అమ్మమ్మలు, నాయనమ్మలు చిన్నపిల్లలకు బోజనము పెట్టి వారి పొట్టను మెల్లిగా రాస్తూ
జీర్ణంజీర్ణంవాతాపిజీర్ణం అంటూ వుంటారు. అలా అనేదాని వెనకాల ఒక కదా వుంది. ఆ కధే
జీర్ణంజీర్ణంవాతాపిజీర్ణం.
1930 లో,
ఎండర్స్ Ph.D. యొక్కపట్టాపుచ్చుకున్నాడుహార్వర్డ్వద్దక్షయబాసిల్లేక్రిములనుండివిడివడినరసికరకంబాక్టీరియాఅనాఫిలాక్సిస్నుమరియుతీవ్రసున్నితత్వంగాప్రత్యేకమైనవిషయాలుతెలుసుకొనివాటినిఆధారంలతోఒకథీసిస్కోసంసమర్పించారు .
1930 నుండి
1946 వరకు, ఎండర్స్బోధనాసిబ్బందిసభ్యుడిగాహార్వర్డ్వద్దఉండిపోయినారు. ఈకాలంలోఅతను, మొదటి, బాక్టీరియా,
వైరస్వల్లకలిగినవ్యాధియొక్కతీవ్రతమరియుహోస్ట్జీవియొక్కప్రతిఘటనసంబంధించినకొన్నికారకాలువివరాలపైఅధ్యయనంచేసారు. నిర్దిష్టప్రతిరక్షకంద్వారాబ్యాక్టీరియా opsonization ఒకఉత్ప్రేరక-వంటివిపెంచివాటిఆధారంతోపోలిసాకరైడ్మరియుఉత్పత్తిపద్ధతియొక్కఒకకొత్తరూపంకనుగొన్నారు.
1946 లో,
ఎండర్స్బోస్టన్వద్దపిల్లలమెడికల్సెంటర్వద్దఅంటువ్యాధులులోపరిశోధనకోసంఒకప్రయోగశాలఏర్పాటుకోరారు. మనిషియొక్కవైరల్వ్యాధులుఈప్రయోగశాలచాలాఉద్భవించినమిగిలిఉన్నపనితనఆధ్వర్యములోజరిగిందిమరియుఅది Th వెల్లెర్మరియు FC రాబిన్స్, నోబెల్కలిసి, పనిఎండర్స్లభించిందిఇదికోసంపోలియోవ్యాధివైరస్యొక్కసాగుచేయబడుతుందిఅనిఇక్కడఉంది 1954 లోజీవశాస్త్రంలేదామెడిసిన్కోసంబహుమతి.
1949లోజాన్ఫ్రాన్క్లిన్ఎండర్స్, థామస్హెచ్.వెల్లర్మరియుఫ్రెడరిక్చాప్మన్రాబిన్స్కలిసిపోలియోవైరస్నుసజీవమయినజంతుకణాలకల్చర్లోపెంచారు. అప్పటినుంచివారిపద్దతిలోచిన్నాచితకామార్పులుచేస్తూమిగతావైరస్లనుకూడాసెల్కల్చర్లలోపెంచడంమొదలయింది. ఇదేపోలియోవాక్సిన్కనుక్కొటానికినాందిఅయ్యింది. ఈయన నిరంతరము ఏదో సాధించాలి అన్నట్టు జీవితాన్ని సాగించారు.
1931 వ సంవత్సరము ఫిబ్రవరి 10 న కొత్త ఢిల్లీ నగరం అధికారికంగా ప్రారంభించబడింది.
బ్రిటిష్ రాజ్య పరిపాలన కాలంలో డిసెంబరు 1911 వరకూ భారత రాజధానిగా కలకత్తా నగరం వుండేది. కొన్నాళ్ళు తరువాత రాజధానిని ఢిల్లీకి మార్చబడినది. ప్రాచీనకాలం నుండి ఢిల్లీ రాజకీయ కేంద్రముగా వుంటూ వస్తున్నది. ప్రత్యేకంగా మొఘల్ సామ్రాజ్య కాలం నుండి మరీ ముఖ్యంగా 1799 నుండి 1849 వరకూ ఢిల్లీ కేంద్రంగా వుంటూ వచ్చింది. 1900 ప్రారంభంలో బ్రిటిష్ పరిపాలనా కాలంలో భారత రాజధానిని, కలకత్తా నుండి ఢిల్లీ కి మార్చాలనే ప్రతిపాదన వచ్చింది. కలకత్తా భారత్ కు ఈశాన్య దిశలోనూ, భారత్కు చెందిన అనేక ప్రాంతాలకు చాలా దూరంగా వుండేది. ఈ కారణాన బ్రిటిష్ రాజ్ పరిపాలనా సౌలభ్యం కొరకు రాజధానిని ఢిల్లీకి మార్చడమే ఉత్తమమని భావించింది. అప్పటి భారత చక్రవర్తి 5వ జార్జి, యునైటెడ్ కింగ్డం, భారత రాజధాని, కలకత్తా నుండి ఢిల్లీ కి మార్చాలని ప్రకటించాడు.
అష్టావదానము అన్నపదము వినేవుంటారు కదా. ఇది తెలుగు సాహిత్యంలో ఒక ప్రత్యేకమైన విశిష్టత కలగిన ప్రక్రియ, ఈ ప్రక్రియ సంస్కృతంలో ను తెలుగులోనూ బాగా పరిచయము వున్నది. మా తాతగారు చింతా. రామకృష్ణా రావు గారు చాలా వివరముగా వివరించారు. మీరు కూడా తెలుసుకోవాలని కుతూహలముగా వుందా. అయితే సింపుల్ గా చెప్పెయలంటే.
అవధానం అనేది తెలుగు సాహిత్యం లో ఒక విశిష్ట ప్రక్రియ సంస్కృతము, తెలుగు కాకుండా వేరే ఏ యితర భాషలోనుఈ ప్రక్రియ ఉన్నట్లు కనపడదు. క్లిష్టమైన సాహితీ సమస్యలను అలవోకగా పరిష్కరిస్తూ, చమత్కార పూరణలను అవలీలగా పూరిస్తూ, అసంబధ్ధ, అసందర్భ ప్రశ్నలను సమర్ధంగా ఎదుర్కొంటూ, ఆశువుగా పద్యాలు చెప్పుతూ అవధాని సభాసదులనలరింప జేయడం అన్నది అవధాని ప్రత్యేకత.వీటన్నిటినీ ఏక కాలంలో అవధాని చేసే సాహితీ విన్యాసమే అవధానం.
అష్టావధానముఅనే సాహిత్య ప్రక్రియ తెలుగు భాష సొత్తా అన్నట్టు వుంటుంది. ప్రప్రంచంలో ఏ భాష లోను లేని ఈ అవధానంలొ ముఖ్యమైన వ్యక్తి అవధాని. అతను అపారమైన ఏకాగ్రత వున్న పండితుడు. విశేషమైన భాషా పాండిత్యం, సమయస్పూర్తి , కల్పనా చాతుర్యము , చమత్కారం వంటివి వారిలో వుంటుంది. అవధాని కలం కాగితం పట్టకూడదు. కేవలం తన ధారణ లేక జ్ఞాపక శక్తితో, మధ్య మధ్య ఏకాగ్రతను భంగపరస్తూ అప్రస్తుత ప్రసంగి వేసే వింత ప్రశ్నలకు సముచితంగా సమాధానం చెబుతూ, కవితా వ్యాసంగం కావించాలి. మద్యలో మద్యలో గంట కొడతారు అవి లెక్కపెట్టి ఎన్ని గంటలు కోటారో చెప్పాలి. చెప్పిన కవిత్వాన్ని , ధారణ చేసి అఖరి అంశంగా అన్ని ప్రశ్నల సమాధానాల్ని అప్పచెప్పవలెను. ఎనిమిది అంశాలపై జరిగే అవధానం అష్టావధానము.
ఇంకా పూర్తిగా తెలుసుకోవాలి అనుకుంటున్నారా అయితే ఇక్కడ చూడండి. మీకు పూర్తి సవివరంగా తెలుస్తుంది.
ఇలాంటి అవదానాన్ని ప్రత్యక్షముగా చూస్తే చాలా తమాషాగా వుంటుంది. టీవీ లో చూసే వుంటారు ఈ అష్టావదానము. టీవీ లో కంటే ప్రత్యక్షముగా చూడటం చాలా బాగుంటుంది. మీకు వీలయితే మీరు చూడటానికి ప్రయత్నం చేయండి. దీని మీరు చూసారంటే మన తెలుగు భాషకు వున్నా ప్రత్యేకత మీకు తెలుస్తుంది.
భగవంతుని పొందుటకు భక్తులు ఆచరించే పద్దతి భజన. శ్రీ అన్నమాచార్యులవారు రచించిన భజన కీర్తనలలో చాలా గొప్పగా ప్రసిద్ధి చెందినది ఈ కీర్తన. అన్నమాచార్యులువారు ఈ కీర్తనలో వెంకటేశ్వర స్వామివారిని చాలా రకాలుగా కొనియాడారు. అందులోనే శరణు వెడుతున్నాడు. ఈ కీర్తన నేర్చుకోటానికి చాలా సులువుగా వుంటుంది. చిన్నపిల్లలకుడా సులువుగా వస్తుంది అనటంలో సందేహమే లేదు.
ధర్మో రక్షతి రక్షితః అనే వాక్యం అందరికి తెలిసినదే ఆ పదము ఎక్కడిది అంటే వాల్మీకి రచించిన రామాయణంలోని ఒక శ్లోకంలోనిది. ఈ వాఖ్యము ప్రజా ప్రాముఖ్యం పొందిన వాక్యాలలో ఇది ఒకటి. ఈ వాక్యం యొక్క అర్ధం "ధర్మాన్ని మనం రక్షిస్తే ఆ ధర్మం మనల్ని రక్షిస్తుంది".
ధర్మో రక్షతి రక్షితః అనే అర్యొక్తిని అనుసరించి ధర్మముని మనం కాపాడితే ఆ ధర్మం మనల్ని కాపాడుతుంది. ఇట్టి ధర్మాన్ని మనం ఎలా ఆచరించాలి, స్వధర్మ ఆచరణ యందు ఎట్టి నిష్ట కలిగి ఉండాలి అనే విషయాలను తెలియపరుస్తూ మానవుడి మనుగడను తీర్చి దిద్దడానికి ఏర్పడినవి. ప్రస్తుత కాలమానము ప్రకారము ధర్మము ఎక్కడుంది. ఎలావుంటుంది. అప్పుడు వాల్మికీగారు ధర్మాన్ని ఎలావుంటుంది అంటే రామో విగ్రహాన్ ధర్మః (మూర్తీభవించిన ధర్మమే రాముడు ) అని అన్నారు . మరి ఈ కాలములో ధర్మము ఎలావుంది. ఎక్కడుంది. సరే అది వదిలైయండి. ప్రస్తుతము ఈ వాక్యములో అన్నట్టు ధర్మో రక్షతి రక్షతః అన్నట్టు. ధర్మము ను మనము కాపాడితే , ఆ ధర్మము మనలను కాపాడుతుందా అన్నది నా ప్రశ్న మీకు వీలు అయితే కాపాడుతుంద లేదా అన్నది చెప్పండి.
జీవులు ఆక్సిజన్ లేకుండా ఒక్క నిమిషము కంటే ఎక్కువ వుండలేరు. కారణము మెదడులోని కణాలకు ఆక్సిజన్ అవసరము. అలా ఆక్సిజన్ సరిగా అందకపోతే కొద్ది నిముషములలోనే స్పృహ కోల్పోతారు. కొంతమందికి ఉపిరి సరిగా పిల్చుకోలేక ఇబ్బంది పడతారు. అప్పుడు హాస్పిటల్స్ లో కృత్రిమ ఆక్సిజన్ అందిస్తారు కదా. ఆ ఆక్సిజన్ కనుకున్నతను జోసెఫ్ ప్రీస్ట్లీ. అతని గురించి తెలుసుకుందాం. భూమి మీద జీవులందరికీ అత్యవసరం ఈ వాయువు చాలా అవసరం దీనిని మన వాడుక భాషలో ఆమ్లజని అంటాం. ఆక్సిజన్ ను మొట్ట మొదట కనుక్కొన్నది ఎవరో తెలుసా అతనే జోసెఫ్ ప్రీస్ట్లీ (మార్చి 13, 1733—ఫిబ్రవరి 6, 1804) 18వ శతాబ్దానికి చెందిన ఆంగ్ల శాస్త్రవేత్త, తత్వవేత్త, రాజనీతిజ్ఞుడు. ప్రీస్ట్లీ చాలా Gases ను కనుక్కొన్నారు వాటిలో వాతావరణంలో సహజంగా కొద్దిగా మాత్రమే లభించే ఆక్సిజన్ను ప్రయోగశాలలో కృత్రిమంగా తయారు చేసే విధానాన్ని కనుగొన్నది ఈయనే. కార్బన్డయాక్సైడును కృత్రిమంగా చేయడాన్ని కనిపెట్టింది కూడా ఈయనే. ఇవే కాదు కార్బన్ మోనాక్సైడు( CO), నైట్రస్ ఆక్సైడు (Laughing Gas ) లను కూడా ఈయనే ఆవిష్కరించారు. ప్రీస్ట్లీ కనుక్కొన్నవాటిలో ముఖ్యమైనది ఆక్సిజన్. ఆక్సిజన్ కు "dephlogisticated air" అని పేరు పెట్టారు.
ఇంగ్లండ్లోని లీడ్స్ నగరానికి దగ్గర్లోని ఓ గ్రామంలో 1733 మార్చి 13న పుట్టిన జోసెఫ్ ప్రీస్ట్లీ ఏడాదికే తల్లిని, ఏడేళ్లకల్లా తండ్రిని కోల్పోయి అనాథయ్యాడు. మేనత్త దగ్గర పెరుగుతూ ఫ్రెంచ్, ఇటాలియన్, జర్మన్, అరబిక్ భాషలపై పట్టు సాధించాడు. పట్టభద్రుడయ్యాక చర్చిలో పాస్టర్గా చేరాడు. ఆదాయం చాలక ఓవైపు ట్యూషన్లు చెబుతూనే ఇంగ్లిషు గ్రామర్పై పుస్తకం రాశాడు. ఫలితంగా ఒక అకాడమీలో టీచర్గా అవకాశం వచ్చింది. అక్కడే రసాయన శాస్త్రంపై మక్కువ పెరిగి ప్రయోగాలు చేయసాగాడు.
ప్రఖ్యాత శాస్త్రవేత్త బెంజిమెన్ ఫ్రాంక్లిన్ ఇంగ్లండు పర్యటనతో స్ఫూర్తి పొంది విద్యుత్పై అధ్యయనం చేసి 'History and present of electricity'అనే గ్రంథాన్ని ఆయన రాయడం విశేషం. ఇందుకు గుర్తింపుగా Royal Society Fellow గా ఎంపికయ్యారు. జీవితకాలంలో ఆయన మొత్తం 150 పుస్తకాలు రాశారు. మరోవైపు రాజకీయాలపై ముఖ్యంగా ఫ్రెంచి విప్లవంపై ఆసక్తిని పెంచుకున్నారు. ఆయన భావాలతో ఏకీభవించని ప్రత్యర్థులు ఆయన ప్రయోగశాలపై చేసిన దాడి వల్ల 20 ఏళ్ల పరిశోధన పత్రాలు దగ్ధమయ్యాయి. దాంతో America వలస వెళ్లి అక్కడే వాయువులపై పరిశోధనలు చేశాడు. అమెరికా Northumberland County, Pennsylvania లో ఆయన ప్రయోగశాలను నేషనల్ మ్యూజియంగా ప్రకటించారు.