Blogger Widgets

సోమవారం, మార్చి 07, 2016

శ్రీ శివ సహస్రనామ స్తోత్రమ్

సోమవారం, మార్చి 07, 2016

ఓం నమః శివాయః          హరహర మహాదేవ శంభోశంకర 
ఓం
స్థిరః స్థాణుః ప్రభుర్భానుః ప్రవరో వరదో వరః |
సర్వాత్మా సర్వవిఖ్యాతః సర్వః సర్వకరో భవః || 1 ||

జటీ చర్మీ శిఖండీ చ సర్వాంగః సర్వాంగః సర్వభావనః |
హరిశ్చ హరిణాక్శశ్చ సర్వభూతహరః ప్రభుః || 2 ||

ప్రవృత్తిశ్చ నివృత్తిశ్చ నియతః శాశ్వతో ధ్రువః |
శ్మశానచారీ భగవానః ఖచరో గోచరో‌உర్దనః || 3 ||

అభివాద్యో మహాకర్మా తపస్వీ భూత భావనః |
ఉన్మత్తవేషప్రచ్ఛన్నః సర్వలోకప్రజాపతిః || 4 ||

మహారూపో మహాకాయో వృషరూపో మహాయశాః |
మహా‌உ‌உత్మా సర్వభూతశ్చ విరూపో వామనో మనుః || 5 ||

లోకపాలో‌உంతర్హితాత్మా ప్రసాదో హయగర్దభిః |
పవిత్రశ్చ మహాంశ్చైవ నియమో నియమాశ్రయః || 6 ||

సర్వకర్మా స్వయంభూశ్చాదిరాదికరో నిధిః |
సహస్రాక్శో విరూపాక్శః సోమో నక్శత్రసాధకః || 7 ||

చంద్రః సూర్యః గతిః కేతుర్గ్రహో గ్రహపతిర్వరః |
అద్రిరద్ర్యాలయః కర్తా మృగబాణార్పణో‌உనఘః || 8 ||

మహాతపా ఘోర తపా‌உదీనో దీనసాధకః |
సంవత్సరకరో మంత్రః ప్రమాణం పరమం తపః || 9 ||

యోగీ యోజ్యో మహాబీజో మహారేతా మహాతపాః |
సువర్ణరేతాః సర్వఘ్యః సుబీజో వృషవాహనః || 10 ||

దశబాహుస్త్వనిమిషో నీలకంఠ ఉమాపతిః |
విశ్వరూపః స్వయం శ్రేష్ఠో బలవీరో‌உబలోగణః || 11 ||

గణకర్తా గణపతిర్దిగ్వాసాః కామ ఏవ చ |
పవిత్రం పరమం మంత్రః సర్వభావ కరో హరః || 12 ||

కమండలుధరో ధన్వీ బాణహస్తః కపాలవానః |
అశనీ శతఘ్నీ ఖడ్గీ పట్టిశీ చాయుధీ మహానః || 13 ||

స్రువహస్తః సురూపశ్చ తేజస్తేజస్కరో నిధిః |
ఉష్ణిషీ చ సువక్త్రశ్చోదగ్రో వినతస్తథా || 14 ||

దీర్ఘశ్చ హరికేశశ్చ సుతీర్థః కృష్ణ ఏవ చ |
సృగాల రూపః సర్వార్థో ముండః కుండీ కమండలుః || 15 ||

అజశ్చ మృగరూపశ్చ గంధధారీ కపర్ద్యపి |
ఉర్ధ్వరేతోర్ధ్వలింగ ఉర్ధ్వశాయీ నభస్తలః || 16 ||

త్రిజటైశ్చీరవాసాశ్చ రుద్రః సేనాపతిర్విభుః |
అహశ్చరో‌உథ నక్తం చ తిగ్మమన్యుః సువర్చసః || 17 ||

గజహా దైత్యహా లోకో లోకధాతా గుణాకరః |
సింహశార్దూలరూపశ్చ ఆర్ద్రచర్మాంబరావృతః || 18 ||

కాలయోగీ మహానాదః సర్వవాసశ్చతుష్పథః |
నిశాచరః ప్రేతచారీ భూతచారీ మహేశ్వరః || 19 ||

బహుభూతో బహుధనః సర్వాధారో‌உమితో గతిః |
నృత్యప్రియో నిత్యనర్తో నర్తకః సర్వలాసకః || 20 ||

ఘోరో మహాతపాః పాశో నిత్యో గిరి చరో నభః |
సహస్రహస్తో విజయో వ్యవసాయో హ్యనిందితః || 21 ||

అమర్షణో మర్షణాత్మా యఘ్యహా కామనాశనః |
దక్శయఘ్యాపహారీ చ సుసహో మధ్యమస్తథా || 22 ||

తేజో‌உపహారీ బలహా ముదితో‌உర్థో‌உజితో వరః |
గంభీరఘోషో గంభీరో గంభీర బలవాహనః || 23 ||

న్యగ్రోధరూపో న్యగ్రోధో వృక్శకర్ణస్థితిర్విభుః |
సుదీక్శ్ణదశనశ్చైవ మహాకాయో మహాననః || 24 ||

విష్వక్సేనో హరిర్యఘ్యః సంయుగాపీడవాహనః |
తీక్శ్ణ తాపశ్చ హర్యశ్వః సహాయః కర్మకాలవితః || 25 ||

విష్ణుప్రసాదితో యఘ్యః సముద్రో వడవాముఖః |
హుతాశనసహాయశ్చ ప్రశాంతాత్మా హుతాశనః || 26 ||

ఉగ్రతేజా మహాతేజా జయో విజయకాలవితః |
జ్యోతిషామయనం సిద్ధిః సంధిర్విగ్రహ ఏవ చ || 27 ||

శిఖీ దండీ జటీ జ్వాలీ మూర్తిజో మూర్ధగో బలీ |
వైణవీ పణవీ తాలీ కాలః కాలకటంకటః || 28 ||

నక్శత్రవిగ్రహ విధిర్గుణవృద్ధిర్లయో‌உగమః |
ప్రజాపతిర్దిశా బాహుర్విభాగః సర్వతోముఖః || 29 ||

విమోచనః సురగణో హిరణ్యకవచోద్భవః |
మేఢ్రజో బలచారీ చ మహాచారీ స్తుతస్తథా || 30 ||

సర్వతూర్య నినాదీ చ సర్వవాద్యపరిగ్రహః |
వ్యాలరూపో బిలావాసీ హేమమాలీ తరంగవితః || 31 ||

త్రిదశస్త్రికాలధృకః కర్మ సర్వబంధవిమోచనః |
బంధనస్త్వాసురేంద్రాణాం యుధి శత్రువినాశనః || 32 ||

సాంఖ్యప్రసాదో సుర్వాసాః సర్వసాధునిషేవితః |
ప్రస్కందనో విభాగశ్చాతుల్యో యఘ్యభాగవితః || 33 ||

సర్వావాసః సర్వచారీ దుర్వాసా వాసవో‌உమరః |
హేమో హేమకరో యఘ్యః సర్వధారీ ధరోత్తమః || 34 ||

లోహితాక్శో మహా‌உక్శశ్చ విజయాక్శో విశారదః |
సంగ్రహో నిగ్రహః కర్తా సర్పచీరనివాసనః || 35 ||

ముఖ్యో‌உముఖ్యశ్చ దేహశ్చ దేహ ఋద్ధిః సర్వకామదః |
సర్వకామప్రసాదశ్చ సుబలో బలరూపధృకః || 36 ||

సర్వకామవరశ్చైవ సర్వదః సర్వతోముఖః |
ఆకాశనిధిరూపశ్చ నిపాతీ ఉరగః ఖగః || 37 ||

రౌద్రరూపోం‌உశురాదిత్యో వసురశ్మిః సువర్చసీ |
వసువేగో మహావేగో మనోవేగో నిశాచరః || 38 ||

సర్వావాసీ శ్రియావాసీ ఉపదేశకరో హరః |
మునిరాత్మ పతిర్లోకే సంభోజ్యశ్చ సహస్రదః || 39 ||

పక్శీ చ పక్శిరూపీ చాతిదీప్తో విశాంపతిః |
ఉన్మాదో మదనాకారో అర్థార్థకర రోమశః || 40 ||

వామదేవశ్చ వామశ్చ ప్రాగ్దక్శిణశ్చ వామనః |
సిద్ధయోగాపహారీ చ సిద్ధః సర్వార్థసాధకః || 41 ||

భిక్శుశ్చ భిక్శురూపశ్చ విషాణీ మృదురవ్యయః |
మహాసేనో విశాఖశ్చ షష్టిభాగో గవాంపతిః || 42 ||

వజ్రహస్తశ్చ విష్కంభీ చమూస్తంభనైవ చ |
ఋతురృతు కరః కాలో మధుర్మధుకరో‌உచలః || 43 ||

వానస్పత్యో వాజసేనో నిత్యమాశ్రమపూజితః |
బ్రహ్మచారీ లోకచారీ సర్వచారీ సుచారవితః || 44 ||

ఈశాన ఈశ్వరః కాలో నిశాచారీ పినాకధృకః |
నిమిత్తస్థో నిమిత్తం చ నందిర్నందికరో హరిః || 45 ||

నందీశ్వరశ్చ నందీ చ నందనో నందివర్ధనః |
భగస్యాక్శి నిహంతా చ కాలో బ్రహ్మవిదాంవరః || 46 ||

చతుర్ముఖో మహాలింగశ్చారులింగస్తథైవ చ |
లింగాధ్యక్శః సురాధ్యక్శో లోకాధ్యక్శో యుగావహః || 47 ||

బీజాధ్యక్శో బీజకర్తా‌உధ్యాత్మానుగతో బలః |
ఇతిహాస కరః కల్పో గౌతమో‌உథ జలేశ్వరః || 48 ||

దంభో హ్యదంభో వైదంభో వైశ్యో వశ్యకరః కవిః |
లోక కర్తా పశు పతిర్మహాకర్తా మహౌషధిః || 49 ||

అక్శరం పరమం బ్రహ్మ బలవానః శక్ర ఏవ చ |
నీతిర్హ్యనీతిః శుద్ధాత్మా శుద్ధో మాన్యో మనోగతిః || 50 ||

బహుప్రసాదః స్వపనో దర్పణో‌உథ త్వమిత్రజితః |
వేదకారః సూత్రకారో విద్వానః సమరమర్దనః || 51 ||

మహామేఘనివాసీ చ మహాఘోరో వశీకరః |
అగ్నిజ్వాలో మహాజ్వాలో అతిధూమ్రో హుతో హవిః || 52 ||

వృషణః శంకరో నిత్యో వర్చస్వీ ధూమకేతనః |
నీలస్తథా‌உంగలుబ్ధశ్చ శోభనో నిరవగ్రహః || 53 ||

స్వస్తిదః స్వస్తిభావశ్చ భాగీ భాగకరో లఘుః |
ఉత్సంగశ్చ మహాంగశ్చ మహాగర్భః పరో యువా || 54 ||

కృష్ణవర్ణః సువర్ణశ్చేంద్రియః సర్వదేహినామః |
మహాపాదో మహాహస్తో మహాకాయో మహాయశాః || 55 ||

మహామూర్ధా మహామాత్రో మహానేత్రో దిగాలయః |
మహాదంతో మహాకర్ణో మహామేఢ్రో మహాహనుః || 56 ||

మహానాసో మహాకంబుర్మహాగ్రీవః శ్మశానధృకః |
మహావక్శా మహోరస్కో అంతరాత్మా మృగాలయః || 57 ||

లంబనో లంబితోష్ఠశ్చ మహామాయః పయోనిధిః |
మహాదంతో మహాదంష్ట్రో మహాజిహ్వో మహాముఖః || 58 ||

మహానఖో మహారోమా మహాకేశో మహాజటః |
అసపత్నః ప్రసాదశ్చ ప్రత్యయో గిరి సాధనః || 59 ||

స్నేహనో‌உస్నేహనశ్చైవాజితశ్చ మహామునిః |
వృక్శాకారో వృక్శ కేతురనలో వాయువాహనః || 60 ||

మండలీ మేరుధామా చ దేవదానవదర్పహా |
అథర్వశీర్షః సామాస్య ఋకఃసహస్రామితేక్శణః || 61 ||

యజుః పాద భుజో గుహ్యః ప్రకాశో జంగమస్తథా |
అమోఘార్థః ప్రసాదశ్చాభిగమ్యః సుదర్శనః || 62 ||

ఉపహారప్రియః శర్వః కనకః కాఝ్ణ్చనః స్థిరః |
నాభిర్నందికరో భావ్యః పుష్కరస్థపతిః స్థిరః || 63 ||

ద్వాదశస్త్రాసనశ్చాద్యో యఘ్యో యఘ్యసమాహితః |
నక్తం కలిశ్చ కాలశ్చ మకరః కాలపూజితః || 64 ||

సగణో గణ కారశ్చ భూత భావన సారథిః |
భస్మశాయీ భస్మగోప్తా భస్మభూతస్తరుర్గణః || 65 ||

అగణశ్చైవ లోపశ్చ మహా‌உ‌உత్మా సర్వపూజితః |
శంకుస్త్రిశంకుః సంపన్నః శుచిర్భూతనిషేవితః || 66 ||

ఆశ్రమస్థః కపోతస్థో విశ్వకర్మాపతిర్వరః |
శాఖో విశాఖస్తామ్రోష్ఠో హ్యముజాలః సునిశ్చయః || 67 ||

కపిలో‌உకపిలః శూరాయుశ్చైవ పరో‌உపరః |
గంధర్వో హ్యదితిస్తార్క్శ్యః సువిఘ్యేయః సుసారథిః || 68 ||

పరశ్వధాయుధో దేవార్థ కారీ సుబాంధవః |
తుంబవీణీ మహాకోపోర్ధ్వరేతా జలేశయః || 69 ||

ఉగ్రో వంశకరో వంశో వంశనాదో హ్యనిందితః |
సర్వాంగరూపో మాయావీ సుహృదో హ్యనిలో‌உనలః || 70 ||

బంధనో బంధకర్తా చ సుబంధనవిమోచనః |
సయఘ్యారిః సకామారిః మహాదంష్ట్రో మహా‌உ‌உయుధః || 71 ||

బాహుస్త్వనిందితః శర్వః శంకరః శంకరో‌உధనః |
అమరేశో మహాదేవో విశ్వదేవః సురారిహా || 72 ||

అహిర్బుధ్నో నిరృతిశ్చ చేకితానో హరిస్తథా |
అజైకపాచ్చ కాపాలీ త్రిశంకురజితః శివః || 73 ||

ధన్వంతరిర్ధూమకేతుః స్కందో వైశ్రవణస్తథా |
ధాతా శక్రశ్చ విష్ణుశ్చ మిత్రస్త్వష్టా ధ్రువో ధరః || 74 ||

ప్రభావః సర్వగో వాయురర్యమా సవితా రవిః |
ఉదగ్రశ్చ విధాతా చ మాంధాతా భూత భావనః || 75 ||

రతితీర్థశ్చ వాగ్మీ చ సర్వకామగుణావహః |
పద్మగర్భో మహాగర్భశ్చంద్రవక్త్రోమనోరమః || 76 ||

బలవాంశ్చోపశాంతశ్చ పురాణః పుణ్యచఝ్ణ్చురీ |
కురుకర్తా కాలరూపీ కురుభూతో మహేశ్వరః || 77 ||

సర్వాశయో దర్భశాయీ సర్వేషాం ప్రాణినాంపతిః |
దేవదేవః ముఖో‌உసక్తః సదసతః సర్వరత్నవితః || 78 ||

కైలాస శిఖరావాసీ హిమవదః గిరిసంశ్రయః |
కూలహారీ కూలకర్తా బహువిద్యో బహుప్రదః || 79 ||

వణిజో వర్ధనో వృక్శో నకులశ్చందనశ్ఛదః |
సారగ్రీవో మహాజత్రు రలోలశ్చ మహౌషధః || 80 ||

సిద్ధార్థకారీ సిద్ధార్థశ్చందో వ్యాకరణోత్తరః |
సింహనాదః సింహదంష్ట్రః సింహగః సింహవాహనః || 81 ||

ప్రభావాత్మా జగత్కాలస్థాలో లోకహితస్తరుః |
సారంగో నవచక్రాంగః కేతుమాలీ సభావనః || 82 ||

భూతాలయో భూతపతిరహోరాత్రమనిందితః || 83 ||
వాహితా సర్వభూతానాం నిలయశ్చ విభుర్భవః |
అమోఘః సంయతో హ్యశ్వో భోజనః ప్రాణధారణః || 84 ||

ధృతిమానః మతిమానః దక్శః సత్కృతశ్చ యుగాధిపః |
గోపాలిర్గోపతిర్గ్రామో గోచర్మవసనో హరః || 85 ||

హిరణ్యబాహుశ్చ తథా గుహాపాలః ప్రవేశినామః |
ప్రతిష్ఠాయీ మహాహర్షో జితకామో జితేంద్రియః || 86 ||

గాంధారశ్చ సురాలశ్చ తపః కర్మ రతిర్ధనుః |
మహాగీతో మహానృత్తోహ్యప్సరోగణసేవితః || 87 ||

మహాకేతుర్ధనుర్ధాతుర్నైక సానుచరశ్చలః |
ఆవేదనీయ ఆవేశః సర్వగంధసుఖావహః || 88 ||

తోరణస్తారణో వాయుః పరిధావతి చైకతః |
సంయోగో వర్ధనో వృద్ధో మహావృద్ధో గణాధిపః || 89 ||

నిత్యాత్మసహాయశ్చ దేవాసురపతిః పతిః |
యుక్తశ్చ యుక్తబాహుశ్చ ద్వివిధశ్చ సుపర్వణః || 90 ||

ఆషాఢశ్చ సుషాడశ్చ ధ్రువో హరి హణో హరః |
వపురావర్తమానేభ్యో వసుశ్రేష్ఠో మహాపథః || 91 ||

శిరోహారీ విమర్శశ్చ సర్వలక్శణ భూషితః |
అక్శశ్చ రథ యోగీ చ సర్వయోగీ మహాబలః || 92 ||

సమామ్నాయో‌உసమామ్నాయస్తీర్థదేవో మహారథః |
నిర్జీవో జీవనో మంత్రః శుభాక్శో బహుకర్కశః || 93 ||

రత్న ప్రభూతో రక్తాంగో మహా‌உర్ణవనిపానవితః |
మూలో విశాలో హ్యమృతో వ్యక్తావ్యక్తస్తపో నిధిః || 94 ||

ఆరోహణో నిరోహశ్చ శలహారీ మహాతపాః |
సేనాకల్పో మహాకల్పో యుగాయుగ కరో హరిః || 95 ||

యుగరూపో మహారూపో పవనో గహనో నగః |
న్యాయ నిర్వాపణః పాదః పండితో హ్యచలోపమః || 96 ||

బహుమాలో మహామాలః సుమాలో బహులోచనః |
విస్తారో లవణః కూపః కుసుమః సఫలోదయః || 97 ||

వృషభో వృషభాంకాంగో మణి బిల్వో జటాధరః |
ఇందుర్విసర్వః సుముఖః సురః సర్వాయుధః సహః || 98 ||

నివేదనః సుధాజాతః సుగంధారో మహాధనుః |
గంధమాలీ చ భగవానః ఉత్థానః సర్వకర్మణామః || 99 ||

మంథానో బహులో బాహుః సకలః సర్వలోచనః |
తరస్తాలీ కరస్తాలీ ఊర్ధ్వ సంహననో వహః || 100 ||

ఛత్రం సుచ్ఛత్రో విఖ్యాతః సర్వలోకాశ్రయో మహానః |
ముండో విరూపో వికృతో దండి ముండో వికుర్వణః || 101 ||

హర్యక్శః కకుభో వజ్రీ దీప్తజిహ్వః సహస్రపాతః |
సహస్రమూర్ధా దేవేంద్రః సర్వదేవమయో గురుః || 102 ||

సహస్రబాహుః సర్వాంగః శరణ్యః సర్వలోకకృతః |
పవిత్రం త్రిమధుర్మంత్రః కనిష్ఠః కృష్ణపింగలః || 103 ||

బ్రహ్మదండవినిర్మాతా శతఘ్నీ శతపాశధృకః |
పద్మగర్భో మహాగర్భో బ్రహ్మగర్భో జలోద్భవః || 104 ||

గభస్తిర్బ్రహ్మకృదః బ్రహ్మా బ్రహ్మవిదః బ్రాహ్మణో గతిః |
అనంతరూపో నైకాత్మా తిగ్మతేజాః స్వయంభువః || 105 ||

ఊర్ధ్వగాత్మా పశుపతిర్వాతరంహా మనోజవః |
చందనీ పద్మమాలా‌உగ్{}ర్యః సురభ్యుత్తరణో నరః || 106 ||

కర్ణికార మహాస్రగ్వీ నీలమౌలిః పినాకధృకః |
ఉమాపతిరుమాకాంతో జాహ్నవీ ధృగుమాధవః || 107 ||

వరో వరాహో వరదో వరేశః సుమహాస్వనః |
మహాప్రసాదో దమనః శత్రుహా శ్వేతపింగలః || 108 ||

ప్రీతాత్మా ప్రయతాత్మా చ సంయతాత్మా ప్రధానధృకః |
సర్వపార్శ్వ సుతస్తార్క్శ్యో ధర్మసాధారణో వరః || 109 ||

చరాచరాత్మా సూక్శ్మాత్మా సువృషో గో వృషేశ్వరః |
సాధ్యర్షిర్వసురాదిత్యో వివస్వానః సవితా‌உమృతః || 110 ||

వ్యాసః సర్వస్య సంక్శేపో విస్తరః పర్యయో నయః |
ఋతుః సంవత్సరో మాసః పక్శః సంఖ్యా సమాపనః || 111 ||

కలాకాష్ఠా లవోమాత్రా ముహూర్తో‌உహః క్శపాః క్శణాః |
విశ్వక్శేత్రం ప్రజాబీజం లింగమాద్యస్త్వనిందితః || 112 ||

సదసదః వ్యక్తమవ్యక్తం పితా మాతా పితామహః |
స్వర్గద్వారం ప్రజాద్వారం మోక్శద్వారం త్రివిష్టపమః || 113 ||

నిర్వాణం హ్లాదనం చైవ బ్రహ్మలోకః పరాగతిః |
దేవాసురవినిర్మాతా దేవాసురపరాయణః || 114 ||

దేవాసురగురుర్దేవో దేవాసురనమస్కృతః |
దేవాసురమహామాత్రో దేవాసురగణాశ్రయః || 115 ||

దేవాసురగణాధ్యక్శో దేవాసురగణాగ్రణీః |
దేవాతిదేవో దేవర్షిర్దేవాసురవరప్రదః || 116 ||

దేవాసురేశ్వరోదేవో దేవాసురమహేశ్వరః |
సర్వదేవమయో‌உచింత్యో దేవతా‌உ‌உత్మా‌உ‌உత్మసంభవః || 117 ||

ఉద్భిదస్త్రిక్రమో వైద్యో విరజో విరజో‌உంబరః |
ఈడ్యో హస్తీ సురవ్యాఘ్రో దేవసింహో నరర్షభః || 118 ||

విబుధాగ్రవరః శ్రేష్ఠః సర్వదేవోత్తమోత్తమః |
ప్రయుక్తః శోభనో వర్జైశానః ప్రభురవ్యయః || 119 ||

గురుః కాంతో నిజః సర్గః పవిత్రః సర్వవాహనః |
శృంగీ శృంగప్రియో బభ్రూ రాజరాజో నిరామయః || 120 ||

అభిరామః సురగణో విరామః సర్వసాధనః |
లలాటాక్శో విశ్వదేహో హరిణో బ్రహ్మవర్చసః || 121 ||

స్థావరాణాంపతిశ్చైవ నియమేంద్రియవర్ధనః |
సిద్ధార్థః సర్వభూతార్థో‌உచింత్యః సత్యవ్రతః శుచిః || 122 ||

వ్రతాధిపః పరం బ్రహ్మ ముక్తానాం పరమాగతిః |
విముక్తో ముక్తతేజాశ్చ శ్రీమానః శ్రీవర్ధనో జగతః || 123 ||

శ్రీమానః శ్రీవర్ధనో జగతః ఓం నమ ఇతి ||
ఇతి శ్రీ మహాభారతే అనుశాసన పర్వే శ్రీ శివ సహస్రనామ స్తోత్రమ్ సంపూర్ణమ్ ||

మంగళవారం, ఫిబ్రవరి 23, 2016

ఉదయాద్రి తెలుపాయె

మంగళవారం, ఫిబ్రవరి 23, 2016

తాళపాక  అన్నమయ్య 95 సంవత్సరాలు పరిపూర్ణ జీవితం గడిపి దుందుభి నామ సంవత్సరం ఫల్గుణ బహుళ ద్వాదశి నాడు (ఫిబ్రవరి 23, 1503) పరమపదించాడు. రాగిరేకులమీద వ్రాసిన తిధుల కారణంగా అతని జన్మ, మరణ దినాలు తెలుస్తున్నాయి.  ఇతడు శ్రీమహావిష్ణువు యొక్క ఖడ్గం అయిన నందకాంశ సంభూతుడు అని భావన ఉంది. "పదకవితా పితామహుడు", "సంకీరత్నాచార్యుడు", "పంచమాగమ సార్వభౌముడు", "ద్రవిడాగమ సార్వభౌముడు" - ఇవి అన్నమయ్యకు సమకాలీనులు సాదరంగా ఇచ్చిన బిరుద నామాలు.  అన్నమయ్య వర్ధంతి సందర్బంగా ఒక మంచి పాట. 
ఉదయాద్రి తెలుపాయె నుండు రాజు కొలు వీడె | 
అద నెర్కిగి రాడాయె నమ్మ నా విభుడు ||
చన్నులపై ముత్యాల సరులెల్ల జల్లనాయె | 
కన్నులకు గప్పొదవె గాంత నా కిపుడు |
కనె కలువల జాతి కనుమోడ్చినది మీద | 
వెన్నెల వేసంగి మొగ్గ వికసించె గదవె ||
పువ్వుల లోపలి కురులు బుగులు కొనగా నెర్కసె | 
దవ్వుల దుమ్మెదగములు తరమి డాయగను |
రవ్వసేయ శుక పికము రాయడి కోర్వగ రాదు | 
అవ్వలనెవ్వతె పసల కలరున్నవాడో ||
పన్నీట జలక మార్చి పచ్చకప్రము మెత్తి | 
చెన్ను గంగొప్పున విరులు చెరువందురిమి |
ఎన్నంగల తిరువేంకటేశుం డిదె ననుంగూడి | 
కన్నుల మనసునుం దనియం గరుణించెం గదవే ||

ఆదివారం, ఫిబ్రవరి 14, 2016

భక్తానా మభయప్రదం దినకరం

ఆదివారం, ఫిబ్రవరి 14, 2016

సప్తాశ్వ రథ మారూడం
ప్రచండం కశ్యపాత్మజం 
శ్వేత పద్మ ధరం దేవం
తం సూర్యం ప్రణమామ్యహం 

సూర్యభగవానుని ధ్యాన శ్లోకం !
ధాయెత్పూర్యః మనంతకోటి కిరణం
త్రైలోక్య చూడామణి,
భక్తానా మభయప్రదం దినకరం
జ్యోతిర్మయం శంకరమ్,
ఆదిత్యం జగదీశ మచ్యుత మజం
త్రైయార్ధసారం రవిమ్,
భక్తా భీష్ట ఫలప్రదం ద్యుతినిభం
మార్తాండ మధ్యం విభుమ్!!


ఉషోదయ కిరణాలతో సమస్త జీవ కోటినీ నవ చైతన్యంతో ఉంచుతున్న ఆ సూర్యభగవానుడి జన్మదినమును ధసప్తమి గా జరుపుకుంటాం.  ప్రత్యక్ష భగవానుడు  సమయపాలనా చక్రవర్తి... ఆరోగ్యదాత... అభయప్రదాత... అన్న పేర్లున్నవాడు. రాత్రిపగళ్లతో- చీకటివెలుగులను పంచడంలో సిద్ధహస్తుడు. ఆయనే సూర్యుడు. అదితికశ్యపులకు పుట్టిన సూర్యభగవానుడి జన్మదినమే రథసప్తమి.  రధసప్తమి రోజునుండి వేసవి కాలము ప్రారంబమవుతుంది . అందుకే రధసప్తమిరోజు తప్పకుండా సూర్య నమస్కారములు చేయాలి. మనకు ప్రతినిత్యము ప్రత్యక్షముగా కనిపించే దైవం సూర్యభగవానుడు. ప్రపంచములో అన్ని జీవరాసులకు వేడి, వెచ్చదనము, పాడిపంటలను, వెలుగును ఇచ్చేవాడు భాస్కరుడు. సుర్యారాధన మనకు వేద కాలమునుండి ఉంది. సూర్యుని పేరు సప్తిమ. ఏడు గుర్రాలను (ఏడు  గుర్రముల పేర్లు వరుసగా గాయత్రి, బృహతి, ఉష్ణిక్, జగతి, త్రిష్ణుప్, అనుష్ణుప్, పంక్తి )  వంచిన రధము కలిగినవాడు. సప్తలోకములకు తన శక్తిని ప్రసాదించువాడు సూర్య కిరణాలు ఏడురంగులకు నిదర్శనమని, రధసప్తమినాడు ఆకాసములో గ్రహ నక్షిత్ర సన్నివేసం రధమును పోలి ఉంటుంది కనుకనే ఈ తిధిని రధసప్తమి అని పేరు వచ్చింది.
అనంతసక్తితో కూడుకొన్న కిరణాలు, తేజస్సు, శుద్ధమైన వాడు , భక్తులకు అభయము ఇచ్చేవాడు. జగతికి వెలుగుకారకుడు, జ్యోతిర్మయుడు, శుభానిచ్చే ఆదిత్యుడు, చీకటి పారద్రోలేవాడు, భక్తుల కోరికలు తీర్చేవాడు ఆదిత్యుడు , మార్తాండుడు, శుభంకరుడు, భాస్కరుడు అయిన సూర్యనారాయణమూర్తికి నమస్కారములు అంటూ ధ్యానించాలి.
సుర్యుడు ఆరోగ్య ప్రదాత. అది సైన్స్ ద్వారా కూడానిరూపించబడినది. సూర్య కిరణాలలో డి విటమిన్ కలదు. ఎముకలకు  బలముగా వుంటాయి.  కేన్సర్ రాకుండా కాపాడతాయి.  ఒకప్పుడు సూర్యరశ్మి సమృద్ధిగా ఉండే భారతదేశంలో.. ప్రజలకు అసలు 'విటమిన్‌-డి' లోపమనేదే ఉండదని భావించేవారు. కానీ నేడది వట్టి అపోహేనని తాజా అధ్యయనాలన్నీ రుజువుచేస్తున్నాయి. ప్రస్తుతం మన దేశంలో 90% మందికి విటమిన్‌-డి లోపం ఉంది.
అన్నట్టు రధసప్తమి రొజు స్త్రీలు ఎన్నో నోములు చెయటానికి ప్రారంబధినముగా చెయుదురు. అక్షింతలు వేసుకొని నోములకు నాంది పలుకుదురు.
శుద్ధ సప్తమికి ’రథసప్తమి’ అని పేరు. ఈరోజు ఒక పరిపూర్ణ పర్వం. దీక్షానిర్వహణకి, వ్రతాచరణకి, సాధనాలకు ఈ సప్తమి ప్రసిద్ధి. ఏడాది పొడుగునా సూర్యారాధన చేసిన ఫలం ఈ దినం లభిస్తుంది.
సూర్యునికి రాగి పాత్ర ద్వారా అర్ఘ్యాన్నివ్వడం, ఎర్రచందనం, ఎర్రపువ్వులతో అర్చన చేయడం వంటివి ఈ రోజు ప్రత్యేకతలు.ఆవుపాల పాయసం నివేదించడం, అది కూడా ఆరుబయట సూర్యకిరణాలు పడే తావున ఆవుపేడ పిడకలను మండించి, దానిపై పాయసాన్ని పొంగించడం ఒక చక్కని ప్రక్రియ. వైద్యవిధానం, దేవతా మహిమ కలబోసిన పద్ధతి ఇది.
’రథ’శబ్దం గమనంలోని మార్పుని సూచిస్తుంది. సూర్యకిరణ ప్రసారం భూమికి లభించే తీరులో ఈ రోజునుండి ఒక మలుపు. ఈ మలుపులోని దేవతా ప్రభావాన్ని పొందేందుకు మన సంస్కృతిలో ఈ ఆనవాయితీని ప్రవేశపెట్టారు.
రామాయణంలో రావణవధి సమయంలో శ్రీరాముడు ’ఆదిత్యహృదయం’తో సూర్యోపాసన చేసి విజయం సాధించాడు. భారతంలో ధర్మరాజు ధౌమ్యుని ద్వారా సూర్యాష్టోత్తర శతనామ మంత్రమాలను ఉపదేశం పొంది , ఆదిత్యానుగ్రహంతో అన్న సమృద్ధిని, అక్షయపాత్రని సంపాదించాడు.
శ్రీకృష్ణుని పుత్రుడు సాంబుడు సూర్యోపాసన ద్వారా కుష్టువ్యాధి నుండి విముక్తుడయ్యాడు. చారిత్రకంగా మయూర కవి సూర్యశతక రచనతో ఆరోగ్యవంతుడయ్యాడు.
ఇలా పౌరాణిక చారిత్రకాధారాలు రవికృపా వైభవాన్ని చాటి చెబుతున్నాయి.  ఆదిత్య హృదయం అనే ఈ స్తోతము సూర్యభగవానుడి ని ఉద్దేశించినది. రామాయణం యుద్ధకాండలో శ్రీ రాముడు అలసట పొందినప్పుడు, అగస్త్య మహర్షి యుద్ధ స్థలానికి వచ్చి ఆదిత్య హృదయం అనే ఈ మంత్రాన్ని ఉపదేశిస్తారు.ఈ ఉపదేశము అయిన తరువాత శ్రీరాముడు రావణాసురుడిని నిహతుడిని చేస్తాడు. వాల్మీకి రామాయణం లోని యుద్ధకాండమునందు 107 సర్గలో ఈ అదిత్య హృదయ శ్లోకాలు వున్నాయి.  
సూర్య రశ్మిలో విటమిన్ D ఉంటుంది అది ఎముకల పటుత్వానికి అవసరం అని చెబుతారు. అంతే కాకుండా విటమిన్ D కణ విభజనలో కూడా తోడ్పడుతోంది. దీన వలన గాయాలు మానడమే కాకుండా కాన్సర్ రాకుండా కూడా ఉపయోగం ఉంటుంది. సూర కాంతికి ఎక్కువగా ఎక్స్‌పోజ్ అయిన వారిలో చాలా రకాల కాన్సర్ తక్కువగా వస్తుంది అని డాక్టర్స్ చెబుతారు. ముఖ్యంగా పెద్ద పేగు, మల ద్వారానికి సంబంధించిన కాన్సర్ మీద ఈ ప్రభావం ఎక్కువగా ఉంటుంది.  పన్నెండు భంగిమలతో కూడిన సూర్యనమస్కారాలలో ఒక సంక్షిప్తమైన ప్రాణాయామం, ధ్యానం సమ్మిళితమైన వ్యాయామం ఇమిడి ఉన్నాయి. 

శనివారం, ఫిబ్రవరి 13, 2016

భారత కోకిల

శనివారం, ఫిబ్రవరి 13, 2016

భారత కోకిల (నైటింగేల్ ఆఫ్ ఇండియా)గా ప్రసిద్ధి చెందిన ఈమె స్వాతంత్ర్య సమరయోధురాలు మరియు కవయిత్రి అయిన సరోజనీ దేవి జయంతి నేడు. సరోజినీ దేవి 1935 డిసెంబరులో కానుపూరులో జరిగిన అఖిల భారత జాతీయ కాంగ్రెష్ మహాసభలకి తొలి మహిళా అధ్యక్షురాలు మరియు స్వతంత్ర భారత దేశపు తొలి మహిళా గవర్నర్ కూడా.  ఈమె గొప్ప భారతదేశపు గర్వించదగ్గ మహిళ.  "హిందూ ముస్లిం భాయి భాయి అనే నినాదంతో సభల్లోనూ, సమావేశాల్లోనూ ప్రసంగాలు ఇచ్చి ప్రజలతో మమైకం అయ్యింది ఈమె.  స్వాతంత్రోద్యమంలో పాల్గొనిన ఆధునిక భారతదేశ ప్రముఖ స్త్రీలలో ఈమె ఒకరు. ఈమె హైదరాబాద్‌లో 1879 వ సంవత్సరంలో జన్మించెను. సరోజినీ తండ్రి పేరు అఘోరనాధ చటోపాధ్యాయ. బెంగాలు దేశానికి చెందిన వ్యక్తి. వృత్తిరిత్యా హైదరాబాదులో స్థిరపడ్డాడు. తల్లి వరదసుందరీదేవీ. తల్లిదండ్రులిద్దరూ విద్యావేత్తలు కావటంవలన విద్యావ్యాప్తికి ఎంతో కృషి చేసేవారు. ఆ రోజుల్లో స్రీ విద్య గురించి అనేక ఆంక్షలుండేవి పెద్ద కుటుంబాల వారెవ్వరూ తమ ఆడపిల్లలను పదవ తరగతి మించి చదివించేవారు కాదు. అటువంటి సమయంలో వారిద్దరూ స్త్రీ విద్య గురించి ప్రజల్లో ఉన్న అపోహలను తొలగించి వారిని పై చదువులు చదివించడానికి ప్రోత్సహించారు. సరోజినీదేవికి అయిదుగురు సోదరులుండేవారు.ఆమె సోదరీ మణులు ముగ్గురు. అందరూ బాగా చదువుకున్నవారే.  1891లో జరిగిన మెట్రిక్ పరీక్షలో మొత్తం రాష్ట్రంలో ప్రధమ స్థానం సరోజినీదేవి చేజిక్కించుకుని, అందరి ప్రశంసలు పొందటంతో, నిజాం నవాబు ఉప్పొంగిపోయి, ఆమెను విదేశాలకు పంపి చదువు చెప్పించాలని నిర్ణయంచుకొని, ఆమె తండ్రికి ఆ విషయంచెప్పి, ఒప్పించి తాను అనుకున్నది సాధించాడు. సరోజినీదేవికి చిన్నతనం నుంచి కవిత్వమంటే ఎంతో ఇష్టం.  1898 వరకు ఆమె విదేశాల్లో ఉండి అపారమైన విజ్ఞానాన్ని సంపాదించింది. ఇంగ్లాండు, ఇటలీ, స్విట్జర్లాండ్ వంటి దేశాలు తిరిగి వారి నుండి ఎన్నో విషయాలను నేర్చుకుని మంచి స్నేహితురాలిగా, కవయిత్రిగా వారి నుంచి ప్రశంసలు అందుకొని భారతదేశం తిరిగి వచ్చింది. ఇక్కడకు వచ్చిన తరువాత డాక్టర్ గోవిందరాజులు నాయుడుగారిని ప్రేమించి వివాహమాడి, ఎందరికో ఆదర్శ మహిళ అయింది. గాంధీజీ ఉప్పుసత్యాగ్రహం ప్రకటించటంతోటే, ఈమె దానిలో పాల్గొనింది. ప్రభుత్వానికి ఎదురు తిరిగి తూటా దెబ్బలకో, చీకతి కొట్లకో బలయ్యేబదులు ఈ బానిస బ్రతుకే నయమనుకుని సర్దుకుపొయ్యె అమాయక ప్రజానీకములో ఆమె ఉపన్యాసాలు దేశభక్తిని నూరి పోసి చావుకు కూడా భయపడని తెగింపును తేగలిగాయి. "జాతి వేరనీ, దేశం వేరనీ, నువ్వు వేరనీ విడిగా ఉండకు, నీకు జరిగితే దేశనికి జరిగినట్టే, దేశం అనుభవించే బానిసతనం నీవూ అనుభవించవలసినదే" అంటూ దేశమంతా తిరిగి దేశభక్తిని నూరిపోసించా వీరతిలకం. సరోజిని నాయుడు 1925 లో భారతీయ కాంగ్రెస్‌కు అధ్యక్షురాలిగా ఎన్నికైన మొదటి భారతీయ మహిళ. ఈమె స్త్రీ విమోచన కోసమూ, అస్పృశ్యతా నివారణ కోసమూ, ఆసక్తితో కృషి చేశారు. ఈమె గొప్ప కవయిత్రి. ఈమె అనేక పద్యాలను, ఆంగ్లంలో 'గోల్డెన్ త్రెషోల్డు', 'బర్డ్సు ఆఫ్ టైం', 'ఫెదరర్ ఆఫ్ ది డాన్' అనే గ్రంథాలను రచించారు. ఈమెను 'భారతదేశపు కోకిల' అన్నారు. 1947 లో భారతదేశం స్వాతంత్ర్యం పొందిన తరువాత ఉత్తరప్రదేశ్ గవర్నరుగా నియమితులైనారు.   ఆమె రచించిన కావ్యాలలో "కాలవిహంగం"(Bird of time), "స్వర్గ ద్వారం" (the Golden Threshold) , విరిగిన రెక్కలు(the broken wings) అనేవి చాలా ప్రసిద్ధమైనవి.  19వ శతాబ్దం చివరలో రచించింది Nightfall In The City Of Hyderabad ఇది చదివితే సంధ్యా సమయంలో హైద్రాబాద్ నగరం ఏ విధంగా ఉండేది అని తెలుస్తుంది.  తండ్రి మరణాంతరం రచించిన విషాదకవితలు ఈమెకు కైసర్-ఇ-హిండ్' బంగారు పతాకాన్ని సాధించిపెట్టింది. దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తరువాత దేశంలో అతిపెద్ద అప్పటి రాష్ట్రం ఉత్తరప్రదేశకి ఈమె గవర్నరు గా నియమించబడింది. హైదరాబాదులో తాను నివశించిన ఇంటికి తన మొదట కవితాసంకలనం పేరునే స్వర్ణప్రాగణంగా"ఎన్నుకొన్నది.ఈమె 1949 మార్చి 2న లక్నోలో మరణించినది. ఈమె జ్ఞాపకార్థం భారత ప్రభుత్వం 1964 ఫిబ్రవరి 13న ఈమె చిత్రంతో ఒక తపాలబిళ్ళను విడుదల చేసింది.ఈమెపై అభిమానంతో హైదరాబాదులో సికింద్రాబాద్ దగ్గర ఒక వీధికి సరోజినీ దేవి రోడ్డూ' అని నామకరణం చేసారు. ఈమె పేరున హైదరాబాదులో సరోజినీ కంటి ఆసుపత్రీ'ని కూడా స్థాపించారు. ఈవిడగారి విలువైన వస్తువులు ఇప్పటికీ సాలార్ జంగ్ మ్యూజియంలోను, జాతీయ పురావస్తు ప్రదర్శనశాలలోనూ భద్రంగా ఉన్నాయి.

శుక్రవారం, ఫిబ్రవరి 12, 2016

దయానంద - 'పాఖండ ఖండిని '

శుక్రవారం, ఫిబ్రవరి 12, 2016

దయానంద - 'పాఖండ ఖండిని ' పతాకము 
ఆర్యసమాజ్ స్థాపకుడు, అజ్ఙానాంధకారం, దారిద్య్రం, అన్యాయన్ని ఎదురించి పోరాడి, హిందు ధర్మ సంస్థాపనకు నడుం బిగించిన స్వామి దయానంద సరస్వతి జయంతి నేడు   ఈయన 1857 ప్రథమ స్వాతంత్ర పోరాటం లో చాలా ముఖ్యమైన  పాత్ర పోషించి, ఎందరో స్వాతంత్ర  సమర యోధులకు ప్రేరణ గా నిలిచాడు స్వామీ దయానంద సరస్వతి .
స్వామి దయానంద సరస్వతి 1824 సంవత్సరం లో గుజరాత్ లోని  ఠంకార అనే గ్రామంలోని  మహాశివభక్తులు అయిన ఒక వర్తక కుటుంబం లో జన్మిచారు.  ఈయన చిన్ననాటి నుండి భగవద్భక్తి ఎక్కువగా  కలిగివున్నాడు.  1846 లో భగవంతుడిని వెతకడానికి ఇల్లు వదిలి వెళ్లాడు. ఈ ప్రయాణంలో ఎందరో యోగులు మునుల సాంగత్యంలో గడిపి దయానందఅన్న నామం పొందాడు. భగవంతుని తపనలో భ్రమిస్తూ మథుర లోని స్వామి విరజానంద సరస్వతి కడకు చేరుకున్నాడు, అక్కడే వేదోపనిషత్తులను ఔపోసనం పట్టి గురువు ఆజ్ఞ మేరకు దేశమంతట ప్రబోధించుటకు బయలుదేరెను.  ధర్మం పేరిట జరిగే మోసాలు మూఢనమ్మకాలు గ్రహించాడు.  అలాంటి అధర్మాలను రూపుమాపటానికి ప్రయత్నించారు.  ప్రయాణ మార్గమున దేశ స్థితిగతులు, దీనమైన శోచనీయమైన హిందు సమాజమును అవగాహన చేసుకున్నాడు. భారతావని బ్రిటిష్ పాలనలో ఉంది, ఒకప్పుడు విశ్వమానవ సామ్రాజ్యానికి, ధర్మ సంస్కృతులకు కేంద్రమైన దేశం ఇప్పుడు, అపారమైన దరిద్రంలో స్వయం వినాశనానికి పరుగులెడుతుండడం చూసి శోకించాడు. హిందు సమాజం ఎటువైపు నుండి చూసినా కుల, మత వర్గ విభేదాలతో ఖండములగుచున్నది, అంధ విశ్వాసం, అంటరానితనం, సతి, బాల్య వివాహాలు ధర్మం పేరుతో జరుగుతున్న అవాంఛనీయమైన ఆచారాలు చూసిచలించి పోయి వాటిని ఛేదించడానికి 'పాఖండ ఖండిని ' అన్న పతాకాన్ని ఆవిష్కరించినాడు. భారత దేశాన్ని, హిందు సమాజాన్ని జాగృత పరచాలని సంకల్పించి ఎన్నో పురోగామి సంస్కరణలు చేపట్టాడు. అందులో భాగంగా సతి, బాల్య వివాహాలు, అంటరానితనం, వరకట్న దురాచారాన్ని బహిష్కరించాడు. స్త్రీ విద్య పరిచయం చేసాడు. బ్రిటిష్ సామ్రాజ్యవాదం పోవాలని నమ్మి (స్వరాజ్) స్వయం పరిపాలన అని మొదటి సారి గొంతెత్తినాడు. దయానందుడు వ్రాసిన సత్యార్థ ప్రకాశ్ లో భారత దేశం నుండి సమస్త భారతీయుల మనసులలోని మూఢ నమ్మకాలు, అంధవిశ్వాసాల నిర్మూలన గూర్చి వ్యాఖ్యానించాడు. ధర్మ సంస్థాపనకు శాశ్వత సంస్థగా, దేశ సంఘ సంస్కరణకు పునాదిగా, 10 ఏప్రిల్ 1875 న ముంబాయి నగరంలో మొదటి ఆర్యసమాజము స్థాపించినాడు. ఈ క్రమంలో దయానంద సరస్వతి పెక్కుమందికి కంట్లో నలుసు అయినాడు, పూర్వం ఏడు సార్లు విషప్రయోగాలు జరిగిననూ బస్తి, న్యోళి అనే యోగ ప్రక్రియ ద్వారా ప్రేగులను ప్రక్షాళనము చేసుకుని వాటిని విఫలము చేసినను, చివరిసారిగా 30 అక్టోబర్ 1883 సాయంత్రము జరిగిన విష ప్రయోగంతో క్షీణిస్తూ ఓంకారనాదంతో సమాధి అవస్థలో మోక్షాన్ని పొందాడు.

ఆదివారం, జనవరి 31, 2016

హరి రసమా విహారి సతు

ఆదివారం, జనవరి 31, 2016


హరి రసమా విహారి సతు
సరసోయం మమ శ్రమ సంహారి

దయా నిభృత తనుధారి సం
శయాతిశయ సంచారి
కయాప్యజిత వికారి
క్రియా విముఖ కృపాలధారి

సదా మిథ్యా జ్ఞానీ సతు
మదాలిమతాభిమానీ
తదా శ్రిత సంధానీ సతు
తదా తదా చింతా శయనాని 

పరామృత సంపాది
స్థిరానందాశ్రేది
వరాలాభ వివాది శ్రీ -
తిరువేంకటగిరి దివ్య వినోది

శనివారం, జనవరి 30, 2016

అమరవీరుల దినోత్సవం

శనివారం, జనవరి 30, 2016

మోహన్ దాస్ కరంచంద్ గాంధీ భారతీయులందరిచే ఆదరింపబడే ఒక గొప్ప స్వాతంత్ర సమరయోధుడు. ప్రజలు ఆయనను జాతిపిత గా గౌరవిస్తారు. సత్యముఅహింసలు గాంధీ నమ్మే సిద్ధాంత మూలాలు. సహాయ నిరాకరణ,సత్యాగ్రహము ఆయన ఆయుధాలు. 20వ శతాబ్దిలోని రాజకీయనాయకులలో అత్యధికముగా మానవాళిని ప్రభావితము చేసిన రాజకీయ నాయకునిగా ఆయనను కేబుల్ న్యూస్ నెట్వర్క్(CNN) జరిపిన సర్వేలో ప్రజలు గుర్తించారు. కొల్లాయి గట్టి, చేత కర్రబట్టి, నూలు వడకి, మురికివాడలు శుభ్రం చేసి, అన్ని మతాలూ, కులాలూ ఒకటే అని చాటి, ఆ మహాత్ముడు రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యాన్నిగడగడలాడించాడు. సత్యాగ్రహమూ, అహింస పాటించడానికి ఎంతో ధైర్యము కావాలని బోధించాడు. మహాత్ముడనీ, జాతిపిత అనీ పేరెన్నిక గన్న ఆయన ఆంగ్లేయుల పాలన నుండి భారతదేశానికి స్వాతంత్ర్యము సాధించిన నాయకులలో అగ్రగణ్యుడు.   1948 జనవరి 30వ తారీఖున ఢిల్లీలో బిర్లా నివాసంవద్ద ప్రార్థన సమావేశానికి వెళ్తుండగా ఆయనను నాథూరామ్ గాడ్సే  అనే వ్యక్తి రివాల్వర్ తో గాంధిజీ ని కాల్చి చంపాడు. నేలకొరుగుతూ గాంధీ "హే రామ్" అన్నాడని చెబుతారు.   గాంధి వర్ధంతిని అమరవీరుల దినోత్సవం గా జరుపుకుంటున్నారు  . ఈరోజున భారతదేశం అంతట 11గంటలకి సైరన్ మోగుతుంది . భారతదేశ ప్రజలందరూ స్వాతంత్రం పోరాటంలో ప్రాణాలు  అమరవీరులకు 2 నిమిషాలు మౌనం  శ్రద్ధాంజలి ఘటిస్తారు.  

మంగళవారం, జనవరి 26, 2016

Happy Republic Day

మంగళవారం, జనవరి 26, 2016

సోమవారం, జనవరి 25, 2016

తత్తాడి గుడి ధింధిం

సోమవారం, జనవరి 25, 2016

తత్తాడి గుడి ధింధిం తకధింధిం

తిత్తి తిత్తితి తితి తితి తితి||

దానవవదన వితానదాన సం-
ధాన రుధిర నిజపాన మిదం |
నానా భూత గణానాం గానం
దీన జనానాం తిత్తితి తితి ||


విమత దనుజమత విభవపరిభవిత
సమధికం తవ శౌర్య మిదం |
ప్రమదా భవ్యం ప్రమదాభరణం
తిమిర నిరసనం తిత్తితి తితి ||


తిరువేంకటగిరి దేవనిధానం
పరమామృతరస భాగ్యమిదం |
కరుణావరణం కమలా ధటనం
తిరొ తిరొ తిత్తితి తితి తితి ||

గురువారం, జనవరి 14, 2016

సంక్రాంతి పండగ శుభాకాంక్షలు.

గురువారం, జనవరి 14, 2016

సంక్రాంతి అనగా సూర్యుడు రాశిలో ప్రవేశించడం. సూర్యుడు రాశిలో ప్రవేశించడాన్ని సంక్రమణము అంటారు.అయితే ఈ సంక్రమణాన్నే సంక్రాంతి అంటారు. అయితే మనకు పన్నెండు రాశులు ఉన్నాయి.ఆ పన్నెండు రాశులలోకి సూర్యుడు ప్రవేశించే క్రమంలో మనకు పన్నెండు సంక్రాంతులు వస్తాయి. సూర్య సంక్రమణం జరిగేటపుడు సూర్యుడు ఏ రాశిలో ఉంటే ఆ సంక్రాంతి అంటారు. ఇలా ప్రతి మాసం ఒక సంక్రాంతి ఉంటుంది. సౌరమాన కాలెండరులో ప్రతినెల ఒక సంక్రాంతి తో ప్రారంభమవుతుంది. దీనిని భారతదేశంలో ఆంధ్రప్రదేశ్తెలంగాణకర్ణాటకమహారాష్ట్రతమిళనాడుకేరళఒడిషాపంజాబ్గుజరాత్ మొదలగు రాష్ట్రాలలో పాటిస్తారు. మరొకవైపు బెంగాలీ కాలెండరు మరియు అస్సామీ కాలెండరులలో ప్రతి నెల చివరి రోజున సంక్రాంతిగా పరిగణిస్తారు. పన్నెండు నెలల సంవత్సర కాలములో ఆరు నెలల దక్షిణాయణము దేవతలకు ఒక రాత్రి, ఆరు నెలల ఉత్తరాయణము దేవతలకు ఒక పగలు. కనుక దేవతలు మేలుకునే కాలము ఉత్తరాయణ పుణ్య కాలము. కనుకనే ఉత్తరాయనము వరకూ ఎదురు చూసి ఉత్తరాయణము ప్రవేశించిన తర్వాత తనువును చాలించాడు మహానుభావుడైన భీష్ముడు.  "సంక్రాంతి" లేదా "సంక్రమణం" అంటే చేరుట అని అర్ధం. జయసింహ కల్పద్రుమం అనే గ్రంధంలో "సంక్రాంతి"ని ఇలా విర్వచించారు - తత్ర మేషాదిషు ద్వాదశ రాశి క్రమణేషు సంచరతః సూర్యస్య పూర్వస్మాద్రాశే ఉత్తరః రాశౌ సంక్రమణ ప్రవేశః సంక్రాంతిః - మేషం మొదలైన 12 రాశులలో సంచరించే సూర్యుడు ముందున్న రాశి నుండి తరువాతి రాశిలోనికి ప్రవేశించడమే సంక్రాంతి.   సూర్యుని చలనంలో (రధయాత్రలో) ఘట్టాలు నాలుగు. అవి మేష, తుల, కటక, మకర సంక్రమణాలు. వీటిలో మకర సంక్రమణాన్ని "సంక్రాంతి పండుగ"గా వ్యవహరిస్తారు. 
పెద్ద పండగ రెండవ రోజయిన సంక్రాంతి రోజున పాలు పొంగించి, దానితో మిఠాయిలు తయారు చేస్తారు. దాదాపుగా అందరి ఇళ్ళలో అరిసెలు, బొబ్బట్లు,జంతికలు,చక్కినాలు, పాలతాలుకలు, సేమియాపాయసం, పరమాన్నం, పులిహోర, గారెలు మొదలయిన వంటకాలు చేసి, కొత్తబట్టలు ధరించి ఈ పండుగను ఆస్వాదిస్తారు.ఈ రోజున పితృదేవతలకు తర్పణాలు వదులుతారు.ప్రతీ సంక్రమణానికీ పితృతర్పణాలు ఇవ్వాలి. కాని మిగిలిన పదకొండు సంక్రమణాలకు ఇవ్వక పోయినా, ఈ మకర సంక్రమణానికి మాత్రం తప్పకుండా పితృ తర్పణాలు ఇస్తారు.  
సంక్రాంతి రోజులలో మనము చూసే ఇంకో సుందర దృశ్యం. గంగిరెద్దులను ఆడించే గంగిరెద్దులవారు. చక్కగా అలంకరించిన గంగిరెద్దులను ఇంటింటికీ తిప్పుతూ, డోలు, సన్నాయి రాగాలకు అనుగుణంగా వాటిచేత చేయించే నృత్యాలు చూడటానికి చాలా రమణీయంగా ఉంటాయి. ఆ గంగిరెద్దులు మనము ఇచ్చే కానుకలను స్వీకరిస్తున్నట్లుగా తలలు ఊపుతూ ధన్యవాదాలు తెలుపుతున్నట్లు మోకాళ్ళ మీద వంగటం వంటి విద్యలు వాటికి నేర్పిస్తారు.అయ్యగారికి దండం పెట్టు, అమ్మగారికి దండం పెట్టు అంటూ గంగిరెద్దుల వాళ్ళు సందడి చేస్తారు.కొత్త దాన్యము వచ్చిన సంతోషం తొ మనము వారికి దాన్యమ్ ఇస్తాము. హరిలో రంగ హరీ అంటూ నడినెత్తిపై నుంచి నాసిక దాకా తిరుమణి పట్టెలతో, కంచు గజ్జెలు ఘల్లుఘల్లుమనగా చిందులు త్రొక్కుతూ, చేతుల్లో చిరుతలు కొడుతూ కోడిగుడ్డు లాంటి బోడి తలపై రాగి అక్షయపాత్ర కదలకుండా హరిదాసు ప్రత్యక్షమవుతాడు. చిన్న పిల్లలు,  సరదాగా గాలి పటాలు ఎగురవేస్తూ పండగను చాలా సంతోషంగా జరుపుకుంటారు.  పతంగుల పోటీలు పెట్టుకుంటారు.  ఇంకా పండగను ఎంతో బాగా జరుపుకుంటారు.  ఈ సంక్రాంతి పండగ సందర్భముగా అందరికీ శుభాకాంక్షలు. 

My Blog Lovers

నా యూట్యూబ్ చానల్స్ ప్లీజ్ సబ్స్క్రిబ్ చేయండీ

Diabetic Challenger

DIABETIC CHALLENGER YOUTUBE CHANNEL. PLASE SUBSCRIBE MY CHANNEL...... THANK YOU VERY MUCH.

Ammamma Tho Nenu (అమ్మమ్మ తో నేను

Please subscribe our channel Ammamma Tho Nenu (అమ్మమ్మ తో నేను)