతదేశానికి మనకు అప్పగించారు.
దీనికి కొంతమంది అహింసా మార్గములో ప్రయత్నించారు.
మరికొందరు హింసా మార్గములో ప్రయత్నించారు. 
చివరికి 1947 ఆగష్టు 15 న స్వాతంత్ర్యము పొందాం. అలా త్యాగాలు చేసి సాధించిన భారత మాతకు వందనం తెలుపుతూ. 
వారిని గుర్తు చేసుకొని జెండా ఎగురవేసాం కదా. ఈ స్వాతంత్ర్యదినోత్సవ సందర్భముగా అందరికి నా శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాను.
బంగారు పువ్వులు పూచే తల్లికి భారత దాత్రికి వందనం.

ఆదివారం, ఆగస్టు 11, 2013

Catch me live today @ 5:00 pm

ఆదివారం, ఆగస్టు 11, 2013

Catch me live today @ 5:00 Pm to 6:00 pm 

Stay Tune With 
RadioJosh  Masth Maza Masth Music.



2day's Topic : 
About Independence Day.
U r's Fav Freedom fighters.
U r's Fav Patriotic Song.
Skype Me™!

తేనెల తేటల మాటలతో మన దేశ మాతనే కొలిచెదమా

తేనెల తేటల మాటలతో మన దేశ మాతనే కొలిచెదమా
భావం భాగ్యం కూర్చుకొని ఇక జీవన యానం చేయుదమా

సాగర మేఖల చుత్తుకొని సుర గంగ చీరగా మలచుకొని
గీతా గానం పాడుకొని మన దేవి కి ఇవ్వాలి హారతులు

గాంగ జటాధర భావనతో హిమ శైల శిఖరమే నిలబడగా
గలగల పారే నదులన్నీ ఒక బృంద గానమే చేస్తుంటే

ఎందరు వీరుల త్యాగబలం మన నేటి స్వేచ్చకే మూలబలం
వారందరిని తలచుకొని మన మానస వీధిని నిలుపుకొని

శనివారం, ఆగస్టు 10, 2013

శంకరంబాడి సుందరాచారిగారి జయంతి

శనివారం, ఆగస్టు 10, 2013


తెలుగు రచయిత లలో ప్రముఖుడు  ప్రసన్న కవి,  భావకవి,  అహంభావకవి,  సుందరకవి గా పేరుపొందిన  శంకరంబాడి సుందరాచారి కి ఒక ప్రత్యేక స్థానం ఉంది. తెలుగు ప్రజలకు, ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్రానికి రాష్ట్ర గీతమైన మా తెలుగు తల్లికి మల్లె పూదండ అందించారు. సుందరాచారి మా తెలుగు తల్లికి.. గీతాన్ని 1942 లో దీనబంధు సినిమా కోసం రచించాడు. కానీ ఆ చిత్ర నిర్మాతకు ఆ పాట నచ్చక పోవటం వల్ల ఆ సినిమాలో చేర్చలేదు. టంగుటూరి సూర్యకుమారి గ్రామఫోన్ రికార్డు కోసం ఆ పాటను మధురంగా పాడిన తరువాతనే ఆ గీతానికి గుర్తింపు లభించింది.  ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్ర గీతమైన మా తెలుగు తల్లికి.. కూడా తేటగీతిలో రాసింది . ఈ పద్యం ఆయన రచనలలో మణిపూస వంటిది. రాష్ట్ర చారిత్రక, సాంస్కృతిక వారసత్వాన్ని రమ్యంగా వర్ణించిన నాలుగు పద్యాలు అవి. ఆంధ్ర ప్రదేశ్‌ ప్రభుత్వం ఆ గీతాన్ని రాష్ట్ర గీతంగా గుర్తించి గౌరవించింది.


మా తెలుగు తల్లికి మల్లె పూదండ 

మా కన్న తల్లికి మంగళారతులు 
కడుపులో బంగారు కనుచూపులో కరుణ 
చిరునవ్వు లో సిరులు దొరలించు మా తల్లి



గల గలా గోదారి కదలి పోతుంటేను 
బిల బిలా కృష్ణమ్మ పరుగులిడుతుంటేను 
బంగారు పంటలే పండుతాయి 
మురిపాల ముత్యాలు దొరలుతాయి



అమరావతీ నగర అపురూప శిల్పాలు 
త్యాగయ్య గొంతులో తారాడు నాదాలు
తిక్కయ్య కలములో తీయందనాలు 
నిత్యమై నిఖిలమై నిలచి ఉండేదాక



రుద్రమ్మ భుజ శక్తి మల్లమ్మ పతి భక్తీ 
తిమ్మరుసు ధీయుక్తి కృష్ణ రాయని కీర్తి
మా చెవులు రింగుమని మారు మ్రోగేదాక 
నీ పాటలే పాడుతాం నీ ఆటలే ఆడుతాం
జై తెలుగు తల్లీ,జై తెలుగు తల్లీ,జై తెలుగు తల్లీ

అనే పాటను రచించిన శంకరంబాడి సుందరాచారి గారి జయంతి నేడే ఆగష్టు 10,1914 .  సుందరాచారి, 1914 ఆగష్టు 10  తిరుపతి లో జన్మించాడు. మదనపల్లె లో ఇంటర్మీడియేటు వరకు చదివాడు. చిన్నతనం నుండే ఆయన స్వతంత్ర భావాలు కలిగి ఉండేవాడు. బ్రాహ్మణోచితములైన సంధ్యావందనము వంటి పనులు చేసేవాడు కాదాయన. తండ్రి మందలించగా జంధ్యాన్ని తెంపివేసాడు. తండ్రి మందలింపుకు కోపగించి, పంతానికి పోయి, ఇంటి నుండి బయటికి వెళ్ళి పోయాడు.
భుక్తి కొరకు ఎన్నో పనులు చేసాడు. తిరుపతిలో హోటలు సర్వరుగా పని చేసాడు. రైల్వే స్టేషనులో కూలీగా కూడా పని చేసాడు. ఆంధ్ర పత్రిక లో ప్రూఫు రీడరుగా, ఉపాధ్యాయుడిగా, పాఠశాల పర్యవేక్షకుడిగా ఎన్నో వైవిధ్య భరితమైన పనులు చేసాడాయన.
అమితమైన ఆత్మవిశ్వాసం ఆయనకు.  ఆంధ్ర పత్రికలో ఉద్యోగం చేస్తుండగా, ఒక ప్రముఖునిపై పద్యం వ్రాయవలసి వచ్చింది. నేను వ్యక్తులపై పద్యాలు వ్రాయను అని భీష్మించుకుని, దాని కోసం ఆ ఉద్యోగాన్ని కూడా వదులుకున్నాడు సుందరాచారి. తరువాత విద్యాశాఖలో పాఠశాల పర్యవేక్షకుడిగా పని చేసాడు. నందనూరు లో ఉండగా ఒకసారి పాఠశాల సంచాలకుడు వచ్చాడు. ఆ సంచాలకుడు సుందరాచారిని ప్యూనుగాను, ప్యూనును పర్యవేక్షకుడిగాను పొరబడ్డాడు. దానికి కోపగించి, సుందరాచారి ఆ ఉద్యోగానికి తక్షణమే రాజీనామా చేసాడు.
భార్య అనారోగ్యం కారణంగా ఆయన వేదన చెంది, జీవిత చరమాంకంలో ఒక రకమైన నిర్లిప్త జీవితం గడిపాడు. సుందరాచారి 1977 ఏప్రిల్ 8 న తిరుపతి, గంగుండ్ర మండపం వీధిలో నివాసముంటున్న ఇంట్లో మరణించాడు.
శంకరంబాడి సుందరాచారి గారి జయంతి శుభాకాంక్షలు. 

గురువారం, ఆగస్టు 08, 2013

క్విట్‌ ఇండియా ఉద్యమానికి 71 సంవత్సరాలు.

గురువారం, ఆగస్టు 08, 2013

భారత దేశానికి స్వాతంత్ర్యము వచ్చి 66 సంవత్సారాలు అయ్యింది. మనకు ఈ స్వాతంత్ర్యము రావటానికి భారతీయులు చాలా కష్టపడ్డారని మనకు తెలుసు.  ఎన్నో ఉద్య్యమాలు చేసారు.  అందులో చాలా ప్రముఖమైన ఉద్యమము క్విట్‌ ఇండియా ఉద్యమం భారత స్వాతంత్య్రోద్యమంలో అతి ప్రధాన ఘట్టం.  క్విట్‌ ఇండియా ఉద్యమం జరిగి నేటికి 71 సంవత్సరాలు పూర్తి అయ్యింది అందుకే దీనిగురించి చెప్పుకుందాం. 
ఒకదేశ ప్రజలు తమ స్వాతంత్య్రం కోసం కష్టాలు నష్టాలకు ఓర్చిఎంతవరకు  పోరాడగలరో ఎన్ని త్యాగాలు చేయగలరో 'క్విట్‌ ఇండియా ఉద్యమం ప్రపంచానికి చాటి చెప్పింది. క్రిప్స్‌ రాయబారం వల్ల ఎటువంటి ఉపయోగము లేదు అని తెలిసి 1942 ఆగస్టు 8న కాంగ్రెస్‌ వర్కింగ్ కమిటి ముంబాయి లో  సమావేశమై స్వాతంత్య్ర పోరాటానికి చిట్టచివరిగా రూపొందించారు . ఆ ఉద్యమం తన జీవితంలో చివరిదని ఇందులో విజయమో, మరణమో తేలుతుందని మహాత్మాగాంధీజీ స్పష్టం చేసారు.   జాతిపిత మహాత్మాగాంధీ క్విట్‌ ఇండియా (ఇండియా వదిలి వెళ్లిపోండి) అనిపిలుపు నిచ్చారు. 8న ముంబాయిలో జరిగిన సదస్సులో క్విట్‌ ఇండియా తీర్మానం జరుగగా మరుసటి (ఆగస్టు 9) రోజు నుంచి పెద్ద ఎత్తున లేచింది. దేశం మొత్తం మీదా ఈ ఉద్యమం పెరిగిపోవటం తో  కాంగ్రెస్‌ ఉద్యమకారులను బ్రిటీష్‌ సైనికులు విజృంభించి చెల్లాచెదురు చేసారు. ఈ ఉద్యమం బ్రిటిష్ పాలకులకు ముచ్చెమటలు పట్టేల చేసింది.   ఈ సందర్భముగా గాంధీజీని ఆగాఖాన్‌ భవనంతో నిర్బంధించారు. ఆయనతో పాటు గాంధీగారి భార్య కాస్తురిబాయి  జైలులోనే మరణించింది.  భారత స్వాతంత్రోద్యమానికి జాతిపిత మహాత్మా గాంధీ 1916 నుండి నాయకత్వం వహించారు. సత్యం- అహింసా, సిద్దాంతాలుగా, సత్యాగ్రహం ఆయుధంగా ఆయన చెప్పిన విషయాలు యావత్‌ భారత ప్రజలకూ ఆనాటి నుండి 'గాంధీ సిద్దాంతంగా మారింది. ఆయన వ్యక్తి సత్యాగ్రహం, నిరాహారదీక్ష మొదలగు అనేక ప్రక్రియలు చేబూని వ్యక్తిగతంగా ప్రయోగాలు చేశారు. ఎన్ని చేసి ఎంత నైపుణ్యంతో బ్రిటిష్‌ పాలకులతో చర్చలు జరిపినా ఫలితం లేకపోయింది. బ్రిటిష్‌ పాలకులు భారతదేశ ప్రజలతోగాని, జాతీయ నాయకులతోగాని చర్చలూ, సంప్రదింపులూ కూడా జరపకుండా, ఏకపక్షంగా భారతదేశ 40కోట్ల ప్రజల్ని 1939నాడు రెండవ ప్రపంచ యుద్ద మారణ హోమంలోకి ఈడ్చారు. ఈ దుశ్చర్యతో విసిగెత్తి పోయిన బాపూజీ, 1942 ఆగస్టు 9వ తేదీన జరిగిన అఖిలభారత కాంగ్రెస్‌ కమిటి ఆమోదించిన క్విట్‌ ఇండియా (భారత్‌ చోడ్‌) డూ ఆర్‌ డై (కరో యా మరో) తీర్మానాన్ని బలపరుస్తూ, సుదీర్ఘ ఉపన్యాసం ఇచ్చారు. ఈ ఉపన్యాసంలో చెప్పిన విషయాలు ఇలా ఉన్నాయి. భారతీయులకే కాక, ఎల్ల మానవాళికీ సర్వకాలాలకి వర్తించే తాత్విక సత్యాలతో పరిపక్వమైన రాజకీయ చాతుర్యాన్ని, ఎత్తుగడల్ని, రాజకీయ నైపుణ్యాన్నీ, విజ్ఞతనీ, గాంధీజీ విశ్వసించిన సిద్ధాంతాల నైతిక సూత్రాల పరిణితినీ రుజువు చేస్తున్నాయి. ప్రజాస్వామ్యంపైనా, భారత ప్రజలపైనా గాంధీజీకున్న ప్రగాఢ విశ్వాసాన్ని, నమ్మకాన్ని తదనంతర సంఘటనలు రుజువు చేసాయి. పైగా ఆయన ఇచ్చిన నినాదం 'కరో యా మరో తక్షణ కర్తవ్యంగా భారత స్వాతంత్య్ర సాధనానికి, ఆఖరి పిలుపూ, కార్యాచరణ వివరాలూ ఆ ఉపన్యాసంలో ఉన్నాయి. గాంధీజీ 'బహుశా ఇది ఆఖరిసారేమో, మనం కల్సుకోవడం అన్నపుడు ఎఐసిసి సభ్యులు బాగా  ఏడ్చేశారట. బానిసత్వంతో విసుగెత్తిపోయి, ఇంక భరించలేని ఆనాటి భారత ప్రజల యుద్ద నినాదం అది. అందుచేతనే ఆనాటి బ్రిటిష్‌ పాలకులను  ఆ ఉపన్యాసం, ఆ పోరాట నినాదం ఆయన 'డూ ఆర్‌ డై భయభ్రాంతుల్ని చేసి, ఆ ఉపన్యాసం ఇచ్చిన గంటల లోపునే గాంధీజీని ముఖ్య నాయకుల్ని ఆనాడే ఆగస్టు 9వ తేదీన అర్థరాత్రివేళ జైలుకు పంపించి నిర్భంధించారు. బ్రిటిష్‌ పార్లమెంటు చర్చల్లో గాంధీజీ ఉపన్యాసాన్ని విమర్శిస్తూ, అహింసా వాదులమని చెప్పుకొంటూ భారతదేశాన్ని హింసతో కూడిన అరాచకానికి, రక్తపాతానికి ప్రోత్సహించాడు గాంధీజీ అని ఆనాటి బ్రిటిష్‌ ప్రధాన మంత్రి సర్‌ విన్‌స్టంట్‌ చర్చిల్‌ నిందించాడు. ప్రజలకీ వార్త తెలియగానే ఉత్సాహవంతులూ, చైతన్యవంతులూ అయిన ప్రతీ భారతీయుడూ గాంధీజీ సందేశం ప్రకారం, తానే నాయకుడై యావత్తు దేశంలో బ్రిటిష్‌ పాలకులపై పోరాటాలు జరిపారు.  ఆ పోరాటంలో 5లక్షల మంది జైలు పాలైనారు. 5,000 గ్రామాలు బ్రిటిష్‌ ఊచకోతకు (ఎయిర్‌ స్ట్రాఫింగ్‌) బాంబులకు ఆహుతైనాయి).  40,000 మంది భారతమాత చరణాలపై ప్రాణాలు అర్పించారు.
  • 958 మంది దేశభక్తులకు కొరడా దెబ్బ శిక్షలు పడ్డాయి.  వేలాది గ్రమాలలో గ్రామస్వరాజ్యం స్థాపించగా, బ్రిటిష్‌ అధికారులు, తాబేదార్లూ తరిమివేయబడ్డారు. ఆగస్టు 14న పోలీసులు కాల్పులు జరిపి 76 గ్రామస్తులను కాల్చి చంపారు. 114 మందిని చావబాదారు. ఆ ప్రాంతంలో మొత్తం 60,000 మందిని అరెస్టు చేశామనీ, 940 మందిని చంపామనీ 1630 మంది క్షతగాత్రులయ్యారనీ బ్రిటీష్‌ పాలకులు ప్రకటించారు. 30 లక్షల మంది బెంగాల్‌ కరువులో మరణించారు.
  • ఎట్టకేలకు  1947 ఆగస్టు 15వ తేదీన బ్రిటిష్‌ సామ్రాజ్య పతాకం నేలకు దింపబడి భారతీయ స్వేచ్ఛా కేతనం, త్రివర్ణ పతాకం ధర్మచక్రంతో నీలాకాశాన రెపరెపలాడింది. గాంధీజీ ధర్మమా అని ఆయన నాయకత్వం వల్ల భారత ప్రజలలో స్వాతంత్య్రాపేక్ష, భయరాహిత్యం స్థిరంగా నెలకొల్ప బడ్డాయి. అందుచేతనే ఆయన ఇచ్చిన నినాదం చావోరేవో తెల్సుకొనే దృఢ నిశ్చయానికి బానిసత్వం నుండి పిరికితనం నుండి సంపూర్తిగా విడుదల చేయడానికి భారత ప్రజలను కృతనిశ్చయుల్ని చేసింది.
 క్విట్‌ ఇండియా తీర్మానం.   

మంగళవారం, ఆగస్టు 06, 2013

అలెగ్జాండర్ @ పెన్సిలిన్

మంగళవారం, ఆగస్టు 06, 2013

పెన్సిలిన్ ఇంజక్షన్ పేరు విననివారు ఉండరు. సర్వ రోగ నివారిణిగా పెన్సిలిన్ ను ఇప్పటికీ తిరుగేలేదు. ఇట్టి పెన్సిలిన్ ను కనుగొన్నవాడు అలెగ్జాండర్ ఫ్లెమింగ్. 1928 లో ఈ బాక్టీరియాలజిస్టు పెన్సిలిన్ కనుక్కొని లోకానికి గొప్ప ఉపకారం చేసిన వాడయ్యాడు.  

అలాంటి అలెగ్జాండర్ ఫ్లెమింగ్ జీవిత విశేషాలు గురించి సంక్షిప్తముగా తెలుసుకుందాం.  

స్కాట్లాండ్‌లో 1881 ఆగస్టు 6న ఓ రైతు కుటుంబంలో ఎనిమిది సంతానంలో చివరివాడిగా పుట్టిన ఫ్లెమింగ్‌, ఏడేళ్ల వయసులోనే తండ్రిని కోల్పోయాడు. అమ్మ పొలం పనులు చేస్తుంటే అక్కడి బడిలోచదివిన అతడు, ఆపై లండన్‌లో ఉండే పెద్దన్నయ్య దగ్గరకు వెళ్లి హైస్కూల్లో చేరాడు. అయితే ఆర్థిక ఇబ్బందుల వల్ల చదువు మధ్యలోనే ఆపేసి షిప్పింగ్‌ కంపెనీలో గుమాస్తాగా చేరాల్సి వచ్చింది. అనుకోకుండా ఆస్తి కలిసి రావడంతో తిరిగి ఇరవయ్యేళ్ల వయసులో చదువును కొనసాగించడం ప్రపంచానికెంతో మేలు చేకూర్చింది. సెయింట్‌ మేరీస్‌ కాలేజీలో వైద్యవిద్యలో చేరి చురుగ్గా చదువుతూనే రైఫిల్‌ షూటింగ్‌, ఈత, వాటర్‌పోలో క్రీడల్లో బహుమతులు పొందుతూ ఉండేవాడు. డిగ్రీ పొందాక పరిశోధనల్లో నిమగ్నమయ్యాడు. ఇరవై ఏళ్ల వయసులో తిరిగి చదువు మొదలెట్టి గొప్ప శాస్త్రవేత్త అయ్యాడు. గడ్డురోగాల నుంచి ప్రాణాలు కాపాడే మందు కనిపెట్టి మహోపకారం చేశాడు. ఆయన  1881 ఆగస్టు 6న జన్మించారు. అంటే ఈరోజు అలెగ్జాండర్ ఫ్లెమింగ్ పుట్టిన రోజు  .  ఈయన 1923లో లైసోజేమ్‌ అనే ఎంజైమును కనిపెట్టాడు.  1928లో పెన్సిలిన్‌ అనే యాంటిబయాటిక్‌ను కనిపెట్టాడు.  పెన్సిలిన్ లేదా పెనిసిలిన్ ఒక రకమైన మందు. ఇవి పెన్సిలియమ్ (Penicillium) అనే శిలీంద్రము నుండి తయారుచేయబడిన సూక్ష్మజీవి శకాలు(Antibiotic). వీటిని బాక్టీరియా కు సంబంధించిన ఇన్ఫెక్షన్స్ లో విరివిగా ఉపయోగిస్తారు.  ప్రకృతిలో తయారైన కొన్ని పదార్ధాల సమ్మేళనాలను కూడా "పెనిసిలిన్" అని వ్యవహరిస్తారు.  మొదటి ప్రపంచ యుద్ధం మొదలవడంతో సైనికులకు చికిత్సలు చేసే బృందానికి నాయకత్వం వహించాడు. గాయాలకు సూక్ష్మజీవుల వల్ల ఇన్ఫెక్షన్‌ సోకి చాలా మంది సైనికులు చనిపోవడాన్ని గమనించిన ఫ్లెమింగ్‌, యుద్ధానంతరం బ్యాక్టీరియాపై పరిశోధనలు చేయసాగాడు. వాటిలో భాగంగా 'స్టెఫైలో కోకి' (Staphylo cocci) సూక్ష్మజీవులపై పరిశోధన చేస్తుండగా ఓ రోజున చిన్న పొరపాటు జరిగింది. ఆ బ్యాక్టీరియా ఉన్న పాత్రలను బల్లపై పెట్టి మర్చిపోయి ఇంటికి వెళ్లిపోయాడు. ఆ మర్నాడు వచ్చి చూస్తే బయటి వాతావరణం ప్రభావం వల్ల ఓ పాత్రలో నీలిరంగులో బూజులాంటి తెట్టు (ఫంగస్‌) కట్టి ఉండడం గమనించాడు. చిత్రంగా ఆ బూజు ఆశించినంత మేరా పాత్రలో సూక్ష్మజీవులు నాశనమై కనిపించాయి. అంటే ఆ బూజులో సూక్ష్మజీవులను చంపే పదార్థమేదో ఉందన్నమాట! దాంతో ఫ్లెమింగ్‌ దానిపై పరిశోధనలు చేసి చిన్న కుంచెలాగా ఉండే పదార్థాన్ని వేరుచేయగలిగాడు. లాటిన్‌లో పెన్సిలియమ్‌ అంటే చిన్న కుంచె అనే అర్థం ఉండడంతో దానికి 'పెన్సిలిన్‌' అని పేరు పెట్టాడు. దాన్ని 1928లో కనిపెట్టగా, మరిన్ని పరిశోధనలు చేసి ఓ మందుగా మార్చి వాడుకలోకి తీసుకు రావడానికి 17 సంవత్సరాలు పట్టింది. దీంతో యాంటీబయాటిక్‌ యుగానికి నాంది పలికినట్టయింది. వెయ్యేళ్ల కాలంలోనే అతి గొప్ప ఆవిష్కరణగా, కోట్లాది మంది ప్రాణాలకు రక్షణగా గుర్తింపు పొందింది 'పెన్సిలిన్‌'. తొలి యాంటీ బయోటిక్‌గా పేరొందిన ఆ మందును కనిపెట్టిన శాస్త్రవేత్తే అలగ్జాండర్‌ ఫ్లెమింగ్‌. వేరే ప్రయోగం చేస్తుండగా జరిగిన చిన్న పొరపాటు వల్ల ఇది బయటపడడం విశేషం. పెన్సిలిన్‌ వల్ల క్షయ, న్యూమోనియా, టైఫాయిడ్‌ లాంటి ఎన్నో ప్రాణాంతక వ్యాధుల నుంచి మానవాళికి రక్షణ కలుగుతోంది. దీన్ని కనిపెట్టినందుకు ఫ్లెమింగ్‌ 1945లో నోబెల్‌ బహుమతిని పొందారు.  1999లో టైమ్స్‌ పత్రిక ఫ్లెమింగ్‌ను 20వ శతాబ్దంలోని 100 ప్రముఖ వ్యక్తుల్లో ఒకరిగా కీర్తించింది.  ఫ్లెమింగ్‌ పెడింగ్టన్‌లోని సెయింట్‌ మెరీస్‌ హాస్పిటలు వైద్య పాఠశాలలలో ఎంబిబిఎస్‌ చదివారు.  ఫ్లెమింగ్‌ సిప్టమర్‌ మేరియన్‌ మెకెల్రాట్‌ అనే నర్సును పెళ్లిచేసుకున్నారు.  ఫ్లెమింగ్‌ మొదటి ప్రపంచ యుద్ధంలో రాయల్‌ ఆర్మి మెడికల్‌ కోర్‌లో కెప్టెన్‌గా పనిచేశారు. యుద్ధ భూమిలో చాలా మంది సూక్ష్మజీవుల బారినపడి చనిపోవడం ఫ్లెమింగ్‌ పెన్సిలిన్‌ కనిపెట్టడానికి ప్రేరణ.  పెన్సిలిన్‌ సృష్టి ఆధునిక వైద్యశాస్త్ర గమనాన్నే మార్చివేసింది. పెన్సిలిన్‌ ప్రపంచవ్యాప్తంగా లక్షలాది ప్రాణాలు కాపాడింది. ఇప్పటికీ కాపాడుతూనే ఉంది.  పెన్సిలిన్‌ స్కార్లెట్‌ ఫీవర్‌, న్యుమోనియా, మెనింజైటిస్‌, డిఫ్తీరియా, గొనోరియాపై బాగా పనిచేస్తుంది.  ఫ్లెమింగ్‌కు రాయల్‌ కాలేజ్‌ ఆఫ్‌ సర్జన్స్‌, ఇంగ్లాడు హంటేరియన్‌ ప్రొఫెసర్‌ షిప్‌ ఇచ్చింది.  ఫ్లెమింగ్‌ 11.3.1955న గుండెపోటుతో మరణించారు.   వైద్యశాస్త్రంలో అద్భుతమైన యాంటీబయాటిక్ మందుగా పేరుపొందిన పెన్సిలిన్ పేరు చెప్పగానే అలెగ్జాండర్ ఫ్లెమింగ్ దాన్ని కనిపెట్టినట్టు గుర్తొస్తాడు. 1945లో వైద్యశాస్త్రానికి నోబెల్ బహుమానం ఈ పెన్సిలిన్ కనుగొన్నందుకు ఫ్లెమింగ్ తో పాటు హొవార్డ్ ఫ్లోరె, ఎర్నెస్ట్ చెయిన్ అనే మరో ఇద్దరు శాస్త్రవేత్తలకు కూడా ఇచ్చారు. అలెగ్జాండర్ ఫ్లెమింగ్ వంటి శాస్త్రవేత్తను ఆదర్సవంతముగా  .   శాస్త్రవేత్త   అంటే నాకు చాలా ఇష్టం.  నాకు మంచి inspiration గా అనిపిస్తుంది.  అలెగ్జాండర్ ఫ్లెమింగ్ జయంతి శుభాకాంక్షలు 

శనివారం, ఆగస్టు 03, 2013

స్నేహానికన్న మిన్న

శనివారం, ఆగస్టు 03, 2013

స్నేహం అంటే చాలా గొప్పబంధం. అలాంటి బంధం గురించి వర్ణించటం ఎవరి తరంకాదు . దానికి హద్దులు , ఎల్లలు వుండవు. మనకు అతి దగ్గర సన్నితులు కేవలం స్నేహితులు మాత్రమే. ఆతరువాతె ఎవరైనా. ఆఖరికి మన అమ్మానాన్నలైనా సరె. స్నేహితులు తరువాత.
స్నేహం అద్భుతమైంది. నిజమైన మిత్రులకు మించిన ఆస్తి లేదు. స్నేహానికి ఎల్లలు లేవు. అది సరిహద్దుల్ని చెరిపేస్తుంది. వికాసానికి బాటలు వేస్తుంది. మంచి మిత్రుడు తోడుంటే ఆయుధం ధరించినంత ధైర్యం ఉంటుంది. కన్నవారితో, కట్టుకున్నవారితో, తోడబుట్టిన వారితో చెప్పుకోలేని విషయాలను మిత్రులతో చెప్పుకోవడం మిత్రత్వం గొప్పదనం. కష్టసుఖాల్లో అండగా ఉండేవారు.. నిస్వార్థంగా సాయం అందించేవారు నిజమైన మిత్రులు.  స్నేహం ఓ మధురమైన అనుభూతి. దీనికి వయసుతో నిమిత్తం లేదు. ఆటపాటలాడే బాల్యం నుంచి వృద్ధాప్యం వరకు అందరిలో స్నేహ భావం ఉంటుంది. అటువంటి స్నేహానుభూతిని అనుభవిస్తేనే తెలుస్తుంది. సృష్టిలో నా అనేవారు,బంధువులు లేని వారైన ఉంటారేమే గాని స్నేహితులు లేని వారుండరు. ఇంట్లో చెప్పలేని సమస్యలు, బాధలు సైతం వీరితో ఎటువంటి దాపరికం లేకుండా చెప్పుకొని ఓదార్పు పొందుతాం. అదే స్నేహం.  స్నేహితులతో కలిసి ఉంటే ఎంతో ఆనందం మనతోనే ఉంటుంది.
ప్రతిఏటా ఆగస్టు నెలలో వచ్చే మొదటి ఆదివారం రోజున ప్రపంచమంతా 'ఫ్రెండ్‌షిప్‌ డే ' ను ఘనంగా నిర్వహించుకుంటారు.  ఇక్కడ ఒక మంచి పాట  స్నేహం గురించి. 
  
స్నేహానికన్న మిన్న లోకాన లేదురా
స్నేహానికన్న మిన్న లోకాన లేదురా
కడదాకా నీడ లాగ నిను వీడి పోదురా
ఈ గుండెలో పుచేటిది నీ శ్వాసగా నిలిచేటిది
ఈ స్నేహమోకటేనురా ...

తులతూగే సంపదలున్నా స్నేహానికి సరిరావన్నా...ఓ...
పలుకాడే బంధువులున్నా నేస్తానికి సరికారన్నా
మాయా మర్మం తెలియని చెలిమే ఎన్నడు తరగని పెన్నిధి రా
ఆ స్నేహామే నీ ఆస్థి రా నీ గౌరవం నిలిపేను రా
సందేహమే లేదు రా ...

త్యాగానికి అర్ధం స్నేహం లోభానికి లొంగదు నేస్తం...ఓ...
ప్రాణానికి ప్రాణం స్నేహం రక్తానికి రక్తం నేస్తం
నీది నాదను భేదం లేనిది నిర్మలమైనది స్నేహము రా
ద్రువతార లా స్థిరమైనదీ...ఈ జగతిలో విలువైనదీ...
ఈ స్నేహమోకటేనురా ...

స్నేహం గురించి ప్రముఖులు ఏమన్నారో తెలుసుకుందాం.  వారి మాటలను దృష్టిలో పెట్టుకుందాం  మరి.  
Everyone need Friendship

  • స్నేహం పాతబడిన కొద్దీ బాగుంటుంది.- చింగ్‌చౌ
  • శత్రువు ఒక్కడైనా ఎక్కువే. మిత్రులు వంద అయినా తక్కువే - వివేకానందుడు
  • విశ్వాసం లేకుండా స్నేహం ఉండదు - గౌతమబుద్ధుడు
  • మనిషికి అవసరంలో ఆదుకున్న మిత్రుడికన్నా ప్రియమైనది ఏదీ ఉండదు - గురునానక్
  • కష్టకాలంలోనే మిత్రుడెవరో తెలుస్తుంది - గాంధీ
  • అహంకారి కి మిత్రులుండరు - ఆస్కార్‌వైల్డ్
  • ఇచ్చింది మరిచిపోవడం, పుచ్చుకున్నది జ్ఞాపకం ఉంచుకోవడమే స్నేహం - గాంధీ
  • ఎవరితోనైనా స్నేహం చేయడం సులభమే, కానీ ఎక్కువ కాలం నిలుపుకోగలగడమే కష్టం -కార్డినల్‌న్యూమాన్
  • చెడ్డ మిత్రుల కన్నా మిత్రుడు లేక పోవడమే నయం - మార్టిన్ లూథర్‌కింగ్
  • నీ తప్పును, నీ తెలివి తక్కువ పనులను నీ ముందుంచువాడే నిజమైన నీ స్నేహితుడు - బెంజిమన్ ఫ్రాక్లిన్
  • మనిషిని బట్టే అతని స్నేహితుడు ఉంటారు - స్వీడెన్ బర్గ్
  • మాటలకే పరిమితమయ్యే మిత్రుడెపుడు నీ మిత్రుడుగా ఉండలేడు - లియోటాల్‌స్టాయ్
  • మిత్రున్ని మించిన అద్దం లేదు మిత్రుడు లేకుండా ఏ మనిషి సర్వసంపూర్ణుడు కాలేడు - సెయింట్ బెర్నార్డ్ 
  • స్నేహం కన్నా గొప్పది ఈ లోకంలో లేదు - రెవన్థ్ ఛొవ్దరీ

ఇలా ఒక్కొక్కరు మంచి స్నేహితుని గురించి వర్ణించారు.      స్నేహాన్ని అభివర్ణించటం చాలా కష్టం .

ఈరోజు స్నేహితుల దినోత్సవమే కాకుండా ఈరోజుకు ఇంకో ప్రత్యేకత వుంది అది ఏమిటంటే  sister's day. అన్నదమ్ములు మంచి స్నేహితులుగా వుండవచ్చు వుండకపోవచ్చు.  అక్కచెల్లులు  మాత్రము మంచి స్నేహితులుగా వుంటారుట .  
సరే మరి ఈరోజు friendship day  మరియు sister's  day  శుభాకాంక్షలు.

శుక్రవారం, ఆగస్టు 02, 2013

భారతదేశానికొక జాతీయ జెండా

శుక్రవారం, ఆగస్టు 02, 2013

శ్రీ  పింగళి వెంకయ్య గారు  మన జాతి మొత్తం గుర్తుచేసుకొని గర్వించగల మహామనిషి అందులోను ఈయన మన ఆంద్రుడు. ఈయన జన్మ్దదినము ఆగష్టు 2వ తారీకున.వెంకయ్య ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని కృష్ణా జిల్లా మచిలీపట్నము సమీపమున ఉన్న ప్రస్తుత మొవ్వ మండలములోని భట్లపెనుమర్రు  గ్రామములో హనుమంతరాయుడు మరియు వెంకటరత్నమ్మ దంపతులకు జన్మించారు.  ఈయన గొప్ప స్వాతంత్ర్య సమర యోధుడు మరియు భారతదేశ జాతీయ పతాక రూపకర్త .

1916 సంవత్సరం లక్నోలో జరిగిన భారత జాతీయ కాంగ్రెస్ సమావేశంలో వెంకయ్య తయారు చేసిన జాతీయ జెండానే ఎగురవేశారు.  లాలా హన్స్ రాజ్ మన జాతీయ పతాకంపై రాట్న చిహ్నముంటే బాగుంటుందని సూచించగా గాంధీజీ దాన్ని అంగీకరించాడు. అఖిల భారత కాంగ్రెస్ సమావేశాలు బెజవాడలో జరిగాయి. గాంధీజీ, వెంకయ్యను ఆ సమావేశానికి పిలిపించి కాషాయం- ఆకుపచ్చ రంగులు కలిగి, మధ్య రాట్నంగల ఒక జెండాను చిత్రించమని కోరాడు.  మహాత్ముని సూచనపై కాషాయం, ఆకుపచ్చ రంగులు కలిగి, మధ్యన రాట్నం చిహ్నం గల జాతీయ జెండాను సమకూర్చాడు వెంకయ్య. అనంతరం కోత్త ఆలోచన మీద, సత్య- అహింసలకు ప్రత్యక్ష నిదర్శనమైన తెలుపు రంగును కూడా ఉండాలని గాంధీజీ అభిప్రాయపడగా, వెంకయ్య ఆ జెండాలో అదనంగా తెలుపు రంగును చేర్చి నేటి త్రివర్ణ పతాకాన్ని దేశానికి అందించారు. కాషాయ రంగు హిందువులకు చిహ్నమని, ఆకుపచ్చ ముస్లింలకని పేర్కొనడంతో, ఇతర మతాలకు కూడా ప్రాధాన్యం ఇవ్వాలనే అభిప్రాయం వెలువడడంతో గాంధీజీ సూచనపై ఆకుపచ్చ, కాషాయ రంగులుతో పాటు తెలుపు కూడా చేర్చి త్రివర్ణ పతాకాన్ని వెంకయ్య రూపొందించాడు. మధ్యనున్న రాట్నం చిహ్నం గ్రామ జీవనాన్ని, రైతు కార్మికత్వాన్ని స్పురింప చేస్తుందన్నారు. అంటే కార్మిక కర్షకులపై ఆధారపడిన మన దేశం, సత్యాహింసలపై ఆధారపడటంతో సుభిక్షంగా ఉంటుందని మన ఆశయం. ఆ ఆశయ చిహ్నమే మన త్రివర్ణ పతాకం.1947జూలై 22 వ తేదీన భారత రాజ్యాంగ సభలో నెహ్రూ జాతీయ జెండా గురించి ఒక తీర్మానం చేస్తూ , మునుపటి త్రివర్ణ జెండాలోని రాట్నం మాత్రం వదిలి, దాని బదులు అశోకుని ధర్మచక్రం చిహ్నంగా యిమిడ్చారు. చిహ్నం మార్పు తప్పితే శ్రీ పింగళి వెంకయ్య రూపొందించిన జెండాకు నేటి జెండాకు తేడా ఏమీ లేదు. అశోకుని ధర్మచక్రం మన పూర్వ సంస్కృతికి సంకేతం. శ్రీ  పింగళి వెంకయ్య 1906 నుంచి 1922 వరకు భారత జాతీయోద్యమంలోని వివిధ ఘట్టాలలో పాల్గొన్నాడు. వందేమాతరం, హోంరూల్ ఉద్యమం, ఆంధ్రోద్యంలాంటి ప్రసిద్ధ ఉద్యమాలలో ప్రాధాన పాత్రధారిగా ఉన్నాడు.  గాంధీజీ ప్రోద్భలంతో త్రివర్ణపతాకం పుట్టింది ఆంధ్రప్రదేశ్ లోనే. మన జాతికొక పతాకం కావాలని, అదీ ఒక ఆంధ్రుని ద్వారా రూపొందిచడటం , ఆంధ్రులందరికీ గర్వకారణమైన విషయం. .జాతీయ పతాకం రెప రెప ఎగిరినంతకాలం వరకు స్మరించుకోదగిన ధన్యజీవి శ్రీ పింగళి వెంకయ్య . ఆయన జన్మదినము నాడు ఆయన గురించి తెలుసుకొని వివరిస్తున్నందుకు నేను చాలా సంతోషిస్తున్నాను. 
జైహింద్ 

My Blog Lovers

నా యూట్యూబ్ చానల్స్ ప్లీజ్ సబ్స్క్రిబ్ చేయండీ

Diabetic Challenger

DIABETIC CHALLENGER YOUTUBE CHANNEL. PLASE SUBSCRIBE MY CHANNEL...... THANK YOU VERY MUCH.

Ammamma Tho Nenu (అమ్మమ్మ తో నేను

Please subscribe our channel Ammamma Tho Nenu (అమ్మమ్మ తో నేను)