Blogger Widgets

శుక్రవారం, జనవరి 06, 2012

ఎందరో మహానుభావులు అందరికీ వందనములు

శుక్రవారం, జనవరి 06, 2012


ఎందరో మహానుభావులు అందరికీ వందనములు  అన్న పాటకు కర్త, కర్మ, క్రియ, త్యాగరాజు అని అందరికీ తెలుసు కదా.  అయితే  త్యాగరాజు (మే 4, 1767 1 - జనవరి 6, 18472) కర్ణాటక సంగీత త్రిమూర్తులలో ఒకడు. త్యాగయ్య, త్యాగబ్రహ్మ అనే పేర్లతో కూడా ప్రసిద్ధుడు. నాదోపాసన ద్వారా భగవంతుని తెలుసుకోవచ్చని నిరూపించిన గొప్ప వాగ్గేయకారుడు. ఆయన కీర్తనలు శ్రీరాముని పై ఆయనకుగల విశేష భక్తిని, వేదాలపై, ఉపనిషత్తులపై ఆయనకున్న జ్ఞానాన్ని తెలియపరుస్తారు.  
ఎందరో మహానుభావులు అందరికీ వందనములు వారిలో ఒక్కరు త్యాగయ్యగారు.

కూర్పు: శ్రీ త్యాగరాజాచార్యులు 
రాగం: శ్రీ
తాళం: ఆది
గాయకుడు: Dr . మంగళంపల్లి బాలమురళీకృష్ణ

ఎందరో మహానుభావులు అందరికీ వందనములు 

చందురూ వర్ణుని అంద చందమును హృదయారవుందమున 
జూచి బ్రహ్మానందమనుభవించు వారెందరో మహానుభావులు

సామగాన లోల మనసిజ లావణ్య 
ధన్య ముర్ధన్యులెందరో మహానుభావులు

మానసవన చర వర సంచారము నెరిపి మూర్తి బాగుగ పొగడనే 
వారెందరో మహానుభావులు 

సరగున పాదములకు స్వాంతమను సరోజమును సమర్పణము
సేయువారెందరో మహానుభావులు

పతిత పావనుడనే పరాత్పరుని గురించి 
పరమార్ధమగు నిజ మార్గముతోను బాడుచును 
సల్లాపముతో స్వర లయాది రాగముల దెలియు 
వారెందరో మహానుభావులు

హరిగుణ మణిమయ సరములు గళమున 
షోభిల్లు భక్త కోటులిలలో తెలివితో చెలిమితో 
కరుణ గల్గి జగమెల్లను సుధా దృష్టిచే 
బ్రోచువారెందరో మహానుభావులు

హొయలు మీర నడలు గల్గ్గు సరసుని 
సదా కనుల జూచుచును పులక శరీరులై 
ఆనంద పయోధి నిమగ్నులై ముదంబునను యశము 
గలవారెందరో మహానుభావులు

పరమ భాగవత మౌని వర శశి విభాకర సనక సనందన 
దిగీశ సుర కింపురుష కనక కశిపు సుత నారద తుంబురు 
పవనసూను బాలచంద్ర ధర శుక సరోజభవ భూసురవరులు 
పరమ పావనులు ఘనులు శాశ్వతులు కమల భవ సుఖము 
సదానుభవులు గాక ఎందరో మహానుభావులు

నీ మేను నామ వైభవంబులను 
నీ పరాక్రమ ధైర్యముల శాంత మానసము నీవులను 
వచన సత్యమును రఘువర నీయెడ సద్భక్తియు జనించకను 
దుర్మతములను కల్గ జేసినట్టి నీమది నెరింగి 
సంతసంబునను గుణ భజనానంద కీర్తనము జేయు 
వారెందరో మహానుభావులు

భాగవత రామాయణ గీతాది శృతి శాస్త్ర పురాణపు మర్మములను 
శివాది సన్మతముల గూఢములన్ 
ముప్పది ముక్కోటి సురాంతరంగముల భావంబులనెరిగి 
భావ రాగ లయాది సౌఖ్యముచే చిరాయువుల్గలిగి 
నిరవధి సుఖాత్ములై త్యాగరాప్తులైన 
వారెందరో మహానుభావులు

ప్రేమ ముప్పిరి గొను వేళ నామమును దలచేవారు 
రామభక్తుడైన త్యాగరాజనుతుని 
నిజ దాసులైనన వారెందరో మహానుభావులు
అందరికీ వందనము-లెందరో మహానుభావులు

గురువారం, జనవరి 05, 2012

తిరుప్పావై ద్వివింశతి పాశురము

గురువారం, జనవరి 05, 2012

గోపికలు శ్రీ కృష్ణ పరమాత్మ వద్దకు చేరి మేల్కొనమని వెనుకటి పాశురములో ప్రార్ధించారు. వేరొక గతిలేక నీకే చెందినవారమని చెప్పారు. ఈ పాశురములో తమ ను మెల్లమెల్లగా కనువిచ్చి చూడవలసిందిగా అర్ధించుచున్నారు .
పాసురము:
  అంగణ్ మా ఞాలత్తరశర్, అబిమాన 
అంగణ్ మా ఞాలత్తరశర్, అబిమాన
పంగమాయ్ వందు నిన్ పళ్ళికట్టిల్ కీరే
శంగమ్ ఇరుప్పార్ పోల్ వందు తలై ప్పెయ్-దోమ్
కింగిణివాయ్ చ్చేయ్ద తామరై ప్పూప్పోలే
శెంగణ్ శిఱుచ్చిఱిదే యెమ్మేల్ విరయావో
తింగళుమ్ ఆదిత్తియనుమ్ ఎరుందాఱ్పోల్
అంగణ్ ఇరండుం కొండు ఎంగళ్మేల్ నోక్కుదియేల్

ఎంగళ్మేల్ శాపం ఇరింద్-ఏలోర్ ఎమ్బావాయ్


తాత్పర్యము:
సుందరము విశాలమగు మహా పృధ్వీ మండలము నంటాను ఏలిన రాజులు తమకంటే గొప్పవారు లేరనేది అహంకారమును వీడి తమను జయించిన సార్వభౌముని సింహాసనము క్రింద గుంపులు గుంపులు చేరి ఉన్నట్లు , మేమును అభిమాన భంగమై వచ్చి నీ సింహాసనము క్రింద గుంపులు గుంపులుగా చేరి ఉన్నాము. చిరుగంట ముఖమువలె విదియున్న తామరపువ్వులు వలె వాత్సల్యముచే ఎర్రగా నున్న నీ కన్నులను మెల్లమెల్లగా విచ్చి మాపై ప్రసరించుము.
సూర్య చంద్రులిరువురు ఒక్క సారి ఆకాశమున ఉదయించునట్లు ఉండేది నీ రెండు నేత్రములతో మావైపు కటాక్షిమ్చితివా! మేము అనుభావిమ్చియే తీరాలి అనే శాపాము వంటి కర్మ మమ్ములను వీడి పోవును.





ఎగిరిపోతే ఎంత బాగుంటుంది

 
                                          ఈ రోజు National Birds Day .
ఆకాశములోని కనిపించిన పక్షులును చూసి పంజరములో వున్నా ఈ పక్షి ఏమనుకుంటోంది అంటే ....ఎగిరిపోతే ఎంత బాగుంటుంది .
ఈ మనుషులు మనసులో కష్టము కలికినప్పుడు ఆకాశములోఉన్న మా పక్షులును చూసి నాకు రెక్కలు వచ్చి ఎగిరిపోతే ఎంతబాగుంటుంది అని పాడుకుంటారు. అవి హాయిగా ఆకాశం అంతా నాదే అని ఎగురుతూ వుంటే చూడటానికి ఎంతబాగుంది అనుకుంటారు.  మా శబ్దాలను (కిలకిల రవాలు) హాయిగా విని ఎంతో ఎంజాయ్ చేస్తారు.  పక్షులులో చాలా అందముగా అనేకానేక రంగుల్లో వుంటాయి.  ఇప్పుడు మాకు  కాలం బాలేదు అనిపిస్తోంది.  మాకు మనిషి అధికముగా అనేకరకాలుగా కష్టాన్ని కలిగిస్తున్నాడు.  చేట్లు నరికేసి మాకు నిలువు నీడలేకుండా చేస్తున్నాడు.  సెల్ ఫోన్ టవర్స్ కట్టి ఒకరకంగా మాఉనికినే పూర్తిగా తీసేస్తున్నాడు.  విపరీతమైన వాతావరణ కాలుష్యము చేసేస్తున్నాడు, ఇంకా దొరికితే తినేస్తున్నారు.  మరి కొందరు మాతో circus చేయించి డబ్బు సంపాదిస్తారు. కొందరు మాలో మాకు యుద్దాలు (కోడిపందాలు) పెట్టి మమ్ములను మేమే చంపుకునేటట్టు చేసి మమ్ములను తినేస్తున్నారు. అంతే కాదు భారతీయులు అయితే తమ జాతీయ పక్షిగా పెట్టుకున్న నెమలిని రెక్కలు పీకి నేమలీకలు అని చెప్పి అమ్మేస్తున్నారు.  రాజకీయనాయకులు, ధనవంతులు నెమలిని తింటున్నారు.  ఇంకా చెప్పాలి అంటే మా బాధలు చాలా వున్నాయి.  నాకు ఇలా చెప్తుంటే కళ్ళు నీళ్ళు కారుతున్నాయి.  పక్షులును చూసి ఆనందిచేవారు వాటిని cage  లో బంధించి మా స్వేచ్చను తొలగిస్తున్నారు.  మరలా మమ్ములను ఆకాశములో చూసి మేము రెక్కలు వచ్చి ఎగిరితే ఎంత బాగుంటుంది అని పాడుకుంటారు ఇదెక్కడి న్యాయం.  మాకు కష్టం కలిగించినా సరే కష్టంలో కూడా మాకు ఇల్లు మేమే కట్టుకొని వుంటే గూళ్ళు పీకేసి సంతోషిస్తున్నారు. మేము వంశమును పెంచుకోటానికి గుడ్లు పెట్టుకుంటే అవికూడా లాగేసుకొని తినేస్తున్నారు.  నాకే కనుక భగవంతుడు ఒక న్యాయస్తానం చూపిస్తే  న్యాయస్థానంలో  మనిషి మీద వారు చేస్తున్న ఆకృత్యాలమీద కేసుపెట్టాలని వుంది.  మాకు జరుగుతున్నా అన్యాయానికి గొంతెత్తి అరిచి మాకు న్యాయం చేయమని న్యాయపోరాటం చేయాలని వుంది.  మనుషులమని చెప్పుకుని జీవిస్తున్న జీవులకి మానవత్వం ఎక్కడుంది అని అడగాలని వుందిమాకు స్వేచ్చ స్వాతంత్రాలు కావాలని అడగాలని వుంది.  నన్ను నావారినుండి విడదీసే హక్కు మనుషులకు ఎవరిచ్చారని అడగాలని వుంది.   నాకు  పంజరము నుండి ఎగిరిపోవాలని వుంది. మా పక్షిజాతిని కాపాడండి.  దయచేసి నన్ను, మా జాతిని స్వేచ్చగా బ్రతకనీయండి. మానవులారా మేము మీలానే ప్రాణం కలవారమే.  దయచేసి మాకు హాయిగా బ్రతికే అవకాసము ఇవ్వండి.  ఇక మిమ్ములను మేము ఏమీ అడుగము.     దయ చేసి నన్ను వదిలేయండి.  మీకు మీ పెద్దలికి నా నమస్సులు . 

బుధవారం, జనవరి 04, 2012

తిరుప్పావై ఏకవింశతి పాశురము

బుధవారం, జనవరి 04, 2012

గోపికలు పురుష అహంకార భుతురాలగు నీలాదేవిని మేలుకోలిపిరి. ఆమె మేలుకొని "నేను మీలో ఒక్కదానినికదా! నన్ను ఆశ్రయించిన మీకేనాడు లోపముండదు. రండి!  మనమందరమూ కలసి శ్రీ కృష్ణుని మేల్కొల్పి అర్దింతము . " అని తానూ వచ్చి గోపికలతో శ్రీకృష్ణ భగవానుని సమీపమునకు వారిని తోడ్కొనిపోయి మేలుకొలుపు జొచ్చెను.

ఈ విధముగా శ్రీ కృష్ణుని మేలుకోల్పుతున్నారు. 

ఏత్త కలంగళ్ ఎదిర్ పొంగి మీదళిప్ప
మాత్తాదే పాల్ శొరియుం వళ్ళల్ పెరుం పశుక్కళ్
ఆత్త ప్పడైత్తాన్ మగనే! అఱివుఱాయ్     

ఊత్త ముడైయాయ్! పెరియాయ్! ఉలగినిల్
తోత్తమాయ్ నిర్ఱ శుడరే! తుయిల్ ఎరాయ్

మాత్త్తార్ ఉనక్కు వలి తొలైందు ఉన్-వాశఱ్కణ్
ఆత్తాదు వందు ఉన్-అడిపణియుమా పోలే
పోత్తియాం వందోం పుగరందు-ఏలోర్ ఎంబావాయ్

తాత్పర్యము:
పొదుగు క్రిందనుండి కడవలు చరాచర నిండి, పొంగిపొరలి నట్లు ఆగక, పాలు స్రవించు అసంఖ్యకములగు, ఉదారములగు, బలసిన ఆవులుగల నందగోపుని కుమారుడా! మేల్కొనుము. ప్రమాణదార్ఢ్యముగల పరబ్రహ్మస్వరూపా ! ఆశ్రితరక్షణ పృతిజ్ఞాధార్ఢ్యముగల మహామహిమ సంపన్నా! ఈ లోకములో ఆవిర్భవించిన జ్యోతిస్స్వరూపా ! నిద్ర నుండి లెమ్ము. శత్రువులు నీపరాక్రమమునకు లోకి నీవాకిటికి వచ్చి నీ దాసులై నీపాదారవిందముల నాశ్రయించినట్లు మేముకూడా నిన్ను వీడి యుండలేక నీ పాదములనే స్తుతించి మంగళాశాసనము చేయుటకై వచ్చితిమి. 
గోపికలు వారి పరిస్తితిని శ్రీ క్రిష్ణునికి నివేధించినారు.

ఉత్తరద్వార దర్శనము

ఉత్తరద్వార దర్శనము
ఒక సంవత్సరములో 24 ఏకాదశులు వస్తాయి. ప్రత్యక్ష దైవం సూర్యనారాయణమూర్తి  ఉత్తరాయణానికి మారే ముందు వచ్చేది పుష్య శుద్ధ ఏకాదశి దీనినే మనం  వైకుంఠ ఏకాదశి లేదా ముక్కోటి ఏకాదశి అంటారు. ఈ రోజున వైకుంఠములోని తలుపులు తెరుచుకొని ఉంటాయి.   వైష్ణవాలయాలలో గల ఉత్తరద్వారం దర్శనమునకు భగవద్ భక్తులు తెల్లవారుజామునే భగవద్దర్శనార్థం వేచి ఉంటారు.  

ఈ రోజు మహావిష్ణువు గరుడ వాహనారూఢుడై మూడు కోట్ల దేవతలతో భూలోకానికి దిగివచ్చి భక్తులకు దర్శనమిస్తాడు కనుక దీనికి ముక్కోటి ఏకాదశి అనే పేరు వచ్చిందంటారు. ఈ ఒక్క ఏకాదశి మూడు కోట్ల ఏకాదశులతో సమమైన పవిత్రతను సంతరించుకున్నందువల్ల దీన్ని ముక్కోటి ఏకాదశి అంటారు. ముక్కోటి ఏకాదశి నాడే హాలాహలం, అమృతం రెండూ పుట్టాయి. ఈ రోజునే శివుడు హాలాహలం మింగాడు.  ఈ ఏకాదశి చాలా విశిష్టమైనది.  

దేవతలు రాక్షస కృత్యాలకు భరించలేక బ్రహ్మ తో కూడి  
వైకుంఠము చేరి ఉత్తరద్వారములోనుండి లోపలి ప్రవేసించి శ్రీ మహావిష్ణువును దర్శించుకొని వారి బాధలు వివరించి స్వామివారి అనుగ్రహము  పొంది  రాక్షస పీడ వదిలించుకున్నారు.   నాటి నుండి 

వైకుంఠ ఏకాదశి విశేషము కలిగివుంది.  ఆరోజు ఉపవాసము వుంటే మంచిది. రాక్షస పీడ మనకు చేరదు అంటారు.  


మనము కూడా ఉత్తర ద్వారా దర్శనము చేసుకుందాం.  స్వామివారిని దర్శించుకుందాం.  కనులార్పకుండా దర్సిమ్చుకోవాలి.  స్వామివారి అందము చెప్పలేము మన దిష్టి తగులుతుందేమో.  ఆ దిష్టిని  హారతి ఇచ్చి  తీస్తారు.  మనము ఆ హారతిని మళ్ళీ కళ్ళకు అద్దుకొని మళ్ళీ దిష్టి పెట్టేస్తాం. అందుకే స్వామివారి హారితికి నమస్తే చేయాలి కాని కళ్ళకు అద్దుకోవద్దు అని మనవి.

మరి ఉత్తర ద్వార దర్శనము చేసుకోలేనివారు ఏమిచెయ్యాలి అంటే! మనదేహమే దేవాలయము అని  మన పెద్దలు చెప్పారు కదా.  మన తలపైన ఉత్తరము కదా.  so  కళ్ళు మూసుకొని మనము 

ఙ్ఞానదృష్టి తో స్వామీ దర్శనము చేసుకోవాలి అని అంటారు.  మానసికంగా భగవంతుని దర్శనము చేసుకోవచ్చు.  తప్పకుండా ఉత్తర ద్వారదర్శనము చేసుకోండి మరి.
జై శ్రీమన్నారాయణ్

లూయీ బ్రెయిలీ

లూయి బ్రెయిలీ

Breyili  keybord 



Alphabet bord
ప్రపంచ అంధులకు చదువుకొనే వీలు కలిగించిన మహనీయుడు లూయీ బ్రెయిలీ 1809 సం. జనవరి 4న పారిస్ దగ్గరలోని “క్రూవే” గ్రామంలో జన్మించాడు.  ఈ రోజు ఆయన పుట్టినరోజు.
లూయి బ్రెయిలీ కి చిన్నవయసులో ప్రమాదవశాత్తు రెండు కళ్ళను కోల్పోయి తన 4వ ఏట పూర్తిగా గుడ్డి వాడయ్యాడు. చదువుపై కొడుకు ఆసక్తిని గుర్తించి , పారిస్ లోని అంధుల పాఠశాలలో చేర్చాడు అతని తండ్రి. అప్పటికి అమలులో ఉన్న “లైన్ టైపు” పద్ధతిలో చదువుకుని,  తన ప్రతిభతో చివరికి అదే పాఠశాలలో టీచర్ గా  ఎదిగాడు బ్రెయిలీ.  పగలు విద్యార్ధులకు బోధిస్తూ, రాత్రులు అంధులు తేలికగా చదవగలిగే, రాయగలిగే లిపి తయారీకై  చాలా చాలా కృషిచేసాడు. 
1821 లో ఛార్లెస్ బార్బియర్ అనే సైనికాధికారి తన సైనికులు చీకటిలో కూడా తాను పంపిన సమాచారం గుర్తించేందుకు 12 ఉబ్బెత్తు చుక్కలతో సంకేత లిపిని తయారు చేసాడు.  ఆ సైనికాదికారి చుక్కలులిపి ఆయనకీ స్ఫూర్తి గా అనిపించింది.  అప్పుడు బ్రెయిలీ 12 చుక్కలను ఆరు చుక్కలగా  తగ్గించి అవసరమైన రీతిలో వాటిని పేర్చుతూ అక్షరాలను, పదాలను అంకెలను, సంగీత చిహ్నాలను రూపొందించాడు.బ్రెయిలీ తన కోసం తనలాంటి వారికోసం నిరంతర శ్రమచేసి చివరకు విజయం సాదించారు.  బ్రెయిలీ 1851 లో క్షయ వ్యాధికి గురై 1852 జనవరి 6న మరణించాడు.
బ్రెయిలీ శిష్యులు తమ గురువు గారు రూపొందించిన లిపికి గుర్తింపునివ్వాలని  పోరాటం చేయగా అతని లిపికి అధికార గుర్తింపునిచ్చినది ప్రాన్స్.
ఈనాడు ప్రపంచ అంధులుకోసం అన్ని రకాల పుస్తకాలు, పత్రికలు ఆ లిపిలోనే వస్తున్నాయి. వారందరూ చదువుతున్నారు అంటే అదంతా బ్రెయిలీ వల్లే అని చెప్పుకోవాటం లో ఎటువంటి సందేహం లేదుకదా.
మనం ఈ సందర్బములో ఇంకో విషయం కూడా చెప్పాలి అనుకుంటున్నాను.  గ్రుడ్డివారికోసం నేత్రదానం చేసి వారికి మన అందమైన సృష్టి అందాలు చూపించండి. ఒక మనషి తన కళ్ళు దానం చేస్తే అది ఇద్దరికీ కంటి చూపు వస్తుంది.  వారు మనలాగా అందమైన రంగుల ప్రపంచాన్ని చూడగలరు.  దయచేసి మీ తదనంతరం కళ్ళను బూడిదపాలు చేయకుండా గ్రుడ్డివారికి చూపును ప్రసాదించి ఆ కళ్ళద్వారా మీరూ జీవించండి.
 

నేత్రదానం (Donate Eyes) 

మంగళవారం, జనవరి 03, 2012

తిరుప్పావై వింశతి పాశురము

మంగళవారం, జనవరి 03, 2012

ముందు పాసురములో నీలాదేవిని మేలుకొల్పి,  శ్రీ కృష్ణుని మేలుకొలిపి కృష్ణుడుని ఎలాంటివాడో కీర్తిస్తూ నీలా దేవిని ఎలాంటిదో వర్ణిస్తూ ఆమెను శ్రీ కృష్ణుని వారితో స్నానం చేయుటకు పంపమని అర్ధిస్తున్నారు.  మరి ఎలా వర్ణిస్తున్నారంటే...

పాశురము:
  ముప్పత్తుమూవర్ అమరర్క్కు మున్ శెన్ఱు 
ముప్పత్తుమూవర్ అమరర్క్కు మున్ శెన్ఱు
కప్పం తవిర్క్కుం కలియే! తుయిల్ ఏరాయ్

శెప్పం ఉడైయాయ్! తిఱలుడైయాయ్ శేత్తార్క్కు
వెప్పం కొడుక్కుం విమలా! తుయిల్ ఎరాయ్
శెప్పన్న మెల్-ములై చ్చెవ్వాయ్ చ్చిఱు మరుంగుల్

నప్పినై నంగాయ్! తిరువే! తుయిలెరాయ్

ఉక్కముం తట్టొళియుం తందు ఉన్-మణాళనై 

ఇప్పోదే ఎమ్మై నీరాట్టు-ఏలోర్ ఎంబావాయ్
తాత్పర్యము:
ముప్పది మూడుకోట్ల అమరులకు వారికింకను ఆపద రాక ముందే పోయి , యుద్ధ భూమిలో వారికి ముందు నిలిచి , వారికి శత్రువుల వలన భయమును తొలగించే బలసాలీ ! మేల్కొనుము అర్జవము కలవాడా ! రక్షణము చేయు స్వభావము గలవాడా ! బలము కలవాడా ! ఆశ్రితుల శత్రువులనే నీ శ త్రువులుగా భావించి వారికి భయ జ్వరమును కలిగించువాడా ! నిర్మలుడా ! మేలుకో ! బంగారు కలశములను పోలిన స్థానములను, దొండపండువలెఎర్రని పెదవియును, సన్నని నడుమును కల ఓ నీలాదేవి! పరిపుర్ణురాలా! లక్ష్మీ సమానురాలా! మేలుకొనుము. వీచుటకు ఆలవట్టమును (hand fan) కంచుతద్దమును మా కోసంగి నీ వల్లభుడగు శ్రీ కృష్ణునితో కలసి మేము స్నానము చేయునట్లు చేయుము.
జై శ్రీమన్నారాయణ్

సోమవారం, జనవరి 02, 2012

తిరుప్పావై నవాదస పాశురం

సోమవారం, జనవరి 02, 2012

ముందు పాశురములో పొడుగు జుట్టు గల నీలాదేవి ని మేల్కొల్పి .  ఈ రోజు నీలాదేవిని మేలుకొలిపినా ఈ పాశురములో శ్రీ కృష్ణుని,నీలాదేవిని కూడా మేలుకోల్పవలసినది గా అర్ధించుచున్నారు.  లేచి వారితో మాటాలాడమని కోరుకొని నీలాదేవిని అర్ధిస్తున్నారు కాసేపు అయినా మాతో మాటాడనీ అంటున్నారు. మరి ఎలా అన్నది తెలుసుకుందాం.   నీలాదేవిని కీర్తిస్తున్నవారు ఈ పాశురములో అమ్మవారిని దర్శించ వచ్చునని పెద్దలు అంటారు

పాశురము 
  కుత్తు విళక్కెరియ కోట్టుక్కాల్ కట్టిల్మేల్ 

కుత్తు విళక్కెరియ కోట్టుక్కాల్ కట్టిల్మేల్
మెత్తెన్ఱ పంచ శయనత్తిన్ మేల్ ఏఱి
కొత్తలర్ పూంగురల్ నప్పిన్నై కొంగైమేల్
వైత్తు క్కిడంద మలర్ మార్బా! వాయ్ తిఱవాయ్
మైత్తడంకణ్ణినాయ్! నీ ఉన్-మణాళనై
ఎత్తనై పోదుం తుయిలెర ఒట్టాయ్ కాణ్
ఎత్తనై యేలుం పిరివాత్తగిల్లాయాల్
తత్తువమన్ఱు తగవ్-ఏలోర్ ఎంబావాయ్


తాత్పర్యము: ఒక గుత్తి దీపములు చుట్టును వేలుగుచుండగా , ఏనుగు దంతము లతో చేయబడిన కోళ్ళు గల మంచముపై నున్న, చల్లదనము, మెత్తదనము, తెల్లదనము,ఎత్తు , వెడల్పు కలిగిన పాన్పులపై ఎక్కి , గుత్తులు గుత్తులుగా వికసించుచున్న పూలు తలలో ముడుచుకోనిన కేశ పాశము గల నీలాదేవి యొక్క స్థనములపై తన శరీరమును ఆనుకొని పరుండి విశాలమైన వక్షస్థలము గల శ్రీ కృష్ణా నోరు తెరచి మాట్లాడు . కాటుక పెట్టికోనిన విశాలమైన కన్నులు కల ఓ నీలాదేవి ! నీవు నీ ప్రియుని ఎంతసేపు లేవనీవు?ఇంత మాత్రపు ఎడబాటుకుడా ఓర్వ లేకుండుట నీ స్వరుపమునకు, నీ స్వభావమునకు తగదు.  

డా.హరగోవింద ఖురానా

హరగోవింద ఖురానా
జీవరసాయన శాస్త్ర పరిశోధనలకు మొదటగా బంగారు బాట వేసినది  డా.హరగోవింద ఖురానా .  ఈయన పంజాబ్ లోని  కుగ్రామం రాయ్‌పూర్‌లో 1922  జనవరి 2  న లో జన్మించారు. ఈ గ్రామము ప్రస్తుత పాకిస్థాన్‌లో ఉన్నది. ఆ గ్రామంలో పేదరికంలో పుట్టి పెరిగిన ఆయనకు 1968లో వైద్యశాస్త్రంలో నోబెల్ బహుమతి లభించింది.  Massachusetts Institute of Technology (MIT) జీవ, రసాయనిక శాస్త్ర విభాగాల్లో ప్రొఫెసర్‌గా పనిచేశారు. 


ప్రొటీన్ల సంశ్లేషణలో ఆర్‌ఎన్‌ఏ సంకేతాల తీరుపై చేసిన పరిశోధనలు ఆయనకు నోబెల్ బహుమతిని తెచ్చిపెట్టాయి. 
మరో ఇద్దరితో కలసి ఆయన ఈ బహుమతిని పంచుకున్నారు.  డీఎన్‌ఏ రసాయనిక ధర్మాలపై జరిపిన పరిశోధనలు ఆయనకు ఎనలేని కీర్తిప్రతిష్టలు తెచ్చిపెట్టాయి. విస్కాన్సిన్ వర్సిటీలో 1960-70ల కాలంలో ఆయన సాగించిన పరిశోధనలు పలు భావి ఆవిష్కరణలకు దోహదపడ్డాయి. విస్కాన్సిన్‌లో దాదాపు దశాబ్దకాలం బోధన, పరిశోధనలు కొనసాగించిన తర్వాత ఆయన MITలో చేరారు. యువ శాస్త్రవేత్తలకు తర్ఫీదు ఇచ్చేందుకు తన ఎక్కువగా ఇష్టపడేవారు. రిటైరైన తర్వాత కూడా పలువురు యువ శాస్త్రవేత్తలు ఆయన వద్దకు వచ్చేవారని అన్నారు. 




"Gobind was a brilliant, path-breaking scientist, a wise and considerate colleague, and a dear friend to many of us at MIT, said Chris Kaiser, MacVicar professor of biology and head of the department of biology, in an e-mail announcing the news to the department 's faculty.

పేదరికంలోనూ తమను చదివించేందుకు తన తండ్రి తన జీవితాన్నే అంకితం చేశారని ఖురానా తన ఆత్మకథలో రాసుకున్నారుఅతని విజయంలో ఒక సోదరి మరియు ముగ్గురు సోదరులు బాగా support  గా నిలిచారని.  తన తండ్రి బ్రిటిష్ ఇండియన్ ప్రభుత్వ నకు  ఒక పట్వారి  (ఒక వ్యవసాయ పన్నుclerk) గా పనిచేసేవారనీ .దాదాపు వంద కుటుంబాలు గల తమ స్వగ్రామంలో అక్షరాస్యత సాధించిన తొలి కుటుంబం తమదేనని ఆయన చెప్పుకున్నారు. ముల్తాన్ వద్ద హైస్కూలు విద్య పూర్తి చేసుకున్న ఖురానా, పంజాబ్ వర్సిటీ నుంచి 1943లో కెమిస్ట్రీలో డిగ్రీ, 1945లో బయోకెమిస్ట్రీలో పీజీ పూర్తి చేశారు. గ్రాడ్యుయేషన్‌లో ఉండగానే, బ్రిటన్‌లోని లివర్‌పూల్‌లో చదువుకునేందుకు ఆయనకు స్కాలర్‌షిప్ లభించింది. అక్కడే ఆయన 1948లో పీహెచ్‌డీ పూర్తి చేశారు. స్విట్జర్లాండ్‌లోని ఫెడరల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో పోస్ట్‌డాక్టరల్ పరిశోధనలు సాగించారు. తను ఈ స్తాయికి చేరటానికి జీవితంలో చాలా కష్టపడ్డారని తన biography లో రాసుకున్నారు.


కేంబ్రిడ్జిలో మరో పోస్ట్‌డాక్టరల్ పరిశోధన చేశారు. కెనడాలోని బ్రిటిష్ కొలంబియా వర్సిటీలో ఉద్యోగం లభించడంతో 1952లో వాంకోవర్ నగరానికి చేరుకున్నారు. అక్కడ ఎనిమిదేళ్లు ఉద్యోగం చేశాక, 1960లో అమెరికాలోని విస్కాన్సిన్ వర్సిటీలో చేరారు. అక్కడే ఆయన ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఎంజైమ్ రీసెర్చ్ కోడెరైక్టర్‌గా బాధ్యతలు చేపట్టి, కీలకమైన పరిశోధనలు సాగించారు.  ఈయన నవంబర్ 9 , 2011  న పరమపదించినారు.
ఇండియన్ స్టూడెంట్స్ ఆయనని చూడటానికి వెళ్ళినప్పుడు
డా.హరగోవింద ఖురానా
జననము                     - 1922  జనవరి 2  న
మరణము                    - నవంబర్  9, 2011 న   
మాతృదేశము                     -భారతదేశము  
జాతీయత                           - భారతీయుడు 
రంగము                             -జీవ, రసాయన శాస్త్రము
ముఖ్య విభాగము                -Massachusetts Institute of Technology 
ముఖ్య పురస్కారాలు          -
నోబెల్ బహుమతి

జై హింద్

ఆదివారం, జనవరి 01, 2012

తిరుప్పావై అష్టాదస పాశురము

ఆదివారం, జనవరి 01, 2012

గోపికలు కృష్ణుని పొంది యనుభవించాలని ఆవేసముచే కృష్ణపరమాత్మ కనిపించగానే తామూ అనుభవించ వచ్చునని తొందరగా మేలుకొన్నారు. కాని శ్రీ కృష్ణుడు మేలుకోలేదు. తరువాత బలరాముని మేలుకోల్పారు . అప్పుడు కుడా కృష్ణుడు మేలుకోలేదు . తెలివి తెచ్చుకొని నీలాదేవి ద్వారా మేలుకోల్పవచ్చని ఆమెని మేలుకోల్పుతున్నారు ఈ పాశురములో . 

పాశురము:
  ఉందు మదకళిత్తన్-ఓడాద తోళ్ వలియన్ 

ఉందు మదకళిత్తన్-ఓడాద తోళ్ వలియన్
నంద గోపాలన్ మరుమగళే! నప్పిన్నాయ్!
కందం కమరుం కురలి కడై తిఱవాయ్ వంద్
ఎంగుం కోరి అరైత్తన కాణ్ మాదవి
ప్పందల్ మేల్ పల్గాల్ కుయిల్ ఇనంగళ్ కూవిన కాణ్
పందార్ విరలి ఉన్ మ్మైత్తునన్ పేర్ పా డ
శెందామరై క్కైయాల్ శీరార్ వళై ఒలిప్ప
వందు తిఱవాయ్ మగిరింద్-ఏలోర్ ఎంబావాయ్


తాత్పర్యము :
ఏనుగులతో పోరాడగలిగినవాడును, మదము స్రవించుచున్న ఏనుగు వంటి బలముకలవాడును, మదము స్రవించుచున్న ఏనుగులు కలవాడును, యుద్దములో శత్రువులను చూచి వెనుకకు జంకని భుజబలము కలవాడును అయిన నందగోపుని కోడలా ! సుగంధము వెదజల్లు కేశ పాశము గల ఓ నీలాదేవి ! తలుపు గడియ తెరువుము . కోళ్ళు అంతటా చేరి అరుస్తున్నాయి . మదవీలతప్రాకిన పందిరిమీద గుంపులు గుంపులుగా కూర్చొని కోకిలలు కూస్తున్నాయి. కావున తెల్లవారినది , చూడు. బంతిని చేతిలో పట్టుకోన్నదానా! మీ బావ గుణములను కీర్తించుటకు వచ్చితిమి . నీవు సంతోషముతో లేచి నడచి వచ్చి. ఎర్ర తామర పూలు ను పోలిన నీ చేతితో, అందమైన చేతి కంకణములు గల్లుమని ధ్వని చేయునట్లు తలుపు తెరువుము.  అని నీలాదేవిని కీర్తిస్తున్నారు . ఈ పాశురములో అమ్మవారిని దర్శించ వచ్చునని పెద్దలు అంటారు.

జై శ్రీమన్నారాయణ్

సర్ శాంతి స్వరూప్ భట్నాగర్


శాంతి స్వరూప్ భట్నాగర్ 
శాంతి స్వరూప్ భట్నాగర్ ప్రైజులు ప్రతీ సంవత్సరం 5 శాస్త్ర, సాంకేతిక రంగాలలో కౌన్సిల్ ఫర్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసర్చ్ ద్వారా బహుమతించబడతాయి.
జీవ శాస్త్రాలు
భూమి, వాతావరణ, అఘాత మరియు ఖగోళ శాస్త్రాలు
భౌతిక శాస్త్రాలు
వైద్య శాస్త్రాలు
రసాయన శాస్త్రాలు
సాంకేతిక శాస్త్రాలు
గణిత శాస్త్రాలు
శాంతి స్వరూప్ భట్నాగర్ (ఫిబ్రవరి 21, 1894 – జనవరి 1, 1955) ప్రసిద్ధిగాంచిన భారతీయ శాస్త్రవేత్త. భట్నాగర్ ను భారత పరిశోధన శాలల పితామహుడిగా అభివర్ణిస్తారు. బ్రిటీష్ ఇండియాలోని షాపూర్ (ఇప్పుడు పాకిస్థాన్ లో ఉంది)లో జన్మించాడు.ఈయనికి  చిన్నప్పటి నుంచి బొమ్మలు, యంత్ర పరికరాలు చేయటంలో ఆసక్తి కనబరిచేవారు.  వీరి పరిశోధనలు ఎక్కువగా పారిశ్రామిక రసాయనాలపై జరిగింది. ఆయన శాస్త్రీయ పరిశోధనకు 1941లో బ్రిటన్ ప్రభుత్వం సర్ బిరుదును ప్రదానం చేసింది.భారత స్వాతంత్యం తరువాత కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రిసెర్చ్ సంస్థకు తొలి డైరెక్టర్ జనరల్ పదవి అలంకరించాడు.  మన దేశంలో మొత్తం 12 పరిశోధన శాలలను ఈయన స్థాపించాడు.  ఈతని జ్ఞాపకార్ధం భారత ప్రభుత్వం శాంతి స్వరూప్ భట్నాగర్ పురస్కారం స్థాపించింది.  అంత గొప్ప శాస్త్రీయవేత్త గురించి తెలుసుకొని ఆయనికి నివాళు అర్పిస్తున్నాను. 
జననం                                  -ఫిబ్రవరి 21 1894, పంజాబ్, బ్రిటిష్ ఇండియా
మరణం                                 -జనవరి 1 1955,  న్యూఢిల్లీ, భారతదేశం
నివాసం                                 -భారతదేశం  
జాతీయత                               -భారతీయుడు
రంగము                                 -రసాయన శాస్త్రం
సంస్థ                                      -శాస్త్రీయ మరియు పారిశ్రామిక పరిశోధనా కౌన్సిల్
మాతృ సంస్థ                           -పంజాబ్ విశ్వవిద్యాలయం  యూనివర్శిటి కాలేజ్ ఆఫ్ లండన్
ప్రాముఖ్యత                             -భారతీయ ఖగోళ కార్యక్రమం
ముఖ్య పురస్కారాలు               -పద్మవిభూషణ్  OBE , Knighthood 
జై హింద్ 

My Blog Lovers

నా యూట్యూబ్ చానల్స్ ప్లీజ్ సబ్స్క్రిబ్ చేయండీ

Diabetic Challenger

DIABETIC CHALLENGER YOUTUBE CHANNEL. PLASE SUBSCRIBE MY CHANNEL...... THANK YOU VERY MUCH.

Ammamma Tho Nenu (అమ్మమ్మ తో నేను

Please subscribe our channel Ammamma Tho Nenu (అమ్మమ్మ తో నేను)