Blogger Widgets

మంగళవారం, ఏప్రిల్ 21, 2015

అదే అక్షయ తృతీయ

మంగళవారం, ఏప్రిల్ 21, 2015

ఈ రోజు హిందువులకు మరియు జైనులకు ప్రత్యకమైన రోజు,  అదే అక్షయ తృతీయ .  వైశాఖ శుద్ధ తదియనే అక్షయ తృతీయ గా పిలుస్తారు. సంస్కృతం లో ' అక్షయ ' అనగా క్షయం కానిది , తరిగి పోనిది అని అర్థం. హిందూ పంచాంగం ప్రకారం అక్షయ తృతీయ రోజంతా అత్యంత శుభ కరమైన ముహూర్త కాలంగా భావిస్తారు. అక్షయ తృతీయ నాడు బంగారం కొంటే సంపద అక్షయమవుతుందని భారతీయుల నమ్మకము.  ఈ రోజు నాడే రైతులు విత్తనాలుకు పూజ చేసి నాటుతారు.  ఎందుకంటే విత్తులు మంచిగా వ్యవసాయం వృద్ది చెందుతుంది.  ఇంకా "అక్షయ తృతీయ" నాడే మహావిష్ణువు ఆరో అవతారమైన పరుశురాముడు జన్మించాడని పురాణాలు చెబుతున్నారు. భగీరధుడు తపస్సు ఫలితంగా గంగానది భూమి తరలి వచ్చిన రోజు. యజ్ఞ యాగాదులు చేయటానికి మంచి కాలం. శ్రీ కృష్ణులవారి బాల్య స్నేహితుడు కటిక దరిద్రుడైన సుదాముడు కృష్ణుని దగ్గరకు వెళ్లి అటుకులు సమర్పించి అత్యంత దనవంతుడైనాడు. ధర్మరాజు సూర్యనారాయణ మూర్తి నుండి అక్షయ పాత్రను పొందినాడు. వ్యాసుడు మహాభారతాన్ని చెప్తున్నప్పుడు విఘ్ననాయకుడు అయిన గణపతి భారతాన్ని రాయటం మొదలు పెట్టినరోజు.  శంకరాచార్యులు వారు కనకదరా స్తోత్రాన్ని పాడితే కనకం వర్షంలాగ పడిన రోజు. దుర్యోధనుడు, దుశ్శాసనుడు నిండు సభలో ద్రౌపది కి వస్త్రాపహరణ చేసి అవమానించదలిచారు , అప్పుడు  ఆమెకి శ్రీ కృష్ణులు వస్త్రాలు ఇచ్చి ద్రౌపదిని కాపాడిన రోజు.  అక్షయ తృతీయ నాడు శ్రీ నరసింహస్వామి ప్రహ్లాదుడిని అనుగ్రహించిన రోజేనని పురాణాలు చెబుతున్నాయి.  కుబేరుడు, దేవతల కోశాధికారి, ధనానికి దేవత అనీ. లక్ష్మీ దేవి మరియు కుబేరుడు అక్షయ్ తృతీయ నాడు పూజిస్తే, సంపద కలగ చేస్తుంది.  అంతే కాదు ఈరోజు నాడే  అన్నపూర్ణాదేవి జన్మించినది.  ఈరోజు కి ఇన్ని విశేషాలు వున్నాయి కాబట్టే అందుకే ఈ పర్వదినాన పుష్పమో, ఫలమో భగవంతుడికి సమర్పించినా, దైవనామస్మరణ చేసినా, చివరికి నమస్కారం చేసిన సంపద, పుణ్యఫలం ప్రాప్తిస్తుందని ప్రతీతి.   ఈ క్రమంలో అక్షయ తృతీయ నాడు బంగారం కొనడంతో పాటు అనేక శుభకార్యాలను చేపట్టవచ్చును. ఇందులో పిల్లలను పాఠశాలలో చేర్చడం, పుస్తకావిష్కరణ, పుణ్యస్థలాలను సందర్శించడం వంటి మంచి కార్యాలను చేయవచ్చునని పురోహితులు సూచిస్తున్నారు. 

గురువారం, ఏప్రిల్ 16, 2015

విశిష్టమైన వ్యక్తి కందుకూరి వారు.

గురువారం, ఏప్రిల్ 16, 2015




మొట్టమొదటి వితంతు వివాహం జరిపించిన వ్యక్తి, మొట్టమొదటి సహవిద్యా పాఠశాలను ప్రారంభించిన వారు , తెలుగులో మొదటి స్వీయ చరిత్ర ఆయనదే, తెలుగులో తొలి నవల రాసింది ఆయనే, తెలుగులో తొలి ప్రహసనం రాసింది అతనే , ఆయనకున్న ఇతర విశిష్టతలు పద్య కావ్యాలు, నాటకాలు, నవలలు, ప్రహసనాలు, కధలు, వ్యాసాలు,చరిత్రలు ఇంకా ఎన్నో రచనలు రాసారు . చాలా పత్రికలు కూడా నడిపారు. అతనెవరో తెలుసా కందుకూరి వీరేశలింగం పంతులు గారు .   కందుకూరివారు ఎంతోమందికి ఆదర్సవంతముగా నిలిచారు అనటంలో సందేహం లేదంటే నమ్మండి .  గొప్ప సంఘ సంస్కర్త, తెలుగు జాతి గర్వించదగ్గ మహోన్నత వ్యక్తి కందుకూరి వీరేశలింగం పంతులు. సంఘ సంస్కరణకు, సామాజిక దురాచారాల నిర్మూలనకు నిరుపమానమైన కృషి చేసిన మహానుభావుడు ఆయన. సాహితీ వ్యాసంగంలోనూ అంతటి కృషి చేసిన కందుకూరి బహుముఖ ప్రజ్ఞాశాలి. తెలుగు జాతికి నవయుగ వైతాళికుడు.
వీరేశలింగం పంతులు 1848 ఏప్రిల్ 16న రాజమండ్రిలో పున్నమ్మ, సుబ్బారాయుడు దంపతులకు జన్మించారు. వీరి పూర్వీకులు ఇప్పటి ప్రకాశం జిల్లాలోని కందుకూరు గ్రామం నుండి రాజమండ్రికి వలస వెళ్ళడం వలన వారికి ఈ ఇంటి పేరు స్థిరపడిపోయింది. వీరేశలింగంకు నాలుగేళ్ళ వయసులో తండ్రి చనిపోయారు. పెదతండ్రి, నాయనమ్మల పెంపకంలో అల్లారుముద్దుగా పెరిగారు. ఐదో యేట బడిలో చేరి, బాలరామాయణం, ఆంధ్ర నామ సంగ్రహం, అమరం, రుక్మిణీ కళ్యాణం, సుమతీ శతకం, కృష్ణ శతకం మొదలైనవి నేర్చుకున్నారు. పన్నెండో యేట రాజమండ్రి ప్రభుత్వ పాఠశాలలో ఇంగ్లీషు చదువులో చేరారు. చిన్నప్పటినుండీ, అన్ని తరగతులలోనూ, ప్రథమ శ్రేణిలోనే ఉండేవారు. తన పదమూడో యేట బాపమ్మ అనే ఎనిమిదేళ్ళ అమ్మాయితో బాల్యవివాహమయింది. పెరిగి పెద్దయ్యాక వీరేశలింగం ఇటువంటి దురాచారాల నిర్మూలనకే కృషి చేసారు.
ఒక వ్యక్తిగా, సంఘసంస్కర్తగా, రచయితగా వీరేశలింగంకు అనేక విశిష్టతలు ఉన్నాయి. అనేక విషయాలలో ఆంధ్రులకు ఆయన ఆద్యుడు, ఆరాధ్యుడు. ఆధునికాంధ్ర సమాజ పితామహుడిగా కీర్తి గడించిన వ్యక్తి కందుకూరి. 
ఆంధ్ర దేశంలో బ్రహ్మ సమాజం స్థాపించారు. యువజన సంఘాల స్థాపన కూడా వీరేశలింగంతోనే మొదలయింది. సమాజ సేవ కొరకు హితకారిణి అనే ధర్మ సంస్థను స్థాపించి, తన యావదాస్తిని దానికి ఇచ్చేసారు. 25 సంవత్సరాల పాటు రాజమండ్రిలో తెలుగు పండితుడిగా పనిచేసి, మద్రాసు ప్రెసిడెన్సీ కళాశాలలో తెలుగు పండితుడిగా ఐదేళ్ళు పని చేసారు. తాను నమ్మిన సత్యాన్ని, సిద్దాంతాన్ని తు.చ. తప్పక్కుండా పాటించిన వ్యక్తి ఆయన.యుగకర్త గా ప్రసిద్ధి పొందిన ఆయనకు గద్య తిక్కన అనే బిరుదు ఉంది. ఆంధ్ర సమాజాన్ని సంస్కరణాల బాట పట్టించిన సంస్కర్త, వీరేశలింగం 1919 మే 27న మరణించారు.

సోమవారం, ఏప్రిల్ 13, 2015

ఏనుగు అమెరికా చేరినది.

సోమవారం, ఏప్రిల్ 13, 2015

1796 ఏప్రిల్ 13న  భారత దేశం నుండి పంపిన ఏనుగు అమెరికా చేరినది. అప్పటివరకు  అమెరికా వాళ్ళు  ఏనుగును చూడలేదు.  నాకు చాలా విచిత్రంగా అనిపించింది అది తెలిసాక.  మనకు అయితే బాగా తెలుసు మన చిన్నప్పట్టి నుండి మనకు ఏనుగు కదలు పాటలు నేర్పేవారు.  నాకు ఇప్పటికి గుర్తువున్న ఏనుగు పాట 
ఏనుగమ్మ ఏనుగు ఏ ఊరేళ్ళింది ఏనుగు
ఏనుగమ్మ ఏనుగు మా ఊరోచ్చింది ఏనుగు
ఏనుగమ్మ ఏనుగు ఏ ఊరేళ్ళింది ఏనుగు
ఏనుగమ్మ ఏనుగు మా ఊరోచ్చింది ఏనుగు
ఏనుగు ఏనుగు నల్లన ఏనుగు కొమ్ములు తెల్లన
ఏనుగు ఏనుగు నల్లన ఏనుగు కొమ్ములు తెల్లన
ఏనుగు మీద రాముడూ ఏంతో చక్కని దేవుడు
ఏనుగు మీద రాముడూ ఏంతో చక్కని దేవుడు
మన హిందు పురాణగాధలలో విఘ్నాలు తొలిగించే శక్తి ఉన్న ఒకే ఒక దేవతామూర్తి వినాయకుడు తలఖండించిన శివుడు ఏనుగు తలను తెచ్చి అతికించినట్టుగా పురాణాలు చెబుతున్నాయి.  గజేంద్ర మోక్షములో మహా విష్ణువు సుదర్శన చక్రం తో మొసలిని సంహరించి గజేంద్రున్ని రక్షిస్తాడు.  క్షీరసాగర మథనంలో పుట్టిన ఐరావతం అనే తెల్లని ఏనుగు, ఇంద్రుని యొక్క వాహనముగా వుంది.
అష్ట లక్ష్మిలలో గజలక్ష్మి ఒకరు.   ఏనుగు ఒక భారీ శరీరం, తొండం కలిగిన జంతువు. ప్రస్తుతం భూమిపై సంచరించే జంతువులన్నింటిలోకి ఏనుగే పెద్దది. దీని గర్భావధి కాలం 22 నెలలు. ఏనుగు 70 సంవత్సరాలు కంటే ఎక్కువగా జీవిస్తుంది. ఏనుగులు రెండు రకాలు: ఆఫ్రికా ఏనుగుమరియు ఆసియా ఏనుగుహిందువులు ఏనుగును వివిధరకాలుగా పూజిస్తారు. ఇవి పూర్తిగా శాఖాహారులు మరియు బాగా తెలివైనవి. ప్రాచీన భారతదేశంలో మొదటిసారిగా ఏనుగులను మచ్చికచేసుకున్నారు. ఏనుగులు కష్టపడి పనిచేసే జంతువులు. అడవులలో భారీ వృక్షాలను పడగొట్టడానికి, తరలించడానికి ఉపయోగిస్తారు. ఇలాంటి పనులను ముఖ్యంగా ఆడ ఏనుగుల నుపయోగించేవారు. యుద్ధాలలో ఏనుగులను భారతదేశంలోను, తర్వాత పర్షియాలోను ఉపయోగించారు. వీటికోసం ముఖ్యంగా మగ ఏనుగులను మాత్రమే పనికొస్తాయి. భారీ పనులకోసం, వృక్షాలను కూల్చడానికి, పెద్దపెద్ద దుంగలను కదిలించడానికి, యుద్ధఖైదీలను వీటి పాదాలక్రింద తొక్కించడానికి వాడేవారు.మహారాజులు అడవులలో క్రూరమృగాలు, ముఖ్యంగా పులుల్ని వేటాడటం కోసం ఏనుగులమీద వెళ్ళేవారు. కొన్ని దేవాలయాలలో ఊరేగింపులలో ఏనుగుల్ని ఉపయోగిస్తారు.
ప్రపంచవ్యాప్తంగా జంతుప్రదర్శనశాల లలో మరియు సర్కస్ లలో ఏనుగులు ప్రధాన ఆకర్షణలు.
గజారోహణం, లతో మహారాజులు ఆనాటి గొప్ప కవిపండితులను సన్మానించేవారు.

గురువారం, ఏప్రిల్ 09, 2015

ధ్వని రికార్డు చేసుకునే యంత్రం

గురువారం, ఏప్రిల్ 09, 2015

మనం చాలా సులువుగా మనకు నచ్చిన ధ్వనిని రికార్డ్ చేయగలుగుతున్నాం.  అలా రికార్డ్ చేయటానికి ఈనాడు అయితే అనేకనేక పరికరాలు అందుబాటులో వున్నాయి.  మన చేతిలో నిరంతరం వుండే మొబైల్ నుండి కూడా ధ్వనిని రికార్డ్ చేసేస్తాం.  అంతకు ముందు  టేప్ రికార్డర్ ద్వారా రికార్డ్ చేసేవారు.  వీటి అన్నిటికంటే ముందు అసలు ధ్వని రికార్డు చేసుకునే యంత్రం ను ఎప్పుడు నుండి ఎలాంటి పరికరం ద్వారా రికార్డ్ చేసేవారంటే ! 1860 వ సంవత్సరం ఏప్రిల్ 9 న ధ్వని రికార్డు చేసుకునే యంత్రం ను  కనుగొన్నారు. దాని పేరు ఫొనాటోగ్రాఫ్ యంత్రం ( Phonautograph ).  
దీనిని మొట్ట మొదట  ఫ్రెంచ్ మెన్  Édouard-Léon Scott de Martinville కనుక్కోనాడు.  దానిమీద పూర్తి అధికారాలు  మార్చి 25 1857 లో పొందాడు.   Edouard-Léon Scott de Martinville.jpg  ఇతను ఫ్రెంచ్ ప్రింటర్ మరియు పుస్తకాలు అమ్మకం వ్యాపారం చేస్తూవుండేవాడు.  వృత్తిరీత్యా అతను ఒక ప్రింటర్, అతను ఎల్లప్పుడూ కొత్త కొత్త  శాస్త్రీయ ఆవిష్కరణలు గురించి చదువుతూవుండేవాడు మరియు అతను ప్రయోగాలు కూడా చేసేవాడు . స్కాట్ డి MARTINVILLE కాంతి మరియు ఫోటో కోసం ఫోటోగ్రఫీ అప్పటి కొత్త టెక్నాలజీ ద్వారా అతనికి ఆలోచన వచ్చింది.  ఒక విధంగా ఆలోచించి మనిషి యొక్క ప్రసంగం యొక్క ధ్వనిని రికార్డింగ్  చెయ్యాలి అనే ఆసక్తి కలిగింది. 
1853 నుండి ఆయన స్వర శబ్దాలు లిప్యంతరీకరణ యంత్రాల పట్ల ఆకర్షితుడయ్యాడు. ఒక భౌతిక పాఠ్య పుస్తకం లోని మానవుని శారిర శాస్త్రంలో  చెవి అంతర్బాగం  డ్రాయింగ్లు వున్నాయి . అతను కర్ణ భేరిని చూసి దాని మాదిరిగా, ఒక దీపపు మసితో కవర్ అయిన ఒక కాగితం, చెక్క లేదా గాజు ఉపరితలంపై వత్తుతారు ప్రతిపాదిత ఒక stylus తో చిన్న ఎముక కోసం లేవేర్ యొక్క ఒక ధారావాహిక కొరకు సాగే పొర చొప్పిస్తూ ఒక యాంత్రిక పరికరం ను తయారు చేసారు. జనవరి 1857 26 న, అతను ఫ్రెంచ్ అకాడమీకి  తన సీల్ చేయబడిన కవర్లో డిజైన్ అందించాడు. 

Phonautograph ను తయారు చేయటానికి ఒక దీపం నలుపు పూత, చేతితో త్రిప్పే క్రాంక్ సిలిండర్పై ఒక చిత్రం చెక్కబడివుంది.  ఇది ఒక గట్టి bristle తో కంపింపచేసే ఇది ఒక డయాఫ్రమ్ జత, ధ్వని సేకరించడానికి ఒక కొమ్ము ఉపయోగించారు . స్కాట్ ధ్వని వాయిద్యం మేకర్ రుడోల్ఫ్ కోనిగ్ సహాయంతో పలు పరికరాలను నిర్మించారు. 1877 యొక్క ఎడిసన్ యొక్క ఆవిష్కరణ కాకుండా, ఫోనోగ్రాఫ్, Phonautograph మాత్రమే ధ్వని మరియు దృశ్య చిత్రాలు రూపొందించినవారు.  కానీ దానిని రికార్డింగ్ ఆడడానికి వీలు లేదు. స్కాట్ డి MARTINVILLE యొక్క పరికరం మాత్రమే ధ్వని తరంగాల శాస్త్రీయ పరిశోధనలు కోసం ఉపయోగించారు.

స్కాట్ డి MARTINVILLE ధ్వని రికార్డర్ ను మాత్రమె శాస్త్రీయ ప్రయోగాల కోసం ప్రయోగశాల లో ఉపయోగించేవారు. అంతే కాదు  phonautographs అమ్మకములను కూడా చేయగలిగారు .  ఇది అచ్చు శబ్దాలు యొక్క అధ్యయనానికి ఉపయోగపడుతుంది అని నిరూపించాడు. 

బుధవారం, ఏప్రిల్ 01, 2015

1st ఏప్రిల్ ఫూల్

బుధవారం, ఏప్రిల్ 01, 2015


ఏప్రిల్ 1 ని మనం ఏప్రిల్ ఫూల్ రోజు గా జరుపుకుంటాం.  దీనికి ఒక కధ వుంది.  అది ఏమిటంటే  పదహారో శతాబ్దం మధ్య వరకు యూరప్ లో కూడ సంవత్సరాది మార్చి నెల మధ్యలోనే జరుపుకునేవారు. యూరప్ లో ఈ నూతన సంవత్సరపు ఉత్సవాలు మరియు వసంత కాలపు ఉత్సవాలు కలిపి ఓ పది రోజుల పాటు వరసగా జరుపుకునేవారు. ఏప్రిల్ 1 రాగానే ఈ ఉత్సవాలు ముగిసే సందర్భంలో ఒకరికొకరు బహుమానాలు ఇచ్చి పుచ్చుకునేవారు. ఇలా ఎప్పుడూ ఘనంగా జరుపుకునేవారు.  అలావుండగా అప్పటి ఫ్రాంసు దేశపు రాజు సంవత్సరాదిని మార్చి మధ్య నుండి జనవరి 1 వ తారీఖుకి మార్చుతూ ఒక నోటీసు జారీ చేసాడు. ఆ రోజులలో వార్తాపత్రికలు, రేడియోలు, టీవీలు, కంప్యూటర్స్ లేవు. వారు అప్పట్లో దండోరా వేయించి వుంటారు.   కాని రాజు గారి నోటీసు అందరికీ చేరలేదు. అందిన వాళ్ళు కూడ పాత అలవాట్లని వారు మార్చుకోలేకపోయారు. కనుక రాజధానిలో సంవత్సరాది జనవరి ఒకటిన జరిగిపోయినా కానీ  దేశపు మూలల్లో మాత్రము ఏప్రిల్ 1 న బహుమానాలు ఇచ్చుకోవటంమానలేదు. అందుకని వాళ్ళని ఎగతాళిగా ఏప్రిల్ ఫూల్స్ అనేవారు. పాత అలవాట్లు మనలేక వారు జరుపుకుంటున్నారు కదా. అందుకని ఇప్పటికీ అల్లరిగా బహుమానాలు ఇచ్చుకోవటం, మరియు ఒకరిని ఒకరు ఫూల్స్ చేసుకుంటున్నారు.  అందుకే ఏప్రిల్ 1  ని ఫూల్స్ డే గా జరుపుకుంటున్నారు.  చాలా సరదాకా వుంటుంది.  ఫూల్స్ అయ్యినవారు బాధపడకుండా సరదాగా తీసుకొని ఎంజాయ్ చేయచ్చు.  ఫూల్స్ డే బాగుంది కదండి. 

శుక్రవారం, మార్చి 27, 2015

శ్రీ సీతారాముల కళ్యాణం

శుక్రవారం, మార్చి 27, 2015

శ్రీరాముడు ధర్మ సంస్థాపనార్థం అవతరించిన శ్రీ మహా విష్ణువు యొక్క ఏడవ అవతారం. రావణుని అంతమొందించడానికి అవతరించిన వాడు.  ఇటీవల జరిపిన జ్యోతిష శాస్త్ర పరిశోధనల ఆధారంగా శ్రీరాముడు క్రీ.పూ 5114, జనవరి 10 న జన్మించి ఉండవచ్చునని భావిస్తున్నారు. శ్రీరాముడు వసంత ఋతువులో చైత్ర శుద్ధ నవమి, గురువారము నాడు పునర్వసు నక్షత్రపు కర్కాటక లగ్నంలో సరిగ్గా అభిజిత్ ముహూర్తంలో అంటే మధ్యాహ్మం 12 గంటల వేళలో త్రేతాయుగంలో జన్మించినాడు. ఆ మహనీయుని జన్మ దినమును ప్రజలు పండుగగా జరుపుకుంటారు. పదునాలుగు సంవత్సరములు అరణ్యవాసము, రావణ సంహారము తరువాత శ్రీరాముడు సీతాసమేతంగా అయోధ్యలో పట్టాభిషిక్తుడైనాడు. ఈ శుభ సంఘటన కూడా చైత్ర శుద్ధ నవమి నాడే జరిగినదని ప్రజల విశ్వాసము. శ్రీ సీతారాముల కళ్యాణం కూడా ఈరోజునే జరిగింది.  
శ్రీ రామ రామ రామేతి రమే రామే మనోరమే
సహస్రనామ తత్తు(స్తు)ల్యమ్ రామనామ వరాననే
రామ నామము సకల పాప హరమనీ, మోక్షప్రథమనీ పలువురి నమ్మిక. "రామ" నామము లో పంచాక్షరీ మంత్రము "ఓం నమశ్శివాయ" నుండి 'మ' బీజాక్షరము, అష్టాక్షరీ మంత్రము "ఓం నమో నారాయణాయ" నుండి 'రా' బీజాక్షరము పొందుపరచబడియున్నవని ఆధ్యాత్మిక వేత్తల వివరణ. మూడు మార్లు "రామ" నామమును స్మరించినంతనే శ్రీ విష్ణు సహస్ర నామ స్తోత్రము చేసిన ఫలము లభించునని శ్రీ విష్ణు సహస్ర నామ స్తోత్రము-ఉత్తర పీఠికలో చెప్పబడినది.  
రామాయణంలో ధర్మనిరతి, ఉత్తమమైన వ్యక్తులు పాటించవలసిన నీతి ప్రధానంగా కనిపిస్తాయి. సేవకుడు ఎలా ప్రవర్తించాలి, కొడుకు ఎలా నడుచుకోవాలి, తమ్ముడు ఎలా నడచుకోవాలి, రాజు ఎలా ఉండాలి, భార్య ఎలా ఉండాలి - వంటి నియమాలు రామాయణంలో కధాపరంగా వివరింపబడినాయి. మనకు రమాయణం ద్వారా మంచివిషయాలు తెలుస్తాయి. రామాయణము మనకు ఆధర్శంగావుంటుంది కదా.
శ్రీ సీతారాముల కళ్యాణం శుభాకాంక్షలు. 

ఆదివారం, మార్చి 22, 2015

జల కల

ఆదివారం, మార్చి 22, 2015

ప్రపంచ జల దినోత్సవాన్ని మార్చి 22, 2014న విశ్వవ్యాప్తంగా పాటించారు. మంచి నీటి ప్రాధాన్యతను ప్రజలకు తెలియచేసేందుకు యునైటెడ్ నేషన్స్ మార్చి 22వ తేదీని ప్రపంచ జల దినోత్సవంగా నిర్వహిస్తుంది. మెరుగైన నీటి వనరుల ఉపయోగం, జల వనరుల సంరక్షణ ప్రపంచ జల దినోత్సవ ముఖ్యోద్దేశం.  భూమిపై మూడొంతుల భాగం నీరు ఆవరించబడి ఉన్నది. ఈ భువిపై ఉన్న ప్రతి ప్రాణి నీరు లేనిదే మనుగడ సాగించలేదు.
భూభాగంలో 70.9 శాతం నీటితో నిండి వుంది. అందులో 86.5 శాతం సముద్రపు నీరు, 1.7 శాతం భూగర్భ జలాలు, 1.7శాతం మంచు రూపంలో ఉంది. అయితే భూమిమీద మొత్తం 2.5 శాతం మాత్రమే మంచినీరు ఉంది. అందులో 0.3 శాతం నదుల్లో, కాలువల్లో ఉంది. 
యునైటెడ్ నేషన్స్, ప్రపంచ జల దినోత్సవాన్ని 1992 యునైటెడ్ నేషన్స్ కాన్ఫరెన్స్ ఆన్ ఎన్విరాన్‌మెంట్ అండ్ డెవలప్‌మెంట్ (UNCED), రియో డి జెనీరియో సమావేశంలో ప్రతిపాదించింది. దీన్ని 1993వ సంవత్సరం నుంచి నిర్వహించడం ప్రారంభించారు. 
మెరుగైన మంచి నీటి వనరుల నిర్వహణ, ప్రాముఖ్యత పట్ల అవగాహనా కల్పించడంకోసం యునైటెడ్ నేషన్స్ ప్రతి సంవత్సరం మార్చి 22ను ప్రపంచ జల దినోత్సవంగా జరుపుతుంది.
మనము నీటిని వృదా చేస్తున్నాం , కలుషితం చేస్తున్నాం . ఒకవిధంగా చెప్పాలి అంటే నీటిని విషపూరితం చేస్తున్నాం.  భూమి మీద సమస్త జీవులు నీటిని ఆధారంగానే చేసుకొని జీవిస్తున్నాయి.  మనం నీటిని కలుషితం చేయటం వల్ల  జలచరాలు అనేకమైనవి వాటి ఉనికిని కోల్పోతున్నాయి.  దీనికి అర్ధం కొంతకాలానికి మనకు అదే పరిస్థితి ఎదురవ్వకమానదు.  మనకు నీరు చాలా అవసరం .  నీరు లేకపోతే సమస్త జీవులకు జీవించటమే సమస్య గా మారిపోతుంది . నీరు ప్రకృతి ప్రసాదించిన వరం.  ఇదే ప్రకృతి సహజమైన ఔషధం.  సహజంగానే భూమి మీద నీటి కొరత ఏర్పడింది.  అది అధికమిమచవలెను.  దానికి ఒకే ఒక మార్గం చెట్లను అదికంగా పెంచటమే.  మనం భారతీయులం కావున నీటిని గంగా మాతగా పూజిస్తాం.  హారతులు పడతాం. అలాంటి నీటిని ఎంతో జాగ్రత్తగా ఉపయోగించుకోవాలి.  వృదాచేయకుండా. కలుషితం చేయకుండా.  అనావసరమైన వ్యర్ధాలు నీటిలో కలపకుండా జాగ్రత్త పడాలి.  నీటిని  కాపాడుదాం అలాగే ప్రపంచాన్ని కాపాడుదాం.  ఈరోజు ప్రపంచ జల దినోత్సవాన్ని మంచి ఉద్యమంగా జరుపుకుందాం. 

శనివారం, మార్చి 14, 2015

Take a look about Albert Einstein

శనివారం, మార్చి 14, 2015

Today is Albert Einstein's birthday.  So take a look about Einstein
Documentary on the Life and Discoveries of Physicist Albert Einstein.


బుధవారం, ఫిబ్రవరి 18, 2015

శ్రీ రామకృష్ణ పరమహంస

బుధవారం, ఫిబ్రవరి 18, 2015

శ్రీ రామకృష్ణ పరమహంస శారదామాత 
ఈ రోజు రామకృష్ణ పరమహంస వారి జన్మదినము.  నేను నా తెలుగు ప్రాజెక్ట్ చేస్తున్నప్పుడు రామకృష్ణ పరమహంస గారిగురించి తెలుసుకున్నాను. 
శ్రీ రామకృష్ణ పరమహంస గారి అసలు పేరు గదాధర్ ఛటోపాధ్యాయ. రామకృష్ణులకు తల్లిదండ్రులు పెట్టిన పేరు గదాధరుడు. గదాధర్ క్రీ.శ 1836, ఫిబ్రవరి 18 న పశ్చిమబెంగాల్ లోని హుగ్లీ జిల్లాలోని కామార్పుకూర్ అనే కుగ్రామంలో జన్మించారు. వీరి తల్లిదండ్రులు క్షుదీరామ్, చంద్రమణిదేవి. వీరు చాలా పేదబ్రాహ్మణులైనప్పటికీ ధార్మికులు. గదాధరుడు అందగాడు, బాల్యం నుండే ఇతనికి లలితకళలు, చిత్రలేఖనము లో గల ప్రవేశము వలన వారి గ్రామములో ఇతనికి మంచిపేరు ఉండేది. అయితే చదువు మీద కానీ, ధన సంపాదన మీద కానీ ఆసక్తి చూపించకుండెను. ప్రకృతిని ప్రేమిస్తూ గ్రామము బైట పండ్ల తోటలలో స్నేహితులతో కలసి సమయాన్ని గడిపేవాడు. దానివలన చదువు అబ్బలేదు. పూరీకి వెళ్ళు సాధువులు వీరి గ్రామము గుండా వెళ్ళేవారు. వారు ఆ గ్రామములో ఆగి ప్రసంగిచేటప్పుడు రామకృష్ణుడు ఎంతో శ్రద్దగా వినేవాడు. వారికి సేవలు చేసి వారి మత వాగ్యుద్ధాలను ఆసక్తితో వినేవాడు.
ఉపనయనము కాగానే బ్రాహ్మణునిగా మొదటి బిక్ష, ఒక శూద్ర యువతి దగ్గర పొందుతానని అనడము చాలా మందికి ఆశ్చర్యము కలిగించినది. బ్రాహ్మణుని వద్దనే మొదటి బిక్ష పొందవలననే నియమాన్ని ఎంత వాదించినా, ఎంత మంది చెప్పినా, కన్నీరు కార్చినా వినకుండా ఆ యువతికి మాట ఇచ్చానని తాను ఆడిన మాట తప్పాక ఎటువంటి బ్రాహ్మణుడవుతాడాని ప్రశ్నించెను. చివరికి ఆతని గరిష్ట సోదరుడు రామ్‌కుమార్ తండ్రి మరణము తరువాత అంగీకరించెను.
ఇంతలో కుటుంబ ఆర్థిక పరిస్థితి రోజు రోజుకూ దిగజారుతూ వచ్చింది. రామ్‌కుమార్ కలకత్తా లో సంస్కృత పాఠశాల నడుపుతూ, కొన్ని కుటుంబాలకు పౌరోహిత్యము చేస్తూ ఉండేవాడు. ఆ కాలములో రాణీ రాషమొణి అనే ధనిక యువతి, దక్షిణేశ్వర్ కాళీ మాత గుడి కట్టించి రామ్‌కుమార్ ను పురోహితుడుగా ఉండమని కోరింది. రామ్‌కుమార్ దానికి అంగీకరించెను. కొంత ప్రోద్బలముతో గధాధర్ దేవతను అలంకరించడానికి ఒప్పుకొనెను. రామ్‌కుమార్ రిటైరయిన తరువాత రామకృష్ణుడు పూజారిగా భాధ్యతలను తీసుకొనెను. ఒక ఆధ్యాత్మిక గురువు. విభిన్న మతాలు భగవంతుడిని చేరడానికి విభిన్న మార్గాలు అని అనుభవపూర్వకంగా మొట్టమొదటిసారిగా ప్రపంచానికి చాటిచెప్పిన వ్యక్తి. 19 వ శతాబ్దపు "బెంగాల్ సాంస్కృతిక పునరుజ్జీవనం" లో ఈయన ప్రభావము చాలా ఉంది.
భారత దేశములో మతగురువుల బోధనలకు ఎక్కువ ప్రాముఖ్యాన్ని ఇచ్చి, తేదీలు మరియు ఇతర విషయాలకు తక్కువ ప్రాముఖ్యతను ఇస్తారు. కాని రామకృష్ణుని జీవితములోని చాలా విషయములకు ఎన్నో ఆధారములు కలవు. చాలా మంది రామకృష్ణుని శిష్యులు ఉన్నత విద్యావంతులు, అధారములు దొరకనిదే విషయములు ప్రకటించకుండా ఉండడము దీనికి కారణము.  అతని శిష్యుడు స్వామీ శారదానంద రామకృష్ణుని చుట్టూ పెరుగుతూ ఆతని జీవితచరిత్రను చాలా మటుకు రచించెను.
దట తిరస్కరించినా తర్వాత అన్నగారికి సహాయంగా రామకృష్ణులు పూజలో సేవచేసేవాడు. గుడిలో ఉన్నది నిజంగా రాతి విగ్రహమేనా లేక సజీవమూర్తాఅని అది తెలుసుకోవడానికి ప్రయత్నించాడు. ఒకవేళ సజీవ దేవతను పూజిస్తే కనుక ఆ దేవత ఎందుకు సమాధానము ఇవ్వడము లేదు? అనుకొనేవాడు. ఈ ప్రశ్న ఆతనిని రాత్రి, పగలు కలచివేసింది. ఇక కాళికా దేవిని ప్రత్యక్షము కమ్మని తీవ్రమైన మొరలతో ప్రార్థించడము మొదలుపెట్టాడు. తీవ్ర భక్తిభావంలో నిమగ్నమయ్యి రేయింబవళ్ళు అమ్మవారి ధ్యాసలోనే ఉండేవాడు. రాత్రిళ్ళు అడవిలో కూర్చొని ప్రార్థించేవాడు. ఒకనాడు అమ్మవారి దర్శనము పొందాడు. అప్పటి నుండి నిరంతరమూ అమ్మవారి దర్శనభాగ్యం పొందేవాడు. నిజంగా ఒక మనిషికి చేసే సేవలలాగానే అమ్మవారి విగ్రహాన్ని పూజించేవాడు. ఇంకా తృప్తి పొందక ఇతర మతములలో పరమ సత్యమును తెలిసికొనుటకై ప్రార్థించేవాడు. కొంత మంది గురువులు ఆతని దగ్గరకు వచ్చి అన్ని మతములలో పరమ సత్యము సాక్షాత్కరించుకున్నాడని గ్రహించారు. ఈ మాట అన్ని ఊళ్ళలో వ్యాప్తి చెంది అన్ని మతముల వారు రామకృష్ణుని దర్శనానికి వచ్చేవారు. 
కామార్కపూర్ లో రామకృష్ణుడు దక్షిణేశ్వర్ లో అత్మజ్ఞాన అభ్యాసములతో పిచ్చివాడై పోయాడని పుకారు వచ్చింది. ఊరివారు రామకృష్ణుని తల్లి తో ఆతనికి వివాహము చెయ్యమని, దానితో సంసారిక బాధ్యతల లో పడగలడని చెప్పిరి. వివాహమునకు అభ్యంతరము చెప్పక పోవడమే కాకుండా, మూడు మైళ్ళ దూరము లో ఉన్న జయరాంబాటి గ్రామంలో రామచంద్ర ముఖర్జీ ఇంట్లో పెళ్ళికూతురు దొరుకుతుందని చెప్పాడు. 5 ఏళ్ళ శారదా దేవి తో ఆతని పెళ్ళి నిశ్చయమైనది. శారద రామకృష్ణుని మొదటి శిష్యురాలు. తాను గురువుల వద్ద నేర్చుకున్న విద్యలన్నీ ఆమెకు నేర్పారు. ఆమె గ్రహణ శక్తికి మెచ్చి ఆమెను త్రిపుర సుందరి శక్తి గా పూజించడము మొదలు పెట్టాడు. ఆమెను సాక్షాత్ కాళికాదేవి లా భావించి పూజించారు. ఆమెను కూడా తనంతటి వారిగా తీర్చిదిద్దారు.
ఆమె పరిత్యాగము రామకృష్ణుని పరిత్యాగము వలే శిశ్యులందరికి ప్రస్ఫుటముగా కనపడేది. వారిద్దరి సంబంధము సామాన్య మానవులు అర్థము చేసుకోలేరని భావించేవారు. చాలా కాలము అమెతో గడిపిన తరువాత రామకృష్ణుడు వారి బంధము ఆధ్యాత్మికమైనదని నిర్ణయించారు. శిష్యులందరూ వారు దినసరి జీవితాన్ని పంచుకున్నపటికీ, ఒకరి దగ్గర ఒకరు ఉన్నపుడు మటుకు ఆధ్యాత్మికత కంటే ఏ ఇతర విషయాల పై మనస్సు పోయేది కాదని భావించేవారు. మతగురువుల జీవితాల్లో స్త్రీ, పురుషుల మధ్య ఇలా జీవితకాలమంతా ఆధ్యాత్మిక సంబంధము ఉండడము ఇంకెక్కడా కానరాదు. రామకృష్ణుని మరణానంతరము శారదా దేవి కుడా మతగురువు గా మారెను. ఆ తరువాత కొద్ది కాలములోనే రామకృష్ణు పరమహంస గా పిలవబడెను. ఆయస్కాంతము లాగ భగవంతుని పొందగోరే వారిని అకర్షించేవారని ప్రతీతి. పదిహేను సంవర్సరములు మతములలో మూల సత్యములను కథలు, పాటలు, ఉపమ అలంకారములు, అన్నిటి కంటే ఎక్కువగా తన జీవిత చరిత్రతో నిర్విరామముగా ప్రభోదించెను.
తన అనుభవాలను ప్రపంచానికి చాటిచెప్పడానికి తగిన వ్యక్తుల కొరకు వీరు నిరీక్షిస్తుండగా మకరందము గ్రోలడానికి వచ్చు తుమ్మెదలలాగా శిష్యులు రావడం ప్రారంభించారు. వీరికి ఎందరో శిష్యులు ఉన్నప్పటికీ వీరి పేరు ప్రపంచ ప్రఖ్యాతి పొందడానికి దోహదం చేసినది వివేకానందులు. వీరి పరిచయం విచిత్రంగా జరిగినది. అప్పటికి వివేకానందులు నిజంగా భగవత్ అనుభవమ్ పొందిన వారిని అన్వేషిస్తూ ఎందరినో కలిసి నిరాశకు లోనై చివరికి రామకృష్ణులను కలిశారు. "మహాత్మా మీరు భగవంతున్ని చూసారా?" అని ప్రశ్నించి సానుకూల సమాధానం పొందాడు. రామకృష్ణులు కేవలం స్పర్శతో ఆద్యాత్మిక అనుభవాలను ప్రసాదించేవాడు. వీరు కాలక్రమంలో క్యాన్సర్ వ్యాధితో బాధపడ్డారు.తన నివాసాన్ని ఆరోగ్యరీత్యా దక్షిణేశ్వరం నుండి కాశిపూర్ కు మార్చారు. అప్పుడు శిష్యులు అందరూ ఎంతో సేవచేశారు.చనిపోవడానికి మునుపు ఒకరోజు తన ఆధ్యాత్మిక శక్తులన్నిటినీ స్వామి వివేకానందునికి ధారపోసారు. 16 ఆగష్టు, 1886న మహాసమాధిని పొందెను. అయన వదిలి వెళ్ళిన పదహారు మంది శిష్య సమ్మేళనమునకు స్వామీ వివేకానంద సారధ్యము వహించెను. వివేకానంద ఆ తరువాత మత తత్త్వవేత్త, ఉపన్యాసకుడుగా ప్రసిద్ది పొందెను. 

మంగళవారం, ఫిబ్రవరి 17, 2015

శివ మానస పూజ

మంగళవారం, ఫిబ్రవరి 17, 2015

శివ మానస పూజ
                                  

రత్నైః కల్పితమాసనం హిమజలైః స్నానం చ దివ్యాంబరం
నానారత్నవిభూషితం మృగమదామోదాంకితం చందనమ్ |
జాతీచంపకబిల్వపత్రరచితం పుష్పం చ ధూపం తథా
దీపం దేవ దయానిధే పశుపతే హృత్కల్పితం గృహ్యతామ్ || 

సౌవర్ణే నవరత్నఖండరచితే పాత్రే ఘృతం పాయసం
భక్ష్యం పంచవిధం పయోదధియుతం రంభాఫలం పానకమ్ |
శాకానామయుతం జలం రుచికరం కర్పూరఖండోజ్జ్వలం
తాంబూలం మనసా మయా విరచితం భక్త్యా ప్రభో స్వీకురు ||

ఛత్రం చామరయోర్యుగం వ్యజనకం చాదర్శకం నిర్మలం
వీణాభేరిమృదంగకాహలకలా గీతం చ నృత్యం తథా |
సాష్టాంగం ప్రణతిః స్తుతిర్బహువిధా హ్యేతత్సమస్తం మయా
సంకల్పేన సమర్పితం తవ విభో పూజాం గృహాణ ప్రభో ||

ఆత్మా త్వం గిరిజా మతిః సహచరాః ప్రాణాః శరీరం గృహం
పూజా తే విషయోపభోగరచనా నిద్రా సమాధిస్థితిః |
సంచారః పదయోః ప్రదక్షిణవిధిః స్తోత్రాణి సర్వా గిరో
యద్యత్కర్మ కరోమి తత్తదఖిలం శంభో తవారాధనమ్ ||

కరచరణ కృతం వాక్కాయజం కర్మజం వా
శ్రవణనయనజం వా మానసం వాపరాధమ్ |
విహితమవిహితం వా సర్వమేతత్ క్షమస్వ
జయ జయ కరుణాబ్ధే శ్రీమహాదేవశంభో ||

మహా శివరాత్రి శుభాకాంక్షలు  

శుక్రవారం, జనవరి 30, 2015

(భీష్మ ఏకాదశి) విష్ణు సహస్రనామ స్తోత్రము జన్మదినం

శుక్రవారం, జనవరి 30, 2015


ఈరోజు భీష్మ ఏకాదశి.  ఇది ఏకాదశి లలో చాలా విశేషమైన ఏకాదశి.  ఈరోజు భీష్మ పితామహుల నోటినుండి విష్ణు సహస్ర నామము అందరికీ ఉపదేసించబదినది. నేడు విష్ణు సహస్రం పుట్టినరోజు అన్నమాట.  తండ్రి మాటకు తలొగ్గి శ్రీరాముడు ఆదర్శపురుషుడైతే. ఒక మెట్టు ఎక్కువగా తండ్రి సుఖం కోరి సింహాసనాన్ని వదులుకుని ఆజన్మ బ్రహ్మచర్యం పాటించిన మహాపురుషుడు భీష్మాచార్యుడు. అంపశయ్యపై నుండే విష్ణుసహస్రనామ కీర్తన చేసి ఆ స్వామికి ఇష్టమైన మాఘశుద్ధ ఏకాదశిని తన పేరిట భీష్మ  ఏకాదశి గా బహుమానంగా పొందిన గొప్ప పురాణ పురుషుడు. 
అది ద్వాపరయుగం. శోభకృతు నామ సంవత్సరం. మాఘశుద్ధ అష్టమి. ప్రత్యక్ష నారాయణుడు తీక్షణ కిరణాలతో వెలిగిపోతుండగా ఆ మిట్టమధ్యాహ్నం వేళ  శ్రీమహావిష్ణువును నోరారా కీర్తిస్తూ ఆయనలో ఐక్యమైపోయాడు భీష్ముడు. ఆ పురాణ పురుషుడు మరణించిన రోజే.  భీషాష్టమి. మరణించే ముందు కృష్ణుడు ఇచ్చిన వరం ప్రకారం మూడురోజుల తర్వాత వచ్చే ఏకాదశి ఆ కురువృద్ధుని పేరిట భీష్మఏకాదశిగా ప్రసిద్ధి పొందింది. 

శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రము అత్యంత ప్రాచుర్యము కలిగిన హిందూ ప్రార్థనలలో ఒకటి. పేరును బట్టి ఇది శ్రీమహావిష్ణువు వేయి నామాలను సంకీర్తనం చేసేస్తోత్రము. ఈ స్తోత్రాన్ని చాలామంది హిందువులు భగవంతుని పూజించే కార్యంగా పారాయణం చేస్తూ ఉంటారు.
విష్ణు సహస్ర నామ స్తోత్రము మహాభారతం లోని అనుశాసనిక పర్వం లో 149వ అధ్యాయంలో ఉన్నది. కురుక్షేత్ర యుద్ధానంతరం అంపశయ్య మీద పండుకొని ఉన్న భీష్ముడు ఈ స్తోత్రాన్ని యుధిష్ఠురు నకు ఉపదేశిస్తాడు. ఈ స్తోత్ర పారాయణం సకల వాంఛితార్థ ఫలదాయకమని ఆ విధమైన విశ్వాసం ఉన్నవారి నమ్మకం. స్తోత్రం ఉత్తర పీఠిక (ఫలశ్రుతి)లో ఈ శ్లోకం "ధర్మార్థులకు ధర్మము, అర్థార్థులకు అర్థము, కామార్థులకు కామము, ప్రజార్థులకు ప్రజను ప్రసాదించును" అని చెప్పబడినది.
విష్ణు సహస్రనామ స్తోత్రము ఆవిర్భవించిన పరిస్థితులు ఆసక్తి కరమైనవి. కురుక్షేత్ర యుద్ధంలో జరిగిన జనక్షయం, కష్టాలవలన పాండవాగ్రజుడు యుధిష్ఠిరుడు కృంగిపోయి ఉన్నాడు. తన వంశోన్నతిని కోరిన భీష్ముడు అంపశయ్యపై మరణానికి సిద్ధంగా ఉన్నాడు. అనితర జ్ఞాననిలయమైన భీష్ముని ఆశ్రయించి ధర్మాన్ని, నీతిని తెలిసికొనమని యుధిష్ఠిరుని వేదవ్యాసుడు, శ్రీకృష్ణుడు ఆదేశించారు. భీష్ముడు కృష్ణునితో "ప్రభూ! జగద్గురువువైన నీయెదుట నేను ఉపదేశము చేయజాలినవాడను కాను. ఆపై క్షతగాత్రుడనైన నా బుద్ధి, శక్తి క్షీణించినవి. క్షమింపుడు" అనెను. అప్పుడు శ్రీకృష్ణుడు "భీష్మా! నా ప్రభావము చేత నీ క్లేశములన్నీ ఇపుడే తొలగిపోవును. సమస్త జ్ఞానము నీ బుద్ధికి స్ఫురించును. నీచేత నేను ధర్మోపదేశము చేయించుచున్నాను" అని అనుగ్రహించెను. అలా భీష్ముడు అంపశయ్యపైనుండే యుధిష్ఠిరునకు సమస్త జ్ఞాన, ధర్మములను ఉపదేశించెను.  అలా జ్ఞానబోధను గ్రహించే సమయంలో యుధిష్ఠిరుడు ఆరు ప్రశ్నలను అడిగాడు. ఆ ప్రశ్నల సారాంశము: "దుఃఖముతో కృంగి ఉన్న నాకు తక్కువ శ్రమతో ఎక్కువ ఫలితమును ఇచ్చే ఉపాయమేది? ఎవరిని స్తుతించాలి?" దానికి భీష్ముడు చెప్పిన ఉపాయము: "భక్తితో, శ్రద్ధతో విష్ణువు వేయి నామాలను జపించు. అన్ని దుఃఖములు, కష్టములు, పాపములనుండి విముక్తి పొందడానికి ఇదే సులభమైన మార్గము". అలా భీష్ముడు ఉపదేశించినదే విష్ణు సహస్రనామ స్తోత్రము.
విష్ణు సహస్రనామ స్తోత్రపఠనానికి ముందుగా లక్ష్మీ అష్టోత్తర స్తోత్రాన్ని పఠించడం చాలామంది పాటించే ఆనవాయితీ. చాలా స్తోత్రాలలో లాగానే విష్ణు సహస్రనామ స్తోత్రంలో వివిధ విభాగాలున్నాయి.

ప్రార్థన

ప్రార్ధన శ్లోకములు, స్తోత్రము ఆవిర్భవించిన సందర్భ వివరణ ఈ పూర్వపీఠికలో ఉన్నాయి. ముందుగా వినాయకునకు, విష్వక్సేనునకు, వ్యాసునకు, ఆపై విష్ణువుకు ప్రణామములతో స్తోత్రము ఆరంభమౌతుంది.

ముఖ్య స్తోత్ర:

అనేక పవిత్ర ధర్మములను విన్న తరువాత ధర్మరాజు భీష్ముని అడిగిన ఆరు ప్రశ్నలు:
  1. కిమ్ ఏకమ్ దైవతం లోకే - లోకంలో ఒక్కడే అయిన దేవుడు ఎవరు?
  2. కిమ్ వాపి ఏకమ్ పరాయణమ్ - జీవితానికి పరమపదమైన గమ్యము ఏది?
  3. స్తువంతః కమ్ ప్రాప్నుయుః మానవాః శుభమ్ - ఏ దేవుని స్తుతించుట వలన మానవులకు శుభములు లభించును?
  4. కమ్ అర్చంతః ప్రాప్నుయుః మానవాః శుభమ్ - ఏ దేవుని అర్చించుట వలన మానవునకు శుభములు లభించును?
  5. కో ధర్మః సర్వధర్మాణాం భవతః పరమో మతః - మీ అభిప్రాయము ప్రకారము సర్వధర్మములకు ఉత్కృష్టమైన ధర్మమేది?
  6. కిం జపన్ ముచ్యతే జంతుః జన్మ సంసార బంధనాత్ - ఏ దేవుని జపించుటవలన జన్మ సంసార బంధనములనుండి ముక్తి లభించును?    అన్న ప్రశ్నలు అడుగగా.....
అందుకు భీష్ముడు చెప్పిన సమాధానం: జగత్ప్రభువును, దేవదేవుని, అనంతుని, పురుషోత్తముని వేయి నామములను నిశ్చలమైన భక్తితో స్తుతిసేయట వలనను, ఆరాధించుట వలనను, ధ్యానించుట వలనను, ప్రణామము చేయుట వలనను సర్వదుఃఖములనుండి విముక్తి పొందవచ్చును. ఆ బ్రహ్మణ్యుని, పుండరీకాక్షుని ఆరాధించుట ఉత్తమ ధర్మము. ఆ దేవదేవుడు పరమ మంగళ ప్రదుడు. సకల సృష్టి-స్థితి-లయ కారకుడు. ఈ వేయి గుణ కీర్తనకరములైన నామములను ఋషులు గానము చేసినారు.
విష్ణు సహస్రనామాలను గురించి పెక్కుభాష్యాలు వెలువడినాయి. 8వ శతాబ్దంలో ఆది శంకరాచార్యలు రచించిన భాష్యము వీటిలో ప్రధమము. అద్వైత సిద్ధాంతము ననుసరించే ఈ భాష్యంలో భగవంతుని పరబ్రహ్మ తత్వమునకు, షడ్గుణైశ్వర్యమునకు ఎక్కువ ప్రాదాన్యతనిచ్చి వ్యాఖ్యానించారు. 12వ శతాబ్దంలో పరాశర భట్టు రచించిన భాష్యము భగవద్గుణ దర్పణము అనే గ్రంధం విశిష్టాద్వైతం సిద్ధాంతాలకు అనుగుణంగా సాగుతూ, భక్తుల పట్ల భగవానుని సౌలభ్యాన్నీ, సౌశీల్యాన్నీ, కరుణనూ మరింతగా విపులీకరించినది. తరువాత అనేకులు రచించిన వ్యాఖ్యలకు ఈ రెండు భాష్యాలే మార్గదర్శకాలు.  ఇది మహాభారతమునకు సారము.  విష్ణువు అంశావతారము, వేదవిదుడు అనబడే వేదవ్యాసుడు దీనిని మనకు అందించాడు. ఇది ధర్మములలోకెల్ల ఉత్తమము, సులభము, సకల కర్మబంధ విముక్తి సాధకము అని భీష్ముడు చెప్పాడు. ఈ స్తోత్రపారాయణం దుఃఖములనుహరిస్తుందనీ, శాంతి సంపదలను కలుగజేస్తుందనీ విస్తృతమైన విశ్వాసం
ఈరోజు అందరు ఇళ్ళల్లోను, గుళ్ళలోను విష్ణుసహస్రనామ స్తోత్రం పూజలు  చేస్తున్నారు.  నేడు విష్ణువు గురించి, భీష్ములవారి గురించి , విష్ణుసహస్రము గురించి తెలుసుకున్నాము. మనజన్మ ధన్యము అయినట్టే కదా.  విష్ణుసహస్రనామస్తోత్ర జన్మదిన శుభాకాంక్షలు.
జై శ్రీమన్నారాయణ

ఆదివారం, జనవరి 25, 2015

మనప్రత్యక్ష దేవుడు భానుడి జన్మదినము

ఆదివారం, జనవరి 25, 2015

ధసప్తమి అనగా మనప్రత్యక్ష దేవదేవుడు సూర్యుడు జన్మదినమును జరుపుకుంటాం.   రధసప్తమి రోజునుండి వేసవి కాలము ప్రారంబమవుతుంది . అందుకే రధసప్తమిరోజు తప్పకుండా సూర్య నమస్కారములు చేయాలి. మనకు ప్రతినిత్యము ప్రత్యక్షముగా కనిపించే దైవం సూర్యభగవానుడు. ప్రపంచములో అన్ని జీవరాసులకు వేడి, వెచ్చదనము, పాడిపంటలను, వెలుగును ఇచ్చేవాడు భాస్కరుడు. సుర్యారాధన మనకు వేద కాలమునుండి ఉంది. సూర్యుని పేరు సప్తిమ. ఏడు గుర్రాలను (ఏడు  గుర్రముల పేర్లు వరుసగా గాయత్రి, బృహతి, ఉష్ణిక్, జగతి, త్రిష్ణుప్, అనుష్ణుప్, పంక్తి )  వంచిన రధము కలిగినవాడు. సప్తలోకములకు తన శక్తిని ప్రసాదించువాడు సూర్య కిరణాలు ఏడురంగులకు నిదర్శనమని, రధసప్తమినాడు ఆకాసములో గ్రహ నక్షిత్ర సన్నివేసం రధమును పోలి ఉంటుంది కనుకనే ఈ తిధిని రధసప్తమి అని పేరు వచ్చింది.
అనంతసక్తితో కూడుకొన్న కిరణాలు, తేజస్సు, శుద్ధమైన వాడు , భక్తులకు అభయము ఇచ్చేవాడు. జగతికి వెలుగుకారకుడు, జ్యోతిర్మయుడు, శుభానిచ్చే ఆదిత్యుడు, చీకటి పారద్రోలేవాడు, భక్తుల కోరికలు తీర్చేవాడు ఆదిత్యుడు , మార్తాండుడు, శుభంకరుడు, భాస్కరుడు అయిన సూర్యనారాయణమూర్తికి నమస్కారములు అంటూ ధ్యానించాలి.
సుర్యుడు ఆరోగ్య ప్రదాత. అది సైన్స్ ద్వారా కూడానిరూపించబడినది. సూర్య కిరణాలలో డి విటమిన్ కలదు. ఎముకలకు  బలముగా వుంటాయి.  కేన్సర్ రాకుండా కాపాడతాయి.  ఒకప్పుడు సూర్యరశ్మి సమృద్ధిగా ఉండే భారతదేశంలో.. ప్రజలకు అసలు 'విటమిన్‌-డి' లోపమనేదే ఉండదని భావించేవారు. కానీ నేడది వట్టి అపోహేనని తాజా అధ్యయనాలన్నీ రుజువుచేస్తున్నాయి. ప్రస్తుతం మన దేశంలో 90% మందికి విటమిన్‌-డి లోపం ఉంది.
అన్నట్టు రధసప్తమి రొజు స్త్రీలు ఎన్నో నోములు చెయటానికి ప్రారంబధినముగా చెయుదురు. అక్షింతలు వేసుకొని నోములకు నాంది పలుకుదురు.
శుద్ధ సప్తమికి ’రథసప్తమి’ అని పేరు. ఈరోజు ఒక పరిపూర్ణ పర్వం. దీక్షానిర్వహణకి, వ్రతాచరణకి, సాధనాలకు ఈ సప్తమి ప్రసిద్ధి. ఏడాది పొడుగునా సూర్యారాధన చేసిన ఫలం ఈ దినం లభిస్తుంది.
సూర్యునికి రాగి పాత్ర ద్వారా అర్ఘ్యాన్నివ్వడం, ఎర్రచందనం, ఎర్రపువ్వులతో అర్చన చేయడం వంటివి ఈ రోజు ప్రత్యేకతలు.ఆవుపాల పాయసం నివేదించడం, అది కూడా ఆరుబయట సూర్యకిరణాలు పడే తావున ఆవుపేడ పిడకలను మండించి, దానిపై పాయసాన్ని పొంగించడం ఒక చక్కని ప్రక్రియ. వైద్యవిధానం, దేవతా మహిమ కలబోసిన పద్ధతి ఇది.
’రథ’శబ్దం గమనంలోని మార్పుని సూచిస్తుంది. సూర్యకిరణ ప్రసారం భూమికి లభించే తీరులో ఈ రోజునుండి ఒక మలుపు. ఈ మలుపులోని దేవతా ప్రభావాన్ని పొందేందుకు మన సంస్కృతిలో ఈ ఆనవాయితీని ప్రవేశపెట్టారు.
రామాయణంలో రావణవధి సమయంలో శ్రీరాముడు ’ఆదిత్యహృదయం’తో సూర్యోపాసన చేసి విజయం సాధించాడు. భారతంలో ధర్మరాజు ధౌమ్యుని ద్వారా సూర్యాష్టోత్తర శతనామ మంత్రమాలను ఉపదేశం పొంది , ఆదిత్యానుగ్రహంతో అన్న సమృద్ధిని, అక్షయపాత్రని సంపాదించాడు.
శ్రీకృష్ణుని పుత్రుడు సాంబుడు సూర్యోపాసన ద్వారా కుష్టువ్యాధి నుండి విముక్తుడయ్యాడు. చారిత్రకంగా మయూర కవి సూర్యశతక రచనతో ఆరోగ్యవంతుడయ్యాడు.
ఇలా పౌరాణిక చారిత్రకాధారాలు రవికృపా వైభవాన్ని చాటి చెబుతున్నాయి.  ఆదిత్య హృదయం అనే ఈ స్తోతము సూర్యభగవానుడి ని ఉద్దేశించినది. రామాయణం యుద్ధకాండలో శ్రీ రాముడు అలసట పొందినప్పుడు, అగస్త్య మహర్షి యుద్ధ స్థలానికి వచ్చి ఆదిత్య హృదయం అనే ఈ మంత్రాన్ని ఉపదేశిస్తారు.ఈ ఉపదేశము అయిన తరువాత శ్రీరాముడు రావణాసురుడిని నిహతుడిని చేస్తాడు. వాల్మీకి రామాయణం లోని యుద్ధకాండమునందు 107 సర్గలో ఈ అదిత్య హృదయ శ్లోకాలు వున్నాయి. 
సూర్య రశ్మిలో విటమిన్ D ఉంటుంది అది ఎముకల పటుత్వానికి అవసరం అని చెబుతారు. అంతే కాకుండా విటమిన్ D కణ విభజనలో కూడా తోడ్పడుతోంది. దీన వలన గాయాలు మానడమే కాకుండా కాన్సర్ రాకుండా కూడా ఉపయోగం ఉంటుంది. సూర కాంతికి ఎక్కువగా ఎక్స్‌పోజ్ అయిన వారిలో చాలా రకాల కాన్సర్ తక్కువగా వస్తుంది అని డాక్టర్స్ చెబుతారు. ముఖ్యంగా పెద్ద పేగు, మల ద్వారానికి సంబంధించిన కాన్సర్ మీద ఈ ప్రభావం ఎక్కువగా ఉంటుంది.  పన్నెండు భంగిమలతో కూడిన సూర్యనమస్కారాలలో ఒక సంక్షిప్తమైన ప్రాణాయామం, ధ్యానం సమ్మిళితమైన వ్యాయామం ఇమిడి ఉన్నాయి. 

  
నమస్కారిస్తే ఆయురారోగ్యాలు, అర్ఘ్యమిస్తే అష్టైశ్వర్యాలు ప్రసాదించే ప్రత్యక్ష దేవుడు సూర్యనారాయణ మూర్తి జన్మదినం నే రథసప్తమి గా జరుపుకుంటున్నాము.  భాస్కరునికి క్షీరాన్నం నైవేద్యం సమర్పించాలి.  అందరికి రధసప్తమి శుభాకాంక్షలు. 

శుక్రవారం, జనవరి 23, 2015

చేతిరాత దినోత్సవ శుభాకాంక్షలు.

శుక్రవారం, జనవరి 23, 2015

చేతిరాత 
చదువుకు ఎంత ప్రాముఖ్యత వుందో చేతి రాతకు కూడా అంతే ప్రాముఖ్యత వుంది అనటంలో అతిశయోక్తి లేదు. ఇదంతా ఎందుకు అనుకుంటున్నారా ఈమధ్య నాకు స్కూల్ లో చేతి రాత పరీక్షా జరిగింది. అంతే కాదు ఈరోజు చేతి రాత దినోత్సవం కదా అందుకే.  మనం విధి రాతను మార్చలేం కాని మన చేతిరాతను ప్రాక్టిస్ తో అందంగా ముత్యాలు పరచినట్టు అందంగా రాయచ్చు. మంచి రైటింగ్‌ విద్యార్థులకు ఆనందంగా, ఉత్సాహంగా ఉంటుంది. ఎందుకంటే నేటి సమాజంలో విద్యార్థులు చక్కటి చేతిరాత లేకపోవడం వల్ల పోటీ పరీక్షల్లో మంచి మార్కులను కోల్పోతున్నారు. అందువల్ల చేతిరాత చక్కగా ఉండాలంటే కొన్ని నియమాలను తప్పక పాటించవల్సి ఉంటుంది. అందులో కొన్ని మంచి మార్కులును తెచ్చి పెడుతుంది కూడా. అదే విధంగా చదివి అర్థం చేసుకోవడానికి సహాయపడుతుంది. ఒక్కసారి రాయడం, వంద సార్లు చదివిన దానితో సమానం అని టీచర్లు కూడా ఎప్పుడూ చెప్తూనే ఉంటారు. చేతిరాత బాగా రాయలేకపోతే వచ్చే నష్టాలూ తక్కువే కాదు. మన చేతిరాత అర్థం కాకపోతే చదివేవాళ్లకు విసుగు వస్తుంది. పరీక్ష పేపర్లు దిద్దేవాళ్లకు అర్థం కాకపోతే మార్కులు తక్కువ వేస్తారు. ఇక్కడ చెప్పకునేది ఏమిటంటే ఏది రాసినా ఎదుటివారికి అర్థమయ్యేలా రాయడం ముఖ్యం. అందుకని చిన్నప్పటినుండే పిల్లలకు రాయడం ప్రాక్టీసు చేయించాలి. ఏ పరీక్షలో విజయం సాధించాలన్నా ఎక్కువగా రాతతోటే పని. వాటిల్లో బాగా రాయగలిగితేనే మంచి మార్కులు సాధించగలుగుతారు. అందుకని చిన్నపిల్లలకు పలకా, బలం ఇచ్చి అక్షరాలను గుండ్రంగా రాయించడం నేర్పించడం అవసరం. కొంతమంది పిల్లలు చదివింది చెప్పగలరు కానీ రాయబోయేసరికి అది సరిగా రాయలేరు. కొంతమంది రాయగలరు కానీ చెప్పలేరు. ఇలా రకరకాలుగా వుంటారు. చదువుకునేవారు చదివింది రాయడం తప్పనిసరి. చదువుకునేవారు ఎంత ఎక్కువగా రాస్తే అంత బాగా చదివింది వస్తుంది. పరీక్షల సమయంలో అవి వెంటనే ఈజీగా రాయగలరు. చిన్న వయసునుండి మొదలుకొని పెద్దవారయ్యేవరకు వయసుతో సంబంధం లేకుండా ఏ హోదాలో వున్నవారైనా ఏవో పోటీ పరీక్షలు రాస్తూనే ఉండవచ్చు. అందుకు తోడ్పడేది ఈ రాయడం అనేది. ఉద్యోగాలు చేయాలన్నా వ్యాపారాలు చేయాలన్నా ఒక్కటని కాదు ఎన్నో రంగాలకు మరెన్నింటికో రాయవలసిన అవసరం ఉంటుంది. అందుకని చేతిరాత సరిగా రాని వారు రోజూ కొంచెంసేపు రాస్తూ వుంటే చేతి రాత మెరుగవుతుంది. నేషనల్ చేతివ్రాత డే కూడా జాన్ హాన్కాక్ యొక్క పుట్టినరోజు. చేతిరాత ప్రాముఖ్యత చాలా ఉంది. 
నేషనల్ చేతివ్రాత డే రాయడం ఇన్స్ట్రుమెంట్ మానుఫాక్చరర్స్ అసోసియేషన్ (WIMA) వెబ్సైట్ ద్వారా కనుగొన్నారు, ప్రతి సంవత్సరం జనవరి 23 న జరుపుకుంటారు. చాలా మంది ఈ రోజుల్లో ఒక కంప్యూటర్లు వాడటం మరియు టైపింగ్ ద్వారా చేతి రాత రాయకుండా పని చేస్తున్నారు. నేను కూడా ఈ వ్యాసం టైపింగ్ ద్వారానే చేస్తున్నా ) .
చేతిరాత అనేది ఒక కళ. ఎ ఒక్క మనిషి చేతిరాత కాని చేతివ్రాత వేలిముద్రలు కాని ఒకేరకంగా వుండవు. చేతివ్రాత విశ్లేషించు టను గ్రాఫాలజి అంటారు. చేతితో రాయడానికి వివిధ ఫాంట్లు వున్నాయి.మీ లక్ష్యాలను, కలలు, మరియు ఆశలు రాసుకుంటే రోజు చూసుకుని మన లక్ష్యాలు, కలలు, మరియు ఆశలు చేతిరాతద్వారా మరింత వ్యక్తిగత స్వభావం వాటిని సాధించడానికి 33% ఎక్కువగా ప్రేరణగా వుంటుంది అని విశ్లేషకులు చెప్తారు.
 పూర్వ కాలం నుండి చేతిరాతను రాయటానికి అనేకమైన విధానాలు వాడేవారు.  తాటిఆకులమీద  ఘంటం తో రాసేవారు.  నెమలి ఈక ను సిరాలో ముంచి రాసేవారు. అప్పట్లో కాగితం కలం లేక వారు అలా రాసేవారు.  ఇప్పుడు అయితే కాగితములు , పెన్సిల్స్, పెన్స్ చాలా రకాలు వున్నాయి. అవి ఉపయోగించుకొని చేతిరాతను రాయండి.  చేతిరాత దినోత్సవ శుభాకాంక్షలు

బుధవారం, మే 14, 2014

అన్నమయ్య జయంతి

బుధవారం, మే 14, 2014

అప్పని వరప్రసాది అన్నమయ్య జయంతి శుభాకాంక్షలు . 
గురుదేవ స్తుతి 

శ్రీమత్వదీయ చరితామృత మన్నయార్య 
పీత్వాపినైవ సుహితా మనుజా భవేయుః 
త్వం వేంకటాచలపతే నివ భక్తి సారం 
శ్రీ తాళ్ళపాక గురుదేవ నమో నమస్తే నమో నమస్తే 

కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని 32 వేల సంకీర్తన కుసుమాలతో అర్చన చేసి తన జీవితాన్ని తరింపచేసుకున్న పరమ భక్తాగ్రేశ్వరుడు , తొలితెలుగు వాగ్గేయకారుడు, పదకవితా పితామహుడు శ్రీ తాళపాక  అన్నమయ్య.   15 వ శతాబ్దానికి చెందిన అన్నమయ్య తల్లిదండ్రులు శ్రీమతి లక్కమాంబ, శ్రీ నారాయణ సూరి దంపతులు.   తాళ్ళపాక గ్రామం లో అన్నమయ్య వంశీయులు నందవరీక  బ్రాహ్మణ కుటుంబములో క్రీ.శ . 1408 లో వైశాఖమాసం లో, విశాఖ నక్షత్రంలో మంచి గ్రహస్తితిలో జన్మించారు.  
తెలుగులో మనకు తెలిసినంత వరకు మొట్టమొదటి తెలుగుపదాలు అన్నమయ్యవె.   అన్నమయ్య ఆలపించిన తెలుగు పదాలు పండితులకు అటు పామరులకు అందరికి అర్ధమయ్యే విధంగా వుంటుంది.  ఆయన అత్యాధునిక స్వాతంత్ర్యభావాలు కలవాడు . సమాజాని అతిసూక్ష్మద్రుష్టి తో పరిశీలించి జనబాహుళ్యంలో వున్నా జానపదాన్ని గ్రహించాడు.  అన్నమయ్య పదాలు దేనికదే ప్ర్యతేకతను కలిగివుంటాయి. భక్తి , వైరాగ్యాలలోనే కాకుండా నాటి సాంఘీక రాజకీయ,సామాజిక స్థితిగతులకు కూడా అద్దంపట్టయి అనుటలో ఎటువంటి సందేహం లెదు.  అన్నమయ్య  పదాలు తెలుగువారికి తరగని నిధులు.  తెలుగు తనానికి పెట్టనికోటలు.  తెలుగువారి హృదయాలమునకు చెరగని ముద్రలుగా వున్నాయి.  ఆయన పదమే తెలుగుపాటకు జీవం.    అన్నమయ్య అనేక సంకీర్తనలు తో పాటు సంస్కృతములో వేంకటాచల మహాత్మ్యం, సంకీర్తన లక్షణం, తెలుగు ద్విపద రామాయణం, 12 శతకాలు వ్రాసినట్లు తెలుస్తోంది. వెంకటేశ్వర శతకం ప్రసిద్ది పొందినది.  అన్నమయ్య ఇతర రచన లెన్ని చేసినా ఇతర భాషలలో ఎన్ని ప్రభందాలు  రాసినా సుప్రసిద్దముగా నిలిచినవి సంకీర్తనలే.  నిత్యము స్వామిని తన సంకీర్తనలతో ఆరాధింఛి తరించిన అన్నమయ్య క్రీ.శ . 1503 లో ఫాల్గుణ బహుళ  ద్వాదశి దినమున స్వామిలో లీనమైనాడు.  ఈ తిధిని పురస్కరించుకొని తాళపాక వారు 
"దినము ద్వాదశి నేడు తీర్థదివసము నీకు
జనకు(డ అన్నమాచార్యు(డ విచ్చేయవే

అనంతగరుడ ముఖ్యులైన సూరిజనులతో
ఘననారదాది భాగవతులతో
దనుజ మర్దనుండైన దైవశిఖామణితోడ
వెనుకొని యారగించ విచ్చేయవే

వైకుంఠాన నుండి యాళువారలలోపల నుండి
లోకపు నిత్యముక్తులలోన నుండి
శ్రీకాంతతోడ నున్న శ్రీవేంకటేశు(గూడి
యీకడ నారగించ నింటికి విచ్చేయవే

సంకీర్తనముతోడ సనకాదులెల్ల(బాడ
పొంకపు శ్రీవేంకటాద్రి భూమి నుండి
లంకె శ్రీవేంకటగిరి లక్ష్మీవిభు(డు నీవు
నంకెల మాయీంటి విందు లారగించవే"
అని ఆరాధించారు.  అన్నమయ్యను అప్పని వరప్రసాదిగా కీర్తించి తరించారు.

శుక్రవారం, మే 02, 2014

పరశురాముడు జయంతి

శుక్రవారం, మే 02, 2014

శ్రీ మహావిష్ణువు ఆరవ అవతారమైనవాడు  జమదగ్ని కుమారుడు పరశురాముడు జన్మించాడు. అధికార బల మదాంధులైన క్షత్రియులను శిక్షించిన అవతారమిది. పరశురాముని భార్గవరాముడు,జామదగ్ని అని కూడా అంటారు.పరశురాముడు మహాభారత రామాయణ భారత పురాణ సన్నివేశాలు కీలకమైన పాత్రలు పోషించారు. 
ఈరోజు పరశురాముడు జయంతి. కావునా పరశురాముని జన్మవృత్తాంతం
కుశ వంశానికి చెందిన మహారాజు గాధి. ఒకసారి భృగు వంశానికి చెందిన ఋచీకుడు అనే మహర్షి గాధి దగ్గరికి వెళ్ళి ఆయన కూతురు సత్యవతిని తనకిచ్చి వివాహం చెయ్యమని కోరగా ఆ మహారాజు నున్నటి శరీరం నల్లటి చెవులు గల వెయ్యి గుర్రాలు ఇమ్మని కోరుతాడు. ఋచీకుడు వరుణుని ప్రార్థించి వెయ్యి గుర్రాలు తెచ్చి సత్యవతిని పెళ్ళి చేసుకొన్నాడు. ఇలా జరుగుతుండగా ఒక రోజు సత్యవతి ఋచీకుని దగ్గరకు వచ్చి తనకు, తన తల్లికి పుత్రసంతానం ప్రసాదించమని కోరగా ఉచీకుడు యాగం చేసి విప్రమంత్రపూతం అయిన ఒక హవిస్సు, రాజమంత్రపూతం అయిన ఒక హవిస్సు తయారుచేసి స్నానానికి వెళ్ళతాడు. సత్యవతి ఈ విషయం తెలియక రాజమంత్రపూతమైన హవిస్సు తను తీసుకొని విప్రమంత్రపూతమైన హవిస్సు తల్లికి ఇస్తుంది. ఋచీకునికి సత్యవతి విషయం తెలిపి ప్రాధేయపడగా తనకొడుకు సాత్వికుడిగ ఉండి, మనుమడు ఉగ్రుడు అవుతాడు అని పల్కుతాడు. ఋచీకుని కుమారుడు జమదగ్ని. జమదగ్ని కొడుకు పురుషోత్తమాంశతో జన్మించినవాడు పరశురాముడు. గాధి కొడుకే విశ్వామిత్రుడు. భృగు వంశాను చరితంగా జమదగ్నికి కూడా కోపము మెండు. ఆయన పత్ని రేణుకాదేవి. జమదగ్ని, రేణుకల చిన్న కొడుకు పేరు పరశురాముడు. పరశురాముడు శివుని వద్ద అస్త్రవిద్యలను అభ్యసించి, అజేయ పరాక్రమవంతుడై, ఆయన నుండి అఖండ పరశువు (గండ్ర గొడ్డలి) పొంది, పరశురాముడైనాడు.
అధికార బల మదాంధులైన క్షత్రియులను శిక్షించిన అవతారమిది. 
జమదగ్ని ,రేణుకాదేవి ల చివరి కొడుకు పరశురాముడు. జమదగ్ని చాలా కోపం గలవాడు. అతని భార్య రేణుక తనపతిభక్తితో రోజు నదికి వెళ్ళి తనే స్వయంగా మట్టి కుండచేసి ఇంటికి నీళ్ళుతెచ్చేది. ఒకరోజు రేణుకాదేవి చిత్రరధుడనే రాజును చూసింది. ఆరోజు ఆమె నీళ్ళుతేవటానికి కుండ తయారు చేసినా కుండ తయారుకాలేదు. నీళ్ళు తేలేకపోయింది. ఏమి జరిగింది అని దివ్యదృష్టితోచూడగా రేణుక చిత్రరధుని చూడటంవల్లే పాత్రతయారుకాలేదని గ్రహించి తనపుతృలును పిలిచి తల్లిని నరకమన్నాడు. వారందరు తమవల్లకాదన్నారు. అప్పుడు చివరి కొడుకు పరశురాముడు సరే అని తన తల్లిని నరికి వేశాడు. తండ్రి చెప్పిన మాట చేసినందుకు ఒకకోరిక కోరమనగా తనతల్లిని తిరిగి బ్రతికించమన్నాడు పరశురాముడు.  తండ్రిమాట జవదాటని కొడుకు.పరశురాముడు. తనతల్లికి ఆ గతిపట్టించింది రాజులు కావున పరశురాముడు రాజులుమీదకోపం పెంచుకొని వారిని నాశనంచేయటం మొదలుపెట్టాడు. పరశురాముని పేరు భార్గవరాముడు. (పరశు= గొడ్డలి ) పరశుతో రాజులు ను నరకుతున్నాడుకావునా పరశు రాముడు అని పేరు వచ్చింది. అప్పట్లో పరశురాముడునుండి  రక్షించుకోవటానికి రాజులు అందరు చేతులుకు గాజులు వేసుకొని దాచుకునేవారు.కొందరు గొప్పరాజుల్ పుత్రులును భూదేవి తనలో దాచుకొని రక్షించింది.

రామాయణం లో ప్రభావం
సీతా స్వయంవరంలో శ్రీ రాముడు శివ ధనుస్సును విరచిన తరువాత సీతారాముల కల్యాణం జరిగింది. తన గురువైన శివుని విల్లు విరచినందుకు పరుశురాముడు కోపించి, రామునిపై యుద్ధానికి సిద్ధపడ్డాడు. దశరధుని అభ్యర్ధనలను, రాముని శాంత వచనాలనూ పట్టంచుకొనలేదు. చేతనైతే ఈ విష్ణుచాపాన్ని ఎక్కుపెట్టమని తన ధనస్సును రామునకిచ్చాడు. రాముడు దానిని అవలీలగా ఎక్కుపెట్టాడు. రామచంద్రమూర్తి ఎక్కుపెట్టిన బాణాన్ని ఎక్కడకు విడవాలి అని అడుగగా తన తపోశక్తి కొట్టై మని చెప్పి తాను మహేంద్రగిరిపై తపస్సు చేసికోవడానికి వెళ్ళిపోయాడు. ఆ విధంగా ధనస్సును పరశురాముడు రామునకు అందించినపుడు పరశురామునికీ రామునికీ భేదం లేదని ఇద్దరికీ అవగతమైనది.

మహాభారతం లో ప్రభావం
మహాభారతంలో పరశురాముడు ముగ్గురు వీరులకు గురువైనాడు. గంగాదేవి అభ్యర్ధనపై భీష్మునకు అస్త్రవిద్యలు బోధీంచాడు. తరువాత అంబికను వివాహంచేసుకొనమని చెప్పగా ఆజన్మబ్రహ్మచర్యవ్రతుడైనందున భీష్ముడు అందుకు తిరస్కరించాడు. ఇద్దరికీ జరిగిన మహాయుద్ధంలో ఎవరూ వెనుకకు తగ్గలేదు. దేవతల అభ్యర్ధనమేరకు యద్ధం నిలుపబడింది.

కర్ణుడు తాను బ్రాహ్మణుడనని చెప్పి పరశురాముని వద్ద శిష్యునిగా చేరాడు. తరువాత కర్ణుని అబద్ధాన్ని తెలిసికొన్న పరశురాముడు యుద్ధకాలంలో విద్యలు గుర్తుకు రావని శపించాడు.
ద్రోణాచార్యుడు కూడా పరశురాముని వద్ద దివ్యాస్త్రాలను గ్రహించాడు. అర్జునుడు కూడా మహేంద్ర పర్వతంపై పరశురాముని దర్శించుకొన్నాడు.

మంగళవారం, ఏప్రిల్ 08, 2014

శ్రీ సీతారాములోరి కళ్యాణమహోత్సవ శుభాకాంక్షలు

మంగళవారం, ఏప్రిల్ 08, 2014

శ్రీ రాముడు రోజున జన్మించిన రోజును  మనము శ్రీ రామ నవమి జరుపుకుంటున్నాము. సీతారాముల కల్యాణం మహోత్సవం , శ్రీ రామ చంద్రమూర్తి రావణుని వధించి విజయవంతముగా అయోధ్యకు తిరిగివచ్చిన రోజు కుడా ఈ రోజే. ఆ మరుసటి రోజునే శ్రీ రాముని పట్టాభిషేకము జరిగింది. ఇది ప్రతీ హిందువు కు మరపురాని సంతోషకరమైన రోజు . 
శ్రీ రామనామ మంత్రం: 

దశరథనందన శ్రీరామ నమో
అయోధ్య వాసి శ్రీరామ నమో
నీలమేఘశ్యామ శ్రీరమ నమో
జానకీనాథా శ్రీరామ నమో
హనుమత్సేవిత శ్రీరామ నమో
వాలీమర్ధన శ్రీరామ నమో
కోదండపాణి శ్రీరామ నమో
రావణసమ్హార శ్రీరామ నమో
కారుణ్యహృదయా శ్రీరామ నమో
భక్తవత్సల శ్రీరామ నమో

దశరథునికి ప్రియమైన కుమారుడు, నీలమేఘశ్యాముడు , సీతాదేవికి భర్త , భక్తుడైనా హనుమంతుని చేత సేవించబదినవాడు, వాలిని చంపిన వాడు చేతిలో కోదండమును కలిగినవాడు, దశకంఠుదు రావణుని చంపినవాడు , దయాహృదయం కలవాడు , భక్త వత్సలుడు అయిన శ్రీ రాముడుని నమస్కరిస్తున్నాను రామ నామ స్మరణ వల్ల మనసు పవిత్రంగా ఉంటుంది. కస్ట మైన పనులు కూడా సులువుగా చేయగలిగే శక్తి వస్తుంది.
మానవునిలో ప్రవర్తనలో ఏ శుభలక్షణాలు౦టే లోకకళ్యాణ౦ జరుగుతు౦దో అలా౦టి మంచి శుభలక్షణ స౦పన్నుడు శ్రీరాముడు. సీతారాములు ఇరువురివి యజ్ఞ స౦బ౦ధమైన జన్మలే. అలా౦టి సీతారాముల కళ్యాణ౦ లోక కళ్యాణ౦.
చైత్రశుధ్ధ నవమి పునర్వసు నక్షత్రాన మధ్యాహ్నవేళకర్కాటక లగ్న౦లో సూర్యుడు మేష౦లో ఉ౦డగాఐదుగ్రహాలు ఉచ్ఛస్థాన౦లో ఉ౦డగా శ్రీరామావిర్భావ౦ జరిగి౦ది.  ఐదు గ్రహాలు ఉచ్ఛలో ఉ౦టే లోకనాయకుడు అవుతాడని అర్ధ౦. శ్రీరాముడు లోకోత్తర నాయకునిగా అవతరి౦చాడు. శ్రీరాముడు అవతరి౦చి ఒక కోటి 81 లక్షల 50 వేల స౦వత్సరాలు అయినట్లు ప౦డితులు పరిశోధి౦చి చెప్పారు. అయినా నేటికీ శ్రీరాముని ఆరాధన జరుగుతో౦ద౦టే ఆ అవతార వైశిష్ట్యాన్ని గుర్చి౦చవచ్చు. 
మహిమాన్విత శ్రీరామనామ౦: 
ర - ఆత్మ
మ - మనస్సు
ర - సూర్య బీజ౦ - అజ్ఞానాన్ని పోగొడుతు౦ది
అ - చ౦ద్ర బీజ౦ - తాపాన్ని పోగొడుతు౦ది్.
మ - అగ్ని బీజ౦ - పాపాన్ని భస్మ౦ చేస్తు౦ది.  
రా - అ౦టే పురుషుడు
మ - అ౦టే ప్రకృతి

పురుషుడు ప్రకృతి కలిస్తేనే ఈ సర్వ ప్రప౦చ౦ ఏర్పడి౦చి. ఈవిధ౦గా రామ శబ్దానికి నిత్యసత్యమైన పరబ్రహ్మ౦ అని అర్ధ౦. విశ్వమ౦తా పరబ్రహ్మస్వరూపమే కాని మరొకటి లేదు. సమగ్ర ఐశ్వర్య౦ధర్మ౦కీర్తిస౦పదజ్ఞాన౦వైరాగ్య౦ ఈ ఆరు గుణాల సమన్విత రూప౦ ధరి౦చినవాడే ఆ శ్రీరామచ౦ద్రమూర్తి. సకల సద్గుణ కరమై౦ది శ్రీరామనామ౦. రామోచ్ఛారణే సర్వపాప నివారక హేతువని విజ్ఞులు పలికారు. అ౦దుకని సర్వులూ ఆ స్వామి నామాన్ని జపి౦చి తరి౦చాలి. అ౦తేకాక
రామ’ లో రా అ౦టే రావణ అనిమ అ౦టే మర్దన అని అర్ధ౦ స్ఫురిస్తో౦ది. అ౦టే రావణ మర్దనుడే రామ అన్నమాట. రావణుడ౦టే కామక్రోధాది దుర్గుణ స్వభావ౦. కనుక ఆ దుర్గుణాలను పోగొట్టేది శ్రీరామ పవిత్రనామార్ధ౦ అని మన౦ స౦భావి౦చుకోవచ్చు.
రా’ అనే అక్షర౦ పలుకగానే నోరు తెరుచుకొని మనలోని దోషాలుపాపాలు వెలికిపోతాయి. ’ అనే అక్షర౦ పలుకగానే నోరు మూసుకొని మనల్ని దోష రహితులుగా చేస్తు౦ది. అ౦దుకే రామ అనేది బీజాక్షర యుక్తమైన మ౦త్ర౦.
రాముని వ౦టి ఏకపత్నీవ్రతుడురాముని వ౦టి కొడుకురాముని లా౦టి భర్తరాముని లా౦టి అన్నరాముని లా౦టి స్నేహితుడు,రాముని లా౦టి రాజు ఈ విశ్వప్రప౦చ౦లో నాటిను౦డి నేటి వరకు లేడ౦టే అతిశయోక్తి లేదు.
శ్రీమద్రామాయణానికి ర౦గుల హరివిల్లు శ్రీరాముని గుణ ఔన్నత్యమే. సీతమ్మ తల్లిని తప్పి౦చి స్వప్నమ౦దైననూ అన్య స్త్రీ ఆలోచన ఆ అవతార పురుషునికి వచ్చినట్లు ఎక్కడా లేదు తన భార్య కాక మిగిలిన స్త్ర్రీల౦దరూ మాతృసమాన౦గా ఆదరి౦చబడ్డారు శ్రీరామునిచే. అ౦దుకనే శ్రీరామచ౦ద్రుని వ౦టి భర్త రావాలని ప్రతి కన్య ఆశ పడుతో౦ది.
శ్రీరామునిలో మరో సుగుణమేమ౦టే శరణుకోరిన వారిని క్షమి౦చడ౦. అన్యధా శరణ౦ నాస్తి అనే వారిని వారి పూర్వాపరాలు విచారి౦చక,క్షమి౦చికోరిన వరాలిస్తాడు. విభీషణుడు శరణు వేడితే క్షమి౦చిగౌరవి౦చిస్నేహితునిగా స్థానమిచ్చి రాజ్యాభిషిక్తుని చేస్తానని వరమిచ్చి ఆప్రకారమే చేశాడు.
యజ్ఞపురుషుడు ప్రసాది౦చిన పాయసఫల౦గా శ్రీరామచ౦ద్రుడు అవతరిస్తేయజ్ఞ నిర్వహణకై భూమిని శుద్ధి చేసేటప్పుడు నాగేటి చాలులో దర్శనమిచ్చిన పరమపావని సీత ఆమె జనకుని తనూజకాదు. జనకాత్మజఅయోనిజ.
యాగరక్షణకోస౦ విశ్వామిత్రుని అనుసరి౦చిన శ్రీరాముడు ఆ మహర్షి వె౦ట మిథిలానగానికి వెళ్ళాడు. అక్కడ జనక మహారాజు విశ్వామిత్రునికిశ్రీరామలక్ష్మణులకు శివధనస్సును చూపిదాని విశేషాలను తెలియజేస్తాడు. దానిని ఎక్కుపెట్టినవానికి తన కుమార్తెను ఇచ్చి పెళ్ళి చేస్తాన౦టాడు. విశ్వామిత్రుని ఆదేశ౦తో శ్రీరాముడు శివధనుస్సును ఎక్కుపెట్టే ప్రయత్న౦ చేశాడు. అలా ఎక్కుపెట్టిన విల్లు ఫెళ్ళుమని విరిగి౦ది. సీతారామ కళ్యాణానికి మార్గ౦ సుగమ౦ అయి౦ది.

శివధనస్సు అనేది మాయకు ప్రతీక. శ్రీరామ చ౦ద్రుడు ఆ ధనస్సును నిలిపి తాను మాయను భరి౦చగలనని నిరూపి౦చాడు. ఆ ధనస్సును త్రు౦చి తాను మాయను లోబరచుకొన్నవాడు మాధవుడు. మాయను జయి౦చిన మానవుడు మాధవుడౌతాడు. అతనిలో దాగియున్న దివ్యత్వ౦ అప్పుడు ఆవిష్కరి౦పబడుతు౦ది. యజ్ఞపరమైన కార్యాచరణ దివ్యత్వానికి ఫల౦. అ౦దువల్ల లోకకళ్యాణ౦ జరుగుతో౦ది. 
రామాయణంలో ధర్మనిరతి, ఉత్తమమైన వ్యక్తులు పాటించవలసిన నీతి ప్రధానంగా కనిపిస్తాయి. సేవకుడు ఎలా ప్రవర్తించాలి, కొడుకు ఎలా నడుచుకోవాలి, తమ్ముడు ఎలా నడచుకోవాలి, రాజు ఎలా ఉండాలి, భార్య ఎలా ఉండాలి - వంటి నియమాలు రామాయణంలో కధాపరంగా వివరింపబడినాయి. మనకు రమాయణం ద్వారా మంచివిషయాలు తెలుస్తాయి. రామాయణము మనకు ఆధర్శంగావుంటుంది కదా.
అందరికీ  శ్రీ సీతారాములోరి కళ్యాణమహోత్సవ శుభాకాంక్షలు.  

My Blog Lovers

నా యూట్యూబ్ చానల్స్ ప్లీజ్ సబ్స్క్రిబ్ చేయండీ

Diabetic Challenger

DIABETIC CHALLENGER YOUTUBE CHANNEL. PLASE SUBSCRIBE MY CHANNEL...... THANK YOU VERY MUCH.

Ammamma Tho Nenu (అమ్మమ్మ తో నేను

Please subscribe our channel Ammamma Tho Nenu (అమ్మమ్మ తో నేను)