2 ఏప్రిల్,2013 అనగా ఈరోజు అంతర్జాతీయ బాలల పుస్తకాల రోజు గా జరుపుకుంటున్నాం. పుస్తకములు కొత్తవి కొత్తవి చదవటానికి అంతర్జాతీయబాలలబుక్డేస్పూర్తినిస్తూ,పిల్లలుకు స్కూల్ బుక్స్ మాత్రమె కాకుండా అన్ని రకాల మంచి పుస్తకాలు చదవాలని వారికి తెలియచేయటం ముఖ్యఉద్దేసముగా ఉంది.
ఏప్రిల్2 నహాన్స్ క్రిస్టియన్ ఆండర్సన్యొక్కపుట్టినరోజుకు గుర్తుగా International children books day గా జరుపుకుంటున్నాము. The Little Mermaid Story., The Ugly Duckling , The Nightingale వంటిఅనేకప్రముఖపిల్లలకథలరచయితహాన్స్ క్రిస్టియన్ ఆండర్సన్ పుట్టిన ఈరోజుయువసాహిత్యం ప్రేమికులకు గుర్తించడానికిఎంచుకున్నారు. యంగ్ పీపుల్, లేదాIBBY (IBBY stands for International Board On Books for Young People.)కోసంపుస్తకాలుఅంతర్జాతీయబోర్డ్ ఆర్గనైజ్ చేయటం జరిగింది. దీని లక్ష్యంపుస్తకాలు మరియుయువప్రజలకుచదివేటందుకు ప్రోత్సహించడము దీని ముఖ్య ఉద్దేశము కలిగివుంది.IBBY1953 లోజురిచ్, స్విట్జర్లాండ్లో స్థాపించబడింది. అంతర్జాతీయబాలలబుక్డేసందర్భంగారచనపోటీల్లోమరియుప్రసిద్ధరచయితలుమరియు విశదీకరించుతారు చర్చలుసహాప్రపంచవ్యాప్తంగా events నిర్వహింస్తున్నారు.
అందరికీ వండర్ల్యాండ్,హ్యారీ పాటర్, అండ్ దిఆలిస్వంటి రచనలు బాగాతెలిసినపరిచయంఉండగా మనకు అద్భుతమైనపిల్లలపుస్తకాలు మనకు లభిస్తున్నాయి. ఈ పిల్లల పుస్తకాలు, పిల్లలే కాకుండా పెద్దలు కూడా చదువుకునేటట్టు వున్నాయి.
మనం రోజు స్కూల్ బుక్స్ చదువుతాం అవి కాకుండా మంచి పుస్తకాలు కనుగొనుటకు ప్రయత్నించండి, అంతర్జాతీయబాలలబుక్డే సందర్భముగా ఈరోజు నుండి మంచి పుస్తకాన్ని చదవటానికి అలవాతుచేసుకోండి. ఎలాగు సమ్మర్ హాలిడేస్ వస్తాయి కదా అప్పుడు సంతోషంగా చదువుకోవచ్చు. ఇప్పుడైతే ఎగ్జామ్స్ కదా బాగా చదువుకొని ఎగ్జామ్స్ రాసి మంచి మార్కులు తెచ్చుకోవాలి. సరేనా. నాకు కూడా రేపటినుండి ఎగ్జామ్స్ నేను వెళ్లి చదువుకుంటాను మరి బాయ్.
Get ready for reading on International Childrens Book Day! so Happy International Children 's Book Day .
ఏప్రిల్ 1 ని మనం ఏప్రిల్ ఫూల్ రోజు గా జరుపుకుంటాం. దీనికి ఒక కధ వుంది. అది ఏమిటంటే పదహారో శతాబ్దం మధ్య వరకు యూరప్ లో కూడ సంవత్సరాది మార్చి నెల మధ్యలోనే జరుపుకునేవారు. యూరప్ లో ఈ నూతన సంవత్సరపు ఉత్సవాలు మరియు వసంత కాలపు ఉత్సవాలు కలిపి ఓ పది రోజుల పాటు వరసగా జరుపుకునేవారు. ఏప్రిల్ 1 రాగానే ఈ ఉత్సవాలు ముగిసే సందర్భంలో ఒకరికొకరు బహుమానాలు ఇచ్చి పుచ్చుకునేవారు. ఇలా ఎప్పుడూ ఘనంగా జరుపుకునేవారు. అలావుండగా అప్పటి ఫ్రాంసు దేశపు రాజు సంవత్సరాదిని మార్చి మధ్య నుండి జనవరి 1 వ తారీఖుకి మార్చుతూ ఒక నోటీసు జారీ చేసాడు. ఆ రోజులలో వార్తాపత్రికలు, రేడియోలు, టీవీలు, కంప్యూటర్స్ లేవు. వారు అప్పట్లో దండోరా వేయించి వుంటారు. కాని రాజు గారి నోటీసు అందరికీ చేరలేదు. అందిన వాళ్ళు కూడ పాత అలవాట్లని వారు మార్చుకోలేకపోయారు. కనుక రాజధానిలో సంవత్సరాది జనవరి ఒకటిన జరిగిపోయినా కానీ దేశపు మూలల్లో మాత్రము ఏప్రిల్ 1 న బహుమానాలు ఇచ్చుకోవటంమానలేదు. అందుకని వాళ్ళని ఎగతాళిగా ఏప్రిల్ ఫూల్స్ అనేవారు. పాత అలవాట్లు మనలేక వారు జరుపుకుంటున్నారు కదా. అందుకని ఇప్పటికీ అల్లరిగా బహుమానాలు ఇచ్చుకోవటం, మరియు ఒకరిని ఒకరు ఫూల్స్ చేసుకుంటున్నారు. అందుకే ఏప్రిల్ 1 ని ఫూల్స్ డే గా జరుపుకుంటున్నారు. చాలా సరదాకా వుంటుంది. ఫూల్స్ అయ్యినవారు బాధపడకుండా సరదాగా తీసుకొని ఎంజాయ్ చేయచ్చు. ఫూల్స్ డే బాగుంది కదండి. Enjoy The Fools Day .
ఈరోజు ప్రపంచ డాక్టర్స్ డే గా జరుపుకుంటున్నారు. మన దైనందిన జీవితంలో వైద్యులు పోషిస్తున్న పాత్ర పట్ల అవగాహన కల్పించే రోజు. రోగిని కాపాడే విషయంలో వైద్యుల పాత్ర అత్యంత క్రియా శీలకం అవుతుంది. రోగి ప్రాణాలను కాపాడటంలో డాక్టర్ల కృషి అసామాన్యము . తన వ్యక్తిగత విషయాలను పక్కన పెట్టి , ఏ సమయములో నైనా అత్యవసర కేసులను స్వీకరించే వ్యక్తి డాక్టర్. పరిస్థితులు ఏలా ఉన్నా సరైన సౌకర్యాలు , వనరులు అందుబాటులో ఉన్న, లేకున్నా ఆపారమైన అనుభవంతో తన శాయశక్తులు వినియోగించి రోగి ప్రాణాలకు భద్రత కల్పింస్తాడు డాక్టర్. ఆ డాక్టర్కు ఒక అరుదైన రోజు అదే డాక్టర్ రోజు
మొదటిడాక్టర్స్డేపాటించాలనివైన్డర్,జార్జియాలోమార్చ్ 30,1933 న పాటించాలని అనుకున్నారు.యుడోరాబ్రౌన్ఆల్మాండ్, డాక్టర్చార్లెస్B.ఆల్మాండ్యొక్కభార్య, వైద్యులు ఈమెను గౌరవించటానికిఒకరోజుప్రక్కన సెట్ చేసి నిర్ణయించుకుంన్నారు. ఇది మొట్ట మొదట పాటించాలనిమెయిలింగ్గ్రీటింగ్ కార్డులుకలిగి ఉన్నాయి మరియు మరణించినవైద్యులుసమాధులునపుష్పాలుఉంచడం.ఎరుపుకార్నేషన్సాధారణంగానేషనల్డాక్టర్స్డేకోసంలాక్షణిక పుష్పంఉపయోగిస్తారు.
మార్చి30,1958న,డాక్టర్స్డేజ్ఞాపకముగా రిజల్యూషన్ప్రతినిధులయునైటెడ్ స్టేట్స్ హౌస్ద్వారా స్వీకరించబడింది.1990 లో,చట్టంఒక జాతీయడాక్టర్స్డేఏర్పాటు చేసేందుకుహౌస్ మరియు సెనేట్లోపరిచయం చేయబడింది.యునైటెడ్ స్టేట్స్ సెనేట్మరియు ప్రతినిధుల సభద్వారా అఖండమైనఆమోదంతర్వాత,అక్టోబర్30, 1990 న, అధ్యక్షుడుజార్జ్బుష్SJసంతకంRes.గామార్చి30, 1991కేటాయించడం#366(పబ్లిక్లా101-473 ప్రకారం ఆమోదింపబడినది.)"నేషనల్డాక్టర్స్డే." డాక్టర్స్డేజెఫెర్సన్,GA యొక్కక్రాఫోర్డ్W.లాంగ్, MD,మార్చ్ 30,1842న శస్త్రచికిత్సకోసం మొదటిఈథర్స్పర్శనాశకంనిర్వహించబడుతుందిఆనాటి తేదీని సూచిస్తుంది.ఆరోజు,డాక్టర్లాంగ్ఒకరోగికి ఈథర్అనస్తీషియా ఇచ్చారు అప్పుడు ఆ మనిషియొక్కమెడనుండికణితిని తొలగించడానికి ఉపయోగిమ్చారుట.తరువాత,రోగిఅతనుశస్త్రచికిత్ససమయంలోఏలా భావించాడుమరియు అతనుమేల్కొనంతవరకుశస్త్రచికిత్స చికిత్స పూర్తి అయ్యివరకు అతనికి నొప్పి కలగకుండాఉంది. అందువల్ల మార్చి ౩౦ న డాక్టర్స్ డే జరుపుకుంటున్నారు.
మరి డాక్టర్స్ అందరికి ఒక విన్నపము విన్నవించుకోవాలి అనుకుంటున్నాను. ఇప్పుడు చెప్పటం కర్రెక్టా కాదా అన్నది నాకు తెలియదు కాని, దయచేసి వైద్యాన్ని స్వార్ధానికి ఉపయోగించకండి. డబ్బుకోసం వైద్యాన్ని అమ్ముకోవద్దు. ప్రజలు డాక్టర్స్ ని ప్రాణాలు పోసే దేవతలుగా భావిస్తున్నారు. వారి నమ్మకాన్ని నిలబెట్టండి. ప్రజలు వైద్యం చేయించుకోవటానికి భయపడుతున్నారు. ఆ భయాన్ని పోగొట్టి వారికి అభయాన్ని ఇవ్వండి. ఇంకా చాలా చెప్పాలి అనివుంది. ఇంకోసారి నా అభిప్రాయాన్ని మీతో షేర్ చేసుకుంటాను. ఈ రోజు డాక్టర్స్ డే ని హ్యాపీ గా జరుపుకోండి.
కోల్కతా దగ్గర బారక్ పూర్ వద్ద మార్చి 29, 1857 న ఆవు కొవ్వుతో తయారుచేసిన తూటాను వాడేందుకు నిరాకరించి మంగళ్ పాండే అనే సైనికుడు ల్యూటినెంట్ బాగ్ వద్ద, ఒక బ్రిటిషు అధికారిని కాల్చి చంపాడు. మొదటి భారత స్వాతంత్ర్య పోరాటానికి నాంది ఇది. చంపటానికి మూల కారణం ఏమిటి అంటే బ్రిటిషు వారు సిపాయిలకు తుపాకులకు ఆవు కొవ్వు మరియు పంది కొవ్వును పూసిన తయారు చేసిన తూటాలు (cartridges) ఇచ్చేవారు. ఆ తూటాలని నోటితో కొరికి తొక్క తొలిగిస్తేనే పేలుతాయి. హిందూ ముస్లిం ఇద్దరికీ ఇవి నచ్చలేదు. ఇదే మొదటి భారత స్వాతంత్ర్య ఉద్యమానికి పోరాటానికినాంది పలికిన రోజుగా చెప్పుకోవచ్చు.
మంగళ్ పాండే ఈస్ట్ ఇండియా కంపెనీ లో 34వ బెంగాల్ రెజిమెంట్ యందు ఒక సిపాయి గా పని చేసారు. సిపాయిలతిరుగుబాటుప్రధానకారణంసరళి1853 లో enfield rifle భుజాన వేసుకోని వెళ్ళే తుపాకిఉండేది.ఒక కొత్తrifleలోడ్చేయడానికి, సైనికులుగుళికకొరుకి మరియురైఫిల్యొక్క లోపలకితుపాకీమందుపోసుకోవడం వల్ల పనిచేస్తుంది.ఈగుళికలుపంది క్రోవ్వుతోgreaseచేయబడ్డాయి. అని పుకారుఉంది.పంది క్రోవ్వుముస్లింలుఅపరిశుభ్రమైనదిగా చెప్పబడుతుంది.హిందువులుపవిత్రముగా భావించే ఆవు మాంసము కొవ్వు మరియు పందికొవ్వు ఈ బుల్లెట్స్ల లో ఉపయోగిస్తారు.బ్రిటిష్సైన్యంలో భారతీయులు96% గా మరియుకాబట్టిహిందువులు మరియు ముస్లింలురెండుఈగుళికలును అంగీకరించలేదు. అందరూ కలసిఒకసంస్థనమ్మకంకలిగి మరియుఈఅసంతృప్తిఒక ప్రధానముగా తిరుగుబాటుగా మారినది.
ఇక్కడ ఎక్కువ మతవిశ్వాసంగలహిందూమతంమరియుఖచ్చితంగాతనమతంసాధన కలవాడు ఎవరుమంగళ్ పాండే, ఈయన జీవితంచరిత్ర గురించి తెలుసుకుంటే మరింతబాగుంటుంది.ఇదిభారత సిపాయులు ఉపయోగించేఎన్ఫీల్డ్ P-53రైఫిల్ఉపయోగించేగుళికపందిమరియుఆవుకొవ్వుకొవ్వుతోgreasedపుకారు వచ్చింది.ఈగుళికలుకవర్ముందుఉపయోగంతొలగించేందుకు సగంకరిచి వాడాల్సి వచ్చిందిమరియుఈముస్లింలుమరియుహిందువులుమత విశ్వాసవ్యతిరేకంగా వుంది .సాధారణ ఈ అభిప్రాయం బ్రిటీష్వారుఉద్దేశపూర్వకంగాభారతీయులమనోభావాలుబాధించింపదలచి ఈ ప్రయోగం చేసారు.మరియు ఈపాండే కు కోపం అత్యంత స్తాయికి చేరటానికి మూల కారణం ఇదే. మన భారతీయులను బ్రిటిష్వారు ఎన్నిరకాలుగా భాధపెట్టారో తెలుసుకుంటే చాలా భాదాకరంగా వుంది. అంత కష్టపడి సంపాదించిన భారత దేశాన్ని మనం జాగ్రత్తగా చూసుకోవాలి.
ఫాల్గుణ శుధ్ధ పూర్ణిమ విశేష శక్తితో కూడినది. ఈ దినాన రాక్షస పీడ పోయే౦దుకు "హోళికా" అనే ఒక విధమైన శక్తిని ఆరాధిస్తారు. ఆమె ప్రీతి కోస౦ అ౦దరూ కలిసి గానాలు చేయడ౦, పరిహాసాలాడడ౦ చేస్తారు. హోలికాగ్నిని రగిల్చి ఆరాధి౦చే స౦ప్రదాయ౦ ఇప్పుడు తగ్గిపోయి పరిహాసాది క్రియలే మిగిలాయి.
శ్రీమహాలక్ష్మి క్షీరసాగర౦ ను౦డి ఆవిర్భవి౦చి౦దని పురాణ కథ. ఈ ఏడాది పూర్ణిమ, ఉత్తర ఫల్గుణి కలిసి వచ్చాయి. కనుక ఈ దినాన భక్తి శ్రధ్ధలతో మహాలక్ష్మిని షోడశోపచారములతో చక్కగా ఆరాధి౦చి లక్ష్మీ అష్టోత్తర శతనామాలు, కనకధారాస్తోత్ర౦, వ౦టివి పారాయణ చేయడ౦ మ౦చిది. ఈరోజున లక్ష్మిని శ్రద్ధగా అర్చి౦చే వారికి సమస్త ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి. ఈరోజుననే శ్రీకృష్ణుని ఉయ్యాలలో వేసి ఆరాధి౦చాలి. దీని ’డోలోత్సవ౦’ అని అ౦టారు. ఒరిస్సావ౦టి ప్రా౦తాలలో డోలా పూర్ణిమ పేరుతో ఇప్పటికీ దీనిని ఆచరిస్తారు.
హోలీ విశ్వ వ్యాప్తంగా ప్రకాశించే రంగుల పండుగ. ఈ పండుగ రోజున, తేజం యొక్క వివిధ తరంగాలు విశ్వవ్యాప్తంగా ప్రకాసిస్తాయి, అక్కడ వివిధ రకాల రంగులు ఉత్పత్తి అయ్యి వృద్ది పొంది మరియు వాతావరణంలో ధాతువు పూర్తి సంపూర్ణ ధర్మాన్ని కలిగి ఉంటాయి. ఇదే ఈ పండుగ విశేషము. హిరణ్యకశ్యపుడి పుత్రుడైన ప్రహ్లాదుడు, భగవంతుడైన విష్ణువుకు భక్తుడు. హిరణ్యకశ్యపుడు పలు మార్లు బెదిరించినప్పటికి, ప్రహ్లాదుడు భగవంతుడైన విష్ణువుని ప్రార్థించేవాడు. ఇతడి నోటిలో విషం పోస్తే, అది అమృతంగా మారింది. ఏనుగులచే తొక్కించమని ఆదేశించినా అతనికి ఎటువంటి హాని జరగలేదు. ఆకలితో ఉన్న విష సర్పాలున్న గదిలో ఉంచినప్పటికీ జీవించ గలిగాడు. హిరణ్యకశ్యపుడు తన కొడుకును చంపాలని చేసిన ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయి. చివరిగా, ప్రహ్లాదుడిని హిరణ్యకశ్యపుడి యొక్క సోదరి అయిన హోలిక ఒడిలో చితిలో కూర్చోవాలని ఆజ్ఞాపించాడు, ఎందుకంటే మంటల నుండి రక్షించే శాలువాను ఆమె ధరించడం వలన ఆమెకి ఎలాంటి హాని జరగదు. ప్రహ్లాదుడు తన తండ్రి ఆదేశాలను వెంటనే అంగీకరించి, తనను రక్షించమని విష్ణువును వేడుకుంటాడు. మంటలు మొదలైనప్పుడు అందరూ చూస్తుండగానే హోలిక శాలువా ఎగిరి పోవడం వలన ఆమె దహనం అవుతుంది ఆ శాలువా ప్రహ్లాదుడిని కప్పడం వలన అతడికి ఎటువంటి హాని జరగదు. హోలిక మంటల్లో కాలిపోవటం వల్ల మనం హోలీను జరుపుకుంటున్నాము.
ప్రాథమిక పరిశోధనల ప్రకారం 7వ శతాబ్దంలో రత్నావళి అనే సంస్కృత నాటకం వలన హోలీ పండుగ ఉత్సవాలు జరుపుకొన్నారని తెలిసింది. వాస్తవంగా హోలీ పండుగకు సంవత్సరం పొడవునా ఆచారాలు ఉంటాయి, మొదటగా రంగు పొడిని ఒకరికొకరు పూసుకుంటారు మరియు పొడవైన చిమ్మే గొట్టాలు లేదా చిమ్మే తుపాకుల నుండి రంగు నీటిని జల్లుకుంటారు. సంగీత కచేరీల ద్వారా అనగా పండుగకు సంబంధించిన పాటలను మరియు రాధా మరియు కృష్ణ పురాణ ప్రేమ కథ గురించి పాటలు పాడేవారు; ముఖ్యంగా జానపద పాటలు అనగా "హోరి" పాటలను పాడేవారు. కొన్ని సంప్రదాయక జానపద పాటలు ఆజ్ బిరాజ్ మే హోలీ రే రాసియా కొన్ని తరాల నుండి ఇప్పటి వరకు కూడా ఉన్నాయి.
సంవత్సరాలు గడుస్తున్నకొద్ది, ప్రవాసభారతీయులు ఉంటున్న చాలా ప్రాంతాలలో అనగా ఆఫ్రికా, ఉత్తర అమెరికాలో, యూరప్ మరియు దక్షిణ ఆసియాకు దగ్గర ఉన్న ప్రాంతాలలో హోలీ పండుగను ఘనంగా జరపుకుంటారు.
వసంత కాలంలో వాతవరణములో మార్పూలు జరగటం వల్ల వైరల్ జ్వరం మరియు జలుబు వస్తాయని ప్రజలు విశ్వసిస్తారు. అందుకని, సహజమైన రంగు పొడులను చల్లుకోవడం వల్ల ఔషధముగా పనిచేస్తుందని అర్థం: సంప్రదాయముగా రంగులను నిమ్మ , కుంకుమ, పసుపు, బిల్వ లను ఉపయోగించి ఆయుర్వేద వైద్యులు ఔషధ వనమూలికలను తయారు చేస్తారు.
తడి రంగుల కొరకు, మోదుగ పుష్పములు రాత్రంతా మరిగించి అవి పసుపు రంగులోకి మారేంత వరకు ఉంచుతారు, అది ఔషధ లక్షణాలు కలగి ఉంటుంది. రసాయన రంగుల ఉపయోగం హానికరంగా తయారయ్యింది. వీటి వల్ల అంతుచిక్కని వ్యాధులు వస్తున్నాయి. అలాంటి వ్యాధులు రాకుండా వుండాలి అంటే రసాయన రంగులను ఉపయోగించకుండా వుంటే మంచిది.
ఇది వసంతోత్సవ పండుగ. హోలీ పండుగ కృష్ణుడు కూడా జరుపుకున్నాడు అంటారు. ఈ పండుగ గురించి నేను కొంచెమే తెలుసుకున్నాను అని నాకు అనిపిస్తోంది.
హోలీ పండుగను అందరు సంతోషము గా జరుపుకోవాలని అనుకుంటున్నాను. అందరికి
శనివారం నాడు నాకు హోంవర్క్ కొంచెమే చెయ్యవలసి వుంది . అయితే నేను అనుకున్నాను వర్క్ కొంచెమే కదా వుంది ఆదివారం చేసుకుందాం అని. ఆదివారం నాడు నాకు వర్క్ చేసుకోటానికి time కుదరలేదు. రాత్రి నిద్ర వచ్చేసి పడుకుని రేపు అంటే సోమవారం early morning లేచి వర్క్ చేసుకుందాం అనుకున్నా. అనుకున్నట్టే లేచాను కానీ పవర్ లేదు హోం వర్క్ చెయ్యలేక పోయా అప్పుడు నాకు అమ్మమ్మ నాకు ఒకసారి కద చెప్పింది కదా tomorrow is too late అనే విషయం మీద. ఆకధ మీరు కూడా ఒకసారి గుర్తు చేస్తున్నా. అనగనగా ఒకసారి ఒక బ్రాహ్మణుడు యజ్ఞము చెయ్యాలని అనుకుని ధర్మరాజు ను సహాయం అడిగాడు. ధర్మరాజు ఆ బ్రాహ్మణుని మరుసటి రోజు రమ్మన్ని పంపివేసాడు. ధర్మరాజు మాటలును విన్న భీముడు నగరమంతా తోరణాలు కట్టించి అలంకరించి , గొప్పగా పండుగ చెయ్యాలని తన పరివారమునకు ఆనతిని ఇచ్చాడు. ధర్మరాజు భీమసేనునితో "భీమా ! ఈ రోజు ఏమి విశేషము ? ఈ ఏర్పాటులు అన్నీ దేని గురించి?" అని అడిగాడు. దానికి భీముడు, " అన్నా! మీరు రేపటివరకు జీవించి ఉంఢగలననీ , మీ మాటను మీ మాటను నేరవేర్చుకోగాలరని దృఢ నమ్మకం వున్నది. మీరు ఆడిన మాటను తప్పరని నాకు తెలుసు. ఈ ప్రపంచములో రేపటివరకు జీవించి వుండగలను అన్నా ధీమాగా చెప్పగల వ్యక్తి మీరు తప్ప ఎవరు ఉండగలరు? అందుకనే ఈ పండుగ జరుపుకోదలిచాను. " అని సమాధానము ఇచ్చాడు భీముడు. ధర్మరాజు తన తమ్ముడు ఇంత సుక్షంగా తన కర్తవ్యమును గుర్తు చేసాడని ఆనందించాడు. ఏ మంచి కార్యమును తలపెట్టిన వెంటనే చెయ్యాలి. ఆలస్యము చేయకూడదు.
గతించిన కాలము మనది కాదు.రేపు మనచేతిలో లేదు. వర్తమానంలో జీవించాలి.
అమ్మమ్మ చెప్పింది tomorrow is too late అని. మీరు కూడా గుర్తు పెట్టుకొండి ఈవిషయాన్ని అనుకున్న పని వెంటనే చేసేయండి. మీకు డౌట్ వుంది కదా ఇంతకీ నా వర్క్ కంప్లీట్ అయ్యిందో లేదో అని నా వర్క్ కంప్లీట్ చేసేసి ఈ స్టొరీ మీకు కూడా షేర్ చేస్తున్నా. వర్క్ కంప్లీట్ అయ్యింది కానీ అంతకు ముందు చాలా టెన్షన్ పడ్డాను కదా . అలా అంత టెన్షన్ పడకుండా అనుకున్న పని వెంటనే చెయ్యాలి అని తెలుసుకున్నాను.
అత్యద్భుతమైన కృతులను రచించిన ముత్తుస్వామి దీక్షితులు సంగీతత్రయంలోత్యాగరాజు తర్వాత రెండవవారిగా పరిగణింపబడతారు. ముత్తుస్వామి దీక్షితర్ కర్ణాటక సంగీతత్రయంలో ఒకరైన వాగ్గేయకారుడు .
వాతాపి గణపతిం భజేఅన్న కీర్తన విననివారుండరంటే అది అతిశయోక్తి కాదేమో. అది ఆయన రచించినదే. రామ స్వామి దీక్షితర్, సుబ్బలక్ష్మి అంబాళ్ పుణ్యదంపతుల సంతానంగా 1775లో పుట్టాడు. నేడే ముత్తుస్వామి దీక్షితులు వారి జయంతి. ఈయన భక్తిశ్రద్ధలుగల వ్యక్తి గుణగణాలను తన బాల్యంలోనే ఇతడు ప్రదర్శించాడు. సంగీతంపై వెలువడిన "వెంకటాముఖి" సుప్రసిద్ధ గ్రంధం "చతుర్దండి ప్రకాశికై"ను అధ్యయనం చేశాడు. కావలసినమేరకు మన ధర్మ గ్రంధాల పరమైన జ్ఞానాన్ని కూడా సంపాదించగలిగాడు.రామస్వామి దీక్షితులు వీరి తండ్రి. వీరు సంగీత, వ్యాకరణ, జ్యోతిష, వాస్తు, మాంత్రిక, వైద్య విద్యలలో ఆరితేరిన వ్యక్తి. గురుగుహ ముద్రతో వున్న వీరి కృతులన్నీ సంస్కృతంలోనే వున్నవి. హిందూస్థానీ సంగీతంనుండి వీరు కర్ణాటక సంప్రదాయానికి వీరు తెచ్చిన రాగాలు సారంగ, ద్విజావంతిమొదలైనవి. వీరు అనేక క్షేత్రములు తిరిగి ఆయా ప్రదేశములలో వున్నట్టి దేవస్థానములను సందర్శించి దేవతలపై కృతులు జేసారు. ఆయన రచించిన కృతులలోకమలాంబా నవావర్ణ కృతులు, నవగ్రహ కీర్తనలు ప్రత్యేక స్థానాన్ని కలిగి వున్నాయి. వీరి యితర ప్రముఖ రచనలు: వాతాపి గణపతిం భజే, మహా గణపతిం, శ్రీనాథాది గురుగుహో, అక్షయలింగ విభో, బాలగోపాల, అఖిలాండేశ్వరి, రామచంద్రం భావయామి, చేత: శ్రీబాలకృష్ణం, శ్రీ వరలక్ష్మి, సిద్ధి వినాయకం, త్యాగరాజ యోగవైభవం, హిరణ్మయీం, అన్నపూర్ణే, అరుణాచలనాథం, ఆనందామృతకర్షిణి, మామవ మీనాక్షి, మీనాక్షి మే ముదం దేహి, నీలకంఠం భజే, స్వామినాథ, శ్రీ సుబ్రహ్మణ్యాయ, పరిమళ రంగనాథం, మొదలైనవి.
హాయ్! ఎన్నో అద్భుతమైన ప్రశ్నలతో , సరదా సరదా మాటలతో , కధలు - పద్యాలు- ఆటలతో, మీరు కోరిన పాటలతో , మీతో సరదాగా మాట్లాడేస్తూ మిమ్మల్ని నవ్వుకునేలా, రోజు అంతా సంతోషంగా వుంచటానికి మీ ముందుకు వచ్చేస్తున్నాను మీ చిన్ని RJ Sree Vaishnavi ని . ఎలా అంటే ప్రతీ ఆదివారము 10:00 am to 11:00 am వరకు మీ అభిమాన online రేడియో RadioJoshLive Masth Maza Masth Music :) (http://www.radiojosh.com/) లో నాతో మాట్లాడాలి అని అనుకుంటున్నారు కదా! మరి నాతో మాట్లాడాలి అంటే ఈ నంబర్స్ కి కాల్ చేయండి నాతో సరదాగా మాట్లాడే యండి . INDIA= +91 04042410008 USA = +19142147475 Skype id : radiojoshlive Gtalk id : radiojoshlive@gmail.com ధన్యవాదములు
1931 మార్చి నెల 23వ తేదీ. ఈ రోజునే భగత్ సింగ్ ను ఉరితీశారు. భారత స్వాతంత్ర్యోద్యమంలో కృషి చేసిన భగత్ సింగ్,రాజ్గురు మరియు సుఖ్దేవ్ లు ఉరి తీయబడ్డారు. అంతకు ముందు జైల్ సూపరింటెండెంట్ ఉరి ఉత్తర్వును అధికారికంగా విడుదలచేశారు. ఇప్పుడు మీరు చూస్తున్నది అదే. ఉరితీశాక ఓ గంటసేపు శరీరం గాలిలోనే తేలియాడుతూ ఉండాలని కూడా ఈ ఉత్తర్వుద్వారా ఆదేశించారు. భగత్ సింగ్ మరణించారని వైద్యాధికారి ధ్రువీకరించేవరకు శరీరాన్ని కిందకు దింపకూడదు. ఇదంతా కచ్చితంగా అమలవ్వాలన్నదే జైలు అధికారి ఉత్తర్వులోని సారాంశం. దేశం కోసం భగత్ సింగ్ అలా ప్రాణత్యాగం చేశారు.
నేటికీ భారత యువత భగత్ సింగ్ నుండీ ఎంతో స్పూర్తిని పొందుతున్నారు. ఇండియాటుడే 2008లో నిర్వహించిన ఒక సర్వే ప్రకారం అత్యంత గొప్ప భారతీయుడిగా భగత్ సింగ్ ఎన్నుకోబడ్డాడు. పోటీలో సుభాష్ చంద్రబోస్ ఇంకా గాంధీ వెనుకంజలో ఉండిపోయారు.శతజయంతి సందర్భంలో మేధావుల ఒక సమూహం భగత్ సింగ్ సంస్థాన్ అనే ఒక సంస్థను ఏర్పాటు చేసి భగత్ సింగ్ ఆలోచనలను ఇంకా ఆదర్శాలను అమలు చేయటానికి కృషి చేసింది. 2001 మార్చ్ 23న పార్లమెంటులో భగత్ సింగ్ కు నివాళులర్పించారు.2005 లో కూడా ఈ సంప్రదాయాన్ని పాటించారు.పాకిస్తాన్ లోని లాహోర్ లో భగత్ సింగ్ ను ఉరి తీసిన షద్మన్ చౌక్ ను భగత్ సింగ్ చౌక్ గా పేరు మార్చాలని భగత్ సింగ్ ఫౌండేషన్ ఆఫ్ పాకిస్తాన్ అభ్యర్థన చేసింది, న్యాయపరమయిన సమస్యల వల్ల ఇది ఇంకా అమలు కాలేదు. ఇంత గొప్ప స్వాతంత్ర్య సమరయోదులకు మన బ్లాగ్ ద్వారా నివాల్లు అర్పిస్తున్నాను.
హాయ్! ఎన్నో అద్భుతమైన ప్రశ్నలతో , సరదా సరదా మాటలతో , కధలు - పద్యాలు- ఆటలతో, మీరు కోరిన పాటలతో , మీతో సరదాగా మాట్లాడేస్తూ మిమ్మల్ని నవ్వుకునేలా, రోజు అంతా సంతోషంగా వుంచటానికి మీ ముందుకు వచ్చేస్తున్నాను మీ చిన్ని RJ Sree Vaishnavi ని . ఎలా అంటే ప్రతీ ఆదివారము 10:00 am to 12:00 pm వరకు మీ అభిమాన online రేడియో RadioJoshLive Masth Maza Masth Music :) (http://www.radiojosh.com/) లో నాతో మాట్లాడాలి అని అనుకుంటున్నారు కదా! మరి నాతో మాట్లాడాలి అంటే ఈ నంబర్స్ కి కాల్ చేయండి నాతో సరదాగా మాట్లాడే యండి .
INDIA= +91 04042410008 USA = +19142147475 Skype id : radiojoshlive Gtalk id : radiojoshlive@gmail.com