Blogger Widgets

శనివారం, డిసెంబర్ 18, 2010

తిరుప్పావై 2 వ పాశురం -వ్రత నియామాలు

శనివారం, డిసెంబర్ 18, 2010


మరి మొదటి పాటలో తామేమి పొందదలచి ఈ వ్రతం చేయడలచుకున్నారో , ఈ వ్రతమునకు సాయపడు వారు ఎవరో, ఆ వ్రతమును జేయుటకు తమకుగా అధికారమేమో వివరించినారు. ఈ దిన ఒక కార్యము చేయ దలచుకున్నప్పుడు ముందుగా తెలుసుకోవలసినవి ఆ మూడే. ఏ ఫలము కాంక్షించి ఈ కార్యము చేయుచున్నామో తెలిసి ఫలము తప్పక పొమ్దదగినదె అని తెలిసిన కాని కార్యమునందేవరికిని ప్రవృత్తి కలగదు. ఆ ఫలము మంచిదే అని తిలిసినా తము చేయగలమా ,చేయలేమా , మద్యలో శక్తి లేక మాని నవ్వులపాలగుదురు. దానికి కావలసిన పరికరాలు సమకుర్చుకో గలమో లేమో నిర్నయిమ్చుకోవాలి . ఆ కార్యము చేయుటకు తనకు గల అధికారాన్ని తెలుసుకోవాలి .
ఇవన్నీ సమకుర్చగలది కేవలము కృష్ణుడే అని తెలిసిన నీకు అన్ని సమకురినట్లే.
దీనికి శ్రీ కృష్ణుడే ఉపాయం , శ్రీ కృష్ణుని పోడుతయే ఫలమని విశ్వసించి వానిని కైమ్కరమునదే రుచిగాగల నియామాలుందున ? అసలు నియమాలు పాటించాలా? వారు గొల్లపిల్లలు కదా ? వారికి నియమాలు ఎలాతెలియును?
వీటన్నిటికీ ఒకటే ఉపాయమున్నది. భగవంతునిపై భక్తి , పరిసుద్దమైన మనసు కలిగిన చాలు .
కాని భక్తులు భాగాత్స మ్రుద్దికి భగవద్భాక్తులు ఆనందముగా కొన్ని నియమాలు పాటిమ్చుదురు .
వానిని ఈ పాశురములో వివరించుదురు.
వైయత్తు వాళ్ వీర్గాళ్! నాముం నం పావైక్కు
శెయ్యుం కిరిశైగళ్ కేళీరో పాఱ్కడలుళ్
పైయత్తుయిన్ఱ పరమనడి పాడి
నెయ్యుణ్ణోం పాలుణ్ణోం నాట్కాలే నీరాడి
మైయిట్టెళుదోం మలరిట్టు నాం ముడియోమ్
శెయ్యాదన శెయ్యోం తీక్కుఱళై చ్చెన్ఱోదోమ్
ఐయముం పిచ్చైయుం ఆందనైయుం కైకాట్టి
ఉయ్యుమాఱెణ్ణి ఉగందేలోర్ ఎమ్బావాయ్
 
తాత్పర్యము : శ్రీ కృష్ణుడు అవతరించిన కాలములో పుట్టి దుః ఖమగు ఈ ప్రపంచములో కుడా ఆనందమునే అనుభావిమ్చుచున్న వారలారా ! మేము మావ్రతమునకు చేయు క్రియాకలాపము వినుడు:-
పాలసముద్రములో ద్వానికాకుండా మెల్లగా పడుకోనివున్న ఆ పరమ పురుషుని పాదములకు మంగళము పాడదేము . ఈ వ్రతసమయములో నేతిని కాని పాలను కాని మేము ఆరగింపము . తెల్లవారు జామున స్నానము లు చేసెదము . కంటికి కాటుక పెట్టుకోము . కొప్పులో పువ్వులు ముడువము. మా పెద్దలు ఆచరించని పనులు మేము ఆచరించము . ఇతరులకు బాద కలిగించెపనులు మేము చేయము. అసత్యాలాడము. ఎచ్చటా పలుకము.ఙానులకు అధిక ధన ధాన్యాధులు తో సత్కరించుదుము. బ్రహ్మచారులకు సన్యాసులకు భిక్షలను ఉంచుధుము. మీము ఉజ్జీవించు విధముగానీ పర్యాలోచన చేసికొనెదము. దీనిని అంతావిని మీరానదింప కోరుచున్నము.

విశెషార్ధము:- తమతో వ్రతమునకు రాబోవుచున్న గోపికలను ఉద్దెసించి తామీ వ్రతములొ చెయవలసినవి , చెయకుడనివి ఇందు వివరించుకున్నరు.

శుక్రవారం, డిసెంబర్ 17, 2010

The Geeta

శుక్రవారం, డిసెంబర్ 17, 2010

dhritarashtra uvaca
dharma-kshetre kuru-kshetre samaveta yuyutsavah

mamakah pandavas caiva kim akurvata sanjaya

ధృతరాష్ట్ర ఉవాచ:
ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతా యుయుత్సవః |
మామకాః పాండవాశ్చైవ కిమకుర్వత సంజయ ||
Dhritarashtra said:
O Sanjaya, assembled at the holy-field and place of pilgrimage of Kurukshetra, raring to fight, what did my sons and the sons of Pandu do?

ధృతరాష్ట్రుడు పలికెను: ఓ సంజయా! ధర్మక్షేత్రమైన కురుక్షేత్రమునందు నా తనయులూ మరియు పాండురాజు తనయులు యుద్దము చేయగొరువారై సమకూడిన పిమ్మట ఏమి చేసిరి?
అన్న శ్లోకం తో భగవద్ గీత ప్రారంభం అయ్యింది.  మొత్తం గీతలో దృతరాష్ట్రుడు ఒక్క శ్లోకం మాత్రమె చెప్తాడు.
అప్పుడు సంజయుడు 
sanjaya uvaca

drishtva tu pandavanikam vyudham duryodhanas tadaacaryam upasangamya raja vacanam abravit
 Sanjaya said:
Dhrtarastra! After seeing the army of the Pandavas arranged in a military array, overwhelmed King Duryodhana went to  Dronacharya and spoke these words:

దృష్ట్వా తు పాణ్ణవానీకం వూఢం దుర్యోధనస్తదా |
ఆచార్యముపసంగమ్య రాజా వచనమబ్రవీత్ ||

సంజయుడు పలికెను: ఓ రాజా! పాండవులచే వ్యూహముగా ఏర్పాటు చేయబడిన సైన్యమును గాంచి దుర్యోధనుడు తన గురువు చెంతకు చేరి ఇట్లు పలికెను.
అని సంజయుని మొదటి శ్లోకం.
అసలు గీత జననం శ్రీ క్రిష్నులవారు అర్జునునికి అమవాస్యరోజు చెప్పారు అది పదకొండు రోజులు తరువాత ఏకాదశి రోజు బయటికి వచ్చింది అదే మనం అందరం గీతాజయంతిగా జరుపుకుంటున్నాం.
మహా భారతం లో భీష్మ పర్వంలో గీత సంపూర్తి అయిన పిదప గీతా శ్లోక సంక్య ను గురించి వివరించారు.
శ్లోకం: షట్సాతాని సవింశాని శ్లోకానాం ప్రాహ కేశవః
అర్జునః  సప్తపంచాసత్ సప్తషష్టిం చ సంజయః
దృతరాష్ట్రః శ్లోకం మేకం గీతాయా మానముచ్యతే
తాత్పర్యం: గీతయందు శ్రీ కృష్ణముర్తి 620 శ్లోకంలను, అర్జునుడు 57 శ్లోకాలను, సంజయుడు 67  శ్లోకాలను,  
ధృతరాష్ట్రుడు 1 శ్లోకం చెప్పిరి.  మొత్తం మీద ౭౪౫ శ్లోకాలు అని తెలుస్తోంది.

మనం కృతజ్ఞ్యతలు తెలుపుకోవాలి ఎవరెవరికి అంటే 
గీత ను భోధించిన కృష్ణులవారికి 
గీత కు నిమితమాత్రుడైన అర్జునుడికి 
గీత ను చందోబద్దంగా మనకు అందించిన వ్యాసునికి
గీత  ను రాసిన శ్రీ విఘ్నేసునకు 
గీత ను ఓమ్ ప్రధంగా ప్రచారం చేసిన సంజయునికి
గీత యొక్క తాళ పత్రాలను కాలగర్భములో కలవకుండా కాపాడిన పుణ్యాత్ములకు 
గీత యొక్క చిన్న చిన్న భావాలను మనకు అర్ధం అయ్యేలా చెప్పిన భాష్యకారులకు
గీత ని ఇంటి ఇంటికి ప్రచారం చేసిన, మరియు చేస్తున్న గీతా ప్రచారులకు 
మన లోకం అంతా కృతజ్నతలుతో వుండాలి .
The Gita is the most beautiful and the only truly philosophical song. It contains sublime lessons on wisdom and philosophy. It is the “Song Celestial”. It is the universal gospel. It contains the message of life that appeals to all, irrespective of race, creed, age or religion.

గురువారం, డిసెంబర్ 16, 2010

ముక్కోటి ఏకాదశి /గీతాజయంతి

గురువారం, డిసెంబర్ 16, 2010

సంవత్సరానికి 24 ఏకాదశులు వస్తాయి  సూర్యుడు ఉత్తరాయణానికి మారే ముందు వచ్చే ఏకాదశిని వైకుంఠ ఏకాదశి లేదా ముక్కోటి ఏకాదశి అంటారు   ఈరోజునే వైకుంఠ ద్వారాలు తెరుచుకువుంటాయని. వైష్ణవ గుళ్ళుదగ్గర ఉత్తరంవైపు వున్నద్వారం వైపునుండి భక్తులు భగవంతుని దర్శిస్తారు.  ఈరోజున ముక్కోటి దేవతలు భూమికి వచ్చి ఉత్తరద్వారం వైపునుండి స్వామిని ధర్శిస్తారు. అందుకే ముక్కోటి ఏకాదశి అంటారుట. 


 ఈరోజునే పాలసముద్రం నుండి విషం మరియు అమృతం పుట్టాయి.  ఈరోజే  పరమ శివుడు విషం మింగాడు.   ఈరోజు చాలా మంది ఉపవాశం వుంటారు. 
ఈరోజునే గీతాజయంతి కూడా అందుకే చాలా విశేషమైనదిగా చెప్పుకోవచ్చు.  
మహాభారతంలో శ్రీ కృష్ణుడు అర్జునునికి చేసిన ఉపదేశమే గీత.  గీతలో మొదటి శ్లోకం
ధృతరాష్ట్ర ఉవాచ: 
ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతా యుయుత్సవః | 

మామకాః పాండవాశ్చైవ కిమకుర్వత సంజయ ||
ధృతరాష్ట్రుడు పలికెను: ఓ సంజయా! ధర్మక్షేత్రమైన కురుక్షేత్రమునందు నా తనయులూ మరియు పాండురాజు తనయులు యుద్దము చేయగొరువారై సమకూడిన పిమ్మట ఏమి చేసిరి?
అని ధృతరాష్ట్రుడు అనగా ఈ గీతను సంజయుడు ధృతరాష్ట్రుడికి  వివరించాడు ఆరోజే గీత జయంతిగా చెప్తతారు.  భగవత్ గీత భగవాన్ శ్రీకృష్ణుడు అర్జునుడికి కురుక్షేత్ర సంగ్రామ భూమి లో ఉపదేశిస్తాడు.అన్ని సంధి ప్రయత్నాలూ విఫలమైన తర్వాత, యుద్ధం ప్రకటిస్తారు పాండవులు. సంగ్రామ భూమిమీద అడుగు పెట్టిన తర్వాత ఆ మహా సైన్యం చూసి, వారిలో తన తాత అయిన భీష్ముడు వంటి వారిని చూసి నేను యుద్ధం చేయలేను అని అస్త్త్రాలు విడిచి పెట్టాడు.  అప్పుడు శ్రీ కృష్ణులు వారు గీతోపదేశం చేసారు. దాని సారం శాంతి. కృష్ణుడు అర్జునుడుతో ఇలా ఇన్నారు.
మిత్రమా !ఎందుకు భాధపడుతున్నావు !అయ్యిందేదో అయిమ్ది. పోయిమ్దేదో పోయిమ్ది .
ఈ లోకానికి వచ్చేటప్పుడు ఏమి తెలేదుకదా. వట్టి చేతులతో వచ్చావు ! పోయేటప్పుడు లగేజిలతో పొవాలనుకుంటున్నావు! అందుకే నీకంత యాతన. నువ్వేమి తెచ్చావని -నువ్వు పోగొట్టుకున్తున్నావు. నీవేమి సృస్తిమ్చావని నీకు నష్టం వచ్చింది? నువ్వు ఏదైతే పోదావో అది ఇక్కడనుండే పోదావు. ఏదైతే ఇచ్చావో అదీ ఇక్కడనుండే ఇచ్చావు.
ఈనాడు నీవు నీ సొంతం అనుకున్నదంతా నిన్న ఇంకొకరి సొంతం , రేపు ఇంకొకరి సొంతం కాగలదు.
కావున జరిగేది జరుగక మానదు . అనవసరంగా ఆందోళన చెందకు . ఆందోళన అనారోగ్యానికి మూలం. ప్రయత్నలోపంలేకుండా ప్రయత్నించు. ఫలితం ఏదైనా భగవంతుని ప్రసాదంగా స్వీకరించు.
కారు లేదని చింతించకు _ కాలువున్నందుకు సంతోషించు.
కొట్లులేవని చింతించకు _ కూటికి వున్నదికడా ! సంతోషించు . అది లేక చాలామంది భాద పడుతున్నారు .
కాలిలో ముళ్ళు కుచ్చుకున్నదని చింతించకు _ కంటిలో గుచ్చుకోలేదని సంతోషించు .
కాలం చాలావిలువైనది _రేపు అను దానికి రుపులేదు. మంచి పనులను వాయిదావేయవద్దు.
అసూయను రుపుమాపు_ అహంకారాన్ని అనగద్రోక్కు .
హింసను విడనాడు_అహింసను పాటించు .కొపాన్న్ని దరి చేర్చకు _ఆవెశముతో ఆలోచించకు
ఉపకారం చేయకపోయినా _అపకారం తలపెట్టకు.
మతిని శుద్దము చేసేధి మతం_ మానవత్వంలెని మతం మతం కాధు.
దేవుని పూజించు_ ప్రాణికోట్లకు సహకరించు.
తద్వారా భగవదాశీర్వాధం తో శాంతి నీవెంటె వుంటుంధి అని అన్నరు. ఇదే గీతాసారం 

తిరుప్పావై మొదటి పాశురం


ఈ రోజు నుండి ధనుర్మాసం ప్ర్రారంభమము అయ్యింది కదండి. మరి మొదటి పాశురం గురించి తెలుసుకుందాం.
గోపికలు ను గోదాదేవి ఈ వ్రతం చేయుటకు చేయుటకుముందుగా వారు మార్గశిరమాసం గురించి వ్రతం చేయుటకు అనుకూలంగా వుందని కాలాన్ని వారు పొగిడారు.  తరువాత ఈ వ్రతం ఎవరు చేసారో దాని వల్ల కలుగు ఫలితం గురించి తెలుసుకున్నారు.  ఆవిషయాన్ని మొదటి పాశురంలో చెప్పదలచారు.  మొదటి పాశురం

మార్గళి త్తింగళ్ మది నిఱైంద నన్నాళాల్
నీరాడ ప్పోదువీర్ పోదుమినో నేరిళైయీర్
శీర్ మల్గుం ఆయ్ ప్పాడి చ్చెల్వ చ్చిఱుమీర్గాళ్
కూర్వేల్ కొడుందోళిలన్ నందగోపన్ కుమరన్
ఏరారంద కణ్ణి యశోదై ఇళమ్ శింగం
కార్మేని చ్చెంగణ్ కదిర్మదియం పోల్ ముగత్తాన్
నారాయణనే నమక్కే పఱైతరువాన్
పారోర్ పుగళప్పడిందేలోర్ ఎమ్బావాయ్
 .
మరి ఈ పాశురం తాత్పర్యము ఏమిటంటే  ఒహ్హో మార్గశీర్షమాసము, వెన్నెల నిండిన మంచి రోజు . ఓ అందమైన ఆభరణములు గల పడచులారా ! ఐశ్వర్యముతో నిండిన వ్రేపల్లెలొ సంపదలతో తులతూగు చున్న ఓ బాలికలారా! ఈ మార్గశీర్ష స్నానము చేయవలెనన్నా సంకల్పమున్నచొ రండు. ముందు నడువుడు. వాడియగు వేలాయుధమును దాల్చి కృష్ణునకు ఏవిధమగు ఆపద రాకుండా కాపాడుచున్న శ్రీ నంద గోపుల కుమారుడును , అందములగు కన్నులతో అలరుచున్న యశోద యొక్క బాలసింహము నీలమేఘశ్యాముడును, ఎఱ్ఱని తామరలనుపోలు కన్నులు కలవాడును, సూర్యుని వలే ప్రకాశమును , చంద్రునివలె ఆహ్లాదమును ఈయజాలిన దివ్యముఖమండలము కలవాడును అయిన నారాయణుడే, అతనినే తప్ప వేరొకనిని అర్ధించనిమనకే , మనమాపేక్షెంచు వ్రత సాధనమగు `పరా అను వాద్యమును ఈయనున్నాడు. మనమీ వ్రతము చీయుటను చూచి లోకులందరు సమోషించునట్లు మీరు అందరూ కూడా చేరి ఈ వ్రతము చేయండి అని భావము

బుధవారం, డిసెంబర్ 15, 2010

మార్గశిరమాసం వ్రత విశిష్ఠత

బుధవారం, డిసెంబర్ 15, 2010

తిరుప్పావై అంటే ౩౦ రోజుల పూజ అని అర్ధం అయ్యింది కదా ! మరి ఆ పూజ ఎలా చెయ్యాలో తెలుసుకుందామనుకున్నాం కదా అయితే అది తెలుసుకునే ముందు తిరుప్పావై అంటే ఏమిటో తెలుసుకుందాం .  

తిరుప్పావై అంటే శ్రీ వ్రతం.  శ్రీ అంటే సంపద కదా. అన్ని సంపదలను ఇచ్చే నూము కదా,  దీని నే ధనుర్మాస వ్రతం అని కుడా అంటారు  ప్రత్యక్ష భగవానుడైన శ్రీసూర్యభగవానుడు మేషరశి మొదలు పన్నెండురాశులలో సంచరిస్తుంటాడు. ద్వాదశాత్మడైన ఆదిత్యుడు, తన దివ్యయాత్రలో ధనస్సు రాశిలోనికి ప్రవేశిస్తూనే "ధనుర్మాసం" ప్రారంభమై, సూరీడు మకర రాశిలోనికి ప్రవేశించేంతవరకూ, అంటే మకర సంక్రాంతి పర్వదినం ముందురోజు భోగి వరకు వుంటుంది. ఈ నెలరోజుల పాటూ "ధనుర్మాసవ్రతం" ఆచరించాలి.  ఈనెల రోజులు పూజలు చేయటం భగవంతునికి మనం చేరువు కావటానికి ఈ వ్రతం ఒక మార్గం  ఏలా అంటే మార్గ శిర మాసం వైష్ణవ మాసం అని కుడా అంటారు. "మాసానాం మార్గశీర్షోహం " అని మాసాలలో మార్గశీర్షమాసాన్ని నేనే అని భగవగీత లో శ్రీ క్రిష్ణులవారు అర్జునితో విభూతి యోగములో వివరించారు. అంటే అన్ని మాసాలలోని మార్గశిర మాసం లో శ్రీ కృష్ణ పరమాత్మ ఒక వృక్షచాయ. ఇది గ్రీష్మఋతువులో చల్లగాను, శీతపీడితులకు వెచ్చగాను ఉంటుంది. అలాగే విష్ణు స్వరుపమగు మార్గశీర్ష మాసంకుడా, అతిశీతలం కాక అతి వేడి కాకుండా సమ శీతోష్ణముగా ఉంటుంది. సంవత్సరంను ఒకరోజుగా భావిచినచో మార్గశిరమాసాన్నిబ్రహ్మ ముహార్థముగా చెప్పుకొనవచ్చు అనగా తెల్లవారుజాము చాలామంచిదని తెలుస్తోమ్ది  . మార్గ శిరం సత్వ గుణము ను పెంచి భగవదనుభుతిని కలుగ చేస్తుంది.
లోకమంతా పైరులతో పచ్చగా వెలయు కాలం మార్గశిర్షం . మార్గశిర్శమో ! క్షేత్రములో సస్యములు పంది భారంతో వంగి మనోహరంగా ఉంటుంది.
అల్లా వున్నప్పుడు ప్రజలు సంతోషముగా వుందురు. ఈ నెల ప్రారంభం నుండిఇళ్ళల్లొ ఆడవారు మార్గశిర లక్ష్మి వారపూజలు ప్రత్యెకంగా లక్ష్మివారం రోజు చేయటం ప్రారంభించి పుష్యమాసం మొధటి లక్ష్మి వారం వరకు చాలానియమ నిస్టలతో పూజలు చేస్తారు. ఆ రోజు లక్ష్మేహ్రుదయకమలం ముగ్గు పెట్టి లక్ష్మి ని ఆహ్వానించి పూజచెస్తారు. ఈమెని కనక మహాలక్ష్మి గా కొలుస్తారు .
చంద్ర మానాన్ని బట్టి మార్గశిరమని , సూర్య మానాన్ని బట్టి ధనుర్మాసమని ఏర్పడ్డయి . ఈ రెండూ ఒకటె.
ఈ మాసంలొ తెల్లవారుజామున లెచి మార్గశిర స్నానాలు చేసి తమలో వున్న ఙ్ నాన్ని మెలుకొల్పుదురు. ఆద్యాతంక చింతన కలిగి వుంధురు .
ఇక మార్గశిర మాసంలొ ఒక రహస్యమున్నది. మార్గముని నిర్ధెశించునధి. అని అర్ధము. భగవానుని పొంధు దారి అన్న మాట.

మంగళవారం, డిసెంబర్ 14, 2010

ధనుర్మాసం వస్తోంది

మంగళవారం, డిసెంబర్ 14, 2010

ధనుర్మాసం అనగానే అది మార్గశిరమాసం లో వస్తుందని అందరికి తెలుసు కదా మరి మర్ఘశిరమాశమ్ వచ్చింది దనుర్మాశమ్ కూడా మొదలు కాబోతుంది. అది ఎంతో విశేషమైన వైకుమ్ఠఏకాదశి రోజు ప్రారంభమవుతోంది.  ఈ దనుర్మాసం నెల రోజులు శ్రీ వెంకటేశ్వర స్వామికి సుప్రభాత సేవకు బదులుగా గోదాదేవే పాడిన ౩౦పాసురాలును పాడతారు  ఇది చాలా విశేషమైననెల.

అంత విశేషమైన ఈ నెలరోజులు చంద్రమానము బట్టి చేయుటకు గుర్తుగా ఆ నెలరోజులు ఇంటి ముంగిట పండగ వాతావరనముతో విశేషమైన
ముగ్గులు పెట్టి అందులో నేలగంట పెడతారు . ఆ నెలరోజులు వైష్ణవ గుళ్ళకు వెళ్ళతారు ఈ నెలరోజు లు రోజుకు ఒక పాశురమ్  చదువుతారు .
ఈ పాశురాలన్ని ఆండాలమ్మ తల్లి ధనుర్మాస వ్రతము చేసి రోజుకో పాశురం ఆశువుగా పాడి ౩౦ రోజులు నియమ నిష్టలతో వ్రతము చేసి . ఆ పాండురంగానుని వివాహం చేసుకొని ఆయనలో ఐక్యమైనది.  అలాంటి గోదాదేవి చేసిన వ్రతము మనమూ చేద్దాం . అయితే ఆ అమ్మ కు భక్తితో నమస్కార రూపమున శ్రి శ్రీ శ్రీ పరాసుర భట్తరువారు ఈ శ్లోకం తో విన్నవించారు.

నీలా తుంగస్తన గిరితటీ సుప్త ముద్బోధ్య కృష్ణం
పారార్ధ్యం స్వం శ్రుతి శతశిరస్సిద్ధ మధ్యాపయంతి
స్వోచ్చిస్టాయాం స్రజి నిగళితం యా బలాత్క్రుత్య భుంక్తే
గోదా తస్యై నమ ఇద మిదం భూయ ఏవాస్తు భూయః       అని పరాసుర భట్టరు వారు కీర్తించారు.

శ్రీ కృష్ణ పరమాత్ములవారు నీలా దేవి యొక్క ఉన్నతమైన స్తనగిరులలో నిద్రించుచున్నారు . ఆ నిద్రిస్తున్న కృష్ణ సింహమును మేల్కొల్పినది అమ్మ గోదామాత . ఆయనికి ఉపనిషత్తు లలొ ప్రతిపాదించబడిన పరతంత్రమును పాఠమును చెప్పినది . తాను అనుభవించిన వదన మాలికతో అతనిని బంధించింది . అలాంటి అలాంటి గోదాదేవికి నా మరలా మరలా నమస్కారములు .

మనము కూడా మాయచే నిద్రించుచున్నాము. కాని పరమాత్మ నిద్రించడు , అట్టి పరమాత్మకు నిద్ర తెప్పించు సౌందర్యరాశి నీలాదేవి. ఆయనని మెల్కొల్పినధి గోదాదేవి. ఆలాంటి పరమాత్మకే  ఉపదేసించినధి ఈ గోదాదేవి. ఆమె పరమాత్మను తాను అనుభవించి విడిచిన పూమాలలతో మరియు పాశురములతో బంధించింధి.  తాను చెసిన కర్మకు ఫలితంగా పరమాత్మనే అనుభవించింధి. శ్రీ గోదాదేవి. ఈ స్థితి  కేవలము శ్రీ గోదామాతకే చెల్లినది.
ఆమె దరించిన మాల పరమాత్మ స్వీకరించుటచే ఆమెకు ఆముక్తమాల్యద" అని పేరు వచ్చినది.  మాలలు తయారు చేయువాని బిడ్డ కావునా కోదై అని అంటారు. కోదై అంటే గోదా అని అర్దం.  ఇలా భట్టనాధుని కూతురై , శ్రీ రంగనాధుని ప్రియురాలై, భగవద్రామనుజులకు అభిమాన సొదరైన ఆండాళి కు మరలా మరలా నేను నమస్కారిస్తున్నాను
.
గోదాదేవి భగవంతుని విషయంలో ఏవిధమగు దాస్యము కోరుకున్నదో, ఆ విధముగా దాస్యము ఆమె యెడ మాకు లభించుగాక అని పరాశర భట్టారువారు ప్రార్ధించిరి.  నేను రేపు వ్రతం ఎలా చేయాలి దాని విశేషమ్ వివరిస్తాను.
అలానే మనం కూడా ఈధనుర్మాశమ్ వ్రతం చేద్దామ్.

సోమవారం, డిసెంబర్ 13, 2010

చల్లని చూపులవాని

సోమవారం, డిసెంబర్ 13, 2010



పల్లవి:
చల్లని చూపులవాని చక్కనివాని పీలి
చొల్లెపుం జుట్లవానిఁ జూపరమ్మ చెలులు


చరణం:
వాడలోని చెలులను వలపించి వచ్చెనే | వాడు |
చేడెల మనసు దొంగ చిన్నికృష్ణుడు
యేడుగడయును దానై యెలయించె నన్నును |వాని
జూడక వుండగ లేను చూపరమ్మ చెలులు


చరణం: 

మందలోని గొల్లెతల మరగించి వచ్చెనే | వాడు |
సందడిపెండ్లికొడుకు జాణకృష్ణుడు
ముందు వెనకా నలమి మొహింపించె నన్నును | వాని|
పొందులు మానగ లేను పోనీకురే చెలులు


చరణం:
ఇంటింటి యింతుల నెల్లా యెలయించి వచ్చెనే  వాడు
దంటవాడు కలికి చేతలకృష్ణుడు
నంటునను శ్రీవెంకటనాథుండై నన్ను గూడెనే | వాని |
వొంటి బాయలే నావద్ద నుంచరమ్మ చెలులు.

శనివారం, డిసెంబర్ 04, 2010

పరశురామ జయంతి

శనివారం, డిసెంబర్ 04, 2010

ఈరోజు పరశురాముడు జయంతి. 
జమదగ్ని ,రేణుకాదేవి ల చివరి కొడుకు పరశురాముడు. జమదగ్ని చాలా కోపం గలవాడు. అతని భార్య రేణుక తనపతిభక్తితో రోజు నదికి వెళ్ళి తనే స్వయంగా మట్టి కుండచేసి ఇంటికి నీళ్ళుతెచ్చేది. ఒకరోజు రేణుకాదేవి చిత్రరధుడనే రాజును చూసింది. ఆరోజు ఆమె నీళ్ళుతేవటానికి కుండ తయారు చేసినా కుండ తయారుకాలేదు. నీళ్ళు తేలేకపోయింది. ఏమి జరిగింది అని దివ్యదృష్టితోచూడగా రేణుక చిత్రరధుని చూడటంవల్లే పాత్రతయారుకాలేదని గ్రహించి తనపుతృలును పిలిచి తల్లిని నరకమన్నాడు. వారందరు తమవల్లకాదన్నారు. అప్పుడు చివరి కొడుకు పరశురాముడు సరే అని తన తల్లిని నరికి వేశాడు. తండ్రి చెప్పిన మాట చేసినందుకు ఒకకోరిక కోరమనగా తనతల్లిని తిరిగి బ్రతికించమన్నాడు పరశురాముడు.  తండ్రిమాట జవదాటని కొడుకు.పరశురాముడు. తనతల్లికి ఆ గతిపట్టించింది రాజులు కావున పరశురాముడు రాజులుమీదకోపం పెంచుకొని వారిని నాశనంచేయటం మొదలుపెట్టాడు. పరశురాముని పేరు భార్గవరాముడు. (పరశు= గొడ్డలి ) పరశుతో రాజులు ను నరకుతున్నాడుకావునా పరశు రాముడు అని పేరు వచ్చింది. అప్పట్లో పరశురాముడునుండి  రక్షించుకోవటానికి రాజులు అందరు చేతులుకు గాజులు వేసుకొని దాచుకునేవారు.కొందరు గొప్పరాజుల్ పుత్రులును భూదేవి తనలో దాచుకొని రక్షించింది. పరశురాముడు విష్ణువు దశావతారాలలో ఒక అవతారం.

గురువారం, నవంబర్ 18, 2010

ఝాన్సీ లక్ష్మీబాయి

గురువారం, నవంబర్ 18, 2010


ఉత్తర భారతదేశ రాజ్యమైన ఝాన్సీ అనే రాజ్యానికి రాణి.1857లో ఆంగ్లేయుల పరిపాలనకు వ్యతిరేకంగా జరిగిన మొదటి భారత స్వాతంత్ర్య సంగ్రామంలో ప్రముఖ పాత్ర పోషించింది.
నేడు ఝాన్సీ రాణి పుట్టినదినము.  ఝాన్సీ లక్ష్మి అసలు పేరు మనికర్ణిక. కాశిలో జన్మించింది.  మోరోపంత్ తాంబే మరియు భాగీరథీబా లకు జన్మించింది ఝాన్సి.  ఝాన్సి లక్ష్మి  స్వాతంత్ర సంగ్రామంలో చురుకుగా పాల్గొన్నవీరనారి.  రాణి 1858జూన్ 17 వ తేదీన గ్వాలియర్ యుద్ధం లో మరణించింది.  ఆమె భారత స్వాతంత్ర్యోద్యమ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోవడమే కాక 19వ శతాబ్దంలో మహిళా సాధికారతకు ఆదర్శ ప్రాయంగా నిలిచింది.
అలాంటి ఝాన్సి లక్ష్మీబాయిని గుర్తుచేసుకున్నందుకు నాకు చాలా ఆనందంగా వున్నది.

సోమవారం, అక్టోబర్ 25, 2010

అట్ల తద్దోయ్ - ఆరట్లోయ్

సోమవారం, అక్టోబర్ 25, 2010


అట్ల తద్దోయ్ - ఆరట్లోయ్
ముద్దపప్పోయ్ -మూడట్లోయ్
అయ్యో మీకు చెప్పడం మరచిపోయా ఈ పాట ఏమిటను కుంటున్నారా ? ఏమి లేదండి నేను చెప్తున్నది అట్ల తదియ పండుగ గురుంచి. అట్ల తదియ ఈ పండుగ ప్రతి సవత్సరం ఆశ్విజ బహుళ తదియ రోజు వస్తుంది. ఈ తదియ రోజు తెలవారుజామునే ఆడవారు చిన్న పెద్ద అన్దరూ నిద్ర లేచి కాలకృత్యాలు తీర్చుకొని , గోంగూర పచ్చడి, నువ్వుల పొడి, పులుసు, పెరుగు వేసుకొని తెల్ల వారుజామునే భోజనం చేస్తారు.ఆ తరువాత ఆటలే ఆటలు, చెమ్మచెక్కలు, ఉయ్యాలు అడతారు. అన్నట్టు 
ముందురోజే చేతుల నిండా గోరింట పెట్టుకుంటారు. తదియ రోజు చాలా సంతోషం గా ఆడుకుంటారు. ఉయ్యాల పోటీలు పెట్టుకుంటారు. పల్లెల్లో చాలా బాగా జరుపుకుంటారు. పొద్దు ఎక్కాగా తల స్నానం చేసి దేవుడుకి దణ్ణం పెట్టుకొని రోజు అంతా ఉపవాసం వుంటారు. సాయంత్రం చంద్రోదయం అయ్యాక స్నానం చేసి పార్వతి దేవికి పూజచేస్తారు. పూజచేసి చంద్రుడిని దర్శించుకుంటారు .
అట్ల తదియకు ఒక కదా వుంది ఆకధ
ఒక వూర్లో రాజు గారమ్మాయి, వెలమవారి పిల్ల, బ్రాహ్మ్నవారి పిల్లా, కోమటిపిల్ల,నలుగురు వివాహం కాకముందు చిన్నతనంలో నే అట్లాతదియనోము చీద్దమనుకున్నారు తదియనాడు వుపవాసం వున్నారు.రాజుగారంమయి అతిసుకుమారి కనుక సాయింత్రం కాగానే ముఖము వాడి ముఉర్చపోయినది. వీదిలూనుంది అన్నగారు వచ్చి అమ్మా చెల్లెమ్మ ఏది అని అడుగుగా నాయనా అట్లతదియ నోము చేద్దమనుకుని వుపవాసముంది . చంద్రోదయం వరకు వుండలేక మూర్చపొయినధి అని చెప్పింది. అప్పుడు అన్నయ్య ఏమి దారని అలోచించి వెంటనే దురంగావున్న చింత చెట్టుకు అద్దం పెట్టి దానికి ఎదురుగా అగ్గిపెట్టి చెల్లిలిని లేపి అదిగో చంద్రుడు ఉదయించాడు అనిచెప్పగా నిద్రకలనవున్న నిజంగా చెంద్రుదని బావించి ,రాకుమారి ఫలహారంలు చేసెను. కొన్నాళ్ళకు వివాహం చేయగా వయసు మీద పడిన వాడు భర్తగా సంప్రప్తంయ్యేను. నీను అట్లతదియ నోము నోచినా నాకు ఇదేమీ ప్రారబ్దం అని భాద పడుతూ ఒకనాడు రాత్రి అడవికి వెళ్ళిపొయినది.
ఓ అమ్మాయి ఒంటరిగా ఈ అడవిలో ఎక్కడికి పూతున్నావని పార్వతి పరమేస్వరులు మారు వేషములో వచ్చీ అడుగగా నాయనా మీరేమైనా అర్చేవార తీర్చేవారా మీకెందుకు అని చెప్పి నడుస్తోంది. మీము ఆర్చేదము తీర్చేదము నీ సంగతి చెప్పు అని అడిగిరి . ఆచిన్నది వారికి నమస్కరించి వారి స్నేహితులుతో చేసిన నోము గురించి తనకు మాత్రమె ముసలి భర్త లబించాడని నాకు మాత్రమె ముసలి భర్త సంభవించటం నాకు కారణం ఏమి , నా పాపమా? అని తన భాదను వివరించింది.
వారు దానికి చిన్నదానా నీవ్రతం భంగమైనది నీ అన్నగారి వలన జరిగిన చర్య సవివరంగా చెప్పారు. జరిగినదాని నేను ఇప్పుడు ఏమి చేయ్యన్లని వారి అడుగగా మరలా ఆ వ్రతం నిస్తగా చేయ్య్మన్న్నారు. ఆమె తిరిగి రాజ్యాని కి చేరి తదియరోజు ఆ వ్రతం చేసినది. ముసలి భర్త మంచి అందమైన యువకుని గా మారెను. అది చుసి అన్ధరూ కారణమడుగగా జరిగిన వృతాంతం చెప్పెను . ఇది అట్ల తదియ నోము కదా...
ఈ కధ విని అక్షిమ్థలు తలమీద వేసుకొని చంద్రుని చూసి పదకొండు అట్లు వీసి ఒక ముత్తయ్దువకు ఇచ్చి తను నేయివధ్యం పెట్టుకున్న పదకొండు అట్లు తిన్నాలి .
ఇదండి అట్ల తద్ది నోము గురించి.

శనివారం, అక్టోబర్ 16, 2010

దసర శుభాకాంక్షలు

శనివారం, అక్టోబర్ 16, 2010

TeluguGreetings

మంగళవారం, అక్టోబర్ 12, 2010

తాతగారికి పుట్టినరోజు శుభాకాంక్షలు.

మంగళవారం, అక్టోబర్ 12, 2010

మాతాతగారు చింతా.రామకృష్ణారావుగారు 59 వ సంవత్సరం పుట్టినరోజు జరుపుకుంటున్నసంధర్భంగా నాబ్లాగ్ ద్వారా శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాను.

తాతా మీకు నా తరపునా నాబ్లాగ్ మిత్రులు తరపునా ఇవే మీకు పుట్టినరోజు శుభాకాంక్షలు.

గురువారం, సెప్టెంబర్ 30, 2010

నారాయణతే

గురువారం, సెప్టెంబర్ 30, 2010


నారాయణతే నమో నమో
నారద సన్నుత నమో నమో॥

మురహర భవహర ముకుంద మాధవ
గరుడ గమన పంకజనాభ
పరమ పురుష భవబంధ విమోచన
నరమృగశరీర నమో నమో॥

జలధిశయన రవిచంద్రవిలోచన
జలరుహభవనుత చరణయుగ
బలిబంధన గోపవధూవల్లభ
నళినోధ్ధర తే నమో నమో॥

ఆదిదేవ సకలాగమ పూజిత
యాదవకుల మోహనరూప
వేదోద్ధర శ్రీ వేంకటనాయక
నాదప్రియ తే నమో నమో॥

ఆదివారం, సెప్టెంబర్ 19, 2010

జగడపు జనవుల జాజర

ఆదివారం, సెప్టెంబర్ 19, 2010


జగడపు జనవుల జాజర 

సగినల మంచపు జాజర || 



మొల్లలు తురుముల ముడిచిన బరువున 

మొల్లపు సరసపు మురిపెమున 
జల్లన పుప్పొడు జారగ పతిపై
చల్లే రతివలు జాజర ||

భారపు కుచముల పైపైగడు సిం - 
గారము నెరపెటి గందవొడి
చేరువ పతిపై చిందగ పడతులు 
సారెకు చల్లేరు జాజర || 

బింకపు కూటమి పెనగేటి చెమటల 
పంకపు పూతల పరిమళము 
వేనటపతిపై వెలదులు నించేరు 
సను మదంబుల జాజర ||


శుక్రవారం, సెప్టెంబర్ 10, 2010

గణేశ్ చవితి శుభాకాంక్షలు

శుక్రవారం, సెప్టెంబర్ 10, 2010


శ్లో|| శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం |
ప్రసన్నవదనం ధ్యాయేత్సర్వ విఘ్నోపశాస్తయే ||
సముఖశ్చైక దంతశ్చ కపిలో గజకర్ణకః |
లంబోదరశ్చ వికటోవిఘ్న రాజో గణాధిపః ||
ధూమకేతుర్గణాధ్యక్షః ఫాలచంద్రో గజానన |
వక్రతుండ శ్శూర్పకర్ణః హేరంబః స్కంద పూర్వజ ||
షోడశైతాని నామాని యః పఠేత్‌శృణుయాదపి |
విద్యారంభే వివాహే చ ప్రవేశే నిర్గమేతథా ||
సంగ్రమే సర్వ కార్యేషు విఘ్నస్తస్య నజాయతే |
అభీప్సితార్ధ సిధ్యర్ధం పూజితోయస్సురైరపి ||
సర్వవిఘ్నచ్చిదే తస్మైగణాధిపతయే నమః ||


గురువారం, సెప్టెంబర్ 09, 2010

వినాయకుని ఆకారం

గురువారం, సెప్టెంబర్ 09, 2010

వినాయకుని ఆకారంలో మనంనేర్చుకోవలసినవి ఇమిడివున్నాయి కావాలంటే మీరే చూడండి.

వినాయకుని తొండంఓంకారాన్ని పోలి వుంటుంది.
ఏనుకు తల జ్ణానానికి , యోగ మునకు గుర్తు.
మానవశరీరము మాయ కు ప్రకృతికి సంకేతము.
చేతిలో పరసు అజ్ణానాన్ని పారద్రోలేది.
మరోచేతిలో కత్తి విఘ్నాలను పోగొట్టే సాధనం.
విరిగిన దంతం త్యాగానికి గుర్తు.
మాల జ్ణానాన్ని సంపాదించేది.
పెద్దచేవులు అందరి మాటలు జాగ్రత్తగా వినాలి.
బొజ్జమీద నాగబందం శక్తికి,కుండలినికి గుర్తులు.
ఎలుక వాహనం అన్ని జీవులను సమానంగా ప్రేమించగలగాలి.
                                చూసారా మరి వినాయకుని ఆకారం లో ఎంత గొప్ప జ్ణానం దాగివుందో.

Ramzan Mubarak


బుధవారం, సెప్టెంబర్ 08, 2010

మా చెల్లి ఆటలు

బుధవారం, సెప్టెంబర్ 08, 2010

మా చెల్లెల్లు స్పూర్తి ఆటలు  చూస్తారా మీరు.  అయితే చూడండీఈఈఈఈ.

ఆదివారం, సెప్టెంబర్ 05, 2010

Happy Teacher's Day

ఆదివారం, సెప్టెంబర్ 05, 2010

Happy Teachers Day 2010
It is the birthday [5 September 1888 ],of the second President of India, academic philosopher Dr. Sarvepalli Radhakrishnan. It is considered a "celebration" day, where teachers and students report to school as usual but the usual activities and classes are replaced by activities of celebration, thanks and remembrance. At some schools on this day, the responsibility of teaching is taken up by the senior students to show appreciation for their teachers.

good teacher must know how to arouse the interest of the pupil in the field of study for which he is responsible. He must himself be a master in the field of study and be in touch with the latest developments in the subject, he must himself be a fellow traveler in the exciting pursuit of knowledge..."

- Dr. S Radhakrishen

గురువారం, సెప్టెంబర్ 02, 2010

శ్రీ కృష్ణ లీలలు

గురువారం, సెప్టెంబర్ 02, 2010

శ్రీ కృష్ణాష్టమి సందర్బంగా అందరికీ నా శుభాకాంక్షలు.



కృష్ణలాలీ నందుని కృష్ణలాలీ యశోదమ్మ
నోముల పంట కృష్ణలాలీ || కృ ||
పాలు పెరుగు వెన్నతిని గోల చేసేవు
రవ్వలేల నీతో కృష్ణ వేగలేనురా || కృ ||
గోపకాంతలంతవచ్చి చాడీ చెప్పేరు
నీకు కరువ ఇంట పెరుగు పాల కెపుడైన || కృ ||
మన్ను తిన్నావని అన్న నాతో చెప్పగా
నోట భువనములన్ని జూపి మాయచేసేవు || కృ ||
కన్ను మూయగ కన్నతండ్రి కలలోనైనను
అల్లరి పనులను మానివుండు చిన్ని కృష్ణయ్య || కృ || 

అలర చెంచలమైన...


alara cencalamaina...

ప : అలర చెంచలమైన ఆత్మలందుండ నీ యలవాటు చేసె నీ వుయ్యాల
పలుమారు నుచ్ఛ్వాస పవనమందుండ నీ భావంబు దెలిపె నీ వుయ్యాల

చ : ఉదాయాస్త శైలంబు లొనర కంభములైన వుడుమండలము మోచె నుయ్యాల
అదన ఆకాశపదము అడ్డదూలంబైన అఖిలంబు నిండె నీ వుయ్యాల

చ : పదిలముగ వేదములు బంగారు చేరులై పట్టి వెరపై తోచె నుయ్యాల
వదలకిటు ధర్మదేవత పీఠమై మిగుల వర్ణింప నరుదాయె నుయ్యాల

చ : మేలు కట్లయి మీకు మేఘమండలమెల్ల మెరుగునకు మెరుగాయె నుయ్యాల
నీల శైలమువంటి నీ మేనికాంతికి నిజమైన తొడవాయె నుయ్యాల

చ : పాలిండ్లు కదలగా పయ్యదలు రాపాడ భామినులు వడినూచు నుయ్యాల
వోలి బ్రహ్మాణ్డములు వొరగునో యని భీతి నొయ్య నొయ్యన వూచిరుయ్యాల

చ : కమలకును భూసతికి కదలు కదలుకు మిమ్ము కౌగలింపగజేసె నుయ్యాల
అమరాంగనలకు నీ హావ భావ విలాస మందందు చూపె నీ వుయ్యాల

చ : కమలాసనాదులకు కన్నుల పండుగై గణుతింప నరుదాయె నుయ్యాల
కమనీయ మూర్తి వేంకటశైలపతి నీకు కడువేడుకై వుండె వుయ్యాల

మంగళవారం, ఆగస్టు 31, 2010

వసుదేవ సుతం దేవం

మంగళవారం, ఆగస్టు 31, 2010


వసుదేవ సుతం దేవం కంస చాణూర మర్దనం

దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం

అతసి పుష్ప సంకాశం హార నూపుర శోభితం 
రత్న కంకణ  కేయూరం కృష్ణం వందే జగద్గురుం

కుటిలాలక సంయుక్తం పూర్ణ చంద్ర నిభాననం
విలసత్ కుండల ధరం కృష్ణం వందే జగద్గురుం




మందార గంధ సంయుక్తం చారు హాసం చతుర్భుజం
బహి: పింఛావ చూడాంగం  కృష్ణం వందే జగద్గురుం 

ఉత్ఫుల్ల పద్మ పత్రాక్షం నీల జీమూత సన్నిభమ్

యాదావానాం శిరోరత్నం కృష్ణం వందే జగద్గురుమ్

గోపికానాం కుచద్వందం కుంకుమాంకిత   వక్షసం
శ్రీనికేతం మహేశ్వాసం కృష్ణం వందే జగద్గురుం

రుక్మిణీ కేళి సంయుక్తం పీతాంబర సుసోభితం
అవాప్త తులసీ గంధం కృష్ణం వందే జగద్గురుం




 శ్రీ వత్సాంగం మహోరస్కం వనమాలా విరాజితం
శంఖ చక్ర ధరం దేవం  కృష్ణం వందే జగద్గురుం 

My Blog Lovers

నా యూట్యూబ్ చానల్స్ ప్లీజ్ సబ్స్క్రిబ్ చేయండీ

Diabetic Challenger

DIABETIC CHALLENGER YOUTUBE CHANNEL. PLASE SUBSCRIBE MY CHANNEL...... THANK YOU VERY MUCH.

Ammamma Tho Nenu (అమ్మమ్మ తో నేను

Please subscribe our channel Ammamma Tho Nenu (అమ్మమ్మ తో నేను)