శుక్రవారం, జూన్ 01, 2012
బుధవారం, మే 30, 2012
అత్తలేని కోడలుత్తమురాలు ఓలెమ్మా
బుధవారం, మే 30, 2012
అత్తలేని
కోడలుత్తమురాలు ఓలెమ్మా
కోడలు
లేని అత్త గుణవంతురాలు
ఆహ..
ఊహూ.. ఆహ.. ఊహూ..
అత్తలేని
కోడలుత్తమురాలు ఓలెమ్మా
కోడలు
లేని అత్త గుణవంతురాలు
ఆహ..
ఊహూ.. ఆహ.. ఊహూ..
కోడల
కోడల కొడుకు పెళ్ళామా ఓలెమ్మా
పచ్చిపాలమీద
మీగడేదమ్మా .. ఆ వేడిపాలమీద వెన్న
ఏదమ్మా
ఆహ..
ఊహూ.. ఆహ.. ఊహూ
అత్తమ్మ
నీ చేత ఆరడే గానీ
ఓలేమ్మా
పచ్చిపాలమీద
మీగడుంటుందా .. ఆ వేడిపాలమీద వెన్న
ఉంటుందా
ఆహ..
ఊహూ.. ఆహ.. ఊహూ
అత్తలేని
కోడలుత్తమురాలు ఓలెమ్మా
కోడలు
లేని అత్త గుణవంతురాలు
ఆహ..
ఊహూ.. ఆహ.. ఊహూ..
వంట ఇంటిలోన ఉట్టిమీదుంచిన సున్నుండలేమాయే కోడలా
మినప
సున్నుండలేమాయే కోడలా …
ఆహ..
ఊహూ.. ఆహ.. ఊహూ
ఇంటికి
పెద్దైన గండు పిల్లుండగా ఇంకెవరు
వస్తారె అత్తమ్మా
వేరే
ఇంకెవరు తింటారే అత్తమ్మా …
ఛీ పో… నీ జిమ్మడా….
ఉండు నీ పని చెబుతా…
కొరివితో
అత్తమ్మ గుమ్మానికంతా వచ్చిందీ
పొమ్మని
కాలంతా కుట్టిందీ తేలు
అయ్యో..
అబ్బా … అమ్మా … అయ్యో
ఆ… ఎందుకీ పోరని ఏడుస్తూ మా
అత్త మంచి దానిమలే మళ్ళిపోయింది
ఆ… ఎందుకీ పోరని ఏడుస్తూ మా
అత్త మంచి దానిమలే మళ్ళిపోయింది
ఆహ..
ఊహూ
అత్తలేని
కోడలుత్తమురాలు ఓలెమ్మా
కోడలు
లేని అత్త గుణవంతురాలు
ఆహ..
ఊహూ.. ఆహ.. ఊహూ..
ఆహ..
ఊహూ .. అహ …
మంగళవారం, మే 29, 2012
సోమవారం, మే 28, 2012
శనివారం, మే 26, 2012
Energy Saving Tips
శనివారం, మే 26, 2012
A family is carelessly and unknowingly wasting energy from the moment they wake up. Until something unexpectely happens.
Please follow these tips and save energy.
గురువారం, మే 24, 2012
నేనెందువోయె తానెందువోయీ రానీలే రానీలే రానీలే
గురువారం, మే 24, 2012
నేనెందువోయె తానెందువోయీ రానీలే రానీలే రానీలే
మీనైన నాటి తన మిడుకెల్ల దిగవలె కానీలె కానీలె కానీలె
తలచూపేనాటి తలపెల్ల దిగవలె తలచనీ తలచనీ తలచనీవే
కిరికియైననాటి తన కిటుకెల్లదిగవలె తిరుగనీ తిరుగనీ తిరుగనీవే
హరియైననాటి అదటెల్ల దిగవలె జరగనీ జరగనీ జరగనీవే
వడుగైననాటి వస విడువంగవలె తడవకు తడవకు తడవకువే
కలుషించే నాటి కడమెల్ల దిగవలె అలుగనీ అలుగనీ అలుగనీవే
సతిబాసేనాటి చలమెల్ల దిగవలె తతిగానీ తతిగానీ తతిగానీలే
ముసలైన నాటి ముసుపెల్ల దిగవలె విసుగనీ విసుగనీ విసుగనీవే
మానైననాటి మదమెల్ల దిగవలె పోనీవే పోనీవే పోనీవే
కలికైన నాటి గజరెల్ల దిగవలె చెలగనీ చెలగనీ చెలగనీవే
వేడుకతో నాటి వేంకటపతి నన్ను కూడనీ కూడనీ కూడనీవే
బుధవారం, మే 23, 2012
Sri Rama Rajyam Game
బుధవారం, మే 23, 2012
Lava, Kusa to capture the Sree Rama's horse and win over Sri Rama's Army.
Controls To Play Sri Rama Rajyam | |||||||||||||
|
సోమవారం, మే 21, 2012
మూడేమాటలు మూడుమూండ్లు
సోమవారం, మే 21, 2012
మూడేమాటలు మూడుమూండ్లు తొమ్మిది
వేడుకొని చదువరో వేదాంత రహస్యము ||
జీవస్వరూపము చింతించి అంతటాను
దేవుని వైభవము తెలిసి |
భావించి ప్రకృతి సంపదయిది యెరుగుడే
భావించి ప్రకృతి సంపదయిది యెరుగుడే
వేవేలు విధముల వేదాంత రహస్యము ||
తనలోని జ్ఞానము తప్పకుండా తలబోసి
పనితోడ నందువల్ల భక్తినిలిపి |
మనికిగా వైరాగ్యము మరవకుండుతే
మనికిగా వైరాగ్యము మరవకుండుతే
వినవలసిన యట్టి వేదాంత రహస్యము ||
వేడుకతో నాచార్య విశ్వాసము కలిగి
జాడల శరణాగతి సాధనముతో |
కూడి శ్రీవేంకటేశ్వరు కొలిచి దాసుడౌటే
కూడి శ్రీవేంకటేశ్వరు కొలిచి దాసుడౌటే
వీడని బ్రహ్మానంద వేదాంత రహస్యము ||
ఆదివారం, మే 20, 2012
వాస్కోడిగామ సాహసయాత్ర
ఆదివారం, మే 20, 2012
పూర్వం నుండి సాహస యాత్రలు చేసేవారు వారిలో మొట్టమొదట కొలంబస్ అను నావికా యాత్రికుడు ఎన్నో సాహస యాత్రలు చేసారు వాటిలో నాలుగు గొప్ప యాత్రలు చేసి, ఇండియాని కన్నుక్కోవాలని ప్రయత్నించి ఇండియాకి దారి కనుక్కోలేకపోయినాడు, పశ్చిమ ఇండీస్ దీవులని, దక్షిణ అమెరికా ఖండాన్ని కనుక్కున్నాడు. కాని తను కనుక్కున ప్రదేశము ఇండియ అనే చాలా కాలం వరకు భ్రమలో ఉన్నాడు. అయతే కొంత కాలం తరువాత ఆ ప్రాంతం ఇండియా కాదని, అదేదో కొత్త భూమి అని క్రమంగా యూరొపియన్ ప్రజలకి తెలిసింది అప్పుడు మళ్ళీ ఇండియా కనుక్కోవాలని తపన వారిలో మొదలైనది. అప్పుడు వారు కొత్త దారుల వెతుకు లాట మళ్లీ మొదలుపెట్టారు . అప్పుడు పోర్చిగీసు నావికుడు దీనికి పూనుకొని తన సాహస యాత్ర మొదలు పెట్టాడు. వారు ఆ యాత్రలో చాలా కష్టాలు అనుభవించారు. పెద్ద పెద్ద తుఫానులు, గాలులు, వర్షాలు ఎన్నో అధిగమించి చిట్ట చివరికి మన ఇండియాని కన్నుక్కున్నాడు. ఇండియాని చేరక పూర్వం ఇండియా అనుకోని రెండు ప్రదేశాలకు చేరి అవి ఇండియా కాదు అని తెలుసుకొని తన ప్రయాణం కొనసాగించారు. అ తను ఆఫ్రికా చుట్టూ వెళితే ఇండియా చేరుకోవచ్చు అని అనుకున్నాడు. అయితే మూడోసారి ప్రయాణం చేసాక అప్పుడు ఇండియాని కనిపెట్టేసాడు ఈ సాహస యాత్రికుడు వాస్కోడిగామ. ఇతను కనుక్కొన తరువాతే అందరికి మన దేశం అందరికి తెలిసిపోయింది. అప్పుడే మనకు బ్రిటిష్ వారి వంటి వారు చేరి మనలను కస్టాలు పాలు చేసారా అనిపిస్తోంది. ఈరోజు నాడు 1498 మే 20 న ఈ యాత్రికుడు సముద్ర మార్గము ద్వారా ఇండియాని అప్పటి కాలికట్ ఇప్పటి కోజికోడ్ ను చేరాడు. ఇంత పట్టుదలతో ఇండియాని మొట్ట మొదట చేరిన వాస్కోడిగామ గురించి తెలుసుకోవటానికి ప్రయత్నం చేసినందుకు ధన్యవాదములు.
గురువారం, మే 17, 2012
భూమాత విష్ణువును ప్రార్ధిస్తున్నది.
గురువారం, మే 17, 2012
భూమాత దుష్ట రాక్షసులు యొక్క ధుష్టపనులు నుండి ప్రపంచంను కాపాడుతున్న మరియు మానవశరీరము ధరించిన విష్ణువును ప్రార్ధిస్తూ మరియు పొగడుతూ ఈ విధంగా పాడుతుంది.
శ్లోకం :
శరణ ముపగతాహం త్వం శరణ్యం జనానాం
నిఖిల భయ వియోగం యోగి చింత్యాం మనంతం
సుర రిపుగణ భారం దుస్సహం దుర్భరమ్మే
పరిహర పరమాత్మన్ భక్తి సిద్ధైక మూర్తే||
తాత్పర్యం:
ఓహ్ దేవాదిదేవ శ్రీమన్నారాయణ, మీరు ఏకైక రక్షకుడైన ఉన్నారు. మీరు మా భయాలును దూరంగా వెదజల్లు. యోగులు ఎల్లప్పుడూ మీమీద ధ్యానం చేస్తువున్నారు. అనేక రాక్షసులు భూమిపై భరించలేని విధంగా దుష్టకర్మలు చేస్తున్నారు. ఇలాంటి పనులు మేము భరించలేకపోతున్నారు నన్ను వారి భారం నుండి నాకు ఉపశమనం కలిగించి నాకు మరియు ప్రపంచం ను కాపాడండి.
పాట :
శరణం భవ కరుణమయి కురు దీన దయాళో
కరుణా రస వరుణలయ ఖరిరాజ క్రుపాళొ ||
అధునా ఖలు విధిన మయి సుధియ సురభరితం
మధుసూదన మధుసూదన హర మామక దురితం ||
వరనూపుర ధర సుందర కరశోభిత వలయ
సురభూసుర భయవారక ధరణీ ధర క్రుపయా
త్వరయా హర భర మీశ్వర సురవర్య మదీయం
మధుసూదన మధుసూదన హర మామక దురితం ||
ఘ్రుణి మందల మణి కుందల ఫణి మందల శయన
అణి మాది సుగుణ భూషణ మణి మంటప సదన
వినతా సుత ఘన వాహన ముని మానస భవన
మధుసూదన మధుసూదన హర మామక దురితం ||
అరి భీకర హలి సొదర పరిపూర్ణ సుఖాబ్ధే
నరకంతక నరపాలక పరిపాలిత జలధే
హరిసేవక శివ నారా యణ తీర్థ పరాత్మన్
మధుసూదన మధుసూదన హర మామక దురితం ||
బుధవారం, మే 16, 2012
పొట్టేళ్ల పోట్లాట జవాబు తెలిస్తేనాకు చెప్పేయండి
బుధవారం, మే 16, 2012
ఒక ఊరిలో ఒకానొక మేక ఆహారము కోసం ఒక నిలువుగా వున్నా కొండ ఎ క్కి అక్కడ ఆహారం తిని తిరిగి వస్తూవుంటడేది . కానీ ఆకొండ ఎక్కాలి అంటే ఒక నీటి ప్రవాహం దాటాలి. ఆ నీటి ప్రవాహం మీద ఒక బ్రిడ్జ్ వుంది. కానీ ఆ బ్రిడ్జ్ చాలా ఇరుకుగా వుంటుంది. దానిమీద ఒక్కరు మాత్రమే వెళ్ళ గలరు. అలా ఒకరోజు అలా బ్రిడ్జ్ మీద దాటుతున్నప్పుడు అటునుండి ఇంకో పొట్టేలు వస్తోంది. నేను ముందు వచ్చాను నువ్వు వెనక్కి వెళ్ళు నన్ను ముందువెళ్ళని అని ఆ పొట్టేలు అంది. ఈ పొట్టేలు కూడా అలానే అంది నాను ముందుకు వెళ్ళనీ నువ్వు ముందు వెనక్కి వెళ్ళు అని అన్నాది. వాటి మద్య వాదన పెరిగింది. రెండు వాటి కొమ్ములతో కొట్టుకున్నాయి. వాటి మద్య యుద్ధ వాతావరణం నెలకొంది. అలా కొమ్ములుతో కొట్టుకొని వాటి కొమ్ములు విరిగిపోయి అవి ఆ నీటి ప్రవాహంలో పడిపోయి కొట్టుకుపోయాయి. మరలా కొన్ని రోజులు తరువాత మరలా అదే పరిస్థితి వచ్చింది. అవే పొట్టేళ్ళు అదే బ్రిడ్జ్ మీద కలుసుకున్నాయి. అయితే యిప్పుడు అవి వెనకకు వెళ్ళవు, కొట్టుకోవు నీటిలోకి పడిపోవు, వాటిదారిలో అవి సమానంగా వెళ్ళిపోతాయి అది ఎలా? మీకు ఒక hint కూడా ఇస్తాను అవి ఒక ఒప్పందానికి వస్తాయి. అది ఎలాంటి ఒప్పందమో మీరు చెప్పాలి? అవి ఎ విధంగా రెండు పొట్టేళ్ళు సురక్షితంగా వంతెన ద్వారా మార్పు చెందుతాయి. మీకు జవాబు తెలిస్తే నాకు తొందరగా చెప్పేయండి మరి.
మంగళవారం, మే 15, 2012
హనుమంతుడు
హనుమాన్ జయంతి శుభాకాంక్షలు.
అందరికి నెక్కుడైన హనుమంతుడు
అందుకొనె సూర్యఫలమని హనుమంతుడు
బల్లిదుడై లంకజొచ్చి బలురాకాసుల గొట్టి
హల్లకల్లోలము చేసె హనుమంతుడు
వొల్లనె రాముల ముద్దుటుంగరము సీత కిచ్చె
అల్లదె నిలుచున్నాడు హనుమంతుడు
దాకొని యాకెముందర తనగుఱు తెరుగించి
ఆకారమటు చూపె హనుమంతుడు
చేకొని శిరోమణి చేతబట్టి జలనిధి
ఆకసాన దాటివచ్చె హనుమంతుడు
కొంకకిట్టె సంజీవి కొండ దెచ్చి రిపులకు
నంకకాడై నిలిచెను హనుమంతుడు
తెంకినే శ్రీవెంకటాద్రి దేవుని మెప్పించినాడు
అంకె కలశాపురపు హనుమంతుడు
కాటన్ దొరగారి పుట్టినరోజండి
ఈరోజు గోదావరి ప్రజలు ఎంతో అబిమానించే కాటన్ దొరగారి పుట్టినరోజు. ఈ దొరగారి అసలు పేరేమో జనరల్ సర్ ఆర్ధర్ కాటన్ . ఈయన బ్రిటిష్ సైనిక అధికారి మరియు నీటి పారుదల ఇంజీనీయర్. ఈయన తన జీవితం అంతా నీటి పారుదల గురించే ఎక్కువ కృషి చేసారండి. ఈయన May 15 న 1803 వ సంవత్సరం లో ఆక్సఫోర్డ్ లో
హెన్రీ కాల్వెలీ కాటన్ మరియు ఆయన శ్రీమతికి పదవ కుమారునిగా జన్మించాడు. దొరగారు తన 15 సంవత్సరాల వయసులో కాటన్ 1818లో మిలటరీలో క్యాడెట్ గా చేరి అడ్డిస్కాంబ్ వద్ద ఈస్టిండియా కంపెనీ యొక్క ఆర్టిలరీ మరియు ఇంజనీరింగు సర్వీసులలో శిక్షణ పొందాడు. 1819లో రాయల్ ఇంజనీర్స్ దళంలో సెకండ్ లెఫ్టెనెంట్ గా నియమితుడయ్యాడు. దొరగారు తెలుగు భాషమీద కూడా ఎక్కువ అభిమానం కలవారు. గోదావరి ప్రజలు మీద ఈయన అభిమానం ఎక్కువ చూపేవారు. ఈయన ఎక్కువగా కృషి చేసి విజయం సాధించిన ప్రాజెక్టులలో గోదావరి నుండి నిర్మించిన కాలువల నిర్మాణంగా చెప్పుకోవచ్చు . ఈ కాలువల విభజన వల్ల మరియు అన్ని ప్రదేశాలను కలుపుతూ సాగే విస్తరణ, ఒకప్పుడు వ్యవసాయం లో సామాన్య దిగుబడితో ఉన్న గోదావరి పరివాహక జిల్లాలను అత్యంత అభివృద్ది, అధిక వ్యవసాయ దిగుబడులు కల జిల్లాలుగా మార్చివేసినవి.
దొరగారు ఈ ఆనకట్ట లే కాకుండా 1836 - 38 సంవత్సరాలలో కొలెరూన్ నదిపై ఆనకట్టను నిర్మించాడు. దానితో తంజావూరు జిల్లా మద్రాసు రాష్ట్రంలోనే కాక, యావత్భారత దేశంలోనే ధనధాన్య సమృద్ధికి ప్రథమ స్థానం నాకు వచ్చింది . అన్నిటికంటే ముఖ్యంగా 1847 - 52 సంవత్సరాలలో గోదావరిపై ధవళేశ్వరం వద్ద ఆనకట్టను పూర్తిచేశాడు. గోదావరి డెల్టా ప్రదేశాలు సస్యశ్యామలమై కలకలలాడింది. ఈ ఆనకట్టల వల్ల ఆరు లక్షల ఎకరాల భూమి సాగు కిందికి వచ్చింది. ఇంత గొప్పకార్యానికి ఆయన కేవలం అయిదేళ్ళలో కాలంలోనే పూర్తి చేశాడు. ఇది చాలా గోప్పవిషయంగా తోచుతోంది కదండి. దొరగారు అంతటితో తృప్తి చెందక కృష్ణానదిపై విజయవాడ వద్ద ఆనకట్టకు కృషి చేసారు . మొత్తం భారత భూమిని సస్యశ్యామలం చేయటానికి నదులను మనం ఎలావుపయోగించాలా అన్న ఆలోచనలు చేసారు . దానికోసం ఎన్నో పరిసోదనలు చేసారు. భారతీయులు అందరు దొరగారికి శాశ్వత రుణగ్రస్తులు అయిపోయారు. దొరగారికి 1861లో సర్ బిరుదును పొందాడు . ఈయన బ్రిటిష్ వాడు అయినాసరే మనదేశబౌగోళిక పరిస్తితులు తెలుసుకొని మనదేశాభివ్రుద్దికి కృషిచేసారు. కాటన్ దొరగారు భారత జల సంపద అనే పుస్తకంలో “భారతీయ నదీ వ్యవస్థల విషయంలో సర్ ఆర్థర్ కాటన్ అనుపమానమైన అవగాహన కలిగినవాడు. అలాంటి పథకం గత శతాబ్దం (19 వ) లోనే అమలు జరిగి ఉంటే, ఇప్పుడు ఇండియాలో రవాణా ఒక సమస్య అయ్యుండేది కాదు.” కాదు అని రాసారుట. మన దేశం గురించి ఆయన బాగా అర్ధం చేసుకున్నాడు కదండి. నిజంగా కాటన్ దొరగారు గ్రేటండి బాబు. సారూ గారిని ఈరోజు ఇలా అయినా గుర్తుతెచ్చుకున్నందుకు నాకు చాలా సంతోషంగా వుండండి . మరి మీకో.
లేబుళ్లు:
కమామిషులు,
పుట్టిన రోజులు,
Events,
greetings
సోమవారం, మే 14, 2012
వలస పక్షులు వాటి యాతన.
సోమవారం, మే 14, 2012
ఇక్కడ పక్షులను చూస్తూవుంటే ఇవి వలస పక్షులు అని తెలిసి పోతోంది కదండి. నిజంగా ఇవి వల స పక్షులే ప్రపంచం నేడు వల స పక్షుల రోజుగా జరుపుకుంటోంది. వలస పక్షులు అనగానే మనకు కొల్లేరు సరస్సు దగ్గర కు వచ్చే పక్షులు గుర్తుకు వస్తాయి . ఈ పక్షులన్నీ ఎక్కడో పుట్టి వున్న ప్రదేశాన్ని విడిచి కొన్ని వేల మైళ్ళు ఎగురుకొని కొండలూ కోనలు సముద్రాలు , నదులు , చెరువులు , అడవులు , వూర్లు, ఎడారులు దాటుకొని కొత్త ప్రదేశానికి చేరుకుంటాయి. అక్కడ కొన్ని రోజులు వుండి తరువాత వాటికి అనుకూలమైన వాతావరణం ఏర్పడినప్పుడు మరలా తిరిగి వాటి ప్రదేశానికి వెళ్లి పోతాయి కావున వాటిని వలస పక్షులు అంటారు. ఇవి గుంపులు గుంపులుగా ఈ ప్రయాణాన్ని చేస్తాయి. ఇవి మామూలుగా పగటి జీవులే అయినప్పటికీ ఇవి ఈ వలస ప్రయాణము మాత్రం రాత్రి సమయంలోనే ప్రయాణం చేస్తాయి. ఈ ప్రయాణం చీకటి పడ్డాక మొదలు పెట్టి తెల్లారేలోపు వరకు ప్రయాణం సాగిస్తాయి. ఇలా రాత్రులే ఎందుకు ప్రయాణిస్తున్నాయో ఉహించగలరా. రాత్రులు అయితే వాటికి శతృభయము వుండదు అందుకే అలా ప్రయాణిస్తాయి. రాత్రులు గంటకి తొమ్మిదివేల పక్షులు ప్రయాణిస్తాయి. కష్టకాలంలో ఆహారం దొరకక ఆహారాన్వేషణలో వలసపోవటం జరుగుతుంది. వసంతకాలంలో జంట కట్టడానికి, గుడ్లు పెట్టి పిల్లల్ని పెంచటం కోసం పక్షలు వలస పోతాయి. శీతాకాలపు తీవ్రత నుండి బయటపడటానికి వెచ్చని ప్రదేశాలను వెదుక్కుంటూ వలసపోతాయి. భూమధ్యరేఖ ప్రాంతపు వెచ్చని ప్రాంతాలు చాలా పక్షులను వేసవి విడుదలుగా ఉండటం విశేషం. ఈ ప్రయాణం ఎప్పుడు చేపట్టాలో ఎలా తెలుస్తుంది. మరి ? ఎక్కడికి పోవాలో ఎలా తెలుస్తుంది ? చాలా కాలం నుండి నేటివరకూ మానవ మేధస్సును ఈ ప్రశ్నలు తొలుస్తూనే వున్నాయి. ఏటవాలుగా పయనించే సూర్యకిరణాలు, శరీరంలో వచ్చే హార్మోన్ల మార్పులు ప్రయాణము చెయ్యాలి వాటికి తెలుస్తుంది అంటారు . అంతేగాక వాతావరణంలో వచ్చే మార్పులు ప్రధానంగా వలసకు దారి తీస్తాయి. ప్రయాణానికి సరిపడినంత కొవ్వు నిల్వ చేసుకుని మరీ బయల్దేరుతాయి. సూర్యుడు, నక్షత్రాలను తమ మార్గదర్శకులుగా చేసుకొని ప్రయాణం సాగిస్తాయని పలు పరిశోధకులు తెలియజేశారు. పావురాలు తమ మార్గాన్వేషణలో వాసనను ఉపయోగించుకుంటాయి. అయితే కొన్నిసార్లు దారితప్పిన సందర్భాలు కూడ లేకపోలేదు. ప్రయాణంలో వెనుకబడినవి, పిల్లపక్షులు తరచూ దారిగానక చెల్లాచెదురవుతాయి. ఏమైనా వేల మైళ్ళు ప్రయాణం చేయడం, తిరిగి ఇల్లు చేరుకోవటం జీవులు ప్రకృతిలో వచ్చే మార్పులకు అనుగుణంగా తమనుతాము తీర్చిదిద్దుకున్న ప్రక్రియ ఇది సృష్టిలో మహాద్భుతం గా చెప్పుకోవచ్చు .
పక్షులును చూసి మనలాంటి వారు కష్ట కాలంలో ఎలా జీవించాలో నేర్చుకోవచ్చు. ఎలాగైనా గమ్యాన్ని తిరిగి చేరుతాయి. ఇదే వలసపక్షులు వాటి యాతన .
ఆటలమ్మ
Chicken pox vaccine |
ఆదివారం, మే 13, 2012
సర్ రోనాల్డ్ రాస్
ఆదివారం, మే 13, 2012
సర్ రోనాల్డ్ రాస్ మలేరియ చక్రం |
రాస్ వైద్యశాస్త్రాన్ని లండన్ లోని సెయింట్ బార్తొలోమ్ హాస్పిటల్ లో 1875 - 1880 మధ్య పూర్తిచేశాడు. తర్వాత రోయల్ కాలేజ్ ఆఫ్ సర్జన్స్ సభ్యత్వం (Membership of the Royal College of Surgeons:MRCS) పొందాడు. ఇతడు 1881 లో ఇండియన్ మెడికల్ సర్వీసు లో చేరి ముందుగా మద్రాసులో పనిచేశాడు.
Sir Ronald Ross Institute of Tropical and Communicable Diseases హైదరాబాద్ లో ఈ మలేరియ వ్యాధి గురించి పరిశోధించి విజయం సాధించారు. ఇందుకు గాను ఈయనికి నోబెల్ బహుమతి ఇచ్చారు.
లేబుళ్లు:
పరిశోధకులు,
పుట్టిన రోజులు,
Events,
greetings,
photos
మాతృమూర్తులకు మాతృపూజాదినోత్సవ నాశుభాకాంక్షలు
ఈ రోజు మాతృపూజా దినోత్సవంగా జరుపుకుంటున్నాం అందుకుగాను ముందుగా మన మాతృ భూమికి (భారతమాత )కు మరియు ప్రపంచంలో వున్నా మాతృమూర్తులకు మాతృపూజాదినోత్సవ నాశుభాకాంక్షలు.
సృష్టిలో అమ్మ లేనిజీవి అన్నది లేదు . ఎక్క డైనా చెడ్డ బిడ్డ వుండవచ్చేమో కాని చెడ్డ తల్లి అన్నది వుండదుట. ఏ తల్లి అయ్యినా తన బిడ్డ గొప్పగా వుండాలి అని కోరుకుంటుంది. మనకు ప్రపంచంలో కెల్లా అతి తియ్యనైన పదం అమ్మ . అమ్మప్రేమ కంటే గొప్ప ప్రేమ , అమ్మకంటే గొప్ప రక్షణ , అమ్మ కంటే గొప్ప గురువు, అమ్మ కంటే గొప్ప దైవం ఎక్కడా లేదు. ఇది నిజం . అలాంటి అమ్మ ఋణము మనం ఎన్ని జన్మలుఎత్తినా తీర్చలేము.
ఈ సందర్బములో నాకు ఒక కదా గుర్తు వస్తోంది అది ఏమిటి అంటే!!!!! ఈ కదా అమ్మ ప్రేమకు ఒక నిదర్సనం అని చెప్పుకోవచ్చు. ఒక ఊరిలో ఒక అమ్మ వుంది ఆ అమ్మకి ఒక బిడ్డ వున్నాడు. అతను అన్ని చెడ్డ అలవాట్లు కలిగి వుంటాడు. అతనికి ఒక ప్రియురాలు వుంది ఆమె ఒకనాడు నాకు తల నొప్పిగా వుంది అని చెప్పింది. ఆ తలనొప్పి తగ్గాలి అంటే అతని అమ్మ హృదయపు రక్తం రాస్తే తగ్గుతుంది అని చెప్పింది. అప్పుడు ఆతను మాఅమ్మ హృదయం ఇప్పుడే తెస్తాను అని చెప్పి వెళ్ళాడు. వెళ్లి అమ్మని అడిగాడు. అమ్మా నీ హృదయం కావాలి అని అడిగాడు. ఆమె వెంటనే సరే నాయనా తప్పకుండా తీసుకో అంది. అప్పుడు ఆతను తల్లిని పొడిచి హృదయాన్ని తీసుకున్నాడు. ఆ హృదయం రక్తం కారుతోంది దానిని తన చేతిలో తీసుకొని వెళ్తూ వుండగా ఆ రక్తం లో జారి పడబోయాడు. అప్పుడు అమ్మ హృదయం తల్లడిల్లిపోయి బాబూ జాగ్రత్త చూసుకొని నడువు నాయనా అంది. అప్పుడు ఆ కొడుకులో మార్పు వచ్చి ఇంత మంచి అమ్మనా నేను చంపింది అని ఏడుస్తాడు. చూసారా ఎక్కడైనా అమ్మ మంచిగానే వుంటుంది. అలాంటి అమ్మను మనం కష్టపెట్టకూడదు.
మనకు తెలిసిన రామాయణంలో రాముడు తల్లి (కైకెయి)కోరికకు కట్టుబడి అడవికి వెళ్లి ఎన్నోకస్టాలు అనుభవించాడు. కృష్ణుడు, యశోద ప్రేమ మనం వర్ణించలేము. అర్జునుడు ద్రుపది స్వయంవరంలో గెలిచిన ద్రుపధిని పాండవులు తల్లిమాట విని ద్రౌపదిని ఐదుగురు భార్యగా పొందారు. తరువాత చత్రపతి శివాజి తనతల్లి కొరికను నెరవేర్చి. చక్రవర్తి అయ్యాడు. గాంధి గారుకు తన తల్లి తన చిన్నప్పటి నుండి అనేక కదలు చెప్పేది. ఆ కధలు గాంధిగారికి మార్గనిర్ధేశకంగా నిలిచాయి.
మనకు పంచ మాత లు కలరు అని కుమారశతకంలో ఇలా అన్నారు.
ధరణీ నాయకు రాణియు
గురు రాణియు నన్నరాణి కులకాంతను గ
న్న రమణి దనుగన్నదియును
ధరనేవురు తల్లులనుచు దలుపు కుమారా !
భావం:రాజు భార్య (రాణి), అన్న భార్య (వదిన), గురుని భార్య (గురుపత్ని), భార్య తల్లి (అత్త) మరియు కన్న తల్లి - పంచమాతలు గా భావించవలెను.
అమ్మని ఇప్పుడు mommy అని పిలుస్తున్నారు. mommy అన్న పదం కంటే అమ్మ అన్న పదం లోనే తియ్యదనం వుంది అని తెలుసుకుంటే బాగుంటుంది.
ఎవరు రాయగలరూ అమ్మ అను మాటకన్న కమ్మని కావ్యం
ఎవరు పాడగలరూ అమ్మ అనురాగం కన్న తీయని రాగం
అమ్మేగా… అమ్మేగా తొలిపలుకు నేర్చుకున్న భాషకి .........
ధీరులకు దీనులకు అమ్మ ఒడి ఒక్కటే... --సిరివెన్నెల సీతారామశాస్త్రి అన్న పాట రాసారు ఇది అక్షరసత్యం అని గ్రహించగలరు. ఎందరో కవులు అమ్మ గురించి వర్ణించటానికి ప్రయత్నించారు. కానీ ఎవరు రాయగలరండి అమ్మ గురించి.
అమ్మలందరికి మాతృ పూజా దినోత్సవం శుభాకాంక్షలు.
(మా అమ్మకి)I love You Amma.
శనివారం, మే 12, 2012
ఫ్లోరెన్స్ నైటింగేల్
శనివారం, మే 12, 2012
ఈ రోజు ప్రపంచం మొత్తం మీద నర్సులు పండగ గా గరుపుకుమ్తున్నారు ఎందుకు అంటే ఈరోజు International Nurses Day కదా! . ఈరోజునే ఎందుకు జరుపుకుంటున్నారు అంటే ఈరోజు ఫ్లోరెన్స్ నైటింగేల్ పుట్టిన రోజు. ఈమె ఒక నిజంమైన స్పూర్తిదాయకమైన నర్సు. |
ఫ్లోరెన్స్ నైటింగేల్ క్రిమియన్ యుద్ధం సందర్భంగా ఆమె నర్సింగ్ పని చేసి ప్రసిద్ధి చెందింది.ఆమె చాలా ముఖ్యమైన బాధ్యతలు ఒక అత్యధిక నైపుణ్యం కలిగిన మరియు బాగా గౌరవనీయ వైద్య వృత్తి ఎక్కువగా అభ్యాసం లేని వృత్తి నుండి నర్సింగ్ మార్చబడింది.ఫ్లోరెన్స్ నైటింగేల్ 12 మే 1820 న ఫ్లోరెన్స్, ఇటలీ లో జన్మించారు. ఆమె తండ్రి ఒక సంపన్న భూస్వామి . ఆమె డెర్బిషైర్ మరియు హాంప్షైర్ లో పెరిగింది. ఫ్లోరెన్స్ కు ఆమె జన్మ స్థలం పేరు పెట్టబడిందిఫ్లోరెన్స్ జన్మింఛి ఉన్నప్పుడు ఆ సమయంలో, అమ్మాయిలు విద్యను ఏ రకంగాను అందుకోలేదు. ఆమె తండ్రి, విలియం నైటింగేల్, మహిళలు ఒక విద్యను పొందాలి అని భావించారు ఎందుకంటే ఫ్లోరెన్స్ బాగా అదృష్టవంతుడు. అతను ఫ్లోరెన్స్ మరియు ఆమె సోదరి సైన్స్ మరియు గణితం నుండి చరిత్ర మరియు తత్వశాస్త్రం వరకు విషయాలు నేర్పించారు.ఫ్లోరెన్స్ పెరిగిన గా ఆమె ఇతరులు సహాయం మీద ఆసక్తి పెరిగింది. ఆమె అవకాశం లభించింది చేసినప్పుడు ఆమె అనారోగ్యంతో పెంపుడు జంతువులు మరియు సేవకులు కోసం ఆలోచించలేదు.ఫ్లోరెన్స్ నైటింగేల్ ఒక నర్సు కావాలని దేవునిని ప్రార్ధించారు. వయస్సు పదిహేడు సంవత్సరాలు, ఆమె దేవుని ద్వారా సేవ చెయ్యాలి అని "నిస్సహాయంగా మరియు నీచ నుండి బాధలో వున్నవారికి సహాయం చేయాలని." కోరుకున్నారు.మొదట ఆమె తల్లిదండ్రులు ఆ సమయంలో, అది ఒక బాగా విద్యావంతులు స్త్రీ ఒక అనుకూలమైన వృత్తిగా భావించ లేదు, ఎందుకంటే ఆమె ఒక నర్సు మారింది దానికి వారు తిరస్కరించారు. చిట్టచివరికి 1851 లో ఆమె తండ్రి అనుమతితో ఫ్లోరెన్స్ ఒక నర్స్ గా శిక్షణ Germany కు వెళ్లి పొందారు.1853 లో లండన్ లో ఒక ఆసుపత్రి నడుస్తున్న జరిగినది.1849 - యూరోపియన్ ఆసుపత్రి వ్యవస్థ అధ్యయనం యూరప్ కి ప్రయాణించాడు.1850 - అలెగ్జాండ్రియా, ఈజిప్ట్ వెళ్లింది సెయింట్ విన్సెంట్ డి పాల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వద్ద నర్సింగ్ చదవడం ఆరంభించారు.1851 - వయస్సు ముప్పై-ఒక గొప్ప నర్స్ మారింది. ఆమె మరికొందరికి శిక్షణ ఇవ్వడానికి Germany కు వెళ్ళారు.1853 - లండన్ లో Gentlewomen కోసం ఆసుపత్రి సూపరింటెండెంట్గా మారింది.1854 - క్రిమియన్ యుద్ధంలో బయటపడింది.1854 లో ఫ్లోరెన్స్ నైటింగేల్ క్రిమియన్ యుద్ధం (- 56 1854) గాయపడ్డాడు బ్రిటీష్ సైనికుల నర్సింగ్ నిర్వహించేందుకు టర్కీ వెళ్ళారు. ఆమె గాయపడిన సైనికులుకు సహాయం Scutari (క్రిమియన్ యుద్ధంలో గాయపడిన మరియు అనారోగ్యంతో సైనికులు తీసిన ఇక్కడ స్థానం) వెళ్ళింది.ఫ్లోరెన్స్ తన జీవితం ఉద్యోగంకు అంకితం చేశారు. ప్రతి ఒక కేవలం వారు సరి ఉండేవి నిర్థారించడానికి నిద్రలోకి ఉన్నప్పుడు ఆమె తరచుగా రాత్రి సైనికులు సందర్శించండి ఉంటుంది. ఆమె చక్రంలా నిద్ర సమయం విరామం తీసుకునేదే కాదు ఎందుకంటే అప్పుడు ఆమె "లేడి విత్ ది లంప్ " అని అనటం జరిగినది. గాయపడిన చాలా unwashed మరియు బ్లాకెట్స్ను లేదా decent ఆహార లేకుండా overcrowded, మురికి గదులు లో నిద్రపోవటం వల్ల . టైఫస్ ఈ పరిస్థితులు వ్యాధులు లో, కలరా మరియు విరేచనాలు త్వరగా వ్యాపించాయి. ఫలితంగా, గాయపడిన సైనికులు మధ్య మరణాల రేటు బాగా ఎక్కువ.చాలా సైనికులు అంటువ్యాధులు మరియు వ్యాధి మరణించారు. ఫ్లోరెన్స్ మరియు ఆమె నర్సులు ఈ పరిస్థితులును మార్చింది. వారు, ఒక వంటగది ఏర్పాటు వారి స్వంత సరఫరా నుండి గాయపడిన మృదువుగా, పారిశుధ్యం కోసం latrines తవ్విన, మరియు గాయపడిన యొక్క భార్యలు నుండి సహాయం కోసం కోరారు. వారు అప్పుడు సరిగా పడిపోయింది సైనికులు మధ్య అనారోగ్యం మరియు గాయపడిన మరియు మరణం రేటు కోసం శ్రమ పోయారు.ఫ్లోరెన్స్ నైటింగేల్ ఇంగ్లాండ్ లో ఒక సంవృద్ధిఅయిన కుటుంబం కుమార్తె. క్రిమియన్ యుద్ధం సమయంలో, ఆమె నర్సింగ్ విభాగ ఉంచబడినది. ఆమె యుద్ధ రంగంలో ఆసుపత్రిలో మందిరాలు లేచి, "దీపం తో మహిళ" అని పిలుస్తారు మారింది ఆమె ఒక దీపం తీసుకెళ్లారు. ఈమె ఒక గొప్ప నర్సు గా పేరు తెచ్చుకుని, నర్సు లకు ఆదర్శంగా నిలిచినది.
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
పోస్ట్లు (Atom)
My Blog Lovers
నా యూట్యూబ్ చానల్స్ ప్లీజ్ సబ్స్క్రిబ్ చేయండీ
Diabetic Challenger
DIABETIC CHALLENGER YOUTUBE CHANNEL.
PLASE SUBSCRIBE MY CHANNEL......
THANK YOU VERY MUCH.
Ammamma Tho Nenu (అమ్మమ్మ తో నేను
Please subscribe our channel Ammamma Tho Nenu (అమ్మమ్మ తో నేను)