Blogger Widgets

బుధవారం, జూన్ 13, 2012

Back 2 School.

బుధవారం, జూన్ 13, 2012


హమ్మయ్య స్కూల్ తెరిచారు అని పెద్దవాళ్ళు అనుకుంటూ వుంటారు.  మాలాంటి పిల్లలేమో అప్పుడే సెలవులు అయిపొయాయీఈఈఈ . అని అనుకుంటారు కదండి.  మరి పెద్దవాళ్ళు అలా అనుకోవటానికి కారణం వుంది .  సమ్మర్ హాలిడేస్ లో మనం  బాగా అల్లరి చేసాం.  చెప్పిన మాట వినకుండా ఎండలో అదేసుకున్నాం.  సమ్మర్ హాలిడేస్ ఇచ్చేముందు మనం ఎన్నో ప్లాన్స్ చేస్తూవుంటాము.  ఏవో చేసేయాలి అని అనుకుంటాము .  ఆకరికి ఏమీ చేయము కదండి.  నేను కూడా అలానే చేసాను అందుకే ఇలా అంటున్నాను.  మొత్తానికి సమ్మర్ అయిపోయింది.  స్కూల్ తెరిచేశారు.  కొత్త స్కూలు, కొత్త క్లాస్సు, కొత్త ఫ్రెండ్స్, కొత్త టీచర్స్, కొత్త డ్రస్సులు, కొత్త బుక్స్, అన్నీ కొత్తే.  పుస్తకాలుకు  అట్టలు వేసుకోవటం ఇవన్నీ తలచుకుంటేనే నాకు బలే సరదాగా, గమ్మత్తుగా,  ఆనందముగా వుంది. మరి మీకు కూడా నాలేనే వుందా.  స్కూల్  కి వెళ్ళగానే మన రోజు prayer తో మొదలు అవుతుంది.  prayer లో ముందుగా వందేమాతరం పాడి తరువాత దేవుని ప్రార్ధించి ఆ తరువాత Indian Pledge చెప్తాము.  తరువాత ఎవరి క్లాస్సేస్ లో వారు క్యూలో వెళ్తాం.  మొదటి బెల్ తో క్లాస్స్లు మొదలు అవుతాయి.  మద్యలో breaks తో క్లాస్లు అయిపోయాక ఆఖరి బెల్ కొట్ట గానే జనగణమన పాట  పాడి జైహింద్  చెప్పి   ఇంటికి వెళ్ళిపోవాలని తొందరలో పెద్దగా అరుచుకుంటూ స్కూల్ బయటికి వచ్చి దూరం వెళ్ళేవాళ్ళు బస్సు ఎక్కి ఇంటికి వెళ్ళిపోతాం.  అలారోజు మనరోజులు జరుగుతాయి.  మద్య మద్యలో సండే హాలిడేస్ ను సంతోషంగా గడుపుతూ , ఎగ్జామ్స్ రాస్తూ సంతోషంగా స్కూల్ రోజులు గడుపుతాం,  నాకు బలే exciting గా వుంది ఎప్పుడు ఎప్పుడు తెల్లారుతుందా స్కూల్ కి ఎప్పుడు వెళ్దామా అని.  మరి మీకు.  స్కూల్ కి వెళ్ళేటప్పుడు కొన్ని జాగ్రత్తలు కూడా పాటిస్తే బాగుంటుంది అని మా అమ్మ నాకు చెప్పింది.  ఎలాంటి జాగ్రత్తలో చెప్పెసుకుందాం.   స్కూల్ కి నీటుగా యునిఫోరం వేసుకొని, టైం కి వెళ్ళాలి.  స్చూల్లో బుక్స్ అన్నీ జాగ్రత్తగా మనవి మనవి జాగ్రత్తగా వుంచుకోవాలి.  ఎవరితోనూ కొట్లాడుకోకూడదు.  టీచర్ చెప్పే ప్రతీవిషయాని  గుర్తుపెట్టుకోవాలి.  ఎప్పుడు అబ్సేంట్ కాకూడదు.  స్కూల్ నుండి బయటికి ఎవరు పిలిచినా వెళ్ళకూడదు.  మన పరెంత్స్ యొక్క ఫోన్ నెంబర్ ,మరియు స్కూల్  ఫోన్ నెంబర్ మనదగ్గర వుండాలి.  ఇంకా ఇలాంటి జాగ్రత్తలు తెలుసుకొని. ముఖ్యంగా బాగా చదువుకొని మనం మంచి పిల్లలమని అందరు మెచ్చుకునేట ట్టు తయారు అవ్వాలి.  నాలాగే కొత్తగా కొత్త క్లాస్సులోకి వెళ్లినవారికి అందరికి 
All  The Best.  


    

శనివారం, జూన్ 09, 2012

నా బంగారు పుట్టలో వేలు పెడితే కుట్టనా

శనివారం, జూన్ 09, 2012

మన ఇళ్ళల్లో చిన్నప్పుడు అందరు ఈ కధ వినేవుంటారు.  ఈ కధను వినని  వాళ్ళు వుండరు.  ఇంతకీ ఆకధ ఏమిటి అని అనుకుంటున్నారు కదా.  ఆకధ  పేరు చెప్పగానే ఈ కదా అని అనేస్తారు అని నాకు తెలుసు.  నా చిన్నప్పుడు చాలా ఇష్టంగా విన్న కదా ఇది.  అందుకే మీకు కూడా చెప్తున్నాను.  ఆ కధ  ఇదే 
అనగనగా ఒక రాజు గారున్నారు. ఆయనకు ఏడుగురు కొడుకులు. వారు ఒకనాడు వేటకు వెళ్ళారు. ఏడు చేపలు తెచ్చారు. వాటిని ఎండబెట్టారు. వాటిలో ఒకటి ఎండలేదు.
చేపా ! చేపా ! ఎందుకెండలేదంటే, గడ్డిమోపు అడ్డమైందని చెప్పింది.
గడ్డిమోపా ! గడ్డిమోపా ! ఎందుకడ్డమొచ్చావంటే, ఆవు నన్ను మేయలేదంటుంది.
ఆవా ! ఆవా ! ఎందుకు మేయలేదంటే, పాలేరు మేపలేదంటుంది.
పాలేరా ! పాలేరా ! ఎందుకు మేపలేదంటే, అవ్వ బువ్వ పెట్టలేదంటాడు.
అవ్వా ! అవ్వా ! ఎందుకు బువ్వ పెట్టలేదంటే, పిల్లవాడు ఏదుస్తున్నాడంటుంది.
పిల్లవాడా ! పిల్లవాడా ! ఎందుకు ఏడుస్తున్నావంటే, చీమ కుట్టిందంటాడు.
చీమా ! చీమా ! ఎందుకు కుట్టావని అడిగితే,

నా బంగారు పుట్టలో వేలు పెడితే కుట్టనా అంటుంది. 


ఈ కధను ప్రతీ చిన్న పిల్లలు అమాయకంగా వింటారు కదండి .   సరే మనం ఈ కధను రివర్స్ లో చెప్పెసుకుమ్దాం.  సరేనా.  మరి మన కధలో నిజం గ్రహించాలి ఒకేనా.  మన కధలో రివర్స్ అన్నం కదా కావునా చీమ దగ్గర నుండే మొదలు పెడదాం.  ఓకే.
ANTS - Animation Training School, Ahmedabad - Ahmedabad 
 
ఒక చీమ  గొప్పగా ఆనందం గా అటుగా వెళ్తోంది.  చీమ  ఏమి సాధించావని అంత గొప్పగా వెళ్తున్నావ్  అని అడగగానే.  ఆ చీమ ఇలాఅంది అవును నేను చాలా సంతోషంగా వున్నాను ఎమ్డుకంటే నా బంగారు పుట్టలో వేలుపెట్టిన  ఒక పిల్లాడిని నేను కుట్టాను అందుకే అంది.  ఆ పిల్లాడు ఏడుస్తున్నాడు అంది.  అయ్యో పాపం చిన్న పిల్లాడును కుట్టి సంతోషిస్తున్నావా.  వాళ్ళ దాడికి తెలిస్తే గమేక్సిన్ వేసి నిన్ను చంపేస్తాడు తెలుసా.  అరే  వాడికి అంత కధలేదు.  వాడికి కొడుకు మీద నిజంగా  ప్రేమే వుంటే ముందు   తన కొడుకు సంగతి చూసికొని పిల్లాడికి పాలు పట్టేవాడు . 
తన కొడుకుకి పాలు పట్టలేదా !!!!  :O  ఎందుకలా????
తన కొడుకు ఏడుస్తున్నాడు అన్న బాధతో ఆ రైతు ఆవును వదలలేదు  ఆ ఆవు గడ్డి మేయలేదు.  పాలివ్వలేదు.
గడ్డి మిగిలింది అనుకుంటున్నావా.  అలా మిగిలిన గడ్డిని సైనికులు పారేసారు.  నిలవ వున్న గడ్డిని పారేస్తారులే అనుకుంటున్నవేమొ అదేమికాదు .  అలాచేయటానికి ఒక  కారణం వుంది.  ముందురోజు రాజుగారి ఏడుగురు కొడుకులు చేపలు తెచ్చి ఎండ పెడితే అవి ఎండకుండా చేసింది గడ్డి అని గడ్డిని పాడుచేసారు.
ఇది రివర్స్ కధ.  దీనిలో నీతి కూడా వుండండి.  వరసగా చెప్పేస్తూ వచ్చింది ఈ చీమ.
చిన్న పిల్లాడు ఏడుస్తూ వుంటే  ఆ రైతు తన కర్తవ్యం మరిచి ఆవుకి మేతవేయలేదు.  అందుకు అతనికి నష్టం జరిగినది.  గడ్డి దుబ్బు అడ్డువస్తే చేపలు ఎండవన్న చిన్న విషయాన్ని కూడా గ్రహించకుండా గడ్డి పాడుచేయటమే కాకుండా మంచి బోజనాన్ని మిస్  అయ్యారు.  ఈ మూర్ఖ రాకుమారులు.  ఆ  రాకుమారుల ఆదేశాన్ని పాటించారు . వారు చేయవలసిన పని ఏమిటి దేశాన్ని కాపాడటం.  వాళ్ళ టైం  ను వృదాచేసారు.  గడ్డి పాడు చేయటానికి ఉపయోగించారు.  వారి చేతకాని తనాన్ని కోపాన్ని గడ్డిమీద చూపించారు.  చీమ  ఆకారాన  ఇలా కూడా అంది అవతలి వారి సామ్రాజ్యంలో అనావసరంగా వేలు పెడితే కుట్టడం తప్పాడు అని.  చూసావా నా కర్తవ్యాన్ని నేను సరిగానే నిర్వర్తించాను అందుకే సగర్వంగా తిరుగుతున్నా అంది చీమ.  ఎవరి పని వారు చేసుకోవాలి కానీ.  తన చేతకాని తనాన్ని వేరేవారి మీదకు నెట్ట కూడదు అని ఉపోద్గాతము తో పాట  పాడుకుంటూ వెళ్లి పోయింది చీమ. ఇదండి  కధ .  మరి మీకు నచ్చిందా.  నచ్చలేదో చెప్పేయండి.   

శనివారం, మే 26, 2012

Energy Saving Tips

శనివారం, మే 26, 2012

A family is carelessly and unknowingly wasting energy from the moment they wake up. Until something unexpectely happens.


Please follow these tips and save energy.

గురువారం, ఏప్రిల్ 05, 2012

Which syllabus is best? SSC, or CBSE?

గురువారం, ఏప్రిల్ 05, 2012

My mom is planing to change me a school.   You know at present I am studying  5th Class with SSC syllabus. My mom planning to join me in 6th in one of the good school, but the thing is we are in confusion about to join me  in SSC or CBSE? Our actual requirement is I  should be well and good in communication and also everything should be very good in presenting the information? Could you please suggest which is the good SSC syllabus  or CBSE syllabus ? Please suggest us.

గురువారం, మార్చి 22, 2012

2012 ప్రపంచ జలదినము

గురువారం, మార్చి 22, 2012

హాయ్ ఫ్రెండ్స్. నేడు 22 వ మార్చి 2012 ప్రపంచ జలదినము గా జరుపుకుంటున్నాం.  ఈనాటి జలదినోత్సవం జలము మరియు ఆహార భద్రాత అన్న థీమ్ తో జరుపుకుంటున్నాం.  ఆరోగ్యకరమైన ప్రపంచం కొరకు నీరు శుభ్రంగా వుంచుకోవాలి. అన్న ముఖ్య ఉద్దేశముతో జలదినము జరుపుకుంటున్నాం.

మనకు నీరు చాలా విలువైనది.  నీరు మనము బ్రతకటానికి ఎంతో ఉపయోగకరమైనది.  ఇది మనకు ప్రకృతి ఇచ్చిన వరప్రసాదంగా భావించాలి అని నా అభిప్రాయం.  నిత్యావసరాలు అన్నీ నీటితోనే నిండి వుంది.  మనము దాహం వేసినప్పుడు నీరు దొరకపోతే. మన ప్రాణాలు నీటికోసము కొట్టుకు పోతాయి.  ఆ క్షణములో గ్రుక్కెడు నీళ్ళు దొరికితే మన ప్రాణాలు నిలబడినట్టు వుంటుంది.  అటువంటి నీటిని మనము చాలా జాగ్రత్తగా వాడుకోవాలి కదండి.  

అంతర్జాతీయ ప్రపంచ జల దినోత్సవం మంచినీటి యొక్క ప్రాముఖ్యతపై దృష్టి సారించవచ్చు మరియు మంచినీటి వనరులకు  స్థిరమైన నిర్వహణ కోసం ఒక ఆలోచనకోసం మార్చి 22 న ప్రతి సంవత్సరం నిర్వహింస్తున్నారు. మంచినీటి జరుపుకునేందుకు ఒక అంతర్జాతీయ రోజు ఎన్విరాన్మెంట్ అండ్ డెవలప్మెంట్ (UNCED) 1992 వ సంవత్సరములో యునైటెడ్ నేషన్స్ సమావేశం వద్ద సిఫార్సు జరిగినది. యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ మొదటి ప్రపంచ జల దినోత్సవం గా మార్చి 1993 , 22  న  కేటాయించడం ద్వారా ప్రతిస్పందించారు. ప్రతి సంవత్సరం, ప్రపంచ జల దినోత్సవం మంచినీటి ఒక ప్రత్యేకముగా హైలెట్ చేసారు. 


ఈరోజు జలదినోత్సవ సందర్భముగా మనము నీటిని వృదా చేయద్దు అన్నవుద్దేసము తో ఇవిధంగా చెప్తున్నాను.  జనరల్ గా మనము నీటిని చాలా విదాలుగా వృదాచేస్తున్నాము.  ఉదాహరణకి మనలో చాలా మంది  దినచర్యలో  వారి దంతాలు బ్రష్ చేస్తూ tap విప్పి బ్రష్ కంప్లేట్ అయ్యేవరకు వదిలేస్తాము.   షవర్ ద్వారా బాత్రూమ్ లలో  ట్యాప్ ఉచితంగా నడుస్తున్న వదిలి యొక్క అలవాటు ఉంటుంది.ఇటువంటి imprudence అనవసరముగా నీరు వ్యర్థం అవటానికి కారణమవుతుంది.  

ఆరోగ్యకరమైన ప్రపంచము కోసము పరిశుద్ధ నీరును పొదుపుగా మనము వాడుకుందాం.  దీనికోసము మనము అనావసరముగా నీటిని వృదా చేయద్దు.  మరియు పరిశుద్ధ నీటిని కలుషితము చెయ్యద్దు అని ప్రామిస్ చేద్దాం.

మంగళవారం, మార్చి 13, 2012

చిన్న విన్నపము

మంగళవారం, మార్చి 13, 2012

ఈ రోజు మీదగ్గరకు రెండు విన్నపాలతో వచ్చానండి అవేమిటి అనుకుంటున్నారా చెప్తాను ఆగండి తొందరఎందుకు. చిన్న విన్నపము : మొబైల్  టవర్  రేడియేషన్కి  చిన్న  చిన్న  పిట్టలు  క్రమక్రమముగా  అంతరించి  పోతున్నాయి . ఇలా  ఒక  పెట్  బాటిల్ కి  రెండు  చెక్క  చెంచాలు  పెట్టి , అందులోకి  కాసిన్ని  గింజలు  వచ్చేలా  ఏర్పాటు  చేసి , మీ  ఇంటిముందు  ఇలా  వ్రేలాదేలా  చెయ్యండి . అక్కడికి  ఆ పిట్టలు  వచ్చేసి , ఆ  చేమ్చాల్  మీద  వాలి , గింజలని  తిన్తుంటాయి . మరచిపోరని  ఆశిస్తున్నాను .  ఇది నా ఆలోచన కాదండి పేస్ బుక్ లోని  అచ్చంపేట  రాజు గారి ఆలోచన.  ఈ ఆలోచన నాకు బాగా నచ్చేసింది. నేను ఇలా చేసాను.  నాలాగే మీకు కూడా పక్షులు మీద ప్రేమ వుంటుంది కదా మీరు మరి ఇలా చేయండి.   ఈ సంధర్బములో అచ్చంపేట  రాజు గారికి ధన్యవాదములు తెలుపుకుంటున్నాను.  ఇలాంటి మంచి ఐడియా ఇచ్చినందుకు.
 
ఇప్పుడు వేసవికాలం వచ్చేసింది కదండి.  నీళ్ళు దొరకక అప్పుడే పక్షులు వెతుక్కుంటున్నాయి.  వాటి కోసం దయచేసి మీరు ఒక పని చేయాలి.  అదేమిటనుకుంటున్నారా.  చాలా సింపుల్ అండి.  ఒక చిన్న కుండ లేక బెసెన్ లో నిండా నీరు పోసి మీ ఇంటిముందు బాల్కనిలో వుంచండి. అక్కడికి దాహంగా వున్నా పక్షులు వచ్చి వాటి దప్పికను తీర్చుకుమ్టాయి.   మీ ఇల్లు ఆపర్ట్మెంట్ కాకపొతే వీలు అయితే జంతువులు కూడా దాహం తీర్చుకోనేటట్టు చేయండి.
మనము మన చుట్టూవున్న పక్షులును జంతువులును కాపాడాలి.  ఎందుకు అంటే అవి వాటి సమస్యను మాట్లాడి  మనకు చెప్పలేవు కదా. దయచేసి నోరు లేని జంతువులను కాపాడండి. 

సోమవారం, ఫిబ్రవరి 13, 2012

Want Volunteer

సోమవారం, ఫిబ్రవరి 13, 2012




Hello friends in Hyderabad, 

Sai Junior College for the Visually Challenged needs scribes for their prefinal exams for Inter IInd year students from the 15th of Feb from 10 am to 1 pm. Kindly volunteer and help these students if you have time. 
The schedule is as follows:
15th Feb: Civics
16th Feb: Economics
17th Feb: Commerce/ History

21st Feb: Sanskrit/Telugu
22nd Feb: English.
Kindly contact Sanjeev Chowdary Kosaraju (9885780693 or sanjeevkosaraju@gmail.com ) with the day you want to volunteer.

They need 75 people for every exam. so please share it within ur respective networks n help them. the address is Sai Junior College, Ranigunj (100 metres from Bible House on the road towards to Lower Tank Bund, opposite to "Home for the Disabled, Secunderabad").

Please Help Them.

బుధవారం, ఫిబ్రవరి 08, 2012

ధర్మో రక్షతి రక్షితః - అవునా/కాదా

బుధవారం, ఫిబ్రవరి 08, 2012

ధర్మో రక్షతి రక్షితః అనే వాక్యం అందరికి తెలిసినదే ఆ పదము ఎక్కడిది అంటే వాల్మీకి రచించిన రామాయణంలోని ఒక శ్లోకంలోనిది. ఈ వాఖ్యము ప్రజా ప్రాముఖ్యం పొందిన వాక్యాలలో ఇది ఒకటి. ఈ వాక్యం యొక్క అర్ధం "ధర్మాన్ని మనం రక్షిస్తే ఆ ధర్మం మనల్ని రక్షిస్తుంది".
రామాయణంలో ఈ వాక్యం ఉన్న శ్లోకం
ధర్మ ఏవహతో హంతి
ధర్మో రక్షతి రక్షితః
తస్మాద్ధర్మోన హత వ్యో
మానో ధర్మాహతో వధీత
ధర్మో రక్షతి రక్షితః అనే అర్యొక్తిని అనుసరించి ధర్మముని మనం కాపాడితే ఆ ధర్మం మనల్ని కాపాడుతుంది. ఇట్టి ధర్మాన్ని మనం ఎలా ఆచరించాలి, స్వధర్మ ఆచరణ యందు ఎట్టి నిష్ట కలిగి ఉండాలి అనే విషయాలను తెలియపరుస్తూ మానవుడి మనుగడను తీర్చి దిద్దడానికి ఏర్పడినవి.  ప్రస్తుత కాలమానము ప్రకారము ధర్మము ఎక్కడుంది.  ఎలావుంటుంది.  అప్పుడు వాల్మికీగారు ధర్మాన్ని ఎలావుంటుంది అంటే రామో విగ్రహాన్ ధర్మః   (మూర్తీభవించిన ధర్మమే రాముడు ) అని అన్నారు .  మరి ఈ కాలములో ధర్మము ఎలావుంది. ఎక్కడుంది.  సరే అది వదిలైయండి.  ప్రస్తుతము ఈ వాక్యములో అన్నట్టు ధర్మో రక్షతి రక్షతః అన్నట్టు.  ధర్మము ను మనము కాపాడితే , ఆ ధర్మము మనలను కాపాడుతుందా అన్నది నా ప్రశ్న మీకు వీలు అయితే కాపాడుతుంద లేదా అన్నది చెప్పండి. 

మంగళవారం, జనవరి 31, 2012

జాతీయ పక్షి

మంగళవారం, జనవరి 31, 2012

మన భారత ప్రభుత్వం వారు 1963వ సంవత్సరం జనవరి 31 న నెమలి ని మన జాతీయ పక్షి గా గుర్తించారు.  

The Scientific Classification 
Phylum: Chordata
Sub-phylum: Vertebrata (Vertebrates)
Class: Aves (Birds)
Order: Galliformes
Family: Phasianidae
Sub-family: Phasianinae
Genus: Pavo ¡
Species: Pavo cristatus (blues) and Pavo muticus (Java greens)
Subspecies for P. muticus: P.m. muticus  |  P.m. spicifer  |  P.m. imperator

నెమలి చాలా అందమైన ఈకలు కలిగి వుంటుంది. శ్రీ కృష్ణుడు తన శిరస్సు మీద నెమలి ఈకను అలంకరిమ్చుకునేవారు.  సుబ్రహ్మణ్య స్వామి వాహనంగా నెమలి వుంటుంది కదా నేను ఫొటోస్ లో చూసాను. మగ నెమల్లకు అందమయిన మెరిసే నీలం-ఆకుపచ్చ లేదా ఆకుపచ్చ రంగు పించం ఉంటుంది. మగ నెమలికి వెనుక బాగంలో తోకలాగా కనిపించేది, దాని పొడావాటి ఈకలు. ఆ ఈకలకు కళ్ళు ఉంటాయి, వాటి అందమంతా అవి పురివిప్పి నాట్య మాడుతున్నప్పుడే కనిపిస్తాయి.
మగ నెమల్లకు అందమయిన మెరిసే నీలం-ఆకుపచ్చ లేదా ఆకుపచ్చ రంగు పించం ఉంటుంది. మగ నెమలికి వెనుక బాగంలో తోకలాగా కనిపించేది, దాని పొడావాటి ఈకలు. ఆ ఈకలకు కళ్ళు ఉంటాయి, వాటి అందమంతా అవి పురివిప్పి నాట్య మాడుతున్నప్పుడే కనిపిస్తాయి.
ఆడ నెమలి ఆకుపచ్చ, గోధుమ మరియు బూడిద రంగులలో ఉండే పించం ఉంటుంది. మగ నెమల్ల వలె ఆడనెమలికి పొడావాటి తోక లాంటి ఈకలు ఉండవు, కానీ వీటికి ఒక కొప్పూంటుంది.
నెమలి పించాలలోని ఆ అత్బుత రంగులకు కారణం, వాటి ఈకలమీద పేర్చినట్లు ఉండే సన్నని పీచు లాంటి పదార్దాలే. అక్కడ కనిపించే వివిధ రంగులకు వాటి అమరికలోని నిడివి తేడాలే కారణం. గోధుమ రంగు ఈకలకు, ఎరుపు మరియు నీలం రంగులు అవసరం - వీటిలో ఒక రంగు అమరిక వలన సృస్టింపబడగా, రెండొవది హద్దులలో ఉండే ఇంకో అమరిక వలన వచ్చే కాంతి పరావర్తనం వలన ఏర్పడుతుంది. ఇటువంటి పరావర్తనం వలనే నెమలి నాట్యమాడుతున్నప్పుడు వాటి పించాలు మనకు వివిద కోణాలలో వివిద రంగులుగా కనిపిస్తాయి.
దాదాపు 2000 సంవత్సరాల కాలం నుండి మనుషుల పోషణలో నెమలి ఉన్నదని భావిస్తున్నారు.నెమలిలో పెంపుడు జంతువులలో కనిపించే లక్షణాలు చాలా తక్కువగా వున్నాయి.వీటి నుండీ ఇతర కొత్త జాతులు సృష్టింపబడ్డాయి.
ఇతర జాతులతో అంటకట్టించటం వలన వేరు వేరు రంగుల ఈకలున్న నెమల్లు మనకు కనిపిస్తాయి. అటువంటి వాటిలో తెల్ల శరీరం కలవి చెప్పుకోతగ్గవి.
మబ్బులు పట్టాగానే నెమలి తన అందాన్ని మరింత బాగా చూపి నాట్యం ఆడుతుంది.  ఇంత అందామయిన పక్షికి ఈనాడు నివాస స్తలాలేలేవు. నెమలి తుప్పలు, గడ్డి ప్రదేసాలాల్లో నివసిస్తుంది.  ఇప్పుడు ఆకు రాలే కాలం కదా గడ్డి తుప్పాలను నిప్పుపెట్టేసారు వాటికి సరి ఐన ప్రదేశం లేక కొత్త ప్రదేసాలకోసం అన్వేషిస్తున్నాయి.  ఆ ప్రయత్నంలో కొన్ని మనుషులకు దొరికిపోయి చంపబడుతున్నాయి.  మా ఇంటిదగ్గర గడ్డి కాల్చేసారు.  అప్పుడు అవి దగ్గరలో వున్నా వాటర్ ట్యాంక్ మీద ఎలా కుర్చున్నవి అప్పుడు నేను తీసిన ఫోటో చూడండి. అంత అందంగా వున్నా మన జాతీయ పక్షి అయిన నెమలి జాతి అంతరించి పోకుండా కాపాడ వలసిన బాధ్యతా మనందరికీ వుంది.   దయచేసి నెమలి ని చంపవద్దు దాని అందాన్ని చూసి ఆనందిచుదాం.  
Please Save Our National Bird 

శనివారం, జనవరి 21, 2012

Save Our Mother Earth

శనివారం, జనవరి 21, 2012


Our earth is in trouble and it needs your help! 
Everyday, the air is being filled with poisonous fumes from vehicles, the water is polluted by toxic wastes from our industries and the forests are being cut down.  All these are slowly putting the earth in danger.

Why should I worry, you may ask. There is just one very example reason. We live on this earth and this is the only place we have. We can't live in space. If we treat the earth so badly.  It will so dirty we won't be able to live on it anymore. If we treat it well, the earth will stay a clean place, perfect for living.  So, it's our job to help save the earth.   The earth now needs all the friends it can get.  But then how can we make the earth a better place to live in?  First, we need to be Eco-conscious. Being Eco-conscious means being aware of what you are doing, buying, using and what it does to the environment.  A little awareness and thing you could do is to reduce air pollution.  You could walk or bike to school it you live close by.  Taking a public transport like bus would be suitable for those who live for away.  Car pool in your area if you by car. 
  • The second thing we must know is that some resources are limited on earth.  
  • Turn off the lights and fans in your room when you leave. 
  • Before you open the refrigerator, decide what you want to take from it.
  • This not only prevents warm air from entering the refrigerator but also conserves energy.
  • The next thing you could do is to conserve water.  
  • Take a five minute shower instead of a long bath.
  • Turn off the tap as soon as  you have filled the bucket.
  • While you brush you teeth don't keep the water flowing.
  • The next thing you could do is to shop wisely.
  • Many children discard all the old pencils, pencil cases, notebooks, bags, lunch boxes, uniforms and shoes at the end of each year and buy all new supplies.
  • Just because they are old doesn't  mean, they don't work any more.
  • You can give away things like shoes, uniforms, clothing or things you think you cannot use to someone   who needs it rather than littering them all over the place and buying more.
  • So, the next time you want to buy something, as yourself if you really need it.
  • Be creative when wrapping gifts.
  • Instead of expensive gifts wraps, cover the gifts with comics or magazine pages.
  • Save and re-use decorative ribbons and bows.
  • When you go to supper market with you mom, carry cloth bags.
  • Say 'no' to plastic bags.
  • And last, but not the least, plant trees. 

There  is a well-known slogan " Each one plant one."  So go ahead and do your bit to make this earth clean and green.  "Small drops form an ocean" is a well known saying.  The little things we do can go a long way in protecting Mother Earth.  So let us all come together in our effort to save our planet earth because it's the only one we've got.

గురువారం, జనవరి 05, 2012

ఎగిరిపోతే ఎంత బాగుంటుంది

గురువారం, జనవరి 05, 2012

 
                                          ఈ రోజు National Birds Day .
ఆకాశములోని కనిపించిన పక్షులును చూసి పంజరములో వున్నా ఈ పక్షి ఏమనుకుంటోంది అంటే ....ఎగిరిపోతే ఎంత బాగుంటుంది .
ఈ మనుషులు మనసులో కష్టము కలికినప్పుడు ఆకాశములోఉన్న మా పక్షులును చూసి నాకు రెక్కలు వచ్చి ఎగిరిపోతే ఎంతబాగుంటుంది అని పాడుకుంటారు. అవి హాయిగా ఆకాశం అంతా నాదే అని ఎగురుతూ వుంటే చూడటానికి ఎంతబాగుంది అనుకుంటారు.  మా శబ్దాలను (కిలకిల రవాలు) హాయిగా విని ఎంతో ఎంజాయ్ చేస్తారు.  పక్షులులో చాలా అందముగా అనేకానేక రంగుల్లో వుంటాయి.  ఇప్పుడు మాకు  కాలం బాలేదు అనిపిస్తోంది.  మాకు మనిషి అధికముగా అనేకరకాలుగా కష్టాన్ని కలిగిస్తున్నాడు.  చేట్లు నరికేసి మాకు నిలువు నీడలేకుండా చేస్తున్నాడు.  సెల్ ఫోన్ టవర్స్ కట్టి ఒకరకంగా మాఉనికినే పూర్తిగా తీసేస్తున్నాడు.  విపరీతమైన వాతావరణ కాలుష్యము చేసేస్తున్నాడు, ఇంకా దొరికితే తినేస్తున్నారు.  మరి కొందరు మాతో circus చేయించి డబ్బు సంపాదిస్తారు. కొందరు మాలో మాకు యుద్దాలు (కోడిపందాలు) పెట్టి మమ్ములను మేమే చంపుకునేటట్టు చేసి మమ్ములను తినేస్తున్నారు. అంతే కాదు భారతీయులు అయితే తమ జాతీయ పక్షిగా పెట్టుకున్న నెమలిని రెక్కలు పీకి నేమలీకలు అని చెప్పి అమ్మేస్తున్నారు.  రాజకీయనాయకులు, ధనవంతులు నెమలిని తింటున్నారు.  ఇంకా చెప్పాలి అంటే మా బాధలు చాలా వున్నాయి.  నాకు ఇలా చెప్తుంటే కళ్ళు నీళ్ళు కారుతున్నాయి.  పక్షులును చూసి ఆనందిచేవారు వాటిని cage  లో బంధించి మా స్వేచ్చను తొలగిస్తున్నారు.  మరలా మమ్ములను ఆకాశములో చూసి మేము రెక్కలు వచ్చి ఎగిరితే ఎంత బాగుంటుంది అని పాడుకుంటారు ఇదెక్కడి న్యాయం.  మాకు కష్టం కలిగించినా సరే కష్టంలో కూడా మాకు ఇల్లు మేమే కట్టుకొని వుంటే గూళ్ళు పీకేసి సంతోషిస్తున్నారు. మేము వంశమును పెంచుకోటానికి గుడ్లు పెట్టుకుంటే అవికూడా లాగేసుకొని తినేస్తున్నారు.  నాకే కనుక భగవంతుడు ఒక న్యాయస్తానం చూపిస్తే  న్యాయస్థానంలో  మనిషి మీద వారు చేస్తున్న ఆకృత్యాలమీద కేసుపెట్టాలని వుంది.  మాకు జరుగుతున్నా అన్యాయానికి గొంతెత్తి అరిచి మాకు న్యాయం చేయమని న్యాయపోరాటం చేయాలని వుంది.  మనుషులమని చెప్పుకుని జీవిస్తున్న జీవులకి మానవత్వం ఎక్కడుంది అని అడగాలని వుందిమాకు స్వేచ్చ స్వాతంత్రాలు కావాలని అడగాలని వుంది.  నన్ను నావారినుండి విడదీసే హక్కు మనుషులకు ఎవరిచ్చారని అడగాలని వుంది.   నాకు  పంజరము నుండి ఎగిరిపోవాలని వుంది. మా పక్షిజాతిని కాపాడండి.  దయచేసి నన్ను, మా జాతిని స్వేచ్చగా బ్రతకనీయండి. మానవులారా మేము మీలానే ప్రాణం కలవారమే.  దయచేసి మాకు హాయిగా బ్రతికే అవకాసము ఇవ్వండి.  ఇక మిమ్ములను మేము ఏమీ అడుగము.     దయ చేసి నన్ను వదిలేయండి.  మీకు మీ పెద్దలికి నా నమస్సులు . 

బుధవారం, జనవరి 04, 2012

లూయీ బ్రెయిలీ

బుధవారం, జనవరి 04, 2012

లూయి బ్రెయిలీ

Breyili  keybord 



Alphabet bord
ప్రపంచ అంధులకు చదువుకొనే వీలు కలిగించిన మహనీయుడు లూయీ బ్రెయిలీ 1809 సం. జనవరి 4న పారిస్ దగ్గరలోని “క్రూవే” గ్రామంలో జన్మించాడు.  ఈ రోజు ఆయన పుట్టినరోజు.
లూయి బ్రెయిలీ కి చిన్నవయసులో ప్రమాదవశాత్తు రెండు కళ్ళను కోల్పోయి తన 4వ ఏట పూర్తిగా గుడ్డి వాడయ్యాడు. చదువుపై కొడుకు ఆసక్తిని గుర్తించి , పారిస్ లోని అంధుల పాఠశాలలో చేర్చాడు అతని తండ్రి. అప్పటికి అమలులో ఉన్న “లైన్ టైపు” పద్ధతిలో చదువుకుని,  తన ప్రతిభతో చివరికి అదే పాఠశాలలో టీచర్ గా  ఎదిగాడు బ్రెయిలీ.  పగలు విద్యార్ధులకు బోధిస్తూ, రాత్రులు అంధులు తేలికగా చదవగలిగే, రాయగలిగే లిపి తయారీకై  చాలా చాలా కృషిచేసాడు. 
1821 లో ఛార్లెస్ బార్బియర్ అనే సైనికాధికారి తన సైనికులు చీకటిలో కూడా తాను పంపిన సమాచారం గుర్తించేందుకు 12 ఉబ్బెత్తు చుక్కలతో సంకేత లిపిని తయారు చేసాడు.  ఆ సైనికాదికారి చుక్కలులిపి ఆయనకీ స్ఫూర్తి గా అనిపించింది.  అప్పుడు బ్రెయిలీ 12 చుక్కలను ఆరు చుక్కలగా  తగ్గించి అవసరమైన రీతిలో వాటిని పేర్చుతూ అక్షరాలను, పదాలను అంకెలను, సంగీత చిహ్నాలను రూపొందించాడు.బ్రెయిలీ తన కోసం తనలాంటి వారికోసం నిరంతర శ్రమచేసి చివరకు విజయం సాదించారు.  బ్రెయిలీ 1851 లో క్షయ వ్యాధికి గురై 1852 జనవరి 6న మరణించాడు.
బ్రెయిలీ శిష్యులు తమ గురువు గారు రూపొందించిన లిపికి గుర్తింపునివ్వాలని  పోరాటం చేయగా అతని లిపికి అధికార గుర్తింపునిచ్చినది ప్రాన్స్.
ఈనాడు ప్రపంచ అంధులుకోసం అన్ని రకాల పుస్తకాలు, పత్రికలు ఆ లిపిలోనే వస్తున్నాయి. వారందరూ చదువుతున్నారు అంటే అదంతా బ్రెయిలీ వల్లే అని చెప్పుకోవాటం లో ఎటువంటి సందేహం లేదుకదా.
మనం ఈ సందర్బములో ఇంకో విషయం కూడా చెప్పాలి అనుకుంటున్నాను.  గ్రుడ్డివారికోసం నేత్రదానం చేసి వారికి మన అందమైన సృష్టి అందాలు చూపించండి. ఒక మనషి తన కళ్ళు దానం చేస్తే అది ఇద్దరికీ కంటి చూపు వస్తుంది.  వారు మనలాగా అందమైన రంగుల ప్రపంచాన్ని చూడగలరు.  దయచేసి మీ తదనంతరం కళ్ళను బూడిదపాలు చేయకుండా గ్రుడ్డివారికి చూపును ప్రసాదించి ఆ కళ్ళద్వారా మీరూ జీవించండి.
 

నేత్రదానం (Donate Eyes) 

మంగళవారం, డిసెంబర్ 27, 2011

జన గణ మన అధినాయక జయహే కి 100

మంగళవారం, డిసెంబర్ 27, 2011

మన జాతీయ గీతం జనగణమన ను రవీంద్ర నాద ఠాగూర్ రచించారు.  ఈ గీతాన్ని బెంగాలి లో రచించారు.   1911   లో మొదటి సారిగా పాడిన ఈ గీతాన్ని 1950  జనవరి 24న జాతీయగీతంగా రాజ్య సభ గుర్తించి  స్వీకరించింది. ఈ గీతానికి సంగీత బాణీ కూడా టాగోరే సృష్టించాడు.  ఈ రోజు న మన జాతీయ గీతం గురించి తెలుసుకోవటానికి నేను సంతోషిస్తున్నాను.  ప్రపంచంలో అత్యుత్తమ జాతీయ గీతంగా జనగణమన ను యునెస్కో ప్రకటించింది. అటువంటి గీతానికి నేటికి వంద సంవత్సరములు నిండినవి.  అలాంటి గీతాన్నికనీసం ఈరోజు అయినా ఒకసారి పాడుకోవాలి. ఇది వరకు స్కూల్ లో నుండి వచ్చే ముందు పాడించేవారు.  ఇప్పుడు అలా పాడించటం లేదు ఎందుకో నాకు తెలియటంలేదు.  నేను ఈ రోజు స్కూల్ లో teachar  ని అడుగుతా కనీసం ఈరోజు అయినా పాడేలా చేయమని request  చేస్తాను. మా ఫ్రెండ్స్ అయితే ఆ పాటే తెలియదుట ఈ విషయం మా ఇంట్లో చెప్తే ఆశ్చర్య పోయారు.  వారికి ఈ గీతం గురించి చెప్పమన్నారు.  నేను వారికి చెప్పి మా స్కూల్ లో ఎలాగైనా పాడతాం.  మీరు కూడా మీస్చూల్ లో పాడకపోతే మీరు తెలుసుకొని పాడండి.  ఇది మనజాతియ గీతం దానిని గురించి తెలుసుకొని దానికి గౌరవించిండి.   

జన గణ మన అధినాయక జయహే
భారత భాగ్య విధాతా
పంజాబ సింధు గుజరాత మరాఠా
ద్రావిడ ఉత్కళ వంగా
వింధ్య హిమాచల యమునా గంగా
ఉచ్ఛల జలధి తరంగా
తవ శుభ నామే జాగే
తవ శుభ ఆశిష మాగే
గాహే తవ జయ గాథా
జన గణ మంగళ దాయక జయహే
భారత భాగ్య విధాతా
జయహే జయహే జయహే
జయ జయ జయ జయహే
జయహె
జయహింద్  

శుక్రవారం, డిసెంబర్ 09, 2011

31 Days of Science and Spirituality

శుక్రవారం, డిసెంబర్ 09, 2011


The International Gita Society and Krishnauniverse invite you for the worldwide  " 31 Days of Science and Spirituality" Bhagavad Gita Reading Campaign to celebrate Gita Jayanti 2011.


మంగళవారం, సెప్టెంబర్ 20, 2011

DAY OF PEACE 2011: Make Your Voice Heard

మంగళవారం, సెప్టెంబర్ 20, 2011

DAY OF PEACE 2011: Make Your Voice Heard
Young women and men everywhere are demonstrating the power of connection by reaching out to each other, and rallying together, in the common cause of the dignity and human rights to which their peoples aspire.  

For this year's International Day of Peace observance on September 21, the UN has chosen the theme of "Make Your Voice Heard," under the overall idea of peace and democracy.  
Each year, the Universal Peace Federation and its Ambassadors for Peace around the world organize commemorations of the International Day of Peace. 

"To encourage worldwide, 24-hour spiritual observations for peace and nonviolence on the International Day of Peace, 21 September in every house of worship and place of spiritual practice, by all religious and spiritually based groups and individuals, and by all men, women and children who seek peace in the world."
Thank you.

My Blog Lovers

నా యూట్యూబ్ చానల్స్ ప్లీజ్ సబ్స్క్రిబ్ చేయండీ

Diabetic Challenger

DIABETIC CHALLENGER YOUTUBE CHANNEL. PLASE SUBSCRIBE MY CHANNEL...... THANK YOU VERY MUCH.

Ammamma Tho Nenu (అమ్మమ్మ తో నేను

Please subscribe our channel Ammamma Tho Nenu (అమ్మమ్మ తో నేను)