ధనుర్మాసం అనగానే అది మార్గశిరమాసం లో వస్తుందని అందరికి తెలుసు కదా మరి మర్ఘశిరమాసం వచ్చింది దనుర్మాసం కూడా మొదలు కాబోతుంది. ఎంతో విశేషమైన రోజులు. ఈ దనుర్మాసం నెల రోజులు శ్రీ వెంకటేశ్వర స్వామికి సుప్రభాత సేవకు బదులుగా గోదాదేవి పాడిన ౩౦ పాశురాలును పాడతారు ఇది చాలా విశేషమైననెల.
అంత విశేషమైన ఈ నెలరోజులు చంద్రమానము బట్టి చేయుటకు గుర్తుగా ఆ నెలరోజులు ఇంటి ముంగిట పండగ వాతావరనముతో విశేషమైన ముగ్గులు పెట్టి అందులో నేలగంట పెడతారు . ఆ నెలరోజులు వైష్ణవ గుళ్ళకు వెళ్ళతారు ఈ నెలరోజులు రోజుకు ఒక పాశురమ్ చదువుతారు . ఇలా 30 రోజులు పాశురములు నివేదిస్తారు.
శ్రీ కృష్ణ పరమాత్ములవారు నీలా దేవి యొక్క ఉన్నతమైన స్తనగిరులలో నిద్రించుచున్నారు . ఆ నిద్రిస్తున్న కృష్ణ సింహమును మేల్కొల్పినది అమ్మ గోదామాత . ఆయనికి ఉపనిషత్తు లలొ ప్రతిపాదించబడిన పరతంత్రమును పాఠమును చెప్పినది . తాను అనుభవించిన వదన మాలికతో అతనిని బంధించింది . అలాంటి అలాంటి గోదాదేవికి నా మరలా మరలా నమస్కారములు .
మనము కూడా మాయచే నిద్రించుచున్నాము. కాని పరమాత్మ నిద్రించడు , అట్టి పరమాత్మకు నిద్ర తెప్పించు సౌందర్యరాశి నీలాదేవి. ఆయనని మెల్కొల్పినధి గోదాదేవి. ఆలాంటి పరమాత్మకే ఉపదేసించినధి ఈ గోదాదేవి. ఆమె పరమాత్మను తాను అనుభవించి విడిచిన పూమాలలతో మరియు పాశురములతో బంధించింధి. తాను చెసిన కర్మకు ఫలితంగా పరమాత్మనే అనుభవించింధి. శ్రీ గోదాదేవి. ఈ స్థితి కేవలము శ్రీ గోదామాతకే చెల్లినది. ఆమె దరించిన మాల పరమాత్మ స్వీకరించుటచే ఆమెకు ఆముక్తమాల్యద" అని పేరు వచ్చినది. మాలలు తయారు చేయువాని బిడ్డ కావునా కోదై అని అంటారు. కోదై అంటే గోదా అని అర్దం. ఇలా భట్టనాధుని కూతురై , శ్రీ రంగనాధుని ప్రియురాలై, భగవద్రామనుజులకు అభిమాన సొదరైన ఆండాళి కు మరలా మరలా నేను నమస్కారిస్తున్నాను. . గోదాదేవి భగవంతుని విషయంలో ఏవిధమగు దాస్యము కోరుకున్నదో, ఆ విధముగా దాస్యము ఆమె యెడ మాకు లభించుగాక అని పరాశర భట్టారువారు ప్రార్ధించిరి.
ఈరోజు చాలా ఇంపార్టెంట్ టాపిక్ తో మీముందుకు శీతాకాలం చర్మరక్షణ అన్న విషయంతో మీ ముందుకు వచ్చాను. మధుమేహులు తీసుకోవలసిన ప్రత్యేక రక్షణ ఎలా తీసుకోవాలి మొదలగు విషయాలు చెప్పాను ఈ వీడియో పూర్తిగా చూసి మీ సలహాలు సూచనలు తెలపండి ధన్యవాధములు.
Hii all welcome to my channel Diabetic Challenger, Today I came with top 5 healthy snacks which are diabetic friendly, sugar free which can be made in less than 30 minutes. Kids with type 1 diabetic can also enjoy the snacks, Plz watch full video and give your valuable likes, and comments thank you. Once again wish you all a Happy Diwali.
దీపావళి అంటే మన అందరికి చాలా ఇష్టం . ఐతే చాలామంది లో దీపావళి అంటే దీపాలు వెలిగించటమే కదా!
కాని దీపావళికి చాలా విశిష్టత వుంది . దీపావళి పండుగ చేసుకునే విధానం కుడా వుంది . ఇవి చాలామందికి తెలిదు. పూర్వపు పద్ధతులు మరచి పోయారు. ఆ రోజుకి స్వీట్స్ కొనుక్కొని వచ్చి వెరైటి వంటలుచేసుకొని , రాత్రి దీపాలు వెలిగించి టపాసు కాల్చుకొని ఎంజాయ్ చేయటమే అనుకుంటున్నారు మనలోచాలామంది.
దీపావళి పండుగ ఆశ్విజ బహుళ చతుర్దశి అమావస్య నాడు వస్తుంది. ఇది రెండురోజుల పండుగ త్రయోదశి నాటి రాత్రి అపమృత్యు నివారణ కోసం ప్రమిదలతో దీపాలు వెలిగించి ఇంటిముందు వుంచాలి. నరకచతుర్దశిని ప్రేతచతుర్దశి అని కుడా అంటారు. ఎందుకంటే ఇది యమునికి కుడా ప్రీతి కలిగించేరోజు.యముడు పితృత్వం కూడా ఉన్నా దేవుడు. సూర్యోదయానికి ముందు, రాత్రి తొలి జాములో నువ్వులనూనెతో తలంటు పోసుకోవాలి. ఇలా చేయడంలో చాలా విశేషం వుందిట. దీపావళి పర్వదినాలలో నువ్వుల నూనెలో లక్ష్మి దేవి ఉంటుందిట. . అలాగే నదులు, చెరువులు, బావులు, కాలువలు, వంటి అన్నిజలవనరులలోకి గంగాదేవి ఆ రోజుల్లో ప్రవేశిస్తుందిట . నువ్వులనునేల్తో అభ్యంగనస్నానం చెయ్యడం వల్ల దారిద్య్రం తొలగి గంగాస్నాన ఫలం లభిస్తుందిట. నరక బాధలు తప్పుతాయట . చివరకు సన్యాసులు కుడా చేస్తారుట. స్నానం కూడా ఎప్పుడు పడితే అప్పుడు చెయ్యడం కాదు. సూర్యోదయానికి ముందు నాలుగు ఘడియల కాలం అరుణోదయం అంటారు . ఆలోగా చెయ్యాలి. స్నానం చేసేటప్పుడు ఉత్తరేణి కొమ్మను శిరస్సు మీద తిప్పుతూ ఈ శ్లోకం పాటించాలి .
శీతలోష్ట సమాయుక్త సకంటక దలాన్విత
హరపాప మపామార్గ భ్రామ్యమానః పునః పునః
అపామార్గం అంటే ఉత్తరేణి . ఇలాచేయటం వల్ల నరకం రాదట. నువ్వులనునే , ఉత్తరేను మొదలైనవి ప్రకృతితో మనకు ఎంత ముడిపది వున్నామో తెలుస్తుంది. ప్రకృతి సామరస్యంలో మనం జేవించాలని ఇందులో సందేశం. ఇందు వల్ల నరకం భయం అన్నది ఉంటే అది మన భావన ద్వారా ఆ స్థితికి చేరుకుంటాముట . స్వర్గనరకాలు మనస్సు నందు కల్గేవే. ఇది అంతా మనసుకి శిక్షణ ఇవ్వటమే. స్నానం తరువాత `యమాయ తర్పయుఆమి, తర్పయామి, తర్పయామి' అంటు మూడుసార్లు నువ్వులతో యమునికి తర్పణాలు ఇవ్వాలి.
దీపావళి రోజు మినపాకుతో చేసిన కూరతొ భోజనం చేస్తే మంచిది అని అంటారుట. దీపదానం: సాయంకాలం ప్రోదోషసమయంలో నువ్వులనూనెతో దీపాలు పెట్టాలి . విష్ణ్వాలయంలో, శివాలయాలలో, మతాలలో , దీపాలు పెట్టడంతో పాటు నదీతీరాలలో, చేరుగాట్లు, తోటలు, వీధులు, పర్వతాల్పైన చివరకు స్మసానాలల వద్ద కుడా దీపాలు పెట్టాలని పెద్దల శాసనం. దీపావళి రోజున పితృదేవతలు తమతమ సంతానం ఇంటిని దర్సిస్తారట. వారికి మనం పెట్టె దీపాలే దారి చుపిస్తాయట . దీపావళినాడు మరి ముఖ్యంగా ఐదు ప్రదేశాలలో దీపాలు పెట్టాలిట .అవి:
1) ఇంటిధ్వారం. 2) ధాన్యపుకొట్టు. ౩) బావి. 4) రావిచెట్టు. 5)వంటిల్లు . ఇంట్లో ఆశుచం ( మైల) పాటిస్తున్నాసారే ఈ ఐదు చోట్లా దీపం పెట్టవలసిందే. ఉల్కాదానం: యముడు దక్షినదిసగా ఉంటాడు. మగపిల్లలు ఆ దిక్కువైపు నిలబడి దివిటీలు వెలిగించి పితృదేవతలకు దారి చూపించాలి. తర్వాత కాళ్ళు కడుక్కుని లోపలికి వచ్చి ఏదైనా తీపి పదార్ధాలు తినాలి. లక్ష్మి పూజ : దీపాలు వెలిగించి వాటిలోకి లక్ష్మి దేవిని ఆహ్వానించి లక్ష్మీపూజ చెయ్యాలి. ఆ తర్వాత బాణసంచా వెలిగించాలి. అర్ధరాత్రి స్త్రీలు అందరు కలసి చేతలు, వాయిద్యాలు మోగించాలి. దారిద్రాన్ని దూరంగా తరిమికొట్టడానికి ఇలా చెయ్యడం ను "అలక్ష్మినిస్సరణం" అని అంటారు. మనం టపాసు పెల్చడంలోని అర్ధం ఇదే. ఈ టపాసుల వల్ల వర్షాకాలంలో పుట్టిన ఎన్నో క్రిములు కీటకాలు ముక్తి ని పొందుతాయి. కార్తీకమాసం అంతా దీపాలు వెలిగించేది అందుకే. రోజూ సాయంకాల దీపం వెలిగించి శ్లొకం చదివి తే చాలామంచిధీ.
దీపం జ్యొతిః పరబ్రహ్మ, దీపం జ్యోతి జనార్దనః దీపేన హరతే పాపం సంద్యాదీపం నమోస్తుతే, సాయంత్రం సంద్యాదీపం వెలిగించీ ధానికి నమస్కారిచుట చాలాపున్యము. దీపం అంటే పరమాత్మ . దీపంకు నమస్కరించుట పరమాత్మకు నమస్కరించుటే .
దిబ్బు దిబ్బు దీపావళి
మళ్ళీ వచ్చే నాగులచవితి...
అంటూ చిన్న పిల్లలంతాగోగునారకట్టలకి చిన్న చిన్న గుడ్డ ముక్కల్ని కట్టి వెలిగించి దిష్టి తీయడాన్ని మనంసంప్రదాయంగా కొన్ని ప్రాంతాలల్లో చూస్తూంటాం. ఆ దీపం వెలిగించిన తరువాత కాళ్ళు కడుక్కుని ఇంటిలోపలకు వచ్చి తీపి పదార్థం తింటారు. దీపావళి రోజు శ్రీమహాలక్ష్మికి పూజ చేయాలి. శ్రీసూక్తము గాని, లక్ష్మీసహస్రనామ స్తోత్రం కానీ, అష్టోత్రంకానీ చేసుకోవటంవల్ల లక్ష్మీ కటాక్ష్మము లభిస్తుందిటమరి.
అసుర నాశనానికి, ధర్మ ప్రతిష్టాపనకు గుర్తుగా అమావాస్యనాడు జరుపుకునే దీపావళి పండుగనాడు లక్ష్మీదేవికి ప్రతీకగా వెలుగులు విరజిమ్మే దీపలక్ష్మిని పూజించడం సర్వశుభాలు ప్రసాదిస్తుంది.
దీపావళి చుట్టూ అనేకానేక కథలు ఉన్నాయి. శ్రీకృష్ణుడు సత్యభామ సహకారంతో నరకాసురుణ్ణీ వధించాడు గనుక ప్రజలు ఆనందంతో మరునాడు దీపావళి సంబరం చేసుకుంటారని ఒక కథ. ఇంకో కథకూడా ఉంది. లంకలో రావణుని సంహరించి , రాముడు సీతాసమేతంగాఅయోధ్య కు తిరిగి వచ్చినప్పుడు ప్రజలు ఆనందంతో ఈ పండుగ జరుపుకున్నారని చెబుతారు. ఉత్తరాదివారు ముఖ్యంగా వ్యాపారులు దీపావళి రోజును కొత్త సంవత్సరంగా పాటిస్తారు.
మధుమేహులు వైట్ రైస్ ఎందుకు తినకుడదు? ఎలా తినాలి మరి 🍚(White rice is good or bad)
ఈరోజు మన వీడియోలో చాలా ముఖ్యమైన విషయం గురించి మాట్లాడానండి. అదేమిటంటే
మధుమేహులు వైట్ రైస్ ఎందుకు తినకూడదు.
తినాలి అనుకుంటే ఎలా వండుకు తింటేమంచిది.
అసలు ఏ రైస్ తింటే మంచిది.
ఇంకా చాలా టిప్స్ తో ఆరోగ్య విలువలుతో ఎన్నోవిషయాలు చెప్పాను. ఈవీడియో చూసి మీ అభిప్రాయాన్ని నాతో పంచుకోండి మరి.
నమస్కారం.అందరికీ డయాబెటిక్ చాలెంజర్ చానల్ కి స్వాగతం.
మనలో చాలా మందికి ఇంట్లోనే గ్లూకోమీటర్(glucometer) ను వుపయోగించి రక్తంలో షుగర్(Blood sugar testing) ని పరీక్షించుకోవటం తెలుసు. కానీ చాలా మందికి గ్లూకోమీటర్ లో ఒక్కొక్కసారి ఎర్రర్స్(errors) ని చూపిస్తుంది. కానీ అవి ఏమిటి అన్నది తెలియదు. ఈరోజు మనం ఆ errors గురించి
తెలుసుకుందాం.(today i our video lets see the errors and solutions for that errors)
నమస్కారం.అందరికీ డయాబెటిక్ చాలెంజర్ చానల్ కి స్వాగతం.
వర్షాకాలం వచ్చింది కదండి. డయాబెటిక్ వారికి ఇమ్యునిటి తక్కువగా వుంటుంది కదండి. వారికి ఇమ్యునిటి పెంచుకోటంకోసం ఒక మంచి రిసిపి చెప్పానండి. అది ఇప్పటివరకు ఎవరైనా చేసారో లేదో నాకు తెలియదుకానీ. నేను స్వయంగా చేసాను. చాలా రుచిగా వుంది. మీరు కూడా చేసి రుచి చూడండి. మీ అభిప్రాయం నాతో పంచుకోండి మరి.
Please watch my blog also
http://laharicom.blogspot.com/
-~-~~-~~~-~~-~-
Please watch: "(212) నిముషాలలో తయారుచేసుకునే సుపర్ వెజిటేబుల్ ఫ్రై........😋😋😋😋😋(Instant stirfry with vegetable) "
https://www.youtube.com/watch?v=WXwzg...
#Apple#wood apple #velagapandu#recipe in telugu
నమస్కారం.అందరికీ డయాబెటిక్ చాలెంజర్ చానల్ కి స్వాగతం. వెలగపండు(wood apple),మనలో చాలా మందికి ఈ పండు(fruit) గురించి తెలిసే వుంటుంది. ఈ పండును వినాయక చవితికి సందర్భంగా వినాయకుడిని నైవేధ్యంగా పెడతారు. అని అందరికి తెలుసు. మరి మన ఆరోగ్యానికి(health) ఏరకంగా ఉపయోగపడుతుందో ఈ వీడియో లో తెలుసుకుందా.
In this video we will see Health benefits about wood apple how is it important for health and people with diabetes.Can diabetic patients eat wood apple?What are health benefits with wood apple?
https://www.facebook.com/sree.vaishnavihttps://twitter.com/sreevaishnavihttps://www.instagram.com/diabetic_challenger123/http://laharicom.blogspot.com/
.
నమస్కారం.అందరికీ డయాబెటిక్ చాలెంజర్ చానల్ (Diabetic challenger) కి స్వాగతం.
రెడ్ రైస్ (Red Rice) బ్లడ్ షుగర్ (blood sugar)ను తగ్గించే లక్షణాలు చాలా అధికంగా ఉన్నాయి. బ్లడ్లో షుగర్ లెవెల్స్ తగ్గితే ఇన్సులిన్ (Insulin)బాగా ఉత్పత్తి అవుతుంది. ఇన్సులిన్ సరిగా ఉత్పత్తి అవ్వటం వల్ల షుగర్ వ్యాధి (Diabetes)వల్ల వచ్చే సమస్యలు వుండవు. అందువల్ల డయాబెటిస్ కంట్రోల్లో ఉండాలంటే రెడ్ రైస్ కి మారటం మంచిది.
రెడ్ రైస్ వల్ల కలిగే వుపయోగాలు ఇంకాచాలావున్నాయి అవి ఏమిటో తెలియాలంటే ఈ వీడియో పూర్తిగా చూడాలి. (Red rice uses )