Blogger Widgets

శుక్రవారం, జులై 20, 2012

అలెగ్జాండర్ ద గ్రేట్ మూడు కోరికలు.

శుక్రవారం, జులై 20, 2012

అలెగ్జాండర్ ద గ్రేట్ అన్న పదం మనం సాదారణంగా వినేవుంటాం.  ఆయన గొప్ప గ్రీకు చక్రవర్తి.  అతనికి యంగ్ టైగర్ తో పోలుస్తారు.  అతి చిన్నవయస్కుడు అయిన గొప్ప చక్రవర్తి.   మెగాస్ అలెగ్జాండ్రోస్, జులై 20, క్రీ.పూ. 356 - జూన్ 11, క్రీ.పూ. 323 మద్య కాలంలో జన్మించారు.  ఈరోజు అలెగ్జాండరు పుట్టిన దినము. గ్రీకు దేశములోని మాసిడోనియా రాజ్యాన్ని పరిపాలించిన రాజు. ఇతను చనిపోయే సమయానికి, అప్పటి పురాతన గ్రీకులకు తెలిసినంతవరకు భూమిని ఆక్రమించుకున్నాడు.  క్రీ.పూ 326 వ సంవత్సరంలో అలెగ్జాండర్ భారతదేశంపై దండయాత్ర చేశాడు. సింధూ నదిని దాటి తక్షశిల నగరం వైపుగా చొరబడ్డాడు. జీలం మరియు చీనాబ్ నదుల మధ్య గల రాజ్యాన్ని పరి పాలిస్తున్న పురుషోత్తముడు అనే రాజును యుద్ధానికి ఆహ్వానించాడు. అయితే ఆ సమయము లొ అప్పటికే యుద్దం చేసి అలెగ్జాండర్ సైనికులు అలసిపోతారు.  అలెగ్జాండర్ సైన్యధిపతి వచ్చి మన సైనికులు అందరూ అలసిపొయారు ఇక యుద్దము  చేయలేరని తెలియచేస్తాడు. అంతే కాదు పురుషొత్తముని సైనిక బలం కుడా అధికంగానే ఉంది వారిని ఎదుర్కొనే శక్తి మన సైనికులకు లేదని తెలియచేస్తాడు. ఈ విషయమ్ తెలుసుకొని కొన్ని రొజుల పాటు విశ్రాంతి తీసుకొని వెళిపొతాడు. ఇంకా ఆయన భారతదేశ సందర్శనలో ఎందరో భారతీయ తత్వవేత్తలను, బుద్ధి బలానికి ప్రఖ్యాతి గాంచిన బ్రాహ్మణుల్ని కలిశాడు. వారితో సంవాదం చేశాడు. కొందరిని వారి దేశానికి రమ్మని ఆహ్వానం కూడా పంపాడు.  అలెగ్జాండర్ తో యుద్డంచేయకుండానే చాలా మంది రాజులు లొంగిపోయారు వారిలో తక్షశిలాదీసుడైన అంభి ఒక్కరు.  అలెగ్జాండర్ కి మనదేశం అంటే మంచి అభిప్రాయం వుండేది అతని చివరి కోరిక ఒకటి వుంది.  అది ఏమిటి అంటే హిమాలయాలను దాటి వచ్చి కాశ్మీర్ మన భారత దేశపు చివరను చూడాలి అనే కోరిక వుండేది.  అయితే ఆకోరిక నెరవేరలేదు.   అలెగ్జాండర్ చాలా రాజ్యాలను జయించిన తర్వాత ఇంటికి తిరిగి వెళుతున్నాడు.మార్గమధ్యంలో తీవ్ర అనారోగ్యానికి గురై మరణ శయ్యపై చేరాడు. తాను మరణించడం తథ్యమని అలెగ్జాండర్ కు అవగతమైపోయింది.తాను సాధించిన గొప్ప గొప్ప విజయాలు, అమిత శక్తిశాలురైన సైన్యం, అంతులేని సంపద తన్ను మరణం నుంచి దూరం చేయలేవని తెలుసుకున్నాడు.  తనకు ఇంటికి వెళ్లిపోవాలి అనే కోరిక కలిగింది. తన తల్లికి కడసారిగా తన ముఖాన్ని చూపించి చనిపోవాలన్న కోరికతో  ఇంటిముఖం పట్టాడు . కానీ తను ఇంటికి చేరే వరకు తన ప్రాణాలు ఆగలేదు చనిపోయేముందు  తన సైన్యాధికారులను దగ్గరికి పిలిచి ఇలా అన్నాడు.
“నేనింక కొద్దిసేపట్లో ఈ లోకం నుంచి నిష్క్రమించబోతున్నాను. నాకు చివరగా మూడు కోరికలున్నాయి. ఎట్టి పరిస్థితుల్లోనూ వాటిని నెరవేర్చకుండా విస్మరించకండి.” అని వారి నుండి వాగ్ధానం తీసుకున్నాడు.
అశ్రు నయనాలతో కడసారిగా తమ రాజు గారి ఆజ్ఞను వినమ్రంగా అంగీకరించారు ఆ అధికారులు.
నా మొదటి కోరిక: ” నా శవ పేటికను కేవలం నా వైద్యులు మాత్రమే మోయాలి”
రెండవ కోరిక: “నా పార్థివ దేహం స్మశానానికి వెళ్ళే దారిలో నేను సంపాదించిన విలువైన వజ్రాలు, మణి మాణిక్యాలు పరచండి”
మూడవ కోరిక: “శవపేటిక లో నుంచి నా ఖాళీ చేతులు బయటికి కనిపించే విధంగా ఉంచండి”
చుట్టూ మూగి ఉన్న సైనికులు ఆయన విచిత్రమైన కోరికలు విని ఆశ్చర్యపోయారు.కానీ వారిలో ఎవ్వరికీ ఆయన్ను అడిగే ధైర్యం లేకపోయింది. అలెగ్జాండర్ కు అత్యంత ప్రీతి పాత్రుడైన ఒక సైనికుడు ఆయన కోరికలను తప్పక నెరవేరుస్తామని మాట ఇచ్చాడు. ఈ కోరికల వెనక ఆంతర్యమేమిటో సెలవియ్యమని అడిగాడు.  అలెగ్జాండర్ అతి కష్టమ్మీద ఇలా అన్నాడు. “ఈ మూడు కోరికలు నేనిప్పుడే నేర్చుకున్న మూడు పాఠాలకు ప్రతిరూపాలు.”

“మొదటి కోరికలో నా ఆంతర్యం, నిజానికి ఏ వైద్యుడూ మరణాన్ని ఆపలేడు . ఒకవేళ వైద్యం చేసినా వల్లకాటి వరకే.” అని చెప్పడానికి.

“రెండవ కోరికలో నా ఆంతర్యం, నా జీవితంలో సింహ భాగం సంపదను కూడబెట్టడానికే సరిపోయింది.అదేదీ నా వెంట తీసుకెళ్ళలేక పోతున్నాననీ, కేవలం సిరిసంపదల వెంటబడి విలువైన సమయాన్ని, జీవితంలో మాధుర్యం కోల్పోవద్దని చెప్పడానికి”

“మూడవ కోరికలో నా ఆంతర్యం ఈ ప్రపంచంలోకి నేను వచ్చేటపుడు వట్టి చేతులతో వచ్చాను. ఇప్పుడు వట్టి చేతులతోనే వెళ్ళిపోతున్నాను అని చెప్పడానికే ”  అని చెప్పి కన్ను మూశాడు.

అలెగ్జాండర్ రాజ్యకాంక్ష గల గొప్ప చక్రవర్తి అయినా మనభారతదేశంలో అడుగుపెట్టే సరికి ఎంత మార్పువచ్చిందో కదా.  ఆయన చనిపోయిన తరువాత ఆయన శవం పాడవకుండా తేనెలో వుంచి చేతులు బయటికి వుంచి అలేగ్జండర్ చివరి కోరికలను  సైనికులు నెరవేర్చారు. 

జన్యుశాస్త్రానికి ఆద్యుడు

ఈరోజు నాకు చాలా ఇష్టం అయిన శాస్త్రవేత్త పుట్టినరోజు.  ఆయన ఎవరో తెలుసుకుంటారా.  ఈరోజు 1822 జులై 20 న  జన్యు శాస్త్రానికి ఆద్యుడు  గ్రెగర్ జాన్ మెండెల్ జన్మదినము.  ఈయన  ఆస్ట్రియా సన్యాసి, వృక్షశాస్త్రజ్ఞుడు. 'లాస్ ఆఫ్ హెరెడిటీ' జీవుల అనువంశికత సూత్రాలు కనుగొన్నాడు. చిన్నప్పుడు తోట పని చేశాడు. తేనెటీగలు పెంచాడు. పెద్దయ్యాక మతబోధకుడిగా స్థిరపడ్డాడు. అయినా నిరంతర అధ్యయనం, పరిశీలనల వల్ల శాస్త్రవేత్త అయ్యాడు. ఆయన చేసిన పరిశోధనను ఆయన జీవించి ఉండగా ఎవరూ పట్టించుకోలేదు. కానీ ఆయన కనుగొన్న సూత్రాలు ఆయన మరణానంతరం ఓ కొత్త శాస్త్రం ఆవిర్భావానికి నాందిగా నిలిచాయి. వంశపారంపర్యంగా వచ్చే లక్షణాలపై ప్రయోగాలు చేసి తర్వాతి కాలంలో 'ఫాదర్‌ ఆఫ్‌ జెనెటిక్స్‌'గా కీర్తి పొందిన ఆ శాస్త్రవేత్తే జోహన్‌ గ్రెగర్‌ మెండెల్‌.  అప్పటి ఆస్ట్రియాలోని మొరావియాలో ఓ రైతు కుటుంబంలో పుట్టిన జోహన్‌ గ్రెగర్‌ బాల్యమంతా తండ్రి వెంట పొలాల్లో గడిచింది. తోటలు, తేనెటీగల పెంపకంలో చురుగ్గా ఉండే అతడికి ప్రకృతి అధ్యయనం, సునిశిత పరిశీలన సహజంగానే అలవడ్డాయి. హైస్కూలు కోసం పట్నానికి వెళ్లినా తండ్రికి జరిగిన ప్రమాదం వల్ల తిరిగి రావడంతో చదువుకు ఆటంకం ఏర్పడింది.ఆపై ఉపాధ్యాయుడి సలహాపై క్రైస్తవ సన్యాసిగా మారడానికి నిర్ణయించుకుని మఠంలో చేరాడు. ఆ విధంగా 21వ ఏటనే 'గ్రిగర్‌' పేరును స్వీకరించి మఠాధిపతిగా మారాడు. సైన్స్‌ పట్ల అభిరుచితో ఎన్నోపుస్తకాలు చదివేవాడు.  మఠంలోని తోటలో బఠానీ మొక్కలపై ఉత్సుకతతో ఆయన చేసిన పరిశోధన ఫలితాలే వంశపారంపర్య సిద్ధాంతానికి  మూల సూత్రాలుగా తర్వాతి కాలంలో పేరొందాయి. ఈ మొక్కల్లో పొడుగు, పొట్టి రకాలకు అంట్లు కట్టి, వాటిని కొన్ని తరాల పాటు పెంచి, ఏ తరానికి ఆ తరం వాటి లక్షణాలను నమోదు చేసుకుంటూ తన పరిశీలనలను సూత్రీకరించగలిగాడు. దాదాపు 30,000 మొక్కలపై ఆయన జరిపిన ప్రయోగాలే మెండల్‌ నియంత్రణ నియమం , ఖండీకరణ నియమం గా పేరొందాయి.  మనుషుల్లో తరతరాల్లో కనిపించే పోలికలు, లక్షణాలు ఎలా సంక్రమించే అవకాశం ఉందనే విషయాలను కూడా ఈ సూత్రాలు విశదీకరించగలిగాయి.దాదాపు 30 ఏళ్ల తర్వాత వంశపారంపర్యతపై పరిశోధనలు చేసిన కొందరు శాస్త్రవేత్తలు, జోహన్‌ సూత్రాలను చదివితే కానీ తాము పొందిన ఫలితాలను అర్థం చేసుకోలేకపోయారంటే ఇవెంత ప్రాముఖ్యతను పొందాయో తెలుస్తుంది.  జన్యుశాస్త్రం  వివిధ ప్రయోగాలతో కూడిన, జీవులకు సంబంధించిన ఆధునిక శాస్త్రం. జెనెటిక్స్ , జీవశాస్త్రంలో ఒక ముఖ్యమైన విభాగం. ఇది జీవుల అనువంశికత కు సంబంధించిన శాస్త్ర విజ్ఞానం.
20వ శతాబ్దం వరకు తల్లిదండ్రులు పిల్లల్లో కనిపించే తమ లక్షణాలకు తమ రక్తమే కారణమని భావించేవారు. కానీ తల్లిదండ్రుల లక్షణాలు పిల్లలకు సంక్రమించడాన్ని అనువంశికత అంటారని, దానికి కారణం జన్యువులనీ ప్రముఖ శాస్త్రవేత్త గ్రెగర్ జాన్ మెండల్ తెలిపాడు.జన్యువులు డి.ఎన్.ఎ. నిర్మాణంలోని నిర్ధిష్ట ప్రదేశాలు. ఇవి క్రోమోజోములలో ఉంటాయి.
 
మెండల్ అనువంశిక సిద్ధంతములు:
సంయోగ బీజాల శుద్ధతా సిద్ధాంతం: సంకరంలో కలిసివుండే రెండు యుగ్మ వికల్పాలు సంయోగబీజాలు ఏర్పడేటప్పుడు క్షయకరణ విభజన ద్వారా విడిపోయి వేర్వేరు సంయోగ బీజాల్లోకి ప్రవేశిస్తాయి. అందువలన శుద్ధమైన సంయోగబీజాలు ఏర్పడతాయి.
స్వతంత్ర వ్యూహన సిద్ధాంతం: రెండు లేదా అంతకంటే ఎక్కువ జతల లక్షణాలున్న ఒకే జాతికి చెందిన రెండు మొక్కల మధ్య సంకరణం జరిపినప్పుడు, ఒక జత లక్షణాలు (జన్యువులు) ఇంకొక జత లక్షణాలతో సంబంధం లేకుండా సంయోగబీజాల్లోకి పంపిణీ అవుతాయి.
ఈయన గురించి తెలుసుకోవటం చాలా సంతోషం గా వుంది.  మనబ్లాగ్ ద్వారా ఈ గొప్ప శాస్త్రవేత్త కు నివాళి అర్పిస్తున్నాం.

గురువారం, జులై 19, 2012

రంగులముగ్గులు ముంగిటనిలిచి రమ్మనిపిలిచినవీ

గురువారం, జులై 19, 2012

ఆషాడ మాసం వెళ్ళిపోయి శ్రావణమాసం వచ్చేసింది.  అందరి ఇళ్ళల్లోను హడావిడి.  ఎందుకు ఈ హడావిడి.  శ్రావణమాసం అంటే అందరికి ఇష్టం కాబట్టి.  శ్రవణమాసం అంటే ఇళ్ళలో పూజలు, వ్రతాలు నోములు చేసుకుంటారు కదా.  అసలు ఈ శ్రావణ మాసం అని ఎందుకు పేరు వచ్చిందో మీకు ఎప్పుడైనా సందేహం వచ్చిందా ? నాకు అయితే వచ్చింది అయితే అది తెలుసుకునే ప్రయత్నం చేశా అప్పుడు అమ్మమ్మ తన పని చేసుకుంటూ నాకు చెప్పింది.  అది ఏమిటి అంటే  మనయొక్క మొరలని ఆలకించేందుకు ఆ తల్లిని (లక్ష్మీదేవి) సిద్దపరిచే మాసం కనుకనే శ్రావణం అని పేరు వచ్చింది . మన మొరలని ఆలకించే సమయం, శ్రవణ సంబంధమైన మాసం శ్రావణము. ఈ మాసంలో అమ్మ మనకు ఏకాంతంగా లభిస్తుంది.  ఆషాడ మాస ఏకాదశి వరకు స్వామితో నిరంతరం ఉండే తల్లి పాలకడలిలో స్వామిని యోగ నిద్రలో పవళింపజేసి జగత్ రక్షణ ఎట్లా చేయాలో ఆలోచించుకోవడానికి కావల్సిన సమయాన్ని ఆయనకు ఇవ్వడానికి స్వామికి విశ్రాంతినిచ్చి అమ్మ బయలుదేరుతుంది. తరువాత వచ్చే మాసమైన శ్రావణ మాసంలో అమ్మ అందరి మొరలు వినడానికి అందుబాటులోకి వస్తుంది. అందుకే అమ్మను ఆరాధన చేస్తుంటారు. శ్రావణ మాసం అంతా అమ్మను ఆరాధన చేయడానికి వీలైన సమయం. ప్రక్కన స్వామి లేనప్పుడు మన భాదలను అమ్మతో ఒంటరిగా చెప్పుకోవడానికి అవకాశం ఉంది.  ఆ అమ్మ దయకోసం మనం ఎంతో ప్రయత్నం చేయాలి.  ఆ అమ్మకు అనేక రకాల పేర్లు ఉన్నట్లు మనం గ్రంథాల్లో చూస్తున్నాం. ఆమె కి వెయ్యి పేర్లు వున్నాయి.  ఆమెకి లక్ష్మీ అని పేరు. శ్రీ అని పేరు. ఇందిరా అని పేరు. లోక మాతా, రమా, మంగళ దేవతా అని ఇలా ఎన్నేన్నో పేర్లు. అయితే ప్రసిద్దమైన పేర్లు 'లక్ష్మీ' మరియూ "శ్రీ", ఇవి వేదం చెప్పిన పేర్లు.  అమె చేసే ఉపకారాలను బట్టి ఎన్నెన్నో పేర్లు చెప్పినా "హ్రీశ్చతే లక్ష్మీచ పత్-న్యౌ" లేక "శ్రీ భవతు " అంటూ వేదం చెబుతుంది. అందుకే భగవంతుణ్ణి గుర్తించేప్పుడు ఆయనలోని దయాది గుణాలను పైకి తెచ్చే నామంతో గుర్తించాలి. అందుకే ఆయనని శ్రీపతి లేక శ్రియపతి అని పిలుస్తుంటారు. లేదా లక్ష్మీనాథా అని పిలుస్తుంటారు. ఆయనకంటూ నారాయణ, విష్ణు అనే ఎన్నో నామాలు ఉన్నప్పటికీ ప్రచురంగా కనిపించే నామం శ్రీపతి అనో లేక లక్ష్మీనాథా అనో. ఆవిడ సంబంధం ద్వారా వచ్చిన నామాలు కనుక. అంటే ఆమె ఆయనలో పెంచిన దయ ద్వారా మనల్ని గుర్తిస్తాడు అని భావిస్తాం.  మరి ఇలాంటి శ్రవణమాసపు  మహాలక్ష్మి కి స్వాగతం పలుకుదాం.  ఈ పాట  ద్వారా ఎలా స్వాగతం పలకలో చూడండి  మరి .
                         
రంగుల  ముగ్గులు ముంగిట నిలిచి రమ్మని పిలిచినవీ
వాకిట నిలిచినా తోరనమాలలు స్వాగతమోసగినవి 

అనేకవిదాలుగా శ్రావణ లక్ష్మి దేవికి స్వాగతము పలుకుతున్నది.  మరి ఇదే సంధర్బములో మన బ్లాగ్ మిత్రులందరి కోరికలు అమ్మ తప్పకుండా విని .  వారికోరికలు నెరవేర్చాలని అమ్మని నేనుకూడా కోరుకుంటున్నాను.  అందరికి శ్రావణమాసం శుభాకాంక్షలు.

మంగళ్ పాండే జయంతి

రవి అస్తమించని బ్రిటీష్ సామ్రాజ్యంలో తిరుగుబాటు పతాకమును ఎగురవేసిన మంగళ్ పాండే జయంతి నేడు 1827, జూలై19న ఉత్తరప్రదేశ్ లోని బలియా జిల్లా నాగ్వ గ్రామంలో మంగళ్ పాండే జన్మించారు.
బెంగాల్ నేటివ్ ఇన్ ఫాంట్రీలో ఒక సాధారణ సిపాయిగా పనిచేసిన మంగళ్ పాండే 1857ప్రథమ భారత స్వాతంత్ర్య పోరాటాని నాంది పలికాడు. మంగళ్ పాండే 34 వ బ్రిటిష్ బెటాలియన్ లో పనిచేసిన అతిచిన్న వయస్సు గల బ్రాహ్మణ యువకుడు .   మంచి సాహసవంతుడు అయిన  పాండే తన 22వ ఏట ఈస్ట్ ఇండియా కంపెనీ సైన్యం బి.ఎన్.ఐలో చేరాడు. 1857, మార్చి 29న కలకత్తాలో బ్రిటీష్ సార్జెంట్ పై మంగళ్ పాండే దాడిచేయడంతో సిపాయిల తిరుగుబాటు మొదలైంది.అప్పట్లో బ్రిటిష్ వారు  పి.53 రైఫిల్ తూటాలో ఆవుకొవ్వు నింపుతున్నారన్న వదంతి మంగళ్ పాండేలో బ్రిటీష్ వారిపై ద్వేషానికి కారణమైంది.   సార్జెంట్ పై దాడిచేసిన మంగళ్ పాండే ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నించాడు. అది కాస్త విఫలమవ్వడంతో బ్రిటీష్ సేనలు అదుపులోకి తీసుకున్నాయి. మంగళ్ పాండే చర్యతో పోరాటం మీరట్ కు పాకింది. 1857, ఏప్రిల్8న పాండేను ఆయనకు సహకరించాడన్న ఆరోపణపై సహచర సిపాయిని బ్రిటీష్ ప్రభుత్వం ఉరితీసింది. పాండేపై చర్య తీసుకోమని హేవ్సన్ అనే సైనిక అధికారి ఆదేశించినా సాటి సిపాయిలు వ్యతిరేకించారు. అప్పట్లో ఝాన్సీలక్ష్మి బాయిగారికి కూడా సహకారం అందించారు పాండే గారు.  దీంతో అప్పటినుండి ఉద్యమం మరింత ఎక్కువగా  భారతమంతటా వ్యాపించింది. కాకతాళీయంగా పాండే హీరో అయ్యాడని, భంగు ను సేవించిన మత్తులో బ్రిటీష్ అధికారిపై దాడి చేశాడన్న వాదనలూ ఉన్నాయి. ఏదేమైనా కాలం విసిరిన సవాలును స్వీకరించిన మంగళ్ పాండే ఒక గొప్ప ఉద్యమకారుడు. భారతదేశ  స్వతంత్ర్య చరిత్రలో చిరస్మరణీయుడుగా నిలిచిపోయాడు .  ఇలాంటి వారిని మనం గుర్తు చేసుకోవటం ప్రతీ భారతీయుని కర్తవ్యం.  ఈయన జయంతి సందర్బముగా మంగళ్ పాండే గారికి నివాళ్ళు అర్పిద్దాం మరి.

సోమవారం, జులై 16, 2012

హరి నీ మయమే అంతాను

సోమవారం, జులై 16, 2012

హరి నీ మయమే అంతాను
అరసి నీకు శరణనియెద నేను

యెదుట నెవ్వరిక నే మాటాడిన
అది నీ ఘన నామాంకితమే
అదివో సకల శబ్దాఖ్యుడవని నిన్ను
పొదలి చదువులు పొగడీగాన

యెవ్వరి పొగడాని యెక్కడ నుండిన
నివ్వటిల్లనది నీ రూపే
నెవ్వదీర నిదె నిను విశ్వరూపుడు
యెవ్వల నని శ్రుతులెంచీగాన

భావన యిది నీ బ్రహ్మాత్మకమే
శ్రీవేంకటేశ నాచింతయిదే
ఆవల నిను సర్వాంతర్యామెని
దేవ శాస్త్రములు తెలిపీగాన

ఆదివారం, జులై 08, 2012

Hey friends catch me live today

ఆదివారం, జులై 08, 2012


Hey friends catch me live today (Sunday) show

with your little RJ Sree Vaishnavi

from 9:30 am to 11:30 am

only on RadioJoshLive

Masth Maza Masth Music :) 

My show Name is Harivillu

Fun with me

If you want to talk with me plz call these numbers  

Skype idradiojoshlive

US: 914-214-7574

UK: 20-3286-9594

AUS: 28003-4546

Local Number: 040-4200-2003

Stay Tune RadioJosh 

Thank You Very Much.

బుధవారం, జులై 04, 2012

త్రివర్ణపతాక రూపకర్త

బుధవారం, జులై 04, 2012

తెలుగు జాతి గౌరవం నిలబెట్టి .ప్రపంచ చరిత్రలో  మన జాతీయ జండాను  ఎగురేలా చేసాడు .  మన త్రివర్ణపతాక రూపకర్త 
జాతీయ పతాకం రెపరెపలాడే వరకు ఒక్క తెలుగు వారే కాకుండా.. జాతియావత్తూ స్మరించుకోదగిన మహాపురుషుల్లో పింగళి వెంకయ్య ఒకరు. కృష్ణా జిల్లా మచిలీపట్నం సమీపంలోని భట్లపెనుమర్రు గ్రామంలో హనుమంతరాయుడు-వెంకటరత్నమ్మ దంపతులకు ఆగష్టు 2, 1878 న జన్మించారు. వెంకయ్య చిన్నప్పటి నుండే చాలా చురుకైన విద్యార్ధి. ఈయన ప్రాధమిక విద్య చల్లపల్లిలో మరియు మచిలీపట్నములోని హిందూ ఉన్నత పాఠశాలలో జరిగినది. దక్షిణాఫ్రికాలోనే మహాత్మా గాంధీని కలిసిన తెలుగు యువనేత. వీరిమధ్య ఏర్పడిన సాన్నిహిత్యం అర్ధ శతాబ్దం పాటు సాగింది. 1913 నుంచి ప్రతి కాంగ్రెస్ సమావేశానికి హాజరై నాయకులందరితోనూ జాతీయ పతాక ప్రతిష్ఠాపన గురించి చర్చలు జరిపారు. 1916లో "భారతదేశానికొక జాతీయ జెండా" అనే పుస్తకాన్ని ఇంగ్లీషులో రాసి ప్రచురించారు.  మన తెలుగువారు తమ వారిని గౌరవించటంలో ఏనాడూ ముందంజవేయలేదు.  జీవితాంతం దేశం కొరకు స్వాతంత్ర్యం కొరకు పోరాడిన వెంకయ్య చివరి రోజుల్లో తిండికి కూడా మొహం వాచి నానా అగచాట్లు పడినట్లు ' త్రివేణి ' సంపాదకులు డా. భావరాజు నరసింహారావుగారు పేర్కొన్నారు. అంతిమదశలో విజయవాడలో డా. కె.ఎల్.రావు, డా.టి.విఎస్.చలపతిరావు, కాట్రగడ్డ శ్రీనివాసరావు మున్నగు పెద్దలు 15-1-1963 న వెంకయ్య గారిని సత్కరించి వారికి కొంత నిధిని అందించారు. ఆ సత్కారం తరువాత ఆరు నెలలకే 1963, జూలై 4న వెంకయ్య దివంగతుడయ్యాడు.
కన్నుమూసేముందు వారి చివరి కోరికను వెల్లడిస్తూ

" నా అంత్య దశ సమీపించింది. నేను చనిపోయిన తర్వాత త్రివర్ణ పతాకాన్ని నాభౌతిక కాయంపై కప్పండి. శ్మశానానికి చేరిన తర్వాత ఆ పతాకం తీసి అక్కడ ఉన్న రావి చెట్టుకు కట్టండి. ఇది నా తుది కోరిక " అన్నారు.
ఇది నాకు తెలిసినప్పుడు నా కళ్ళు నీళ్ళు  వచ్చాయి అంటే నమ్మండి.

జాతీయ పతాకం ఎగిరే వరకు స్మరించుకోదగిన ధన్యజీవి పింగళి వెంకయ్య. నిరాడంబరమైన, నిస్వార్థమైన జీవితం గడిపిన మహామనీషి పింగళి వెంకయ్య. ఈయన వర్ధం నేడు.  ఈ మహానీయునికి నివాళు అర్పిద్దాం.

అల్లూరి సీతారామ రాజు

అల్లూరి సీతారామ రాజు మన ఆంద్రప్రదేశంలో జన్మించిన స్వాతంత్ర సమరయోధుడు.  ఈయన దారిలోనే తూర్పుగోదావరి, విశాఖపట్టణం జిల్లాలో అడవుల ప్రదేశంలో మన్యం ప్రజలు విప్లవ దారిలో నడిచాయి.    అల్లూరి సీతామరాజు  4 జూలై 1897 లో పాండ్రంగి అనే ఉరిలో విజయనగరం జిల్లా దగ్గర  వెంకట రామరాజు మరియు సూర్యనారాయణమ్మ లకు జన్మించారు.  వీరికి ఒక తమ్ముడు సత్యనారాయణరాజు మరియు చెల్లి సీతమ్మ కలరు.  మనకు చరిత్రనుండి చూస్తే రక్తపాతం జరగకుండా ఉన్న ఉద్యమాల్లేవు. అంతే కాదు రక్తపాతం జరక్కుండా ఉద్యమాన్ని నడిపించాలని ప్రయత్నించిన ఉద్యమ నాయకులు కూడా వున్నారు.  వారిలో గాంధీజీ మన జాతీయ కథానాయకుడు అని మనకు తెలుసు కదా.  అల్లూరి సీతారామరాజు మన ఊరి విప్లవ నాయకుడు! మన్యంలో కొండదళానికి, తెల్లదండుకి మధ్య అరవెరైండు సార్లు కాల్పులు జరిగినా, అనవసరమైన రక్తపాతం జరగా కూడదు అని మన మన్యం వీరుడు అనేకసార్లు ఆపుచేసాడు. అల్లూరి సీతారామ రాజును  మనము ఆదర్శంగా తీసుకోవాలి. శత్రువుపై నిప్పులు కురిపించిన మన్యం అగ్నికణం అల్లూరి సీతారామరాజు,  ఈయన విప్లవ పోరాట సమయం మొత్తం జీవితకాలం గా మనం చెప్పుకోవచ్చు లెక్కకు వస్తే  అల్లూరి సీతారామరాజు 22 ఆగస్టు 1922 నుంచి 1924 వరకు అని చెప్పుకుంటారు.  అసలు అల్లూరి సీతారామరాజు బ్రిటిష్ వారికి ఒకలేఖ రాసారు నేను మీకు లొంగిపోతున్నాను అని.  కానీ బ్రిటిష్ వారు రుదర్ ఫర్డ్ అద్యక్షణ తో కాల్చి చంపేశారు.  ఈ వీరుని కద ముగించేసారు .

స్వామీ వివేకానంద


స్వామీ వివేకానంద (జనవరి 12, 1863 - జూలై 4, 1902) ప్రసిద్ధి గాంచిన గొప్ప  హిందూ మత యోగి. పూర్తి పేరు నరేంద్ర నాథ్ దత్తా. రామకృష్ణ పరమహంసగారి అత్యంత ప్రియమైన  శిష్యుడు. వేదాంత, యోగ తత్త్వ శాస్త్రములలో సమాజముపై అత్యంత ప్రభావము కలిగించిన ఒక ప్రఖ్యాత ఆధ్యాత్మిక నాయకుడు. హిందూ తత్వ చరిత్ర, భారతదేశ చరిత్రలలోనే ఒక ప్రముఖ వ్యక్తి రామకృష్ణ మఠం వ్యవస్థాపకుడు.
భారతదేశాన్ని మాత్రమే జాగృతము చెయ్యడమే కాకుండా అమెరికా, ఇంగ్లాండుల లో యోగ, వేదాంత శాస్త్రములను తన ఉపన్యాసముల ద్వారా, వాదనల ద్వారా పరిచయము చేసిన ఖ్యాతి వివేకానందునికి  కలదు. గురువు గారి కోరిక మేరకు అమెరికాకు వెళ్ళి అక్కడ హిందూ మత ప్రాశస్త్యం గురించి ఎన్నో ఉపన్యాసాలు చేశాడు. అతని వాగ్ధాటికి ముగ్ధులైన అమెరికా ప్రజానీకం బ్రహ్మరధం పట్టింది. ఎంతో మంది అతనికి శిష్యులయ్యారు. పాశ్చాత్య దేశాలలోకి అడుగు పెట్టిన మొదటి హిందూ సన్యాసి ఈయనే. తూర్పు దేశాల తత్త్వమును షికాగో లో జరిగిన ప్రపంచ మత జాతరలో 1893 లో ప్రవేశపెట్టాడు. అక్కడే షికాగోలోను, అమెరికాలోని ఇతర ప్రాంతాలలోను ప్రజల అభిమానాన్ని పొందారు.  ఈయన తిరిగి భారత దేశం వచ్చి రామకృష్ణ మఠాన్ని స్థాపించి దీని ద్వారా భారత యువతకు దిశా నిర్దేశం చేశాడు. ముప్పై తొమ్మిధి ఏళ్ళ వయసు లోనే మరణించాడు. ఆయన చేసిన సేవలకు గుర్తింపుగా భారత ప్రభుత్వం ఆయన జన్మ దినాన్ని "జాతీయ యువజన దినోత్సవం" గా ప్రకటించింది.
ఆరోగ్యం దెబ్బతిన్నది.
అవిశ్రాంతంగా పని చేయడం వలన స్వామి ఆరోగ్యం దెబ్బతిన్నది. అమెరికాలోని ఆయన శిష్యుల అభ్యర్థన మేరకు మరల అక్కడికి వెళ్ళాడు. ప్యారిస్ లోని సర్వమత సమావేశాలలో పాల్గొని తిరిగి స్వదేశానికి వచ్చాడు. రానూ రానూ అంతర్ముఖుడయ్యాడు. శరీరమైతే బలహీనంగా తయారయ్యింది కానీ ఆయన ఆత్మ,మనసు మాత్రం చాలా చురుగ్గా వ్యవహరించేవి. జులై 4, 1902న యధావిధిగా ఆయన రోజూవారీ కార్యక్రమాలు నిర్వర్తించుకున్నాడు. శిష్యులకు బోధనలు చేశాడు. భోంచేసిన తరువాత కొంచెంసేపు విశ్రాంతి తీసుకున్నాడు. కొద్ది సేపటి తరువాత ఆయనకు చిన్న వణుకు లాంటిదేదో కలిగింది. తనను చూడడానికి వచ్చిన వారితోనూ, శిష్యులతోనూ చాలా ఉల్లసంగా నవ్విస్తూ గడిపాడు. రాత్రి 9 గంటల సమయంలో ఆయనఅలసిపోయినట్లుగా కనిపించాడు. చేతులలో సన్నగా వణుకు ప్రారంభమైంది.చిన్నగా అరిచి లేచి కూర్చున్నాడు. దీర్ఘంగా శ్వాస పీల్చి నెమ్మదిగా శాశ్వత నిద్రలోకి జారుకున్నాడు. ఆయన శిష్యులు తల్లితండ్రులను కోల్పోయిన అనాథలవలే చాలా భాద పడ్డారు .
వివేకానందుడు  చేసిన కృషిని గురించి మనం చెప్పలేమేమో.  కదా.  ఈ రోజు వివేకానంద స్వామి వర్ధంతి రోజు ఆయన గురించి కొంచెం తెలుసుకున్నందుకు చాలా సంతోషంగా అనిపించింది.  ఈ బ్లాగ్ ద్వారా ఆయనకు నివాళి అర్పిద్దాం మరి..  

మంగళవారం, జులై 03, 2012

గురుపూర్ణిమ / వ్యాసపూర్ణిమ

మంగళవారం, జులై 03, 2012



ఓం గురుబ్రహ్మ గురుర్విఘ్ణుః గురుర్దేవో మహేశ్వరః |
గురుస్సాక్షాత్ పరబ్రహ్మతస్మై శ్రీ గురవేనమః||

తాత్పర్యము: గురువు బ్రహ్మ, విష్ణు, శివ లక్షణములు కలవాడు. అట్టి సాక్షాత్‌ పరబ్రహ్మ స్వరూపుడైన గురుదేవులకు నమస్కరిస్తున్నాను.

ఈరోజు గురుపూర్ణిమ.   వ్యాసుని పుట్టిన దినమును మనము గురుపూర్ణిమగా జరుపుకుంటున్నాము.  ఈరోజు  గురువులను (Teachers) , పెద్దవారిని పూజించేరోజు.  గురుపూర్ణిమను వ్యాసుని పుట్టిన దినము రోజు జరుపుకుంటున్నాముకావున దీనిని వ్యాస పూర్ణమ అని కూడా అంటారు.  హిందువులు ప్రతి సంవత్సరం ఆషాఢ శుద్ధ పౌర్ణమి రోజున గురుపూర్ణిమ జరుపుకుంటారు.  శ్రీ మహావిష్ణువుని అవతారంగా వ్యసుని గురించి చెప్తారు.  ఈయన పేరు  కృష్ణద్వైపాయనుడు  వేదాలను   నాలుగు బాగాలుగా చేసాడుకావునా ఈయనికి వేదవ్యాసుడని పేరు వచ్చింది.

వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే|
నమో వై బ్రహ్మనిధ్యే వాసిష్ఠాయ నమోనమ:||

నమోస్తుతే వ్యాస విశాల బుద్ధే
పుల్లార విన్దాయత పత్రనేత్ర|
యేన త్వయా భారత తైలపూర్ణ:
ప్రజ్వాలిలో జ్ఞానమయ: ప్రదీప:||

విశాల బుద్ధిగల వ్యాస మహర్షీ! వికసించిన పద్మ దళముల వంటి నేత్రములుగల వాడా! మహాభారతమనే తైలముచే నింపబడిన జ్ఞానదీపము నీచే వెలిగించబడింది. అట్టి నీకు నా నమస్కారములు.
మనకు  మంచి చెప్పే ప్రతీవారు గురువులే.  ఈరోజు పెద్దవారి ఆశిర్వాధములు మనము తీసుకోవాలి.   ఈరోజు షిరిడి సాయిబాబాగారికి, దత్త్తాత్రయుని వారికి ప్రత్యేక దినముగా పూజిస్తారు.

ఇంకా గురువు తత్వాన్ని  దత్త్తాత్రయులవారు మనకు చాలా విషయాలలో చెప్తారు.  అందులో నాకు అర్ధం అయినవి మీకు చెప్తాను.   దత్త్తాత్రయులు వారు అన్నారు మనకు 24 మంది గురువులువున్నారు అని చెప్పారు.  మనకు వరసగా తన గురువులు గురించి చెప్పారు.   
మొదటి గురువు:  భూమి.  
రెండవ గురువు:  వాయువు
మూడవ గురువు: ఆకాశము 
నాల్గవ గురువు: అగ్ని 
ఐదవ గురువు:  సూర్యుడు 
ఆరవ గురువు:  పావురము
ఏడవ గురువు: కొండచిలువ 
ఎనిమిదవ గురువు: సముద్రము 
తొమ్మిదవ గురువు : మిడత 
పదవ గురువు: ఏనుగు 
పదకొండవ గురువు: చీమ 
పన్నెండవ గురువు: చేప 
పదమూదవ గురువు: పింగళ  అనే వెశ్య
పదునాల్గవ గురువు: శరకారుడు 
పదిహేనవ గురువు:  ఒక బాలుడు  
పదహారవ గురువు: చంద్రుడు 
పదహేడవ గురువు: తేనెటీగ 
పద్దెనిమిదవ గురువు: లేడి 
పంతొమ్మిదవ గురువు: గ్రద్ద 
ఇరవైవ గురువు: కన్య 
ఇరవైవోకటివ గురువు: సర్పము 
ఇరవై రెండవ గురువు: సాలెపురుగు 
ఇరవై మూడవ గురువు: భ్రమరకీటకము 
ఇరవై నాల్గవ గురువు: జలము 


ఇలా తనగురువులు గురుంచి చెప్పారు.  మనకు  ప్రతీజీవి ఒక గురవే అని చెప్పారు దత్తాత్రయులవారు.  వీటినుండి ఏమి నేర్చుకోవాలో తరువాత తెలుసుకుందాం.

ఈనాటి గురుపూర్ణిమ / వ్యాస పూర్ణిమ శుభాకాంక్షలు.

ఆదివారం, జులై 01, 2012

My show Name is Harivillu

ఆదివారం, జులై 01, 2012


Hey friends catch me live today (Sunday) show

with your little RJ Sree Vaishnavi

from 9:30 am to 11:30 am

only on RadioJoshLive

Masth Maza Masth Music :) 

My show Name is Harivillu

Fun with me

If you want to talk with me plz call these numbers  

Skype id: radiojoshlive

US: 914-214-7574

UK: 20-3286-9594

AUS: 28003-4546

Local Number: 040-4200-2003

Thank You Very Much.

శుక్రవారం, జూన్ 29, 2012

తోలి ఏకాదశి

శుక్రవారం, జూన్ 29, 2012

ఏ మంచిపని ప్రారంభించినా దశమి ఏకాదశులకోసం ఎదురుచూడటం అందరికీ అలవాటు కదండి . మొత్తం సంవత్సరం పొడుగునా ఉండే 24 ఏకాదశుల్లో, ఆషాఢ శుక్ల ఏకాదశిని  తొలి ఏకాదశిగా పరిగణిస్తారు.

పూర్వకాలంలో ఈ రోజునే సంవత్సరారంభంగా పరిగణించేవారు. వానకారు మొదలైతే అనారోగ్యాలు తలెత్తడం సహజం. శరదృతువు యముడి కోర. ఉత్తరాయణం కన్నా దక్షిణాయనంలో పండుగలూ పబ్బాలూ ఎక్కువ గా జరుపుకున్నేవారు.  ఆనాడు  ఉపవాస  తొలి ఏకాదశి దీక్ష చేస్తారు.
ఆషాఢమాసము శుక్లపక్ష ఏకాదశి నాడు విష్ణుమూర్తి పాలకడలిపై యోగనిద్రలోకి వెళ్ళే సందర్బాన్ని తొలిఏకాదశిగా పరిగణిస్తారు. స్వామి నిద్రించే రోజు కాబట్టి దీనిని శయన ఏకాదశి అని కూడా అంటారు.  విష్ణువు పాలకడలి పై శేష తల్పమున పవళిస్తాడు.  అదే తోలి ఏకాదశి.

సతీ సక్కుబాయి ఈ శయన ఏకాదశి నాడే మోక్ష ప్రాప్తి పొందింది. తొలిఏకాదశి నాడు రోజంతా ఉపవాసం ఉండి, రాత్రికి జాగారం చేసి, మర్నాడు ద్వాదశినాటి ఉదయం విష్ణుమూర్తిని పూజించి తీర్థప్రసాదాలను స్వీకరించి ఆ తర్వాత భోజనం చేస్తే జన్మజన్మల పాపాలు ప్రక్షాళనమవుతాయని నమ్మకం. ఆ రోజు యోగనిద్రకు ఉపక్రమించే విష్ణువు మళ్ళీ నాలుగు నెలల తర్వాత కార్తీక శుద్ధ ఏకాదశి నాడు మేల్కొంటాడంటారు.  ఇంత ప్రాముఖ్యము కల శయన ఏకాదశి రోజు విష్ణు సహస్రము పారాయణ చేసెదరు.  అందరికీ ఈ తోలి ఏకాదశి శుభాకాంక్షలు.

ఆదివారం, జూన్ 24, 2012

Catch me on Harivillu.

ఆదివారం, జూన్ 24, 2012


Hey friends catch me live today (Sunday) show

with your little RJ Sree Vaishnavi

from 9:30am to 11:00 am

only on RadioJoshLive

Masth Maza Masth Music :) 

My show Name is Harivillu

Fun with me

If you want to talk with me plz call these numbers  

Skype id: radiojoshlive

US: 914-214-7574

UK: 20-3286-9594

AUS: 28003-4546

Local Number: 040-4200-2003

Thank You Very Much.

శనివారం, జూన్ 23, 2012

Array Of Letters.

శనివారం, జూన్ 23, 2012


What is represented by this array of letters?
R       R
A
Y        Y

గురువారం, జూన్ 21, 2012

ప్రపంచ సంగీత దినోత్సవ శుభాకాంక్షలు

గురువారం, జూన్ 21, 2012

ప్రపంచ సంగీత దినోత్సవ శుభాకాంక్షలు.  సంగీతము అన్నది ఒక అద్భుతము.  ఈ సంగీతము అన్నది ప్రకృతి నుండి వచ్చిందేమో అని నాకు అనిపిస్తుంది. "పశుర్వేత్తి శిశుర్వేత్తి వేత్తి గాన రసం ఫణిః" అన్నారు పెద్దలు. కానీ పశువులకన్నా, శిశువుల కన్నా పక్షులకు గానం గురించి బాగా తెలుసు అని ప్రకృతి నిరూపిస్తోంది.   సంగీతముకు రాళ్ళు కరుగుతాయిట ,  పశువులు , పక్షులు, మరియు చిన్ని శిశువులు కూడా రెస్పాండ్ అవుతాయి అంటారు.  సంగీతానికి అంత మహత్యము వుందిట .  
భగవంతుడు కూడా సంగీత ప్రియుడు అని మనకు కూడా తెలుస్తుంది.  ఎలా అంటారా శివుని చేతిలో డమరుకము సంగీత సాదనం, కృష్ణుని చేతిలో మురళి,  నారద తుంబురుడులు సంగీత విద్వాంసులు, మరియు మనం చదువులు తల్లిగా పూజలు చేసే అమ్మ  సరస్వతిమాత చేతిలోని కచ్ఛపి (వీణ).  వీటిని బట్టి బాగావంతుడు కూడా సంగీతము అంటే ఇష్టం అని తెలుస్తోంది కదండీ.   
మనము నిత్యమూ వినే కోకిల అరుపులో వుంది సంగీతము.  పాటల పల్లకిలోన, చిగురాకు సవ్వడిలోన, నిరంతరము వసంతమే సంగీతము, గుప్పెడు గుండెలలోన , గుడిగంటల సందడిలోన ప్రతీక్షణం నిరంతరం స్వరార్చనే సంగీతము, వెన్నేలలో పొంగే గోదావరి సంగీతము.  ఎంత దూరమైనా చిరుగాలిలోన అనుబందం పెంచే రాగం సంగీతము.  ఇలాంటి సంగీతము గురించి చెప్పటం ఎవరి తరంకాదు.  ప్రపంచ  సంగీత దినోత్సవ శుభాకాంక్షలు.  ఈ పాట  నాకు చాలా నచ్చింది ఘంటసాల గారు పాడిన ఈ పాట  చూడండి. 

బుధవారం, జూన్ 20, 2012

కృష్ణం కలయ సఖి

బుధవారం, జూన్ 20, 2012

నారాయణ తీర్థులవారి కృతి

రాగం: ముఖారి
గళం: శ్రీ మంగళంపల్లి బాలమురళీకృష్ణ



కృష్ణం కలయ సఖి సుందరం బాల కృష్ణం కలయ సఖి సుందరం



కృష్ణం కథవిషయ తృష్ణం జగత్ప్రభ విష్ణుం సురారిగణ జిష్ణుం సదా బాల
కృష్ణం కలయ సఖి సుందరం

నృత్యంతమిహ ముహురత్యంతమపరిమిత భృత్యానుకూలం అఖిల సత్యం సదా బాల 
కృష్ణం కలయ సఖి సుందరం

ధీరం భవజలభారం సకలవేదసారం సమస్తయోగిధారం సదా బాల 
కృష్ణం కలయ సఖి సుందరం

శృంగార రసభర సంగీత సాహిత్య గంగాలహరికేళ సంగం సదా బాల 
కృష్ణం కలయ సఖి సుందరం

రామేణ జగదభిరామేణ బలభద్రరామేణ సమవాప్త కామేన సహ బాల 
కృష్ణం కలయ సఖి సుందరం

దామోదరం అఖిల కామాకరంగన శ్యామాకృతిం అసుర భీమం సదా బాల
కృష్ణం కలయ సఖి సుందరం

రాధారుణాధర సుతాపం సచ్చిదానందరూపం జగత్రయభూపం సదా బాల 
కృష్ణం కలయ సఖి సుందరం

అర్థం శితిలీకృతానర్థం శ్రీ నారాయణ తీర్థం పరమపురుషార్థం సదా బాల 
కృష్ణం కలయ సఖి సుందరం



మంగళవారం, జూన్ 19, 2012

బుద్దుడి సూక్తి (సుబ్బడు మారాడు).

మంగళవారం, జూన్ 19, 2012


సమస్త ప్రాణులూ, పెద్దవి గానీ, చిన్నవి గానీ; బలమైనవి గానీ, బలహీనమైనవి గానీ ;  కనిపించేవి గానీ, కనిపించనివి గానీ; దగ్గరగా వున్నవిగానీ, దూరంగా వున్నవిగానీ; పుట్టినవి గానీ, దూరంగా వున్నవిగానీ; అన్నీ, ఎల్లప్పుడూ, శాంతి సౌఖ్యాలతో ఓలలాడాలి!

బుద్దుడి సూక్తి.

నాకు ఈ సూక్తి ఎందుకు గుర్తువచ్చింది అంటే  నేను రాత్రి ఒక కధ చదివాను.   ఆకధ మీకు కూడా షేర్ చేస్తానులెండి.  కదా పేరేమో  సుబ్బడు మారాడు.
 సుబ్బడు రెండో తరగతి చదువుతున్న పిల్లవాడు.  అతని పేరు సుబ్రహ్మణ్యం.  అందరు అతన్ని అందరు ముద్దుగా సుబ్బడు అంటారు.  ఈ పిల్లడు బాగా అల్లరి పిల్లోడుఅన్నమాట .  ఈ పిల్లాడు రోజు స్కూల్  కి వెళ్ళేటప్పుడు దారిలో చెట్ల మీద వుండే పక్షులను రాళ్ళు విసిరి కొట్టేవాడు.   కుక్కలను కర్రతో బెదిరించేవాడు.  చీమల బారులను పుల్లలతో చెదరకోట్టేవాడు.  ఆపిల్లాడు గురించి చెప్తే మనకు ఒక రోజు సరిపోదేమో.  వాళ్ళ అమ్మగారు ఎప్పుడు నోరులేని జీవులను బాధపెట్ట కూడదు అని చెప్పేది .  ఈ సుబ్బడేమో చెప్పేది అసలు వినడు.  జంతువులను బాధపెట్టడము వీడికి బాగా అలవాటు అయిపోయింది.  వీడికి అదే ఆటగా మారిందంటే చూడండి ఎంత అల్లరో వాడు.
ఒకరోజు అలాగే ఆడుకుంటూ ఒక పొదలోకి వెళ్ళాడు సుబ్బుడు.  అక్కడ వున్నా పక్షులన్నీఅరుచుకుంటూ ఒక్కసారిగా పైకి ఎగిరాయి, కుక్కలు మోరుగుతున్నాయి.  అలా హడావిడి గా వుంటే మన సుబ్బడు బయపడి కొంచెం దూరంగా వచ్చి ఆ పోదవైపు చూసాడు.  అక్కడ ఒక పెద్ద పాము కనబడింది.  భయంతో పారిపోయి అమ్మని గట్టిగా పట్టుకొని జరిగిన సంగతి.  పెద్ద పాముని చూసిన సంగతి చెప్పాడు.  అప్పుడు అమ్మ "చూసావా ? ఆ పిట్టలూ కుక్కలూ ఎంత మేలుచేసాయో! అవి లేకపోతే ఈ పాటికి ఏమి అయ్యేది?  పాము నిన్నుకరిచేది" అంది.
సుబ్బుడికి అప్పుడు అర్ధం అయ్యింది.  పక్షులు, జంతువులు ఎంత మంచివో తెలుసుకున్నాడు.  తాను ఎంత చెడ్డవాడో తెలుసుకొని.  అమ్మా ఇంకెప్పుడు వాటిని బాధపెట్టాను అన్నాడు.  అప్పటినుండి వాటికి నూకలు వేసి వాటిని బాదపెట్టడం మానేసాడు.  సుబ్బడు బలే మారిపోయాడు కదండి.  మనం కూడా సుబ్బడు లాగ జంతువులును అల్లరిపెట్ట కూడదు.  నాకు ఈ కదా బుద్దుని  సూక్తి నచ్చిందండి.  అందుకే మీతో షేర్ చేసుకున్నా. 

సోమవారం, జూన్ 18, 2012

దాచబడిన ముఖం

సోమవారం, జూన్ 18, 2012


నాకు ఈ క్రింది చిత్రంలో ఒక దాచబడిన ముఖం వుందిట. నాకు దొరకలేదు,  మీకు కనబడిందా?  కనబడితే చెప్పండి.  ముఖము వుందా లేదా అని.

ఆదివారం, జూన్ 17, 2012

Catch Me Live RadioJoshLive Harivillu.

ఆదివారం, జూన్ 17, 2012


Hey friends catch me live today (Sunday) show

with your little RJ Sree Vaishnavi

from 9:30am to 12:00pm

only on RadioJoshLive

masth maza masth music:) 

My show Name is Harivillu

Today my topic is about School Days and Father's Day Specials.

If you want to talk with me call these numbers  

Skype id: radiojoshlive

US: 914-214-7574

UK: 20-3286-9594

AUS: 28003-4546

Local Number: 040-4200-2003

Thank You Very Much.

శనివారం, జూన్ 16, 2012

FATHER'S DAY

శనివారం, జూన్ 16, 2012


FATHER Abbreviation 
F= Forever With His Family
A= Always There For You No Matter What
T= The Only One Who?S There
H= He?S My Hero Till The End
E= Encouraging In Everything I Do
R= Really The Only One?
No One Can Beat Him He?S The Best!!!


I Wish You Happy Father's Day.

శుక్రవారం, జూన్ 15, 2012

మెరుపులో నిజాలు.

శుక్రవారం, జూన్ 15, 2012

 mcdowel2

ఆకాశం వైపు చూస్తే మనకు నీలి మేఘాలు మెత్తటి దూదిపింజలుగా కనిపిస్తాయి.  అవి అమాయకముగా ఒక ప్రదేశము నుండి మరొక  ప్రదేశానికి యాక్టివ్ గా వెల్తున్నాయి.   నీరు, మంచు లోపల ఆకర్షణ శక్తి ద్వారా వెచ్చని గాలి ప్రవాహాల ద్వారా చుట్టూ కదిలే, మరియు గడ్డకట్టి, మేఘము లో నీరు  evaporating చెందుతుంది  . ఒక  బెలూన్ rubbing వంటి స్టాటిక్ విద్యుత్ సృష్టించవచ్చు, అలాగే  క్లౌడ్ లో రేణువులు ఆవేశం వల్ల  విధ్యుత్ పుడుతుంది అని మొట్టమొదట  బెంజమిన్ ఫ్రాంక్లిన్ అను శాస్త్రవేత్త తన గాలిపటం ప్రయోగము ద్వారా నిరూపించారు.  ఈరోజు బెంజమిన్ ఫ్రాంక్లిన్ జన్మదినము సందర్బముగా మనము ఆయన ప్రయోగము గురించి తెలుసుకుందాం.

ఒక ముఖ్యమైన విద్యుదావేశ వేర్పాటు వల్ల   నిర్మించిన ఒకసారి, క్లౌడ్ గ్రౌండ్ లో సానుకూల ఛార్జ్ ప్రేరేపిస్తుంది. ఆ  చార్గే చివరకు భూమికి చేరుతుంది . అది  గాలి ionise గా వారు purplish మెరుపు ఏర్పడటానికి కారణమవుతుంది. వారు కేవలం ఒక  సులభమయిన, దుమ్ము మరియు గాలి లో ప్రభావితం  చేస్తుంది.  అతి  చిన్నదైన మార్గం ద్వారా బెంజమిన్ ఫ్రాంక్లిన్  కనుక్కునారు ఈ విషయాన్ని Streamers వాటిని తీర్చేందుకు భూమి నుండి పైకి రావచ్చు.  ఒకసారి వచ్చిన   స్పార్క్ ఛార్జ్ తటస్థంగా  రూపొందిస్తుంది. గాలి రుణావేశం ద్వారా క్లౌడ్ గుడ్డుకోవటం వల్ల ఒక కాంతి ఏర్పడుతుంది అది  సాధారణంగా వేడెక్కే కొద్ది.  దాని స్పార్క్ వేడి లేదు, 20,000 డిగ్రీలగా   ఎక్కువ వుంటుంది.  అది త్వరగా షాక్ వేవ్ మరియు ఉరుము వల్ల గాలి వేడిచేస్తుంది. లైట్ ఒక  సెకనుకు  186.000 మైళ్ళు దూరము  ప్రయాణిస్తుంది .   4.5 సెకన్లు వచ్చిన మెరుపు 1 మైలు దూరము ప్రయాణం చేస్తుంది.  
మెరుపులో  నిజాలు:
• ప్రపంచవ్యాప్తంగా సంభవించే 2,000 తుఫాను పైగా ఉన్నాయి ఏ సమయంలో అయినా, ప్రతి 100 మెరుపు ఉత్పత్తి అవుతాయి  అవి ప్రతి రోజు 8 మిలియన్ల మెరుపులు గా చెప్పచ్చు .
• ప్రతి మెరుపు ఫ్లాష్ 3 మైళ్ల పొడవైన కాని కేవలం ఒక సెంటీమీటర్ గా అనిపిస్తుంది.
• ఒక మెరుపు శక్తి యొక్క 1-10 బిలియన్ జౌలేస్ గురించి డిశ్చార్జెస్ మరియు కొన్ని 30,000 ప్రస్తుత ఉత్పత్తి - 50,000 ఆంప్స్, సెల్సియస్ 20,000 పైగా డిగ్రీల చుట్టూ ఉన్న గాలి వేడెక్కడంతో ఇది,
• ఒక మెరుపు తీగ TNT, ఒక టన్ను కాల్చుకొని గా  చాలా శక్తి unleashes గా వుంటుంది.
ప్రతీ ఒక ఫ్లాష్ వల్ల చాలా విద్యుత్ ఏర్పడుతుంది అని మనకు చెప్పకనే అర్థం అవుతోంది.

బెంజమిన్ ఫ్రాంక్లిన్ యొక్క ప్రమాదకరమైన గాలిపటం ప్రయోగం వల్ల  ఇది నిజమని నిరుపితము అయ్యింది.  ఒక ఎగిరే గాలిపటం ద్వారా ఫ్రాంక్లిన్ చే  మెరుపు ఒక విద్యుత్ దృగ్విషయం అని పరికల్పించబడినది.  మరియు మెరుపు యొక్క విద్యుత్ ప్రభావం మరొక వస్తువు కు బదిలీ మరియు విద్యుత్ తన  ప్రభావాన్ని చూపించింది .  1752 లో, ఫిలడెల్ఫియా లో ఒక చీకటి రోజు న  జూన్ మధ్యాహ్నం న, 46 ఏళ్ల బెన్ ఫ్రాంక్లిన్ ఒక గాలిపటం  ఎగురువేసి ప్రయోగం చేసారు . తన కుమారుడు, విలియం సహాయంతో, వారు ఇద్దరు  ఒక  చివర ఒక ఇనుప కీ వ్రేలాడ తీసారు , మరియు ఒక పట్టు స్ట్రింగ్ తన గాలిపటం కు పెట్టారు. తరువాత, వారు కీ నుండి ఒక సన్నని మెటల్ వైర్ టైడ్ మరియు ఒక లైడెన్ జార్, ఒక విద్యుత్ చార్జ్ నిల్వ చేయడానికి ఒక కంటైనర్ లోకి వైర్ చేర్చారు. ఆకాశంలో నల్లని మబ్బులు రావటం వల్ల  ఉరుములతో కూడిన  మెరుపు సమీపించినప్పుడు చివర వారు కీ ఒక పట్టు రిబ్బన్  వుంది .  పట్టు రిబ్బన్ ద్వారా గాలిపటం లోకి హోల్డింగ్, బెన్ గాలిపటం ఎగిరింది మరియు ఒకసారి అది ఎత్తుగా ఎగిరింది , అతను పురిలోకి వెనుతిరిగింది. మేఘం లో ప్రతికూల ఆరోపణలు కీ, మరియు కూజా లోకి, తడి పట్టు స్ట్రింగ్ క్రిందికి తాకటం, తన గాలిపటం లోకి ప్రవేసించి ఉరుము తో కూడిన తుఫాను క్లౌడ్, ఫ్రాంక్లిన్ యొక్క గాలిపటం లోకి  ప్రవేసించి.   అతను కీ న అతనిని వ్యాప్తి నిరోధక, పొడి పట్టు రిబ్బన్ పట్టుకొని ఎందుకంటే బెన్ అయితే,  అతను ఒక షాక్ పొందారు.  అతనుకు షాక్ తగలటం తో అతను మెరుపులో విద్యుత్ కలదు.  అని ఫ్రాంక్లిన్ యొక్క ప్రయోగం విజయవంతంగా మెరుపు స్టాటిక్ ద్వారా విద్యుత్నుచూపించాడు.  ఫ్రాంక్లిన్ సంఘటన తర్వాత నిజాన్ని తెలుసుకోవటానికి ఎన్నో ప్రయోగాలు చేసి నిజాన్ని గ్రహించారు మిగిలిన శాస్త్రవేత్తలు.  

మెరుపులోని విద్యుత్ ఉత్పాదన జరుగుతోంది అని తెలుస్తోంది.  మన శాత్రవేత్తలు ఇలాంటి ప్రయోగాలు చేసి ఆ విద్యుత్ను గ్రహించి సేవ్ చేయగలిగితే.  మనకు నిరంతరము విద్యుత్ను పొందవచ్చు.  మరి ఏరకంగా గ్రహించాలి అని ఆలోచించాలి మరి.   

గురువారం, జూన్ 14, 2012

ప్రపంచ రక్త దాతల రోజు.

గురువారం, జూన్ 14, 2012

Landsteiner, Karl

2005నుండి ప్రపంచ రక్త దాతల రోజుగా జరుపుకుంటున్నారు.  ఎందుకు ఈరోజే జరుపుకుంటున్నారు అంటే ఈరోజు ఆస్ట్రియన్  ఫిజిసియన్   కార్ల్ లేండ్ స్టీనర్ 14 జూన్ 1868.  అను శాస్త్రవేత్త జయంతి.  ఆయన  ఎ, ఒ, బి, బ్లడ్ గ్రూపులను కనుక్కొన్నారు.  ఇలా బ్లడ్  గ్రూపులను  కనుగొన్నందుకు కార్ల్ లేండ్ స్టీనర్ కు 1930 లో నోబుల్ ప్రైజును పొందిన శాస్త్రవేత్త పుట్టిన రోజు గుర్తుగా, ఈ రోజును, ప్రపంచ రక్త దాతల రోజుగా జరుపుకుంటున్నారు.   ఈయన Rh factor మరియు పోలియో వైరస్ ను వేరుచేశారు.  ఈయన ప్రయోగాలు hemoglobinuria గురించి తెలుసుకోవటానికి బాగా ఉపయోగపడ్డాయి.

రక్త దానం (Blood donation) అనేది దరిదాపుగా ప్రాణ దానం లాంటిది. రోగ నివారణ గమ్యంగా పెట్టుకుని ఒకరి రక్తం మరొకరికి ఇచ్చే పద్ధతిని రక్త దానం అంటారు.   ప్రతి 2 సెకన్లకు ఎవరికో ఒకరికి రక్తము అవసరం ఉంటుంది. మీ రక్తం ఒకేసారి ఒకరికన్నా ఎక్కువ మందికి సహాయ పడుతుంది. ప్రమాదానికి గురైనవారికి, అకాల పక్వమైన పిల్లలకి, పెద్ద శస్త్రచికిత్స రక్తం కావలసిన రోగులకు, మీ రక్తాన్ని పరీక్ష చేసిన తరువాత నేరుగా ఉపయోగిస్తారు. గాయాలకు గురైన రోగులకి, రక్తహీనతతో బాధపడే రోగులకి మరియు ఇతర శస్త్రచికిత్స ఎర్ర రక్త కణాలు మాత్రమే కావలసి వస్తాయి. ఈ ఎర్ర రక్త కణాలు మీ రక్తం నుండి వేరుచేయబడతాయి.  అన్ని జీవులు, రక్తం అనే ద్రవం మీద ఆధారపడి జీవిస్తాయి. రక్తం 60% ద్రవ భాగం మరియు 40% ఘన భాగంతో చేయబడింది. 90% నీరు మరియు 10% పోషకాలు, హార్మోన్లు మొదలగువాటితో తయారుచేయబడే, ద్రవ భాగమైన ఈ ప్లాస్మా, ఆహారము మరియు మందులు మొదలగువాటితో సులభంగా తిరిగి నింపబడుతుంది. కాని, ఆర్ బి సి ( ఎర్ర రక్త కణాలు), డ బ్ల్యు సి ( తెల్ల రక్త కణాలు) మరియు ప్లేట్ లెట్స్ కలిగి ఉండే ఘన భాగం పోతే, యధాతదంగా రావడానికి సమయము తీసుకుంటుంది.  మీరు ఇక్కడే అవసర పడతారు. దానిని తిరిగి యధాతదంగా రోగులయొక్క శరీరం నింపడానికి తీసుకునే సమయం, అతని/ఆమె ప్రాణాన్ని తీయవచ్చు. కొన్ని సమయాలలో, శరీరం తిరిగి నింపడానికి వీలైన స్థితిని ఏ మాత్రం కలిగి ఉండకపోవచ్చు.  రక్తాన్ని దానం మాత్రమే చేయవచ్చునని దానిన ఉత్పత్తి చేయలేమని అందరికి  తెలుసుకదా. రక్తం అవసరమయ్యే జీవితాలని మీరు మాత్రమే రక్షించవచ్చు.
ప్రతి సంవత్సరము భారత దేశంలో, 250 సి.సి. రక్తం గల 40 మిలియన్ యూనిట్లు కావాలసి ఉంటే,. అందులో, 500,000 యూనిట్ల రక్తం మాత్రమే అందుబాటులో ఉంది.  రక్తం అనేది శరీర హృదయం, ధమనులు, సిరలు మరియు కేశనాళికల ద్వారా ప్రసరించి మీ ప్రాణాలను నిలబెట్టే ద్రవ్యము రక్తం శరీర పోషణకి, విద్యుద్వాహక లవణాలు (electrolytes), హార్మోన్లని, విటమిన్లని, ప్రతిరక్షకణాలు (antibodies), వేడిని మరియు ఆమ్లజని ని తీసుకువెళతాయి.  శరీరము నుండి వ్యర్థ పదార్థాలని మరియు కార్బన్డయాక్సైడ్ని రక్తం తీసుకువెళుతుంది.  రక్తం, వ్యాధులను ఎదుర్కొని మరియు గాయాలకు ఉపశమనం కలిగించడానికి దోహదపడి మిమ్మల్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. మీ శరీర బరువులో, రక్తం సుమారు 7% వరకు ఉంటుంది. అప్పుడే పుట్టిన శిశువు శరీరంలో సుమారు ఒక కప్పు రక్తం ఉంటుంది.  వ్యాధులను ఎదుర్కొనడంలో, తెల్ల రక్త కణాలు శరీరము యొక్క ప్రాధమిక సురక్ష.  ఒక రకమైన తెల్ల రక్త కణాలైన గ్రేన్యులొకైట్స్, సూక్ష్మక్రిములు (bacteria) వెదకి నాశనం చేయడానికి రక్త కణాల గోడల చుట్టూ తిరుగుతాయి. శరీర అవయవాలకి మరియు కణజాలానికి (tissues), ఎర్ర రక్త కణాలు ఆమ్లజనిని తీసుకు వెళతాయి. రెండు నుండి మూడు రక్త బిందువులలో, సుమారు ఒక బిలియన్ ఎర్ర రక్త కణాలు ఉంటాయి. ప్రసరణ వ్యవస్థలో, ఎర్ర రక్త కణాలు సుమారు 120 రోజులు జీవించి ఉంటాయి. రక్తపట్టికలు (platelets) రక్తం గడ్డకట్టడానికి దోహదపడతాయి మరియు లుకేమియా, ఇతర కేన్సర్ ఉన్నవారికి, జీవించడానికి అవకాశం కలిగిస్తాయి. 

రక్త దానము చేయటానికి చాలా మందికి అనేకమైన అపోహ వుంటుంది అవి ఏమిటంటే.  "దానము చేసిన తరువాత నానుంచి ఏదో పోయినట్టు అంతే కాకుండా  అలసి పోయినట్టు ఉంటుంది"  ద్రవ్యాలను మరియు మంచి ఆహారాన్ని తీసుకుంటూ ఉంటే, మీ నుండి ఏదో పోయినట్టుగాని లేదా మీరు అలసి పోయినట్టుగాని ఉండరు. " సాధారణ కార్యకలాపాలలో తిరిగి పాల్గొనలేను అనుకుంటారు "మిమ్మల్ని పాల్గొనవద్దని మీకు చెప్పినప్పటికీ, మీ అన్ని సాధారణ కార్యకలాపాలలో తిరిగి పాల్గొనవచ్చు.  "రక్తం తక్కువ అవుతుంది"  మీరు డాక్టరు చేత దానం చేయడానికి, సరే అని అనిపించు కున్న తరువాత, దానం చేసిన తరువాత కూడా మీకు సరిపడా రక్తం ఉంటుంది. "దానం చేసే సమయంలో నొప్పిగా వుంటుంది అనుకుంటారు " కానీ  మీకు ఎటువంటి నొప్పి కలుగదు. " తలతిరిగి సొమ్మసిల్లి పోవచ్చుఅని కూడా అనుకుంటారు " రక్తం దానం చేసిన తరువాత,కొంతసేపు విశ్రాంతి తరువాత, మీరు సొమ్మసిల్లిపోరు లేదా అసౌకర్యం కలుగదు.  " ఎయిడ్స్ కలుగవచ్చు!" అలా జరుగదు  ఒకసారి ఉపయోగించి పారవేసే సిరంజ్ లను ఉపయోగించేలా మరియు క్రిములబారి నుండి దూరంగా ఉండేలా అన్ని జాగ్రత్తలు తీసుకుంటారు. " రక్తం సామాన్యమైనది. దానికి గిరాకి ఉంటుందని నేననుకోవడం లేదు" అందుకే అరుదైన వాటి కన్నా మీ గ్రూపు రక్తానికే ఎక్కువ గిరాకీ ఉంటుంది.
రక్త దానం చేయటం మనకి మంచిదే.  అదీ కాకుండా వేరే ప్రాణాన్ని కాపాడిన వారు అవుతారు.  నాకు ఇవన్నీ ఒక  డాక్టర్  గారు చెప్పారు.  మరి మీరు కూడా తెలుసుకోండి.  మీరు రక్త దానం చేసి హాయిగా జీవించండి.  అలాగే ప్రాణాపాయంలో ఉన్నవారిని జీవింప చేయండి.  Thank  you.

బుధవారం, జూన్ 13, 2012

Back 2 School.

బుధవారం, జూన్ 13, 2012


హమ్మయ్య స్కూల్ తెరిచారు అని పెద్దవాళ్ళు అనుకుంటూ వుంటారు.  మాలాంటి పిల్లలేమో అప్పుడే సెలవులు అయిపొయాయీఈఈఈ . అని అనుకుంటారు కదండి.  మరి పెద్దవాళ్ళు అలా అనుకోవటానికి కారణం వుంది .  సమ్మర్ హాలిడేస్ లో మనం  బాగా అల్లరి చేసాం.  చెప్పిన మాట వినకుండా ఎండలో అదేసుకున్నాం.  సమ్మర్ హాలిడేస్ ఇచ్చేముందు మనం ఎన్నో ప్లాన్స్ చేస్తూవుంటాము.  ఏవో చేసేయాలి అని అనుకుంటాము .  ఆకరికి ఏమీ చేయము కదండి.  నేను కూడా అలానే చేసాను అందుకే ఇలా అంటున్నాను.  మొత్తానికి సమ్మర్ అయిపోయింది.  స్కూల్ తెరిచేశారు.  కొత్త స్కూలు, కొత్త క్లాస్సు, కొత్త ఫ్రెండ్స్, కొత్త టీచర్స్, కొత్త డ్రస్సులు, కొత్త బుక్స్, అన్నీ కొత్తే.  పుస్తకాలుకు  అట్టలు వేసుకోవటం ఇవన్నీ తలచుకుంటేనే నాకు బలే సరదాగా, గమ్మత్తుగా,  ఆనందముగా వుంది. మరి మీకు కూడా నాలేనే వుందా.  స్కూల్  కి వెళ్ళగానే మన రోజు prayer తో మొదలు అవుతుంది.  prayer లో ముందుగా వందేమాతరం పాడి తరువాత దేవుని ప్రార్ధించి ఆ తరువాత Indian Pledge చెప్తాము.  తరువాత ఎవరి క్లాస్సేస్ లో వారు క్యూలో వెళ్తాం.  మొదటి బెల్ తో క్లాస్స్లు మొదలు అవుతాయి.  మద్యలో breaks తో క్లాస్లు అయిపోయాక ఆఖరి బెల్ కొట్ట గానే జనగణమన పాట  పాడి జైహింద్  చెప్పి   ఇంటికి వెళ్ళిపోవాలని తొందరలో పెద్దగా అరుచుకుంటూ స్కూల్ బయటికి వచ్చి దూరం వెళ్ళేవాళ్ళు బస్సు ఎక్కి ఇంటికి వెళ్ళిపోతాం.  అలారోజు మనరోజులు జరుగుతాయి.  మద్య మద్యలో సండే హాలిడేస్ ను సంతోషంగా గడుపుతూ , ఎగ్జామ్స్ రాస్తూ సంతోషంగా స్కూల్ రోజులు గడుపుతాం,  నాకు బలే exciting గా వుంది ఎప్పుడు ఎప్పుడు తెల్లారుతుందా స్కూల్ కి ఎప్పుడు వెళ్దామా అని.  మరి మీకు.  స్కూల్ కి వెళ్ళేటప్పుడు కొన్ని జాగ్రత్తలు కూడా పాటిస్తే బాగుంటుంది అని మా అమ్మ నాకు చెప్పింది.  ఎలాంటి జాగ్రత్తలో చెప్పెసుకుందాం.   స్కూల్ కి నీటుగా యునిఫోరం వేసుకొని, టైం కి వెళ్ళాలి.  స్చూల్లో బుక్స్ అన్నీ జాగ్రత్తగా మనవి మనవి జాగ్రత్తగా వుంచుకోవాలి.  ఎవరితోనూ కొట్లాడుకోకూడదు.  టీచర్ చెప్పే ప్రతీవిషయాని  గుర్తుపెట్టుకోవాలి.  ఎప్పుడు అబ్సేంట్ కాకూడదు.  స్కూల్ నుండి బయటికి ఎవరు పిలిచినా వెళ్ళకూడదు.  మన పరెంత్స్ యొక్క ఫోన్ నెంబర్ ,మరియు స్కూల్  ఫోన్ నెంబర్ మనదగ్గర వుండాలి.  ఇంకా ఇలాంటి జాగ్రత్తలు తెలుసుకొని. ముఖ్యంగా బాగా చదువుకొని మనం మంచి పిల్లలమని అందరు మెచ్చుకునేట ట్టు తయారు అవ్వాలి.  నాలాగే కొత్తగా కొత్త క్లాస్సులోకి వెళ్లినవారికి అందరికి 
All  The Best.  


    

My Blog Lovers

నా యూట్యూబ్ చానల్స్ ప్లీజ్ సబ్స్క్రిబ్ చేయండీ

Diabetic Challenger

DIABETIC CHALLENGER YOUTUBE CHANNEL. PLASE SUBSCRIBE MY CHANNEL...... THANK YOU VERY MUCH.

Ammamma Tho Nenu (అమ్మమ్మ తో నేను

Please subscribe our channel Ammamma Tho Nenu (అమ్మమ్మ తో నేను)