Blogger Widgets

బుధవారం, మే 01, 2024

యూట్యూబ్ లో First Time పచ్చ పనస ఆవకాయ (Spl Yellow Jackfruit Pickle)

బుధవారం, మే 01, 2024

యూట్యూబ్ లో First Time పచ్చ పనస ఆవకాయ (Spl Yellow Jackfruit Pickle)

ఆదివారం, ఏప్రిల్ 21, 2024

కలియుగంలో కోరికలు తీర్చేదేముడయ్యా ఈ హనుమయ్య .........హనుమాన్ చాలీసా ఎలా పుట్టింది?

ఆదివారం, ఏప్రిల్ 21, 2024

 




హనుమాన్ చాలీసా పుట్టుక గురించి చాలా ఆసక్తికరమైన చరిత్ర ఉంది. ఇది 16వ శతాబ్దంలో మహాకవి తులసీదాసు చేత రచించబడింది. తులసీదాసు రామభక్తికి ప్రసిద్ధి చెందిన కవి-సన్యాసి మరియు రామచరితమానస అనే ఇతిహాసం రచయిత. హనుమాన్ చాలీసాలో నలభై శ్లోకాలు ఉంటాయి, అందుకే దీనిని ‘చాలీసా’ అని అంటారు, ఇందులో ‘చాలీస్’ అనే పదం నుండి వచ్చింది, దీని అర్థం హిందీ భాషలో ‘నలభై’.

హనుమాన్ చాలీసా వెనుక కథ?

వారణాసి లో ఒక సదాచార సంపన్నుడు తన ఏకైక కుమారుడు కి ఒక అమ్మాయి ని ఇచ్చి వివాహం చేస్తాడు.వారిద్దరూ చిక్కగా జీవనం సాగిపోతుండగా విధి ప్రభావంగా ఆ వక్తి మరణించాడు.దానిని చూసి అతని భార్య తట్టుకోలేకపోయింది ఎంతో బాధపడింది.తన భర్త శవ యాత్రకు అడ్డు పడింది.అది చూసి చుట్టూ పక్కల వాళ్ళు తనని పట్టుకున్నారు యాత్ర సాగుతుంది.ఈ యాత్ర తులసి దాస్ ఆశ్రమం మీదుగా జరుగుతుంది.ఆ అమ్మాయి అందరిని విడుచుకుని వెళ్లి తులసి దాస్ కాళ్ళ మీద పడుతుంది ఎంతో విలపిస్తోంది.ధ్యన్యమ్ లో నిమగ్యమై ఉన్న తులసీదాస్ 'దీర్ఘసుమంగళీభవ' అన్ని దీవించాడు దానితో ఆమె దీనంగా జరిగింది అంత తులసీదాస్ కు వివరించింది.అది విన్న తులసి దాస్ తల్లి నా నోట రాముడు ఎప్పుడు  అసత్యం పలికించాడు అని శవయాత్ర దక్కరకు వెళ్లి శవానికి కట్లు విప్పి రామనామాన్ని జపించి తన కమండలం లో నీళ్లను శవం మీద జల్లుతాడు వెంటనే ఆ యువకుడు పునర్జీవితుడు అయ్యాడు.ఆ మహాత్యమును చుసిన జనులు అందరు రామ భక్తులు అయ్యారు.అది చూసి మరియు చెప్పుడు మాటలు విన్న అక్బర్ తులసి దాస్ ను పిలిపించి అదే రామ నమ మహిమ తో సభ అందరి ముందు ఒక శవాన్ని తెప్పించి బ్రతికించమని చెప్పాడు.జనన మరణాలు నా చేతిలో ఉండవు అని శవాన్ని బ్రతికించలేను అని రాజు చెప్పిన దానిని దిక్కరించాడు తులసి దాస్ అందుకు రాజు జైలు లో పెట్టించి చిత్రహింసలు పెట్టారు 

మహా రామ భక్తుడు అయినా తులసి దాస్ ను అలా హింసలు పెడుతుంటే రామ భక్తుడు అయినా హనుమాన్ తన వానర సైనం తో అక్బర్ మహల్ పై దాడి చేసారు.వందల సంఖ్యలో వానరులని చూసి రాజ్యం లోని వారు అందరు హడిలిపోయారు.కారాగారం లో ఉన్న తులసి దాస్ ను విడిపించకపోతే విధ్వంసం తప్పుడు అని చెప్పారు అక్కడి పండితులు అక్బర్ కి.వెంటనే తులసి దాస్ ను విడిపించారు.తనని కాపాడానికి మహా బాల శాలి అయినా హనుమంతుడు వచ్చాడని గ్రహించాడు తులసీదాస్.అప్పుడు హనుమంతుడు మహాకాయుడు అయ్యి దర్శనం ఇచ్చాడు.

హనుమంతుడిని చుసిన ఆనందం లో తులసీదాస్ నలభై దోహాలు ఆశువుగా స్వామిని స్తుతించాడు .తులసీదాస్ చేసిన స్తోత్రం కి హనుమంతుడు ప్రసన్నం అయ్యి ఈ స్తోత్రం చదివిన వారికీ తాను రక్షగా ఉంటాను అన్ని చెప్పాడు. 

హనుమాన్ చాలీసాలో సూర్యుడు మరియు భూమి దూరం వెల్లడి చేయబడింది

హనుమాన్ చాలీసా వాస్తవంగా సూర్యుడు మరియు భూమి మధ్యలో ఉన్న దూరంను సమర్థంగా చెప్పుతుంది. కానీ అసలు శాస్త్రిక సూత్రం వేరే. వేగం (S) = దూరం (D) ÷ సమయం (T) అనే సామాన్య శాస్త్రిక సూత్రం ఉంది. రికార్డ్ల ప్రకార, 1672లో జాన్ రిచర్ మరియు జోవాన్నికో కాసిని భూమి మరియు సూర్యుడు ఉన్న దూరంను భూమి వ్యాసాల ప్రమాణంగా 22,000 

పన్నెండు వేల దివ్య మైళ్ల దూరంలో ఉన్న సూర్యుడు, మీరు దానిని (సూర్యుడిని) మింగడానికి ప్రయత్నించారు, ఇది ఒక తీపి ఫలంగా భావించి, ఇక్కడ, యుగం అంటే నాలుగు యుగాల (1 పూర్తి మహాయుగం) దైవిక సంవత్సరాలలో ఏకం అవుతుంది. .

సత్యయుగం = 4800 దివ్య సంవత్సరాలు

త్రేతాయుగం = 3600 దివ్య సంవత్సరాలు

ద్వాపరయుగం = 2400 దివ్య సంవత్సరాలు

కలియుగం = 1200 దివ్య సంవత్సరాలు

కాబట్టి, 1 దివ్య యుగం అంటే 12,000 దివ్య సంవత్సరాలు.

సంస్కృతంలో,  సహస్ర  అంటే 1000 మరియు 1  యోజన  అంటే దాదాపు 8 మైళ్లకు సమానం.

కాబట్టి, 12,000 x 1000 x 8 = 96,000,000 మైళ్లు.

శాస్త్రవేత్తల ఇటీవలి లెక్కల ప్రకారం సూర్యుడు మరియు భూమి మధ్య దూరం 92,960,000 మైళ్లు.

భూమి సూర్యుని చుట్టూ ఎలిప్టికల్ కక్ష్యలో తిరుగుతుంది కాబట్టి, ఈ దూరం రుతువులను బట్టి మారుతుంది. ఉత్తర అర్ధగోళంలో వేసవిలో, శీతాకాలంలో కంటే భూమి సూర్యుడికి దగ్గరగా ఉంటుంది.

హనుమాన్ చాలీసా లేదా ఏదైనా మహామంత్ర జపం అనేది ఉత్పాదక మనస్తత్వానికి సానుకూల ధృవీకరణ. మనందరికీ తెలిసినట్లుగా, వాంఛనీయ ఫలితాన్ని సాధించడానికి సానుకూల మనస్తత్వాన్ని సృష్టించేందుకు ధృవీకరణలు సహాయపడతాయి. 

కలియుగంలో  కోరికలు  తీర్చేదేముడయ్యా  ఈ  హనుమయ్య .....ఈ హనుమాన్ జయంతికి అందరు తప్పకుండ పదకొండు సార్లు కనీసం హనుమాన్ చాలీసా పాటించడానికి ప్రయత్నిచండి .అన్ని రకాల బాధలు,ఆరోగ్య సమస్యలు అన్ని తొలిగిపోతాయి 



శుక్రవారం, ఏప్రిల్ 19, 2024

ఒకపరి కొకపరి కొయ్యారమై

శుక్రవారం, ఏప్రిల్ 19, 2024

ఒకపరి కొకపరి కొయ్యారమై
పెద తిరుమలాచర్యుల రచన
రాగం:ఖరహరప్రియ  తాళం : ఆది

Okapari.MP3


ఒకపరి కొకపరి కొయ్యారమై
మొకమున కళలెల్ల మొలచినట్లుండె॥

జగదేకపతిమేన చల్లిన కర్పూరధూళి
జిగికొని నలువంక చిందగాను
మొగి చంద్రముఖి నురమున నిలిపెగాన
పొగరు వెన్నెల దిగబోసి నట్లుండె॥

పొరిమెరుగు చెక్కుల పూసిన తట్టుపునుగు
కరగి ఇరుదెసల కారగాను
కరిగమన విభుడు గనుక మోహమదము
తొరిగి సామజసిరి తొలికినట్లుండె॥

మెరయ శ్రీవేంకటేశుమేన సింగారముగాను
తరచైన సొమ్ములు ధరియించగా
మెరుగు బోడి అలమేలు మంగయు తాను
మెరుపు మేఘము గూడి మెరసినట్లుండె॥

గురువారం, ఏప్రిల్ 18, 2024

మా అమ్మమ్మ రిసిపీ ఇంగువ మిరపకాయలు నాకు నేర్పించింది

గురువారం, ఏప్రిల్ 18, 2024


ఇది మా అమ్మమ్మ రిసిపీ నాకు నేర్పించింది ఇంగువ మిరపకాయలు రిసిపీ: 

కావలిసిన పదార్థాలు :
ఎండు మిరపకాయలు - 5 
నూనె                          - అర కప్పు
ఇంగువ                       - చిటికెడు
 
 విధానం:
 ముందుగా ఎండు మిరపకాయలు ముచుకులు తీసి పెట్టుకోవాలి. స్టవ్ వెలిగించి ముందుగా బాండి పెట్టుకొని అందులో నూనె వేడిచేసుకొని అందులో 3 చిటికెలు ఇంగువ పొడి వేసి తరువాత ఎండుమిరపకాయలు కూడా వేసి వేయించుకోవాలి. మిరపకాయలు ఎర్రగా వేయించుకోవాలి. స్టవ్ ఆపివేసుకొని మిరపకాయలని నూనెలోనే వుండనివ్వాలి. నూనెను బాగ పీల్చుకొని. రుచిగా వుంటాయి. ఏదైనా పప్పు లేదా పప్పుకూరలలో అన్నంతో పాటు నంచుకుని తింటే అధిరిపోతుంది అంతే.ఇది నిల్వ పచ్చడిలో కూడా ఎంతో రుచిగా ఉంటుంది మరి మీరు కూడా చేసుకుని చుడండి 



My Blog Lovers

నా యూట్యూబ్ చానల్స్ ప్లీజ్ సబ్స్క్రిబ్ చేయండీ

Diabetic Challenger

DIABETIC CHALLENGER YOUTUBE CHANNEL. PLASE SUBSCRIBE MY CHANNEL...... THANK YOU VERY MUCH.

Ammamma Tho Nenu (అమ్మమ్మ తో నేను

Please subscribe our channel Ammamma Tho Nenu (అమ్మమ్మ తో నేను)