Blogger Widgets

శనివారం, జనవరి 21, 2012

కొండవేలనెత్తినట్టి గోవిందా

శనివారం, జనవరి 21, 2012

అన్నమాచార్యులవారు రాసిన మరో అద్భుతమైన సంకీర్తన కొండవేలనెత్తినట్టి గోవిందా అన్న కీర్తన. ఈ సంకీర్తనలో  శ్రీ కృష్ణుని అద్భుతంగా వర్ణించారు.   కృష్ణుని అనేక రకాలుగా వర్ణించారో ఈ అన్నమయ్య.  స్వామీ వారిమీద కీర్తనలు రచించిన అన్నమయ్య అదృష్టవంతుడో లేక ఆ స్వామే అదృష్టవంతుడో కదా.   ఈ కీర్తనలు మనం ప్రతీ రోజు  గుర్తుచేసుకుంటుంన్నందుకు మనం మాత్రం అదృష్టవంతులమే కదా.  

                  
కొండవేలనెత్తినట్టి గోవిందా నిన్ను

గొండించేరు యశోదకు గోవిందా


గొల్లెతలు మొక్కేరు గోవిందా నీ-

కొల్లల చీరలిమ్మని గోవిందా

గొల్లు వెన్న దొంగిలగ గోవిందా నిన్ను

కొల్లున నవ్వేరు వీరె గోవిందా


గోవుల గాచేవేళ గోవిందా పిల్ల

గోవిని వలచిరి గోవిందా

గోవాళులై యమునలో గోవిందా నీకు

కోవరమున్నారురా గోవిందా


కొట్టేటి వుట్లకింద గోవిందా నీతో-

గొట్టెవాటై పెనగేరు గోవిందా

గుట్టుతో శ్రీవేంకటాద్రిగోవిందా కూడి

గొట్టాన బెట్టేరు బత్తి గోవిందా

Save Our Mother Earth


Our earth is in trouble and it needs your help! 
Everyday, the air is being filled with poisonous fumes from vehicles, the water is polluted by toxic wastes from our industries and the forests are being cut down.  All these are slowly putting the earth in danger.

Why should I worry, you may ask. There is just one very example reason. We live on this earth and this is the only place we have. We can't live in space. If we treat the earth so badly.  It will so dirty we won't be able to live on it anymore. If we treat it well, the earth will stay a clean place, perfect for living.  So, it's our job to help save the earth.   The earth now needs all the friends it can get.  But then how can we make the earth a better place to live in?  First, we need to be Eco-conscious. Being Eco-conscious means being aware of what you are doing, buying, using and what it does to the environment.  A little awareness and thing you could do is to reduce air pollution.  You could walk or bike to school it you live close by.  Taking a public transport like bus would be suitable for those who live for away.  Car pool in your area if you by car. 
  • The second thing we must know is that some resources are limited on earth.  
  • Turn off the lights and fans in your room when you leave. 
  • Before you open the refrigerator, decide what you want to take from it.
  • This not only prevents warm air from entering the refrigerator but also conserves energy.
  • The next thing you could do is to conserve water.  
  • Take a five minute shower instead of a long bath.
  • Turn off the tap as soon as  you have filled the bucket.
  • While you brush you teeth don't keep the water flowing.
  • The next thing you could do is to shop wisely.
  • Many children discard all the old pencils, pencil cases, notebooks, bags, lunch boxes, uniforms and shoes at the end of each year and buy all new supplies.
  • Just because they are old doesn't  mean, they don't work any more.
  • You can give away things like shoes, uniforms, clothing or things you think you cannot use to someone   who needs it rather than littering them all over the place and buying more.
  • So, the next time you want to buy something, as yourself if you really need it.
  • Be creative when wrapping gifts.
  • Instead of expensive gifts wraps, cover the gifts with comics or magazine pages.
  • Save and re-use decorative ribbons and bows.
  • When you go to supper market with you mom, carry cloth bags.
  • Say 'no' to plastic bags.
  • And last, but not the least, plant trees. 

There  is a well-known slogan " Each one plant one."  So go ahead and do your bit to make this earth clean and green.  "Small drops form an ocean" is a well known saying.  The little things we do can go a long way in protecting Mother Earth.  So let us all come together in our effort to save our planet earth because it's the only one we've got.

శుక్రవారం, జనవరి 20, 2012

Brain Test

శుక్రవారం, జనవరి 20, 2012

I played the Game. Simply super.  
Enjoy The Game.


గురువారం, జనవరి 19, 2012

కానరటె పెంచరటె

గురువారం, జనవరి 19, 2012

నంద యశోదల ముద్దు బిడ్డగా వెలసిన శ్రీకృష్ణుడు తన చిలిపి అల్లరి పనులతో విసిగిన గోపవనితలు యశోదమ్మకు కృష్ణునివల్ల వారికీ కలిగిన కష్టాన్ని విన్నవించుకొని వారు ఊరు విడిచివెళ్లిపోతామని మీ అబ్బాయిని అదుపులో పెట్టుకోమని చెప్పారు గోపవనితలు.  వారు అలా చెప్పుతుంటే  యశోద చాలా బాధ పడినది.  అప్పుడు యశోద గోపవనితలతో ఇలా అన్నది. నేను కూడా మీవలెనే కంటిని ఈ బిడ్డని.  పిల్లలు చేసే అల్లరిని ఆమె సమర్ధిస్తున్నది. 
 అది అన్నమాచార్యులవారు ఇలా అందంగా రచించారు. ఇలా అందంగా వర్ణించటము ఎవరి తరమూకాదేమో అన్నట్టు రాసారు అన్నమాచార్యులవారు. 
కానరటె పెంచరటె కటకట బిడ్డలను | నేను మీవలెనే కంటి నెయ్యమైన బిడ్డని
బాయిట బారవేసిన పాలు వెన్నలును | చేయి వెట్టకుందురా చిన్నిబిడ్డలు |
మీయిండ్లు జతనాలు మీరుసేసికొనక | పాయక దూరేరేల ప్రతిలేని బిడ్డను ||
మూసిన కాగులనే యీముంగిట పెరుగులూ | ఆసపడకుందురా ఆబిడ్డలు |
వోసరించి మోసపోక వుండలేక మీరు | సేసేరింతేని దూరు చెప్పరాని బిడ్డని ||
చొక్కమైన కొప్పెరల జున్నులు జిన్నులును | చిక్కిన విడుతురా చిన్నిబిడ్డలు |
మిక్కిలి పూజలుసేసి మెచ్చ్చించదగదా | యెక్కువైన తిరువేంకటేశుడైన బిడ్డని ||

బుధవారం, జనవరి 18, 2012

"సు-ప్రభాతము"

బుధవారం, జనవరి 18, 2012


 
ధనుర్మాసము లో తిరుప్పావై తో స్వామిని మేలుకోలుపుతారు.  ఆనెల రోజులు కలియుగ దేవుడు వెంకటేశ్వరునికి సుప్రబాత సేవ చేయరు.  తక్కిన రోజులలో స్వామివారికి సుప్రభాత సేవ చేస్తారు.  ఈ సుప్రభాతం మొట్టమొదట ఎవరు రాసారు అని నాకు డౌట్ వచ్చింది అప్పుడు నాకు ఈ విషయాలు తెలిసాయి. 
మనము తెల్లవారి లేవగానే అందరకు good  morning చెపుతాము కదా అదే సుప్రభాతము.  
"సు-ప్రభాతము" అనగా "మంచి ఉదయం" (Good Morning) అని అర్ధంశ్రీ వేంకటేశ్వర సుప్రభాతం కలియుగ వైకుంఠపతి వేంకటేశ్వరుని సుప్రభాత సేవలో కీర్తించే స్తోత్రము.  
రామాయణం బాలకాండలో  శ్లోకం యాగరక్షణా నిమిత్తమై తనవెంట వచ్చిన రామలక్ష్మణులు నిద్రపోతుండగా విశ్వామిత్రుడు ఇలా పాడి వారిని మేలుకోల్పుతారు.  
కౌసల్యా సుప్రజా రామ పూర్వా సంధ్యా ప్రవర్తతే
ఉత్తిష్ఠ నరశార్దూల కర్తవ్యం దైవమాహ్నికమ్‌ 1
"కౌసల్యాదేవి సుపుత్రుడవగు  రామాపురుషోత్తమాతూర్పు తెల్లవారుచున్నదిదైవ సంబంధములైన ఆహ్నికములను చేయవలసియున్నదినిదుర లెమ్ము." అని భావం వచ్చేట్టు పాడారు  విశ్వామిత్రులవారు. దీని తరవాత నే మిగిలిన శ్లోకాలు వస్తాయి .
హిందూ పూజా విధానాలలోను, ప్రత్యేకించి శ్రీవైష్ణవం ఆచార పరంపరలోను, భగవంతుని పూజామూర్తికి అనేకమైన సేవలు  నిర్వహించే సంప్రదాయం ఉంది. ఇలాంటి సేవలలోనిదే సుప్రభాత సేవ. సుప్రభాత సేవా సమయంలో చేసే కీర్తననే "సుప్రభాతం" అని అంటారు. తిరుమల శయనమంటపంలోని భోగశ్రీనివాసుని సుప్రభాతం ద్వారా మేల్కొలుపుతారు.  ప్రఖ్యాతమైన శ్రీ వేంకటేశ్వర సుప్రభాతం స్తోత్రాన్ని శ్రీ ప్రతివాద భయంకర అణ్ణాంగారాచార్య లేదా అణ్ణన్ స్వామి రచించారు. ఇతడు క్రీ..1361 నుండి 1454  సంవత్సరం మధ్యలో జీవించారు ఆమద్య కాలంలో  అనంతాచార్యులు మరియు ఆండాళ్ దంపతులకు కంచి పట్టణంలో జన్మించారు. ఈయన శ్రీరామానుజాచార్యులచే నియమింపబడిన 74 సింహాసనాధిపతులలో ఒకరైన 'ముడుంబ నంబి' వంశానికి చెందినవారు. ఇతని గురువు మణవాళ మహాముని.   సుప్రసిద్ధమైన వేంకటేశ్వర సుప్రభాతము, రంగనాధ సుప్రభాతము కూడా అణ్ణన్ రచనలే. వేదాంత దేశికుల కుమారుడైన నారాయణావరదాచార్యుడు అణ్ణన్కు మొదటి గురువు. నారాయణ వరదాచార్యుల వద్ద వేదాలు, ఇతర విద్యలు అభ్యసిస్తున్న సమయంలో ఆణ్ణన్ను వాదంలో ఎదుర్కోవడం ప్రత్యర్ధులకు చాలా సంకటంగా ఉండేదట. నృసింహ మిశ్రుడనే అద్వైత పండితుడిని వాదనలో ఓడించినపుడు మణవాళ మహాముని అణ్ణన్కు "ప్రతివాద భయంకర" అనే బిరుదు ఇచ్చాడట. తరువాత అణ్ణన్ తిరుమలలో కొంతకాలం గడిపాడు. సమయంలో అతను మణవాళ మహాముని శిష్యుడయ్యాడు.
వెంకటేశ్వర సుప్రభాతం లోని శ్లోకాలు సంఖ్య ఇలావున్నాయి.
స్వామీ మేలుకొలుపు : 29 శ్లోకాలు వీటిని శ్రీ ప్రతివాద భయంకర అణ్ణన్ రచించినారు .
వెంకటేశ్వర స్తోత్రం భగవంతుని పై కీర్తనలు)  : 11 శ్లోకాలు
వెంకటేశ్వర ప్రపత్తి ( భగవంతునికి శరణాగతి): 16 శ్లోకాలు
 శ్రీవైష్ణవ సంప్రదాయంలో ప్రపత్తి అనేది చాలా ముఖ్యమైన అంశంగురువులకుభగవంతునికి సంపూర్ణంగా శరణాగతులవడం ప్రపత్తి యొక్క ముఖ్యలక్షణం.
వెంకటేశ్వర మంగళాశాసనము (పూజానంతరము జరిపే మంగళము) : 14 శ్లోకాలు 
  భాగాన్ని మణవాళ మహాముని రచించారు అని అంటారు.
జై శ్రీమన్నారాయణ్

పార్లమెంటు భవనం



పార్లమెంటు భవనం గురించి తెలియని వారు వుండరు.  చదువుకోని పిల్లలను అడిగినా చేప్తారు పార్లమెంట్ గురించి.  సులువుగా చెప్పేస్తారు అక్కడ రాజకీయనాయకులు డబ్బలాడుకుంటారు అని.  అలాంటి పార్లమెంట్ అయిన  మన భారత పార్లమెంట్ కు ఈరోజు ఒక ప్రత్యకమైన రోజుగా చెప్పుకోవాలి.  పార్లేమేంట్ కు ఇంకోపేరు సంసద్ అని పేరు వుంది సంసద్ అనే పదము సంస్కృతానికి చెందినది దీనికి అర్థం ఇల్లు లేక భవనం.
భారత పార్లమెంటు భవనాన్ని ఒక  బ్రిటిష్ ఆర్కిటెక్ట్ Lutyens రూపకల్పన మరియు సర్ హెర్బర్ట్ బేకర్ ప్రత్యక్ష పర్యవేక్షణలో నిర్మించిన అద్భుతమైన నిర్మాణము.  దీనిని "హెర్బర్ట్ బేకర్" 1912-13 లో డిజైన్ చేశాడు.  ఇది ప్రత్యేకమైన డిజైన్ ఇది ఒక సర్క్యులర్ బిల్డింగ్.  ఇది అనేక స్తంబాలు కలిగి వృత్తాకార  నిర్మాణము.  ఇది పోర్చుగీసు వారి నిర్మాణానికి అద్బుతమైన ఉదాహరణగా చెప్పుకోవచ్చు.  భవనం పని 1921 లో ప్రారంభమైంది అది ఆరు సంవత్సరాల తరువాత పూర్తయింది. ఈ భవనం జనవరి 18, 1927  భారతదేశం లో లార్డ్ ఇర్విన్ అను  అప్పటి బ్రిటిష్ వైస్రాయ్ ప్రారంభించారు. ఆగష్టు 1947 లో స్వాతంత్ర్యం తరువాత ఈ పార్లమెంట్ భారతదేశం యొక్క శక్తివంతమైన ప్రజాస్వామ్యం యొక్క గుర్తుగా వుంది.
పార్లమెంట్ భవనము పైకప్పుకు 257 గ్రానైట్ స్థంభాలు సపోర్టుగా నిలబెట్టారు. ఈ భవనాలు జనపథ్ రోడ్డులో వుంది. రాష్ట్రపతి భవన్ కు చాలా దగ్గరగా వుంది.
ఇది ఒక వృత్తాకార నిర్మాణం రూపకల్పన. దీని చుట్టుకొలత వ్యాసం ఒక మైలు వుంటుంది. ఇది  171 మీటర్లు ఉంటుంది. దానికి ఆకట్టుకునే గోపురం రెండు అర్థచంద్రాకార గదులు ఓర సెంట్రల్ హాల్. భవనం 144 క్రీం కలర్ ఇసుకరాయి స్తంభాలు తో జాలరు గల మొదటి ఫ్లోర్ లో మొత్తం ఓపెన్ కారిడార్ ఉంది. ఎరుపు ఇసుకరాయితో బాహ్య గోడలు ప్రతిధ్వని  రేఖాగణిత నమూనాల్లో చెక్కారు. సెక్యూరిటీ, నిబంధనలతో  మాత్రమే బయట నుండి చూడచ్చు.  ఈ నిర్మాణ అద్భుతమైనది. ఇది చుట్టుకొలతలో ఒక కిలోమీటరు వుండి దాదాపు వృత్తాకార నిర్మాణం గుమ్మటం వలెవుంది. ఇది భారత పార్లమెంటు ఒక ప్రత్యెక స్థానంగా ఉంది. పార్లమెంట్ సమావేశాల సందర్భంగా చర్చల యొక్క గృహముగా వుంది.

మంగళవారం, జనవరి 17, 2012

తిరు తిరు జవరాల తి తి తి తి

మంగళవారం, జనవరి 17, 2012

అన్నమాచార్యులవారు రచించిన సంకీర్తనలలో నాకు చాలా చాలా ఇష్టమైన కీర్తన తిరు తిరు జవరాల తి తి తి తి


తిరు తిరు జవరాల తి తి తి తి ఈ
తరలమైన నీ తారహార మధురే (తిరు తిరు 3)


స స ని స గ స ! మ గ స !
స స ని స గ స ! ప మ గ స !
స స ని స గ స ! మ గ స !
స స ని స గ స ! ప మ గ స !
స స గ గ మ ! గ మ ప ని !
ప ప ని ని స ! ప ని స గ !
మ గ స ని ! ప మ గ స !
ని స గ గ ! స గ మ మ...

ధిమి ధింకి తొంగ తొంగ ధి ధిమీక్కియారే
మమారె పాత్రారావో మజ్జా ! మజ్జా !
కమలనాభుని తమ కపుటింతి నీకు
అమరె తీరుకో ఇదే అవధరించగదో (తిరు తిరు ౩)

స స ని స గ స ! మ గ స !
స స ని స గ స ! ప మ గ స !
స స ని స గ స ! మ గ స !
స స ని స గ స ! ప మ గ స !
స స గ గ మ ! గ మ ప ని !
ప ప ని ని స ! ప ని స గ !
మ గ స ని ! ప మ గ స !
ని స గ గ ! స గ మ మ...

ఝక ఝక్క ఝం ఝం ఝణకీనానీ
ప్రకటపూ మఱువొప్పె భళా ! భళా !
సకలపతికి సరసపు కొమ్మ
నీ మొకశిరి మెరసే చిమ్ముల మురిపెముల (తిరు తిరు 3)

స గ స ! మ గ స ! ప మ గ స ! ని ప మ గ స !
స గ స ! మ గ స ! ప మ గ స ! ని ప మ గ స !
స గ స ! స మ గ ! స ప మ ! స ని ప ! స స ని !
స ని ప మ గ ! ని ప మ గ స ని !
ని స గ గ ! స గ మ మ..

మాయి మాయి అలమేలుమంగ నాంచారి మతి
బాయని వేంకటపతి పట్టపురాణీ
మ్రోయ చిరుగజ్జలని మ్రోతలాడీని
సోయగమైన నీ సొలపు చూపమరే (తిరు తిరు ౩)

George J. Stigler


Born                               January 17, 1911
Died                               December 1, 1991 (aged 80) Chicago, Illinois
Nationality                       Seattle, Washington,  United States

Institution                        Columbia University

Brown University
University of Chicago
Field                               Economics
Alma mater                     University of Chicago (Ph.D.), University of Washington (BA), Northwestern University (MBA)
Opposed                         John Maynard Keynes
Influences                       Frank Knight, Jacob Viner, Henry Simons, Milton Friedman
Influenced                       Jacques Drèze, Thomas Sowell, Kenneth Lyon
Contributions                  Capture theory
Awards                           Nobel Memorial Prize in Economic Sciences (1982)
National Medal of Science. 
"Seminal studies of industrial structures, functioning of markets and causes and effects of public regulation."

సోమవారం, జనవరి 16, 2012

Whizz Quizz

సోమవారం, జనవరి 16, 2012

Test your knowledge. Prove yourself . Let's enjoy the game.


  

ఆదివారం, జనవరి 15, 2012

కనుమపండుగ

ఆదివారం, జనవరి 15, 2012


సంక్రాంతి మరుసటి రోజయిన కనుమ పండుగను వ్యవసాయంలో తమకు ఎంతో చేదోడు వాదోడు ఉన్నందుకుగాను  పశువులకు శుభాకాంక్షలు తెలుపటానికి జరుపుతారు. 
 కొన్ని ప్రదేశాలలో ఎడ్లు పందాలు జరుపుతారు. మరికొన్ని ప్రాంతాలలో కోడి పందాలు కూడా పోటీలు నిర్వహిస్తారు. అయితే ఆ పందాలను నిరవహించేటందుకు వాటిని హింసిస్తారు.  అది మాత్రం బాగోలేదు. ఇలా చేయటం చట్టరీత్యా నేరం. జీవహింసగా భావించి రాష్ట్ర ప్రభుత్వం నిషేధించింది. రైతులు ఈ రోజున వారి పొలంలో వనభోజనాలను కూడా నిర్వహిస్తుంటారు.  
కనుమపండుగనాడు మినుము తినాలనేది సామెత. దీనికి గాను గారెలు, ఆవడలు చేసుకోవడం ఆనవాయితీగా వస్తున్నది. 
కనుమ మరునాటిని ముక్కనుమ అని అంటారు. దీనికి బొమ్మల పండుగ అని పేరు. దక్షిణ భారతదేశం లోని ప్రజలు ఈ పండుగ మూడు రోజులను శ్రద్ధాసక్తులతో జరుపుకుంటారు. కనుమ రోజున మాంసాహారం తినడం ఆంధ్ర దేశాన ఆనవాయితీగా వస్తూంది. మాంసా హారులు కాని వారు, గారెలుని తింటారు. అలాగే కనుమ రోజున ప్రయాణాలు కూడా చేయరు.  
కనుమరోజు కాకి కూడా ప్రయాణం చేయదు అంటారు ఇంకో సామెత కూడా వుంది కనుమ రోజు కాకి కూడా నిండా స్నానం చేస్తుందిట. ఈ కనుమరోజు ముత్తైదువలు, ఆడపిల్లలు చాలా అందంగా తయారు అవుతారు. కళ్ళనిండా కాటుక పెట్టుకుంటారు.  కాళ్ళకు పసుపు పారాణి పెట్టుకుంటారు.  అలా కనుమరోజు అందంగా తయారు అయితే కలకాలం అలా నిండుగా వుంటారని అంటారు.  
ఈ మూడురోజులు మనము పూర్తిగా సంతోషం గా గడిపాం కదా.  ఈ రోజు మన ఇంట్లో వుండే పశువులకు పూజ చేసి వాటికి కృతఙ్ఞత తెలుపుకుంటున్నారు.  ఈ నెలరోజులు వాకిట అందమైన ముగ్గులు తో అలంకరిస్తాము కదా.  ఈ కనుమరోజును మాత్రము రధము ముగ్గువేసి ఆరధమును వీదిచివరి వరకు లాగినట్టుగా ముగ్గు వేస్తారు.  దీని అర్ధము సూర్యుడు తన దిశను మార్చుకున్న మొదటిరోజు అని తెలుస్తున్నది.  ఈ కనుమ పండుగను బాగా జరుపుకోవాలి అని తలుస్తున్నాను.  అలాగని పసుపక్షులను భాదించకండి. 

శనివారం, జనవరి 14, 2012

భారత సైనిక దినోత్సవం

శనివారం, జనవరి 14, 2012



భారత సైనిక దినోత్సవం. 1949లో ఇదేరోజున మొదటిసారి ఓ భారతీయుడు కె.ఎం.కరియప్ప  ఇండియన్‌ ఆర్మీ చీఫ్‌గా ఎంపికయ్యారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని ఏటా జనవరి 15ను సైనికదినోత్సవంగా జరుపుకొంటున్నాం.   దేశవ్యాప్తంగా త్రివిధ దళాలు సైనిక దినోత్స వాన్ని జరుపుకోనున్నాయి.   భారత నావికాదళం, భారత వైమానిక దళం, దేశ రక్షణలో ప్రధాన భూమికను నిర్వహిస్తున్నాయి.
అసలు ఎన్నోరకాలు పోరాటాలు విప్లవాలు చేసి హింసాయుత, మరియు అహింసా పోరాటాలు కూడా చేసి  ఎంతోమంది స్వాతంత్ర్య సమరయోధులు పోరాటం చేసి భారతదేశానికి బ్రిటిషవారి నుండి స్వాతంత్ర్యాన్ని సంపాదించి పెడితే.  ఆ స్వాతంత్ర భారతదేశాన్ని మన దేశ సైనికదళం సరిహద్దుల దగ్గర మన దేశాన్ని వారి ప్రాణాన్ని అడ్డుపెట్టి మరి కాపాడుతున్నది. 
మడమ తిప్పని యోధుడి చేతిలో మంటలు విరజిమ్మే ఆయుధం తో మంచి వజ్రమువంటి  మనస్సుతో ఎటువంటి వృద్దాప్యము దగ్గరకురాని సంకల్పబలంతో, వారి గుండె దైర్యముతో  పోరాటపటిమను చివరవరకు పోరాటం చేయగలిగే శక్తి.  ముప్పూటలా  మోహరిస్తే దానిపేరే భారత సైన్యం. నిప్పులు చెరిగే ఎడారులు లోను , నెత్తురును  గడ్డకట్టించే మంచు ప్రాంతాలలోను, కల్లోల సాగరాలు,  గగనతలాలు, ఎక్కడైనా, ఎప్పుడైనా, ఎలాంటి శత్రువునైనా ఎదిరించి ఓడించే దే మన దేశ సైనికదళం.భారతదేశ ప్రాదేశిక సమగ్రతనూ, సార్వభౌమాధికారాన్ని, కంటికి రెప్పలా కాపాడు తున్న సైనిక శక్తుల త్యాగాలు, విజయాలు. నిరుపమానాలు. వారిని ఎంత పొగిడినా చాలా తక్కువే అనిపిస్తోంది. జనవరి 15న ఆర్మీడే సందర్భంగా మన భారతదేశ త్రివిధ దళాలతో పాటు మనమందరం గొంతు కలుపుదాం. మన భారత జనానికి మోకరిల్లి ప్రణామం తెలుపుదాం.  మన భారతమాత మనలను చూసి గర్వపడేలా చేద్దాం. మన భారతదేశ ఉనికిని, మన సైనికదలాల పోరాటపటిమను ప్రపంచానికి చాటిచేప్పుదాం.  ఇంకెవ్వడు మనదేశము వంకచూడాలంటే భయపడేటట్టు చేద్దాం.
భారతదేశానికి స్వాతంత్య్రం లభించి పట్టుమని పదివారాలు కాకముందే 1947 అక్టోబర్‌ 27న విభజనకు గురైన పాకిస్తాన్‌ దళాలు మన దేశనికి మకుటమయిన కాశ్మీర్‌ను  కబళించడానికి దండెత్తి రాగా మన భారత దళాలు శతృవులను తరిమి తరిమికొట్టి స్వాతంత్య్ర దేశ చరిత్రలో తొలివిజయాన్ని నమోదు చేసుకొంది. ఇది స్వాతంత్ర భారతావనికి తొలివిజయం.  తరువాత  1962లో చైనా దురాక్రమణ దారులకు, 1965, 1971లో పాకిస్తాన్‌ మూకలను, 1999లో కార్గిల్‌ సైనిక చర్యలతో పాటు వివిధ ఆపరేషన్లలో శతృవులను వెనుతిరిగి చూడకుండా తరిమి వేసింది మన భారతసైన్యం. అలాగే ప్రపంచ యుద్ధాలలో సువర్ణాక్షరాలతో లిఖించబడే విధంగా బంగ్లాడేశ్‌ అవతరణ సమయంలో దాదాపు 98 వేలమంది శతృ సైనికులు భారతదేశ సైన్యం ముందు మోకరిల్లినది.  ఇది మనం గర్వపడవలసిన విషయమే కదా.  
ఎందరో మహానుబావుల త్యాగాలకు మనకు స్వాతంత్ర భారతదేశం లబించింది. మన దేశసైనికులు సరిహద్దును ప్రాణాలను అడ్డుగా పెట్టి మనదేశాన్ని కాపాడుతుంటే మనం ఏమి చేస్తున్నాము? లోపల politics  చేస్తున్నాము.  లోపలలోపల తన్నుకుంటున్నాం. అవినీతి అన్నదానికి దారి తీసి దేశబద్రతకు, దేశఖజానాకు చిల్లులు పెడుతున్నాం.  ప్రజాస్వామ్యాన్ని దేబ్బతీస్తున్నాం.  దయచేసి అందరు దేశ భవిష్యత్తును కాపాడుకుందాం.  స్వాతంత్ర భారతదేశాన్ని కాపాడుకుందాం.  అలాంటప్పుడే మనదేశ సైనికులు చేసే ప్రయత్నంనాకు అర్ధం పరమార్ధం వుంటుంది.
మంచి ఆలోచన తో నూతన సాంకేతిక పరిజ్ఞానము తో వ్యక్తిగత జీవితాలు అడ్డుగా  పెడుతూ దేశాన్ని అన్నివిధాలా కాపాడుతూ మనకు ఆపద కలిగే సమయంలో వెనువెంటనే మేమున్నాము అని ఆదుకునే బారత సైన్యానికి ప్రతి ఒక్కరూ కృతజ్ఞత కలిగివుండాలి. సైనికులను గౌరవిస్తూ నేడు దేశవ్యాప్తం భారత సైనిక దినోత్సవం జరుపుకోవాలి . 
Heads  off to  the Indian  Army .
I  wish  you  happy  Indian  Army  Day .
జై హింద్

సంక్రాంతి లక్ష్మికి స్వాగతం సుస్వాగతము

సంక్రాంతి లక్ష్మికి స్వాగతం సుస్వాగతము 
 బోగి తరువాత రోజయిన సంక్రాంతి రోజున పాలు పొంగించి, దానితో చక్కర పొంగలి తయారు చేస్తారు. దాదాపుగా అందరి ఇళ్ళలో అరిసెలు, బొబ్బట్లు, జంతికలు,చక్కినాలు, సేమియాపాయసం, పరమాన్నం, పులిహోర, గారెలు మొదలయిన వంటకాలు చేసి, కొత్తబట్టలు ధరించి ఈ పండుగను ఆస్వాదిస్తారు.ఈ రోజున పితృదేవతలకు తర్పణాలు వదులుతారు.ప్రతీ సంక్రమణానికీ పితృతర్పణాలు ఇవ్వాలి. కాని మిగిలిన పదకొండు సంక్రమణాలకు ఇవ్వక పోయినా, ఈ మకర సంక్రమణానికి మాత్రం తప్పకుండా పితృ తర్పణాలు ఇస్తారు. సంక్రాంతి రోజులలో మనము చూసే ఇంకో సుందర దృశ్యం.


రంగు రంగులు ముగ్గులతో, ముంగిట్లో గొబ్బెమ్మలు, హరినామ సంకీర్తనలు హరిలో రంగ హరీ అంటూ నడినెత్తిపై నుంచి నాసిక దాకా తిరుమణి పట్టెలతో, కంచు గజ్జెలు ఘల్లుఘల్లుమనగా చిందులు త్రొక్కుతూ, చేతుల్లో చిడతలు కొడుతూ తలపై రాగి అక్షయపాత్ర కదలకుండా హరిదాసు ప్రత్యక్షమవుతాడు. డూడూ బసవయ్య విన్యాసాలతో గంగిరెద్దులను ఆడించే గంగిరెద్దులవారు. చక్కగా అలంకరించిన గంగిరెద్దులను ఇంటింటికీ తిప్పుతూ, డోలు, సన్నాయి రాగాలకు అనుగుణంగా వాటిచేత చేయించే నృత్యాలు చూడటానికి చాలా రమణీయంగా ఉంటాయి. ఆ గంగిరెద్దులు మనము ఇచ్చే కానుకలను స్వీకరిస్తున్నట్లుగా తలలు ఊపుతూ ధన్యవాదాలు తెలుపుతున్నట్లు మోకాళ్ళ మీద వంగటం వంటి విద్యలు వాటికి నేర్పిస్తారు.,ఆకాశాన గాలిపటాలు, ఇవన్నీ సంక్రాతి మహాలక్ష్మికి, ఉత్తరాయణ పుణ్యపురుషునికి మనం స్వాగతినిస్తున్నాయి.ఈ సంక్రాంతికి మనమందరమూ స్వాగతం చెప్పుదాం.  ఈ పండుగను సంతోషముగా జరుపుకుందాము.  
  


ఈపండుగ తో ప్రారంబమయిన సుఖసంతోషాలు  జీవితాంతము ఆనందంగా గడిపాలని.  పాడిపంటలతో, సిరి సంపదలతో మనదేశము అభివృద్దిచెందుతూ సంక్రాంతి లక్ష్మి  సంతోషంగా అడుగుపెట్టాలని కోరుకుంటున్నాను.

అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు.

My Blog Lovers

నా యూట్యూబ్ చానల్స్ ప్లీజ్ సబ్స్క్రిబ్ చేయండీ

Diabetic Challenger

DIABETIC CHALLENGER YOUTUBE CHANNEL. PLASE SUBSCRIBE MY CHANNEL...... THANK YOU VERY MUCH.

Ammamma Tho Nenu (అమ్మమ్మ తో నేను

Please subscribe our channel Ammamma Tho Nenu (అమ్మమ్మ తో నేను)