Blogger Widgets

శుక్రవారం, జనవరి 20, 2012

Brain Test

శుక్రవారం, జనవరి 20, 2012

I played the Game. Simply super.  
Enjoy The Game.


గురువారం, జనవరి 19, 2012

కానరటె పెంచరటె

గురువారం, జనవరి 19, 2012

నంద యశోదల ముద్దు బిడ్డగా వెలసిన శ్రీకృష్ణుడు తన చిలిపి అల్లరి పనులతో విసిగిన గోపవనితలు యశోదమ్మకు కృష్ణునివల్ల వారికీ కలిగిన కష్టాన్ని విన్నవించుకొని వారు ఊరు విడిచివెళ్లిపోతామని మీ అబ్బాయిని అదుపులో పెట్టుకోమని చెప్పారు గోపవనితలు.  వారు అలా చెప్పుతుంటే  యశోద చాలా బాధ పడినది.  అప్పుడు యశోద గోపవనితలతో ఇలా అన్నది. నేను కూడా మీవలెనే కంటిని ఈ బిడ్డని.  పిల్లలు చేసే అల్లరిని ఆమె సమర్ధిస్తున్నది. 
 అది అన్నమాచార్యులవారు ఇలా అందంగా రచించారు. ఇలా అందంగా వర్ణించటము ఎవరి తరమూకాదేమో అన్నట్టు రాసారు అన్నమాచార్యులవారు. 
కానరటె పెంచరటె కటకట బిడ్డలను | నేను మీవలెనే కంటి నెయ్యమైన బిడ్డని
బాయిట బారవేసిన పాలు వెన్నలును | చేయి వెట్టకుందురా చిన్నిబిడ్డలు |
మీయిండ్లు జతనాలు మీరుసేసికొనక | పాయక దూరేరేల ప్రతిలేని బిడ్డను ||
మూసిన కాగులనే యీముంగిట పెరుగులూ | ఆసపడకుందురా ఆబిడ్డలు |
వోసరించి మోసపోక వుండలేక మీరు | సేసేరింతేని దూరు చెప్పరాని బిడ్డని ||
చొక్కమైన కొప్పెరల జున్నులు జిన్నులును | చిక్కిన విడుతురా చిన్నిబిడ్డలు |
మిక్కిలి పూజలుసేసి మెచ్చ్చించదగదా | యెక్కువైన తిరువేంకటేశుడైన బిడ్డని ||

బుధవారం, జనవరి 18, 2012

"సు-ప్రభాతము"

బుధవారం, జనవరి 18, 2012


 
ధనుర్మాసము లో తిరుప్పావై తో స్వామిని మేలుకోలుపుతారు.  ఆనెల రోజులు కలియుగ దేవుడు వెంకటేశ్వరునికి సుప్రబాత సేవ చేయరు.  తక్కిన రోజులలో స్వామివారికి సుప్రభాత సేవ చేస్తారు.  ఈ సుప్రభాతం మొట్టమొదట ఎవరు రాసారు అని నాకు డౌట్ వచ్చింది అప్పుడు నాకు ఈ విషయాలు తెలిసాయి. 
మనము తెల్లవారి లేవగానే అందరకు good  morning చెపుతాము కదా అదే సుప్రభాతము.  
"సు-ప్రభాతము" అనగా "మంచి ఉదయం" (Good Morning) అని అర్ధంశ్రీ వేంకటేశ్వర సుప్రభాతం కలియుగ వైకుంఠపతి వేంకటేశ్వరుని సుప్రభాత సేవలో కీర్తించే స్తోత్రము.  
రామాయణం బాలకాండలో  శ్లోకం యాగరక్షణా నిమిత్తమై తనవెంట వచ్చిన రామలక్ష్మణులు నిద్రపోతుండగా విశ్వామిత్రుడు ఇలా పాడి వారిని మేలుకోల్పుతారు.  
కౌసల్యా సుప్రజా రామ పూర్వా సంధ్యా ప్రవర్తతే
ఉత్తిష్ఠ నరశార్దూల కర్తవ్యం దైవమాహ్నికమ్‌ 1
"కౌసల్యాదేవి సుపుత్రుడవగు  రామాపురుషోత్తమాతూర్పు తెల్లవారుచున్నదిదైవ సంబంధములైన ఆహ్నికములను చేయవలసియున్నదినిదుర లెమ్ము." అని భావం వచ్చేట్టు పాడారు  విశ్వామిత్రులవారు. దీని తరవాత నే మిగిలిన శ్లోకాలు వస్తాయి .
హిందూ పూజా విధానాలలోను, ప్రత్యేకించి శ్రీవైష్ణవం ఆచార పరంపరలోను, భగవంతుని పూజామూర్తికి అనేకమైన సేవలు  నిర్వహించే సంప్రదాయం ఉంది. ఇలాంటి సేవలలోనిదే సుప్రభాత సేవ. సుప్రభాత సేవా సమయంలో చేసే కీర్తననే "సుప్రభాతం" అని అంటారు. తిరుమల శయనమంటపంలోని భోగశ్రీనివాసుని సుప్రభాతం ద్వారా మేల్కొలుపుతారు.  ప్రఖ్యాతమైన శ్రీ వేంకటేశ్వర సుప్రభాతం స్తోత్రాన్ని శ్రీ ప్రతివాద భయంకర అణ్ణాంగారాచార్య లేదా అణ్ణన్ స్వామి రచించారు. ఇతడు క్రీ..1361 నుండి 1454  సంవత్సరం మధ్యలో జీవించారు ఆమద్య కాలంలో  అనంతాచార్యులు మరియు ఆండాళ్ దంపతులకు కంచి పట్టణంలో జన్మించారు. ఈయన శ్రీరామానుజాచార్యులచే నియమింపబడిన 74 సింహాసనాధిపతులలో ఒకరైన 'ముడుంబ నంబి' వంశానికి చెందినవారు. ఇతని గురువు మణవాళ మహాముని.   సుప్రసిద్ధమైన వేంకటేశ్వర సుప్రభాతము, రంగనాధ సుప్రభాతము కూడా అణ్ణన్ రచనలే. వేదాంత దేశికుల కుమారుడైన నారాయణావరదాచార్యుడు అణ్ణన్కు మొదటి గురువు. నారాయణ వరదాచార్యుల వద్ద వేదాలు, ఇతర విద్యలు అభ్యసిస్తున్న సమయంలో ఆణ్ణన్ను వాదంలో ఎదుర్కోవడం ప్రత్యర్ధులకు చాలా సంకటంగా ఉండేదట. నృసింహ మిశ్రుడనే అద్వైత పండితుడిని వాదనలో ఓడించినపుడు మణవాళ మహాముని అణ్ణన్కు "ప్రతివాద భయంకర" అనే బిరుదు ఇచ్చాడట. తరువాత అణ్ణన్ తిరుమలలో కొంతకాలం గడిపాడు. సమయంలో అతను మణవాళ మహాముని శిష్యుడయ్యాడు.
వెంకటేశ్వర సుప్రభాతం లోని శ్లోకాలు సంఖ్య ఇలావున్నాయి.
స్వామీ మేలుకొలుపు : 29 శ్లోకాలు వీటిని శ్రీ ప్రతివాద భయంకర అణ్ణన్ రచించినారు .
వెంకటేశ్వర స్తోత్రం భగవంతుని పై కీర్తనలు)  : 11 శ్లోకాలు
వెంకటేశ్వర ప్రపత్తి ( భగవంతునికి శరణాగతి): 16 శ్లోకాలు
 శ్రీవైష్ణవ సంప్రదాయంలో ప్రపత్తి అనేది చాలా ముఖ్యమైన అంశంగురువులకుభగవంతునికి సంపూర్ణంగా శరణాగతులవడం ప్రపత్తి యొక్క ముఖ్యలక్షణం.
వెంకటేశ్వర మంగళాశాసనము (పూజానంతరము జరిపే మంగళము) : 14 శ్లోకాలు 
  భాగాన్ని మణవాళ మహాముని రచించారు అని అంటారు.
జై శ్రీమన్నారాయణ్

పార్లమెంటు భవనం



పార్లమెంటు భవనం గురించి తెలియని వారు వుండరు.  చదువుకోని పిల్లలను అడిగినా చేప్తారు పార్లమెంట్ గురించి.  సులువుగా చెప్పేస్తారు అక్కడ రాజకీయనాయకులు డబ్బలాడుకుంటారు అని.  అలాంటి పార్లమెంట్ అయిన  మన భారత పార్లమెంట్ కు ఈరోజు ఒక ప్రత్యకమైన రోజుగా చెప్పుకోవాలి.  పార్లేమేంట్ కు ఇంకోపేరు సంసద్ అని పేరు వుంది సంసద్ అనే పదము సంస్కృతానికి చెందినది దీనికి అర్థం ఇల్లు లేక భవనం.
భారత పార్లమెంటు భవనాన్ని ఒక  బ్రిటిష్ ఆర్కిటెక్ట్ Lutyens రూపకల్పన మరియు సర్ హెర్బర్ట్ బేకర్ ప్రత్యక్ష పర్యవేక్షణలో నిర్మించిన అద్భుతమైన నిర్మాణము.  దీనిని "హెర్బర్ట్ బేకర్" 1912-13 లో డిజైన్ చేశాడు.  ఇది ప్రత్యేకమైన డిజైన్ ఇది ఒక సర్క్యులర్ బిల్డింగ్.  ఇది అనేక స్తంబాలు కలిగి వృత్తాకార  నిర్మాణము.  ఇది పోర్చుగీసు వారి నిర్మాణానికి అద్బుతమైన ఉదాహరణగా చెప్పుకోవచ్చు.  భవనం పని 1921 లో ప్రారంభమైంది అది ఆరు సంవత్సరాల తరువాత పూర్తయింది. ఈ భవనం జనవరి 18, 1927  భారతదేశం లో లార్డ్ ఇర్విన్ అను  అప్పటి బ్రిటిష్ వైస్రాయ్ ప్రారంభించారు. ఆగష్టు 1947 లో స్వాతంత్ర్యం తరువాత ఈ పార్లమెంట్ భారతదేశం యొక్క శక్తివంతమైన ప్రజాస్వామ్యం యొక్క గుర్తుగా వుంది.
పార్లమెంట్ భవనము పైకప్పుకు 257 గ్రానైట్ స్థంభాలు సపోర్టుగా నిలబెట్టారు. ఈ భవనాలు జనపథ్ రోడ్డులో వుంది. రాష్ట్రపతి భవన్ కు చాలా దగ్గరగా వుంది.
ఇది ఒక వృత్తాకార నిర్మాణం రూపకల్పన. దీని చుట్టుకొలత వ్యాసం ఒక మైలు వుంటుంది. ఇది  171 మీటర్లు ఉంటుంది. దానికి ఆకట్టుకునే గోపురం రెండు అర్థచంద్రాకార గదులు ఓర సెంట్రల్ హాల్. భవనం 144 క్రీం కలర్ ఇసుకరాయి స్తంభాలు తో జాలరు గల మొదటి ఫ్లోర్ లో మొత్తం ఓపెన్ కారిడార్ ఉంది. ఎరుపు ఇసుకరాయితో బాహ్య గోడలు ప్రతిధ్వని  రేఖాగణిత నమూనాల్లో చెక్కారు. సెక్యూరిటీ, నిబంధనలతో  మాత్రమే బయట నుండి చూడచ్చు.  ఈ నిర్మాణ అద్భుతమైనది. ఇది చుట్టుకొలతలో ఒక కిలోమీటరు వుండి దాదాపు వృత్తాకార నిర్మాణం గుమ్మటం వలెవుంది. ఇది భారత పార్లమెంటు ఒక ప్రత్యెక స్థానంగా ఉంది. పార్లమెంట్ సమావేశాల సందర్భంగా చర్చల యొక్క గృహముగా వుంది.

My Blog Lovers

నా యూట్యూబ్ చానల్స్ ప్లీజ్ సబ్స్క్రిబ్ చేయండీ

Diabetic Challenger

DIABETIC CHALLENGER YOUTUBE CHANNEL. PLASE SUBSCRIBE MY CHANNEL...... THANK YOU VERY MUCH.

Ammamma Tho Nenu (అమ్మమ్మ తో నేను

Please subscribe our channel Ammamma Tho Nenu (అమ్మమ్మ తో నేను)