Blogger Widgets

శుక్రవారం, ఫిబ్రవరి 10, 2012

కొత్త ఢిల్లీ

శుక్రవారం, ఫిబ్రవరి 10, 2012


1931 వ సంవత్సరము ఫిబ్రవరి 10  న కొత్త ఢిల్లీ నగరం అధికారికంగా ప్రారంభించబడింది.
బ్రిటిష్ రాజ్య పరిపాలన కాలంలో డిసెంబరు 1911 వరకూ భారత రాజధానిగా కలకత్తా నగరం వుండేది. కొన్నాళ్ళు తరువాత రాజధానిని  ఢిల్లీకి మార్చబడినది. ప్రాచీనకాలం నుండి ఢిల్లీ రాజకీయ కేంద్రముగా వుంటూ వస్తున్నది. ప్రత్యేకంగా మొఘల్ సామ్రాజ్య కాలం నుండి మరీ ముఖ్యంగా 1799 నుండి 1849 వరకూ ఢిల్లీ కేంద్రంగా వుంటూ వచ్చింది. 1900 ప్రారంభంలో బ్రిటిష్ పరిపాలనా కాలంలో భారత రాజధానిని, కలకత్తా నుండి ఢిల్లీ కి మార్చాలనే ప్రతిపాదన వచ్చింది. కలకత్తా భారత్ కు ఈశాన్య దిశలోనూ, భారత్‌కు చెందిన అనేక ప్రాంతాలకు చాలా దూరంగా వుండేది. ఈ కారణాన బ్రిటిష్ రాజ్ పరిపాలనా సౌలభ్యం కొరకు రాజధానిని ఢిల్లీకి మార్చడమే ఉత్తమమని భావించింది. అప్పటి భారత చక్రవర్తి 5వ జార్జి, యునైటెడ్ కింగ్డం, భారత రాజధాని, కలకత్తా నుండి ఢిల్లీ కి మార్చాలని ప్రకటించాడు.

గురువారం, ఫిబ్రవరి 09, 2012

అష్టావధానము 1

గురువారం, ఫిబ్రవరి 09, 2012

అష్టావదానము అన్నపదము వినేవుంటారు  కదా.  ఇది తెలుగు సాహిత్యంలో ఒక ప్రత్యేకమైన విశిష్టత కలగిన ప్రక్రియ,  ఈ ప్రక్రియ సంస్కృతంలో ను తెలుగులోనూ బాగా పరిచయము వున్నది.  మా తాతగారు చింతా. రామకృష్ణా రావు గారు చాలా వివరముగా వివరించారు.  మీరు కూడా తెలుసుకోవాలని కుతూహలముగా వుందా.  అయితే సింపుల్ గా చెప్పెయలంటే.  
అవధానం అనేది తెలుగు సాహిత్యం లో ఒక విశిష్ట ప్రక్రియ సంస్కృతము, తెలుగు కాకుండా వేరే ఏ యితర భాషలోనుఈ ప్రక్రియ ఉన్నట్లు కనపడదు. క్లిష్టమైన సాహితీ సమస్యలను అలవోకగా పరిష్కరిస్తూ, చమత్కార పూరణలను అవలీలగా పూరిస్తూ, అసంబధ్ధ, అసందర్భ ప్రశ్నలను సమర్ధంగా ఎదుర్కొంటూ, ఆశువుగా పద్యాలు చెప్పుతూ అవధాని సభాసదులనలరింప జేయడం అన్నది అవధాని ప్రత్యేకత.వీటన్నిటినీ ఏక కాలంలో అవధాని చేసే సాహితీ విన్యాసమే అవధానం.

అష్టావధానము అనే సాహిత్య ప్రక్రియ తెలుగు భాష సొత్తా అన్నట్టు వుంటుంది. ప్రప్రంచంలో ఏ భాష లోను లేని ఈ అవధానంలొ ముఖ్యమైన వ్యక్తి అవధాని. అతను అపారమైన ఏకాగ్రత వున్న పండితుడు. విశేషమైన భాషా పాండిత్యం, సమయస్పూర్తి , కల్పనా చాతుర్యము , చమత్కారం వంటివి వారిలో వుంటుంది. అవధాని కలం కాగితం పట్టకూడదు. కేవలం తన ధారణ లేక జ్ఞాపక శక్తితో, మధ్య మధ్య ఏకాగ్రతను భంగపరస్తూ అప్రస్తుత ప్రసంగి వేసే వింత ప్రశ్నలకు సముచితంగా సమాధానం చెబుతూ, కవితా వ్యాసంగం కావించాలి. మద్యలో మద్యలో గంట కొడతారు అవి లెక్కపెట్టి ఎన్ని గంటలు కోటారో చెప్పాలి. చెప్పిన కవిత్వాన్ని , ధారణ చేసి అఖరి అంశంగా అన్ని ప్రశ్నల సమాధానాల్ని అప్పచెప్పవలెను. ఎనిమిది అంశాలపై జరిగే అవధానం అష్టావధానము.
ఇంకా పూర్తిగా తెలుసుకోవాలి అనుకుంటున్నారా అయితే ఇక్కడ చూడండి.  మీకు పూర్తి సవివరంగా తెలుస్తుంది.
ఇలాంటి అవదానాన్ని ప్రత్యక్షముగా చూస్తే చాలా తమాషాగా వుంటుంది.  టీవీ లో చూసే వుంటారు ఈ అష్టావదానము.  టీవీ లో కంటే ప్రత్యక్షముగా చూడటం చాలా బాగుంటుంది.  మీకు వీలయితే మీరు చూడటానికి ప్రయత్నం చేయండి.  దీని మీరు చూసారంటే  మన తెలుగు భాషకు వున్నా ప్రత్యేకత మీకు తెలుస్తుంది.

బుధవారం, ఫిబ్రవరి 08, 2012

శరణు శరణు సురేంద్ర

బుధవారం, ఫిబ్రవరి 08, 2012

భగవంతుని పొందుటకు భక్తులు ఆచరించే పద్దతి భజన.  శ్రీ అన్నమాచార్యులవారు రచించిన భజన కీర్తనలలో చాలా గొప్పగా ప్రసిద్ధి చెందినది ఈ కీర్తన. అన్నమాచార్యులువారు ఈ కీర్తనలో వెంకటేశ్వర స్వామివారిని చాలా రకాలుగా కొనియాడారు.  అందులోనే శరణు వెడుతున్నాడు.  ఈ కీర్తన నేర్చుకోటానికి చాలా సులువుగా వుంటుంది. చిన్నపిల్లలకుడా సులువుగా వస్తుంది అనటంలో సందేహమే లేదు.
రాగం - మాళవి
శరణు శరణు సురేంద్ర సన్నుత
శరణు శ్రీసతి వల్లభ
శరణు రాక్షస గర్వ సంహర
శరణు వేంకట నాయక

కమల ధరుడును, కమల మిత్రుడు
కమల శత్రుడు, పుత్రుడు
క్రమముతో మీకొలువు కిప్పుడు
కాచినారెచ్చరికయా

అనిమిషేంద్రులు మునులు దిక్పతులు
అమర కిన్నెర సిధ్ధులు
ఘనతతో రంభాది కాంతలు
కాచినారెచ్చరికయా

ఎన్నగల ప్రహ్లాద ముఖ్యులు
నిన్ను కొలువగా వచ్చిరి
విన్నపము వినవయ్య
తిరుపతివేంకటాచల నాయకా

ధర్మో రక్షతి రక్షితః - అవునా/కాదా

ధర్మో రక్షతి రక్షితః అనే వాక్యం అందరికి తెలిసినదే ఆ పదము ఎక్కడిది అంటే వాల్మీకి రచించిన రామాయణంలోని ఒక శ్లోకంలోనిది. ఈ వాఖ్యము ప్రజా ప్రాముఖ్యం పొందిన వాక్యాలలో ఇది ఒకటి. ఈ వాక్యం యొక్క అర్ధం "ధర్మాన్ని మనం రక్షిస్తే ఆ ధర్మం మనల్ని రక్షిస్తుంది".
రామాయణంలో ఈ వాక్యం ఉన్న శ్లోకం
ధర్మ ఏవహతో హంతి
ధర్మో రక్షతి రక్షితః
తస్మాద్ధర్మోన హత వ్యో
మానో ధర్మాహతో వధీత
ధర్మో రక్షతి రక్షితః అనే అర్యొక్తిని అనుసరించి ధర్మముని మనం కాపాడితే ఆ ధర్మం మనల్ని కాపాడుతుంది. ఇట్టి ధర్మాన్ని మనం ఎలా ఆచరించాలి, స్వధర్మ ఆచరణ యందు ఎట్టి నిష్ట కలిగి ఉండాలి అనే విషయాలను తెలియపరుస్తూ మానవుడి మనుగడను తీర్చి దిద్దడానికి ఏర్పడినవి.  ప్రస్తుత కాలమానము ప్రకారము ధర్మము ఎక్కడుంది.  ఎలావుంటుంది.  అప్పుడు వాల్మికీగారు ధర్మాన్ని ఎలావుంటుంది అంటే రామో విగ్రహాన్ ధర్మః   (మూర్తీభవించిన ధర్మమే రాముడు ) అని అన్నారు .  మరి ఈ కాలములో ధర్మము ఎలావుంది. ఎక్కడుంది.  సరే అది వదిలైయండి.  ప్రస్తుతము ఈ వాక్యములో అన్నట్టు ధర్మో రక్షతి రక్షతః అన్నట్టు.  ధర్మము ను మనము కాపాడితే , ఆ ధర్మము మనలను కాపాడుతుందా అన్నది నా ప్రశ్న మీకు వీలు అయితే కాపాడుతుంద లేదా అన్నది చెప్పండి. 

సోమవారం, ఫిబ్రవరి 06, 2012

Whizz Quizz II

సోమవారం, ఫిబ్రవరి 06, 2012




మూల మూల నమ్ముడు చల్ల ఇది

మూల మూల నమ్ముడు చల్ల ఇది
రేలు పగలు కొనరే చల్ల

పిక్కటిల్లు చన్నుల గుబ్బెత ఒకటి కడు-
జక్కనిది చిలికిన చల్ల
అక్కున జెమట గార నమ్మీని యిది
యెక్కడా బుట్టదు గొనరే చల్ల

వడచల్లు మేను జవ్వని వొకటి కడు
జడియుచు జిలికిన చల్ల
తడబడు కమ్మని తావులది మీ-
రెడయకిపుడు గొనరే చల్ల

అంకురకరముల వొయ్యారి వొకతి కడు-
జంకెనల చిలికిన చల్ల
వేంకటపతిగిరి వేడుకది (యిది)
యింకానమ్మీ గొనరే చల్ల

ఆదివారం, ఫిబ్రవరి 05, 2012

జోసెఫ్ ప్రీస్ట్‌లీ

ఆదివారం, ఫిబ్రవరి 05, 2012


జీవులు ఆక్సిజన్ లేకుండా ఒక్క నిమిషము కంటే ఎక్కువ వుండలేరు.  కారణము మెదడులోని కణాలకు ఆక్సిజన్  అవసరము.  అలా ఆక్సిజన్ సరిగా అందకపోతే కొద్ది నిముషములలోనే స్పృహ కోల్పోతారు.  కొంతమందికి ఉపిరి సరిగా పిల్చుకోలేక ఇబ్బంది పడతారు.  అప్పుడు హాస్పిటల్స్ లో కృత్రిమ ఆక్సిజన్ అందిస్తారు కదా.  ఆ ఆక్సిజన్ కనుకున్నతను జోసెఫ్ ప్రీస్ట్‌లీ.  అతని గురించి తెలుసుకుందాం. భూమి మీద జీవులందరికీ అత్యవసరం ఈ వాయువు చాలా అవసరం  దీనిని మన వాడుక భాషలో ఆమ్లజని అంటాం.   ఆక్సిజన్ ను మొట్ట మొదట కనుక్కొన్నది ఎవరో తెలుసా అతనే  జోసెఫ్ ప్రీస్ట్‌లీ (మార్చి 13, 1733—ఫిబ్రవరి 6, 1804)  18వ శతాబ్దానికి చెందిన ఆంగ్ల శాస్త్రవేత్త, తత్వవేత్త, రాజనీతిజ్ఞుడు. ప్రీస్ట్‌లీ చాలా Gases  ను కనుక్కొన్నారు వాటిలో వాతావరణంలో సహజంగా కొద్దిగా మాత్రమే లభించే ఆక్సిజన్‌ను ప్రయోగశాలలో కృత్రిమంగా తయారు చేసే విధానాన్ని కనుగొన్నది ఈయనే. కార్బన్‌డయాక్సైడును కృత్రిమంగా చేయడాన్ని కనిపెట్టింది కూడా ఈయనే. ఇవే కాదు కార్బన్‌ మోనాక్సైడు( CO), నైట్రస్‌ ఆక్సైడు (Laughing Gas ) లను కూడా ఈయనే ఆవిష్కరించారు. ప్రీస్ట్‌లీ కనుక్కొన్నవాటిలో ముఖ్యమైనది ఆక్సిజన్.  ఆక్సిజన్ కు "dephlogisticated air" అని పేరు పెట్టారు.

ఇంగ్లండ్‌లోని లీడ్స్‌ నగరానికి దగ్గర్లోని ఓ గ్రామంలో 1733 మార్చి 13న పుట్టిన జోసెఫ్‌ ప్రీస్‌ట్లీ ఏడాదికే తల్లిని, ఏడేళ్లకల్లా తండ్రిని కోల్పోయి అనాథయ్యాడు. మేనత్త దగ్గర పెరుగుతూ ఫ్రెంచ్‌, ఇటాలియన్‌, జర్మన్‌, అరబిక్‌ భాషలపై పట్టు సాధించాడు. పట్టభద్రుడయ్యాక చర్చిలో పాస్టర్‌గా చేరాడు. ఆదాయం చాలక ఓవైపు ట్యూషన్లు చెబుతూనే ఇంగ్లిషు గ్రామర్‌పై పుస్తకం రాశాడు. ఫలితంగా ఒక అకాడమీలో టీచర్‌గా అవకాశం వచ్చింది. అక్కడే రసాయన శాస్త్రంపై మక్కువ పెరిగి ప్రయోగాలు చేయసాగాడు.
10 Current Medical Procedures our 22nd Century Descendants Will Find Barbaric
ప్రఖ్యాత శాస్త్రవేత్త బెంజిమెన్‌ ఫ్రాంక్లిన్‌ ఇంగ్లండు పర్యటనతో స్ఫూర్తి పొంది విద్యుత్‌పై అధ్యయనం చేసి 'History and present of electricity'అనే గ్రంథాన్ని ఆయన రాయడం విశేషం. ఇందుకు గుర్తింపుగా Royal Society Fellow గా ఎంపికయ్యారు. జీవితకాలంలో ఆయన మొత్తం 150 పుస్తకాలు రాశారు. మరోవైపు రాజకీయాలపై ముఖ్యంగా ఫ్రెంచి విప్లవంపై ఆసక్తిని పెంచుకున్నారు. ఆయన భావాలతో ఏకీభవించని ప్రత్యర్థులు ఆయన ప్రయోగశాలపై చేసిన దాడి వల్ల 20 ఏళ్ల పరిశోధన పత్రాలు దగ్ధమయ్యాయి. దాంతో America  వలస వెళ్లి అక్కడే వాయువులపై పరిశోధనలు చేశాడు. అమెరికా  Northumberland County, Pennsylvania లో ఆయన ప్రయోగశాలను నేషనల్‌ మ్యూజియంగా ప్రకటించారు.

శనివారం, ఫిబ్రవరి 04, 2012

ఆమె అతనికి ఏమవుతుంది

శనివారం, ఫిబ్రవరి 04, 2012

ఒక వ్యక్తిని తీసుకువచ్చి మా అత్త, మా మావ్వయ్యకు పరిచయం చేస్తూ ఇలా చెప్పింది. 
'అతడి సోదరుడి తండ్రి, మా తాత ఏకైక కుమారుడు. అయితే మా అత్త ఆ వ్యక్తికి ఏమవుతుంది? 
మా మావయ్య తెగ ఆలోచిస్తున్నాడు ఆమె అతనికి ఏమవుతుంది అని.  మీకు తెలిస్తే తొందరగా చెప్పేయండి మా మావయ్యకు.

శుక్రవారం, ఫిబ్రవరి 03, 2012

శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రము జన్మదినము

శుక్రవారం, ఫిబ్రవరి 03, 2012

ఈరోజు భీష్మ ఏకాదశి.  ఇది ఏకాదశి లలో చాలా విశేషమైన ఏకాదశి.  ఈరోజు భీష్మ పితామహుల నోటినుండి విష్ణు సహస్ర నామము అందరికీ ఉపదేసించబదినది. నేడు విష్ణు సహస్రం పుట్టినరోజు అన్నమాట.  తండ్రి మాటకు తలొగ్గి శ్రీరాముడు ఆదర్శపురుషుడైతే. ఒక మెట్టు ఎక్కువగా తండ్రి సుఖం కోరి సింహాసనాన్ని వదులుకుని ఆజన్మ బ్రహ్మచర్యం పాటించిన మహాపురుషుడు భీష్మాచార్యుడు. అంపశయ్యపై నుండే విష్ణుసహస్రనామ కీర్తన చేసి ఆ స్వామికి ఇష్టమైన మాఘశుద్ధఏకాదశిని తన పేరిట బహుమానంగా పొందిన పురాణ పురుషుడు.


అది ద్వాపరయుగం. శోభకృతు నామ సంవత్సరం. మాఘశుద్ధ అష్టమి. ప్రత్యక్ష నారాయణుడు తీక్షణ కిరణాలతో వెలిగిపోతుండగా ఆ మిట్టమధ్యాహ్నం వేళ  శ్రీమహావిష్ణువును నోరారా కీర్తిస్తూ ఆయనలో ఐక్యమైపోయాడు భీష్ముడు. ఆ పురాణ పురుషుడు మరణించిన రోజే. భీషాష్టమి. మరణించే ముందు కృష్ణుడు ఇచ్చిన వరం ప్రకారం మూడురోజుల తర్వాత వచ్చే ఏకాదశి ఆ కురువృద్ధుని పేరిట భీష్మఏకాదశిగా ప్రసిద్ధి పొందింది. 

శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రము అత్యంత ప్రాచుర్యము కలిగిన హిందూ ప్రార్థనలలో ఒకటి. పేరును బట్టి ఇది శ్రీమహావిష్ణువు వేయి నామాలను సంకీర్తనం చేసేస్తోత్రము. ఈ స్తోత్రాన్ని చాలామంది హిందువులు భగవంతుని పూజించే కార్యంగా పారాయణం చేస్తూ ఉంటారు.
విష్ణు సహస్ర నామ స్తోత్రము మహాభారతం లోని అనుశాసనిక పర్వం లో 149వ అధ్యాయంలో ఉన్నది. కురుక్షేత్ర యుద్ధానంతరం అంపశయ్య మీద పండుకొని ఉన్న భీష్ముడు ఈ స్తోత్రాన్ని యుధిష్ఠురు నకు ఉపదేశిస్తాడు. ఈ స్తోత్ర పారాయణం సకల వాంఛితార్థ ఫలదాయకమని ఆ విధమైన విశ్వాసం ఉన్నవారి నమ్మకం. స్తోత్రం ఉత్తర పీఠిక (ఫలశ్రుతి)లో ఈ శ్లోకం "ధర్మార్థులకు ధర్మము, అర్థార్థులకు అర్థము, కామార్థులకు కామము, ప్రజార్థులకు ప్రజను ప్రసాదించును" అని చెప్పబడినది.
విష్ణు సహస్రనామ స్తోత్రము ఆవిర్భవించిన పరిస్థితులు ఆసక్తి కరమైనవి. కురుక్షేత్ర యుద్ధంలో జరిగిన జనక్షయం, కష్టాలవలన పాండవాగ్రజుడు యుధిష్ఠిరుడు కృంగిపోయి ఉన్నాడు. తన వంశోన్నతిని కోరిన భీష్ముడు అంపశయ్యపై మరణానికి సిద్ధంగా ఉన్నాడు. అనితర జ్ఞాననిలయమైన భీష్ముని ఆశ్రయించి ధర్మాన్ని, నీతిని తెలిసికొనమని యుధిష్ఠిరుని వేదవ్యాసుడు, శ్రీకృష్ణుడు ఆదేశించారు. భీష్ముడు కృష్ణునితో "ప్రభూ! జగద్గురువువైన నీయెదుట నేను ఉపదేశము చేయజాలినవాడను కాను. ఆపై క్షతగాత్రుడనైన నా బుద్ధి, శక్తి క్షీణించినవి. క్షమింపుడు" అనెను. అప్పుడు శ్రీకృష్ణుడు "భీష్మా! నా ప్రభావము చేత నీ క్లేశములన్నీ ఇపుడే తొలగిపోవును. సమస్త జ్ఞానము నీ బుద్ధికి స్ఫురించును. నీచేత నేను ధర్మోపదేశము చేయించుచున్నాను" అని అనుగ్రహించెను. అలా భీష్ముడు అంపశయ్యపైనుండే యుధిష్ఠిరునకు సమస్త జ్ఞాన, ధర్మములను ఉపదేశించెను.  అలా జ్ఞానబోధను గ్రహించే సమయంలో యుధిష్ఠిరుడు ఆరు ప్రశ్నలను అడిగాడు. ఆ ప్రశ్నల సారాంశము: "దుఃఖముతో కృంగి ఉన్న నాకు తక్కువ శ్రమతో ఎక్కువ ఫలితమును ఇచ్చే ఉపాయమేది? ఎవరిని స్తుతించాలి?" దానికి భీష్ముడు చెప్పిన ఉపాయము: "భక్తితో, శ్రద్ధతో విష్ణువు వేయి నామాలను జపించు. అన్ని దుఃఖములు, కష్టములు, పాపములనుండి విముక్తి పొందడానికి ఇదే సులభమైన మార్గము". అలా భీష్ముడు ఉపదేశించినదే విష్ణు సహస్రనామ స్తోత్రము.
విష్ణు సహస్రనామ స్తోత్రపఠనానికి ముందుగా లక్ష్మీ అష్టోత్తర స్తోత్రాన్ని పఠించడం చాలామంది పాటించే ఆనవాయితీ. చాలా స్తోత్రాలలో లాగానే విష్ణు సహస్రనామ స్తోత్రంలో వివిధ విభాగాలున్నాయి.

ప్రార్థన

ప్రార్ధన శ్లోకములు, స్తోత్రము ఆవిర్భవించిన సందర్భ వివరణ ఈ పూర్వపీఠికలో ఉన్నాయి. ముందుగా వినాయకు నకు, విష్వక్సేను నకు, వ్యాసు నకు, ఆపై విష్ణువుకు ప్రణామములతో స్తోత్రము ఆరంభమౌతుంది.

ముఖ్య స్తోత్ర:

అనేక పవిత్ర ధర్మములను విన్న తరువాత ధర్మరాజు భీష్ముని అడిగిన ఆరు ప్రశ్నలు:
  1. కిమ్ ఏకమ్ దైవతం లోకే - లోకంలో ఒక్కడే అయిన దేవుడు ఎవరు?
  2. కిమ్ వాపి ఏకమ్ పరాయణమ్ - జీవితానికి పరమపదమైన గమ్యము ఏది?
  3. స్తువంతః కమ్ ప్రాప్నుయుః మానవాః శుభమ్ - ఏ దేవుని స్తుతించుట వలన మానవులకు శుభములు లభించును?
  4. కమ్ అర్చంతః ప్రాప్నుయుః మానవాః శుభమ్ - ఏ దేవుని అర్చించుట వలన మానవునకు శుభములు లభించును?
  5. కో ధర్మః సర్వధర్మాణాం భవతః పరమో మతః - మీ అభిప్రాయము ప్రకారము సర్వధర్మములకు ఉత్కృష్టమైన ధర్మమేది?
  6. కిం జపన్ ముచ్యతే జంతుః జన్మ సంసార బంధనాత్ - ఏ దేవుని జపించుటవలన జన్మ సంసార బంధనములనుండి ముక్తి లభించును?    అన్న ప్రశ్నలు అడుగగా.....
అందుకు భీష్ముడు చెప్పిన సమాధానం: జగత్ప్రభువును, దేవదేవుని, అనంతుని, పురుషోత్తముని వేయి నామములను నిశ్చలమైన భక్తితో స్తుతిసేయట వలనను, ఆరాధించుట వలనను, ధ్యానించుట వలనను, ప్రణామము చేయుట వలనను సర్వదుఃఖములనుండి విముక్తి పొందవచ్చును. ఆ బ్రహ్మణ్యుని, పుండరీకాక్షుని ఆరాధించుట ఉత్తమ ధర్మము. ఆ దేవదేవుడు పరమ మంగళ ప్రదుడు. సకల సృష్టి-స్థితి-లయ కారకుడు. ఈ వేయి గుణ కీర్తనకరములైన నామములను ఋషులు గానము చేసినారు.
విష్ణు సహస్రనామాలను గురించి పెక్కుభాష్యాలు వెలువడినాయి. 8వ శతాబ్దంలో ఆది శంకరాచార్యలు రచించిన భాష్యము వీటిలో ప్రధమము. అద్వైత సిద్ధాంతము ననుసరించే ఈ భాష్యంలో భగవంతుని పరబ్రహ్మ తత్వమునకు, షడ్గుణైశ్వర్యమునకు ఎక్కువ ప్రాదాన్యతనిచ్చి వ్యాఖ్యానించారు. 12వ శతాబ్దంలో పరాశర భట్టు రచించిన భాష్యము భగవద్గుణ దర్పణము అనే గ్రంధం విశిష్టాద్వైతం సిద్ధాంతాలకు అనుగుణంగా సాగుతూ, భక్తుల పట్ల భగవానుని సౌలభ్యాన్నీ, సౌశీల్యాన్నీ, కరుణనూ మరింతగా విపులీకరించినది. తరువాత అనేకులు రచించిన వ్యాఖ్యలకు ఈ రెండు భాష్యాలే మార్గదర్శకాలు.  
ఈరోజు అందరు ఇళ్ళల్లోను, గుళ్ళలోను విష్ణుసహస్రనామ స్తోత్రం పూజలు  చేస్తున్నారు.  నేడు విష్ణువు గురించి, భీష్ములవారి గురించి , విష్ణుసహస్రము గురించి తెలుసుకున్నాము. మనజన్మ ధన్యము అయినట్టే కదా.  విష్ణుసహస్రనామస్తోత్ర జన్మదిన శుభాకాంక్షలు.
జై శ్రీమన్నారాయణ

బుధవారం, ఫిబ్రవరి 01, 2012

కల్పనా చావ్లా

బుధవారం, ఫిబ్రవరి 01, 2012


kalpana chawla,poem kalpana chawla,kalpana chawla poem,poetry kalpana chawla,kalpana chawla poetry
Kalpana Chawla


జాతీయత:అమెరికా మరియు భారత్
జననం: మార్చి 17, 1962 కర్నాల్, హర్యానా, భారతదేశం
మాతృదేశము                     -భారతదేశము
మరణము: ఫిభ్రవరి 1, 2003 ( 40 సంవత్సరాలు) టెక్సాస్
వృత్తి: విజ్ఞాని1994 NASA గ్రూప
Space time : 31d 14h 54m 
Selection  Missions : STS-87, STS-107 
Mission  Insignia :Sts-87-patch.png STS-107 Flight Insignia.svg
పువ్వు పుట్టగానే పరిమళిస్తుంది అని పెద్దలు అన్నారు. అది నిజమే అన్నట్టు కల్పనా చావ్లా జీవితమూ నిరూపిస్తుంది.  ఈమె తన చిన్నతనము నుండే అంతరిక్షములోనికి ఎలావేల్లాలి అని కలలు కనేది. తన కలలను నేరవేర్చుకున్నది.
తొలిసారి 1997లో అంతరీక్ష యాత్ర చేసిన ఈ మొట్టమొదటి ఆసియా మహిళా వ్యోమగామి కల్పన.  అమెరికా అంతరిక్షయాన సంస్థ అయిన "నాసా"లో వ్యోమగామి విధులు నిర్వహిస్తున్న కల్పన.2003లో కొలంబియా అంతరిక్ష నౌకలో రోదసిలోకి వెళ్ళి ఆ ఘనత సాధించిన తొలి భారతీయ సంతతి మహిళగాను, రెండో భారతీయ వ్యక్తిగాను పేరు సంపాదించింది. ఇదే కొలంబియా అంతరిక్షనౌక తిరుగు ప్రయాణంలో 2003 ఫిబ్రవరి ఒకటవ తేదీన జరిగిన ఘోర ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన మొత్తం ఏడుగురు వ్యోమగాముల్లో కల్పనా చావ్లా ఒకరు కావడం విషాదకరం.
 
కొలంబియా వ్యోమనౌక తిరుగు ప్రయాణంలో భూమికి 62 కి.మీ ఎత్తున ప్రయాణిస్తూ... మరో 16 నిముషాల కాలంలో కేప్‌ కెనవరాల్‌లోని కెనడీ అంతరీక్ష కేంద్రంలో దిగాల్సి ఉన్న తరుణంలో ప్రమాదానికి గురైంది. అత్యంత దురదృష్టకరమైన ఈ సంఘటనలో కొలంబియాలో ప్రయాణిస్తున్న కల్పనా చావ్లా (మిషన్‌ స్పెషలిస్టు) సహా మరో ఆరుగురు వ్యోమగాములు హజ్‌బెండ్‌ (కమాండర్‌), ఆండర్సన్‌ (పేలోడ్‌ కమాండర్‌), మెక్‌కూల్‌ (పైలట్‌), ఇలాన్‌ రామన్‌ (పేలోడ్‌ స్పెషలిస్టు), బ్రౌన్‌, క్లార్క్‌ (మిషన్‌ స్పెషలిస్టులు) ప్రాణాలు కోల్పోయారు.
 
ప్రమాద సమయంలో గంటకు 20 వేల కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తున్న ఈ వ్యోమనౌక విస్ఫోటనానికి గురై పేలిపోగా దాని శకలాలు టెక్సాస్‌తో పాటు మరో రెండు రాష్ట్రాల్లో చెల్లాచెదురుగా పడ్డాయి. అయితే ఆ శకలాలు విషపూరిత రసాయనాలతో కూడినవి అయి ఉన్నందున పౌరులెవరూ వాటి చాయలకూ పోరాదని నాసా హెచ్చరించింది. కాగా. 40 ఏళ్లకు పైబడిన నాసా చరిత్రలో మానవ వ్యోమనౌక భూమికి తిరిగివస్తూ ఆపదకు గురికావడం ఇదే మొదటి సారి కావడం గమనార్హం. కల్పనా చావ్లా  అనే  పేరు వినగానే మనందరికీ గుర్తొచ్చేది ధైర్యం. అంతరిక్షంలో అడుగుపెట్టిన తొలి మహిళగా ఘనత సాధించిన ఆమె... అంతరిక్షంలో ఏవేని చిన్న పొరపాట్లు జరిగినా బూడిద కూడా మిగలదని తెలిసిన ఈ ధీశాలి మరణాన్ని సైతం చిరునవ్వుతో స్వీకరించి మళ్లీ ఆకాశంలోకే పయనమైపోయారు. భౌతికంగా ఆమె మరణించినా, కొన్ని వేల సంవత్సరాల తరువాత కూడా కల్పన పేరు ఈ భూప్రపంచంపైన మార్మోగుతూనే ఉంటుంది.                                       

 

మంగళవారం, జనవరి 31, 2012

జాతీయ పక్షి

మంగళవారం, జనవరి 31, 2012

మన భారత ప్రభుత్వం వారు 1963వ సంవత్సరం జనవరి 31 న నెమలి ని మన జాతీయ పక్షి గా గుర్తించారు.  

The Scientific Classification 
Phylum: Chordata
Sub-phylum: Vertebrata (Vertebrates)
Class: Aves (Birds)
Order: Galliformes
Family: Phasianidae
Sub-family: Phasianinae
Genus: Pavo ¡
Species: Pavo cristatus (blues) and Pavo muticus (Java greens)
Subspecies for P. muticus: P.m. muticus  |  P.m. spicifer  |  P.m. imperator

నెమలి చాలా అందమైన ఈకలు కలిగి వుంటుంది. శ్రీ కృష్ణుడు తన శిరస్సు మీద నెమలి ఈకను అలంకరిమ్చుకునేవారు.  సుబ్రహ్మణ్య స్వామి వాహనంగా నెమలి వుంటుంది కదా నేను ఫొటోస్ లో చూసాను. మగ నెమల్లకు అందమయిన మెరిసే నీలం-ఆకుపచ్చ లేదా ఆకుపచ్చ రంగు పించం ఉంటుంది. మగ నెమలికి వెనుక బాగంలో తోకలాగా కనిపించేది, దాని పొడావాటి ఈకలు. ఆ ఈకలకు కళ్ళు ఉంటాయి, వాటి అందమంతా అవి పురివిప్పి నాట్య మాడుతున్నప్పుడే కనిపిస్తాయి.
మగ నెమల్లకు అందమయిన మెరిసే నీలం-ఆకుపచ్చ లేదా ఆకుపచ్చ రంగు పించం ఉంటుంది. మగ నెమలికి వెనుక బాగంలో తోకలాగా కనిపించేది, దాని పొడావాటి ఈకలు. ఆ ఈకలకు కళ్ళు ఉంటాయి, వాటి అందమంతా అవి పురివిప్పి నాట్య మాడుతున్నప్పుడే కనిపిస్తాయి.
ఆడ నెమలి ఆకుపచ్చ, గోధుమ మరియు బూడిద రంగులలో ఉండే పించం ఉంటుంది. మగ నెమల్ల వలె ఆడనెమలికి పొడావాటి తోక లాంటి ఈకలు ఉండవు, కానీ వీటికి ఒక కొప్పూంటుంది.
నెమలి పించాలలోని ఆ అత్బుత రంగులకు కారణం, వాటి ఈకలమీద పేర్చినట్లు ఉండే సన్నని పీచు లాంటి పదార్దాలే. అక్కడ కనిపించే వివిధ రంగులకు వాటి అమరికలోని నిడివి తేడాలే కారణం. గోధుమ రంగు ఈకలకు, ఎరుపు మరియు నీలం రంగులు అవసరం - వీటిలో ఒక రంగు అమరిక వలన సృస్టింపబడగా, రెండొవది హద్దులలో ఉండే ఇంకో అమరిక వలన వచ్చే కాంతి పరావర్తనం వలన ఏర్పడుతుంది. ఇటువంటి పరావర్తనం వలనే నెమలి నాట్యమాడుతున్నప్పుడు వాటి పించాలు మనకు వివిద కోణాలలో వివిద రంగులుగా కనిపిస్తాయి.
దాదాపు 2000 సంవత్సరాల కాలం నుండి మనుషుల పోషణలో నెమలి ఉన్నదని భావిస్తున్నారు.నెమలిలో పెంపుడు జంతువులలో కనిపించే లక్షణాలు చాలా తక్కువగా వున్నాయి.వీటి నుండీ ఇతర కొత్త జాతులు సృష్టింపబడ్డాయి.
ఇతర జాతులతో అంటకట్టించటం వలన వేరు వేరు రంగుల ఈకలున్న నెమల్లు మనకు కనిపిస్తాయి. అటువంటి వాటిలో తెల్ల శరీరం కలవి చెప్పుకోతగ్గవి.
మబ్బులు పట్టాగానే నెమలి తన అందాన్ని మరింత బాగా చూపి నాట్యం ఆడుతుంది.  ఇంత అందామయిన పక్షికి ఈనాడు నివాస స్తలాలేలేవు. నెమలి తుప్పలు, గడ్డి ప్రదేసాలాల్లో నివసిస్తుంది.  ఇప్పుడు ఆకు రాలే కాలం కదా గడ్డి తుప్పాలను నిప్పుపెట్టేసారు వాటికి సరి ఐన ప్రదేశం లేక కొత్త ప్రదేసాలకోసం అన్వేషిస్తున్నాయి.  ఆ ప్రయత్నంలో కొన్ని మనుషులకు దొరికిపోయి చంపబడుతున్నాయి.  మా ఇంటిదగ్గర గడ్డి కాల్చేసారు.  అప్పుడు అవి దగ్గరలో వున్నా వాటర్ ట్యాంక్ మీద ఎలా కుర్చున్నవి అప్పుడు నేను తీసిన ఫోటో చూడండి. అంత అందంగా వున్నా మన జాతీయ పక్షి అయిన నెమలి జాతి అంతరించి పోకుండా కాపాడ వలసిన బాధ్యతా మనందరికీ వుంది.   దయచేసి నెమలి ని చంపవద్దు దాని అందాన్ని చూసి ఆనందిచుదాం.  
Please Save Our National Bird 

మంగళవారం, జనవరి 24, 2012

How many squares are there?

మంగళవారం, జనవరి 24, 2012

 How many squares are there on a chessboard or checkerboard?


మొత్తకురే అమ్మలాల

చిన్ని కృష్ణుని అల్లరి మితిబారినది.  వాని అల్లరి వారి భరించలేక పోతున్నారు.  ఒక గోపెమ్మ చిన్ని కృష్ణుని కొట్టబోయినది. మరో గోపెమ్మ వారించెను.  రేపల్లె వెన్న దొంగ కృష్ణుడు ను యశోదమ్మ కొట్టబోయినది.  అప్పుడు అమ్మ కాలమీద పడినాడు చిన్నివాడు.   అందితే జుట్టు  అందకపోతే కాళ్ళు కృష్ణునకిది వెన్నతో బెట్టిన విద్య. ఇంకేమున్నది ? గోపెమ్మ కోపము మటు మాయమైనది. కృష్ణునకు అలుసుగా తీసుకున్నాడు. తన స్నేహితులతో ఊరిమీదికి బోయి, గొల్లల వాడలలో ఇళ్ళను కొల్లగొట్టినాడు. వెన్న ముద్దలు మాపుదాకా ముక్కున కారునట్లు బుక్కినాడు.  
గోప కృష్ణుని అల్లరి మితిమీరినది. యశోదమ్మ బాలుని దండింపదలచినది. చిన్ని కృష్ణుని రోటికి గట్టినది. అది అంత తేలికా ? అప్పుడు శ్రీ కృష్ణునికి కోపమే వచ్చినది. తన్ను రోటికి కట్టిన తల్లిపై రాళ్ళు రువ్వినాడు. తన చిన్ని చేతులకు అందినంత వరకు విసిరినాడు. చిదిమిన పాలు గారు చిన్ని బుగ్గలతో, చిలికిన నవ్వులతో, మొల చిరు మువ్వలతో గోకులమంతా కలియ దిరిగే నందకిశోరుడు బాలుడా ! పరబ్రహ్మ స్వరూపుడు. త్రిమూర్తులలో మేటియైనవాడు. 
బాలకృష్ణ కేళీవిలాసాలు చిలికి చిలికి పెద్దవైనవి. యశోదతో ఫిర్యాదు చేయుటకు వ్రజ భామలు కదలి వచ్చినారు. గోకుల మిల్లిల్లు కదలినది. అక్కడి దృశ్యమును చూచి పల్లీబిబ్బోకవతులు ఆశ్చర్యచకితలైనారు. కృష్ణుడు పసిబాలుని వలె ఒక మూలకు ఒదిగి, యశోదాదేవి యొడిలో చేరి పాలు త్రాగుతున్నాడు. ఆ తల్లి కన్నులతో వాత్సల్యాన్ని కురిపిస్తూ, తన తనయుని తల నిమురుతున్నది. ముద్దుగుమ్మలు ఆ ముద్దుల బాలుని చూచి ముసి ముసి నగవులతొ వెనుకకు మరలినారు. 
ఆ లీలామానుష విగ్రహుడే నేడు వేంకటగిరిమీద మూలభూతియై నిలచినవాడు.  అంత గొప్ప సన్నివేశానికి చూడటానికి రెండు కళ్ళు అయినా సరోపోవు కదా.  ఇదంతా కృష్ణమాయ .
మొత్తకురే అమ్మలాల -ముద్దులాడు వీడె
ముత్తెము వలె నున్నాడు - ముద్దులాడు 

చక్కని యశోద తన్ను సలిగతో మొత్త రాగా 
మొక్క బోయీ గాళ్ళకు - ముద్దులాడు 
వెక్కసాన రేపల్లె - వెన్నలెల్ల మాపుదాక 
ముక్కున వయ్యగ దిన్న - ముద్దు లాడు 

రువ్వెడి రాళ్ళ దల్లి - రోలదన్ను గట్టెనంట 
మువ్వల గంటల తోడి ముద్దు లాడు 
నవ్వెడి జెక్కులనిండ - నమ్మిక బాలుని వలె 
మువ్వురిలో - నెక్కుడైన ముద్దులాడు 

వేలసంఖ్యల సతుల - వెంటబెట్టుకొనిరాగా ! 
మూల జన్ను గుడిచీని ముద్దులాడు 
మేలిమి వెంకటగిరి మీద నున్నాడిదె వచ్చి 
మూలభూతి దానైన ముద్దులాడు 


'జన గణ మన' @ 100 సంవత్సరాలు

'జన గణ మన' 
'జన గణ మన' నేటికి 100  సంవత్సరాలు నిండింది.
ఏ ఇతర దేశభక్తి గీతము కూడా మన భారత పాటలా వుండదు అనటంలో అతిశయోక్తి లేనేలేదు.  ఈ పాట do or  die అన్నట్టు మంచి పట్టులాగ వుంటుంది.  ఈ గీతము మనము  క్రీడా రంగంలోను సరిహద్దులవద్ద, అది మనకు ఒక మార్గం  జన గణ మన.
డిసెంబర్ 27, 1911 న భారత జాతీయ కాంగ్రెస్ కలకత్తా సమావేశంలో మొదటి సారిగా నోబెల్ గ్రహీతరవీంద్రనాథ్ ఠాగూర్ మరియు పాడిన కూర్చాడు జన గణ మన గీతాన్ని.  భారత జాతీయ గీతం జనగణమనను ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన గీతంగా యునెస్కో గుర్తించింది. ఎన్నో ప్రశంసలు పొందిన ఈ గీతంపై వివాదాలు కూడా లేకపోలేదు. ఇందులోని సింధు పదాన్ని తొలగించాలని కొందరు కోర్టు కెక్కగా దానిని కోర్టు తిరస్కరించింది. అలాగే తెల్లదొరలను ఈ గీతం రాశారనే వివాదం కూడా ఉంది. తెల్లదొరలను కీర్తిస్తూ రాసిన గీతం కాబట్టి దానిని ఎలా ఆమోదించాలని ప్రశ్నించే వారూ ఉన్నారు. అంతేకాకుండా నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఆదేశాల మేరకే రవీంద్రుడు ఈ గీతాన్ని రాశారని, ఆయన స్వతహాగా రాయలేదని అంతేకాకుండా గీతానికి బాణీలు కట్టింది తానేనని నేతాజీ అనుచరుడు ఒకరు తెరపైకి వచ్చారు.
ఈగీతానికి 100 ఏళ్ల చరిత్రలో జాతీయ గీతం ఒక రక్తపాత విభజన, జాతీయవాద ఉద్యమం మరియు ప్రముఖ ఉద్యమాలు ప్రారంభమై మంచిగా ఉద్యమాన్ని బలోపేతం చేయటానికి బాగా దోహదపడింది. ఇది జాతీయ జెండా మరియు సాంస్కృతిక కార్యక్రమాలు మరియు ప్రజా సందర్భాల్లో ఎగుర వెయ్యటానికి, క్రీడా విజయాలు సాధించే  సమయంలో ఈ గీతం వారికి తోడుగా వుంటుంది.
ఒక బ్రహ్మ గీత రాసిన శైలి లో రాసిన ఈ జన గణ మన అధికారికంగా జనవరి 24, 1950 న భారత జాతీయ గీతం గా రాజ్యాంగ సభ స్వీకరించారు. జన గణ మన గీతం మరింత జాతీయ ఐకమత్యాన్ని పెంచేవిధంగా వుంటుంది.  ఇది నేతాజీ బోస్ యొక్క ఇండియన్ నేషనల్ ఆర్మీ 1946 లో జాతీయ గీతంగాను  మరియు మహాత్మా మహాత్మా గాంధీ గారు కూడా జన గణ మన ను వాడటం.  గాంధి గారు ఇలా అన్నారుట  "పాట మా జాతీయ జీవితంలో ఉత్తమ స్థానాన్ని పొందింది" అని చెప్పాడు. 'జన గణ మన',  భారతదేశం యొక్క 1947 రిపబ్లిక్ జాతీయ గీతంగా గుర్తించారు.
రవీంద్రుడు ఈ జనగణమనను చిత్తూరు జిల్లాలోని మదనపల్లిలో రాశారు. బంగ్లాదేశ్ జాతీయ గీతాన్ని రాసింది కూడా రవీంద్రుడే. జనగణమనను మన భారత రాజ్యాంగం 1950 జనవరి 24న జాతీయ గీతంగా స్వీకరించింది. ఆయన మొదటిసారి బెంగాళీలో ఈ గీతాన్ని ఆలపించారు. ఈ గీతానికి బాణీలు కట్టింది కూడా విశ్వకవే. ఆ తర్వాత ఇంగ్లీషులోకి అనువదించారు.
AR రెహమాన్ మరియు లతా మంగేష్కర్  భారతదేశం యొక్క మ్యూజిక్ ప్రపంచం ద్వారా జాతీయ గీతం  హృదయపూర్వక కూర్పు కొత్త వయసు, కొత్త సంగీతం కట్టిపడేశాయి. 
భారతదేశం 2011 క్రికెట్ ప్రపంచ కప్ ఒక ఉప్పొంగే దేశంగా ఈ గీతము పైకి ఎత్తి వేసింది.  ఈ గీతము అప్పుడు అందరి ఇళ్ళలోనూ. ప్రతీ ప్రదేసములోను, ప్రభుత్వ కార్యాలయలోను ఉన్నప్పుడు ఖచ్చితమైన సమయంలోను, టీ దుకాణాల్లో మరియు రోడ్డు పక్కన ఈ గీతము మారుమోగింది.
ఆసక్తికరంగా  ఠాగూర్ మాత్రమే సంగీతకారుడుగా పంకజ్ కుమార్ ముల్లిక్ తన పద్యాల వరకు ట్యూన్ సెట్ కూడా అతన్ని 'రాబింద్రసంగీత్' యొక్క భావాలు మార్చే వీలు లేదు స్వయంగా వచ్చింది. ముల్లిక్ ఒకసారి కూడా 'జన గణ మన' కోసం గాన శైలిని తయారు చేసారు. ఇది  ప్రధాన మంత్రి జవహర్ లాల్ నెహ్రూ కోరాడు.
అయితే ఈగీతానికి నియమాలు వున్నాయి.  ఆ నియమాలు ఏమిటి?
జాతీయ గీతం యొక్క  కూర్పు 52 సెకన్లు పడుతుంది. మొదటి మరియు చివరి పంక్తులు (మరియు ప్లే 20 సెకన్లు  తీసుకొని)కలిగి ఉన్న ఒక చిన్నదైన వెర్షన్ కూడా అప్పుడప్పుడు ప్రదర్శించారు.
Text మాత్రము బెంగాలీ లో వుంది కొంత సంస్కృతంలో ఉంది (పాక్షిక-సంస్కృతం టెక్స్ట్). అది అనేక ఆధునిక భారతీయ భాషల్లో ఆమోదయోగ్యంగా వుంది, కానీ ఉచ్చారణ గీతం యొక్క singing సంబంధించిన నియమాలు మరియు నియంత్రణలు  చూపించారు.  ప్రభుత్వం యొక్క అధికారిక వెబ్సైట్ ప్రకారం, భారతదేశం అంతటా గణనీయంగా మారుతూ ఉంటుంది.
గీతం పాడిన లేదా ఆడతారు ఉన్నా ప్రభుత్వం రూల్బుక్, ప్రకారం, ప్రేక్షకులు నిలబడే వుండాలి. అయితే, ఒక రీల్ లేదా డాక్యుమెంటరీ కోర్సులో గీతం చిత్రం భాగంగా ఆడాడు ఉన్నప్పుడు, మాత్రము ప్రేక్షకుల నిలబడుట అన్నదాని గురించి ఒక  అంచనా లేదు. నిలబడుట  చిత్రం ప్రదర్శన అంతరాయం కలిగి ఉంటుంది.  మరియు అంతేకాకుండా గీతం యొక్క గౌరవం చేయటం అంత కంఫోర్ట్ గా వుండదు.
వందేళ్లు పూర్తి చేసుకున్న జనగణమనకు ప్రపంచ రికార్డును ఈనాడు తీసుకు వచ్చే దిశలో గీతాలాపన జరుగుతోంది. ఈ గీతాలాపన మంగళవారం ఉదయం ఏడు గంటలకు పవిత్ర పుణ్యక్షేత్రం తిరుపతిలోని మహతి కళామందిరంలో ప్రారంభమైంది. ఉదయం ఏడు గంటలకు ప్రారంభమైన జనగణమన గీతాలాపన సాయంత్రం ఐదు గంటల వరకు కొనసాగుతుంది.  ఇందుకోసం ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డ్స్ ప్రతినిధులు హాజరయ్యారు.   ఈ గీతాన్నికి కచ్చితంగా గిన్నిస్ రికార్డు రావాలని కోరుకుంటు జాతీయ గీతానికి 100 నిండిన సందర్బముగా అందరికి శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాను.
జయ్ హింద్ 

సోమవారం, జనవరి 23, 2012

Can you find the baby?

సోమవారం, జనవరి 23, 2012


Can you find the baby?




Ballero

Check inside the game for instructions on how to play Ballero

నేతాజీ సుభాష్ చంద్రబోస్

నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఈనాటి రోజు జన్మించారు  జనవరి 23, 1897. నేతాజీగా ప్రసిద్ధి గాంచిన గొప్ప స్వాతంత్ర్య సమరయోధుడు.  ఒకవైపునుండి  గాంధీ  మొదలైన నాయకులందరూ అహింసావాదం తోనే స్వరాజ్యం సిద్ధిస్తుందని నమ్మి పోరాటం సాగిస్తు వుండగా.  సుభాష్ చంద్రబోస్ వంటి వారు హింసాయుధ పోరాటం వల్ల మాత్రమే స్వాతంత్రము పొందగలమని బలంగా నమ్మారు.  హింసాయుధము తోనే ఆంగ్లేయులను దేశం నుంచి తరిమి కొట్టవచ్చునని నమ్మి, అది పూర్తిగా ఆచరణలో పెట్టిన గొప్ప మహనీయుడు.  
బోసు రెండు సార్లు భారత జాతీయ కాంగ్రెస్ కు అధ్యక్షుడిగా ఎన్నికైనా గాంధీతో సిద్ధాంత పరమైన అభిప్రాయ భేదాల వలన ఆ పదవికి రాజీనామా చేశాడు. గాంధీ యొక్క అహింసావాదం మాత్రమే స్వాతంత్ర్య సాధనకు సరిపోదని, పోరుబాట కూడా ముఖ్యమని బోసు బావన. ఈ అభిప్రాయాలతోనే ఆల్ ఇండియా ఫార్వార్డ్ బ్లాక్ అనే రాజకీయ పార్టీని కూడా స్థాపించాడు. చాలా సార్లు ఆంగ్లేయులచే కారాగారంలో నిర్బంధించ బడ్డాడు. 
1939లో రెండవ ప్రపంచ యుద్ధం మొదలైంది. ఆంగ్లేయులను దెబ్బ తీయటానికి దీన్ని ఒక సువర్ణవకాశంగా బోసు భావించాడు. యుద్ధం ప్రారంభం కాగానే అతను ఆంగ్లేయుల పై పొరాడేందుకు కూటమి ఏర్పాటు చేసే ఉద్దేశంతో రష్యా, జర్మనీ మరియు జపాను దేశాలలో పర్యటించాడు. జపాను సహాయంతో భారత యుద్ధ ఖైదీలు, రబ్బరు తోట కూలీలు మరియు ఔత్సాహికులతో భారత జాతీయ సైన్యం ను ఏర్పాటు చేశాడు. జపాను ప్రభుత్వం అందించిన సైనిక, ఆర్ధిక, దౌత్య సహకారాలతో ఆజాద్ హింద్ ప్రభుత్వం ను సింగపూర్ లో ఏర్పరచాడు.  బోసు రాజకీయ అభిప్రాయాలుజర్మనీ మరియు జపానుతో అతని మిత్రత్వం పై చరిత్రకారుల్లో భిన్నాభిప్రాయాలున్నాయికొందరు వీటిని విమర్శిస్తేమరి కొందరు వాస్తవిక దృష్టితో చేసిన ప్రయత్నాలుగా బోసును అభిమానిస్తారుఅతని జీవితం లాగే మరణం కూడా వివాదాస్పదమైంది. 18 ఆగస్టు, 1945 లో తైవాన్ లో జరిగిన విమాన ప్రమాదం లో బోసు మరిణించాడని ప్రకటించినప్పటికిఅతను ప్రమాదం నుంచి బయట పడి అజ్ఞాతం లోకి వెళ్ళాడని పలువురు నమ్ముతారు.  ఇలాంటి గొప్ప స్వాతంత్ర్య సమర యోధుడు ను గుర్తు చేసుకొని మన దేశం మీద భక్తి పెంచుకోవాలని తలచాను.  

ఆదివారం, జనవరి 22, 2012

Why This Kolaveri Di Tom and Jerry Style

ఆదివారం, జనవరి 22, 2012

Why This Kolaveri Di 

విక్టోరియా రాణి

Queen Victoria
బ్రిటన్‌ రాణి విక్టోరియాఇంగ్లండుకు చెందిన మహారాణి 
1858 నుండి 1947 మధ్య భారత దేశము లో సాగిన బ్రిటిష్ పరిపాలనను బ్రిటిష్ రాజ్య చరిత్ర సూచిస్తుందిబ్రిటిష్ ఈస్టిండియా కంపెనీ ఆధ్వర్యంలో ఉన్న పాలనను 1858లో విక్టోరియా రాణి కిరీటాని ధరించిన తరువాత 1876లో ఈమెను భారత దేశపు సామ్రాఙ్ఞిగా ప్రకటించారు, అప్పుడు ఈమె పాలనా వ్యవస్థను సంస్థాగతం చేయబడిందిబ్రిటిష్ ఇండియా సామ్రాజ్యం 1947 వరకూ కొనసాగింది.  ఈమె జీవించి ఉన్నంత కాలము భారత దేశాన్ని పరిపాలించినది.
విక్టోరియా పూర్తిపేరు అలెగ్జాండ్రినా విక్టోరియా.  ఈమె 24 మే 1819 న జన్మించారు.   ఈమె United Kingdom of Great Britain‌ మరియు ఐర్లాండ్ కు క్వీన్‌ గా 1837 వ సంవత్సరము జూన్‌ 20 నుంచి ,‌ తరువాత  1876 వ సంవత్సరము  మే 1 నుంచి భారత దేశంలోని బ్రిటిష్‌ రాజ్యానికి తొలి రాణిగా మరణించే వరకు కొనసాగారు.   ఈమె 22 జనవరి 1901 వ సంవత్సరములో మరణించింది.  విక్టోరియా రాణి  బ్రిటీష్‌ రాజుల కంటేను , అదే విధంగా చరిత్రలోని ఇతర రాణుల కంటే ఎక్కువ కాలం పరిపాలించారు. 
ఈమె పరిపాలించిన కాలాన్ని విక్టోరియన్‌ ఎరా అంటారు కాలంలో బ్రిటీష్‌ సామ్రాజ్యంలో పారిశ్రామికసాంస్కృతికరాజకీయశాస్త్రసైనిక రంగాలు అభివృద్ధి సాధించాయి.
ఈమె తన 18 ఏట పాలనా బాధ్యతలు పొందిందిఆమె సింహసనం అధిష్టించే నాటికే బ్రిటన్‌ రాజ్యాంగం ఉన్న సుస్ధిర సామ్రాజ్యంరాజు లేదా రాణికి కొన్ని స్వచ్ఛంద అధికారాలు ఉన్నాయివాటిని ప్రధాన మంత్రి సలహా మేరకు అమలు చేయవచ్చుకానీ రాణికి ఎంతో కీలకమైన గుర్తింపు ఉండేదిఆమె కాలంలో బ్రిటిష్ సామ్రాజ్యం పూర్తిగా విస్తరించిందిరవి అస్తమించని సామ్రాజ్యంగా పేరు సంపాదించుకున్నది.  

My Blog Lovers

నా యూట్యూబ్ చానల్స్ ప్లీజ్ సబ్స్క్రిబ్ చేయండీ

Diabetic Challenger

DIABETIC CHALLENGER YOUTUBE CHANNEL. PLASE SUBSCRIBE MY CHANNEL...... THANK YOU VERY MUCH.

Ammamma Tho Nenu (అమ్మమ్మ తో నేను

Please subscribe our channel Ammamma Tho Nenu (అమ్మమ్మ తో నేను)